
Telusaa!
చెంగా బజారు నాటకముల...!!
| మద్రాసు లోని 'చెంగా బజారు నాటకాల'కు ప్రేక్షకులు చెంగు చెంగున గంతులేసుకుంటూ వెళ్ళేవాళ్ళు.  "తారా శశాంకము' నాటకములో  "తార"గా 'బాలామణి' నటించేది.  "ఫాల భాగమున వజ్రాల పాపిట బొట్టు...తమక మెడ నంట సంపంగి తైల మంటె!.........."  ఈ సీనులో రంగ స్థలముపైన ఒక దోమ తెర కర్టెనును వేసే వారు.  ఆ తెర వెనుక, నటి దిగంబరముగా చంద్రుడి తలను అంటుతుంది.  ఆమె కేవలం దిగంబరంగానే నిలబడేదో లేక బనియన్ డ్రెస్సు మీద అలాగ కనిపించేదో గానీ,  ఏది ఏమైతేనేమి గానీ ఆ మహత్తర దృశ్యాన్ని చూడటానికే జనం వచ్చేవారు.  పెద్ద తొక్కిసలాట అయ్యేది.  మొదటి తరగతిలో కూర్చునేందుకు  మదరాసులోని "ప్రముఖులు" ముందు కెగబడేవారు.  ఆ ఘట్టం అయిపోగానే  ఖాళీ అయిపోయిన కుర్చీలను చూస్తే చాలు!,  ఆ మహాశయులందరూ ఏ ఆకర్షణ కోసం దయ చేశారో ఇట్టే అర్ధమౌతుంది. 'అరవ భాష తెలియక పోయినా, అరవం అంటే రాళ్ళ డబ్బా చప్పుడు' అని ఎగతాళి చేసినా,  మన తెలుగు విద్యార్ధులు కూడా  అప్పుడప్పుడు ఈ "చెంగా బజారు నాటకముల"ను  చూడటానికి పోవడము కద్దు!  అవును పాపం! ఇటువంటి చాన్సు  మన దేశంలో ఎక్కడ దొరుకుతుంది గనుక?!!! (తాపీ ధర్మా రావు గారి 'రాలూ, రప్పలూ'లోని విశేషాలు ఇవి) | 
| Views (95) | 
 
 
 
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి