10, నవంబర్ 2015, మంగళవారం

రైతు రాజ్యం, కంబ కవి

12 వశతాబ్దం, కంబ కవి. "Silai Ezhupathu" &                                 ఇందు డెబ్భై పద్యాలు ఉన్నవి.                  70 పద్య సంకలనమునందు  వెల్లడించిన అభిప్రాయాలు ఆదర్శవంతమైనవి.   
జై జవాన్, జై కిసాన్! ఈ నినాదం లాల్ బహదూర్ శాస్త్రి [ Prime Minister, on 11 June 1964] భారత జాతికి అందించారు. 
వ్యవసాయ అంశముల విపులీకరణ కలిగిన ప్రాచీన గ్రంధము. 
కంబ కవి రచన "Eaer Ezhupathu".  
[తిరువళ్ళువర్ - వాక్కులు - "తిరుక్కురల్" ( Thirukkural, Thiruvalluvar) నందు రైతు యొక్క ప్రాధాన్యతను ప్రస్తుతించాడు.]
కొంగువెల్లలర్ (Kongu Vellalar community) సంఘమున, పెళ్ళిళ్ళు, శుభ కార్య సందర్భములలో ఈ పద్యాలను గానం చేస్తూంటారు. 
కవి చక్రవర్తి కంబర్ -  కర్షకుని అత్యున్నతస్థానంలో నిలిపిన ప్రాచీన రచన, బహుశా ఇవి రెండు మాత్రమేనేమో !!!!!!!!
ఆ కవితలను చదువుతూంటే 'కంబర్ కి రైతు పట్ల కల అవ్యాజ అనురాగం ఎంత గొప్పదో , అర్ధమౌతుంది , 
చదువరి అమిత సంభ్రమాశ్చర్య ఆనందాలలో ఓలలాడుతాడు.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

"నిరాడంబర జీవితం గడిపే బ్రాహ్మణులు                                                        #(austere Brahmins) # ;
అధికార  శక్తిమంతులైన నియంతల కన్నా, 
ధనికులైన వాణిజ్య, వర్తకుల కన్నా ;  
అత్యున్నత కీర్తి శిఖరములకు చేరిన రైతు యశస్వి!
కానీ, కర్షక జాతికి చెందిన వారే వీరందరి కంటె గొప్ప వాళ్ళు ||

"రైతు జాతీయులు మాత్రమే ; 
ఈ భూమిని సజీవంగా ఉంచగలుగుతున్న వారు|| 

"యజ్ఞములను చేసే  బ్రాహ్మణుల ; 
అధికారము వలన అమిత ఆర్జన కలిగిన నియంతలు/ ప్రభువులు ; 
అందరూ, వేరే ఎక్కడి నుండో పుట్ట లేదు; 
రైతు యొక్క నాగలి నుండి మాత్రమే! 
ప్రపంచము యొక్క భవిష్యత్తు [లలాట లిఖితం ఐన విధి - ని] 
నిర్దేశించునది కర్షకుడు [మాత్రమే!] || "

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

జై జవాన్, జై కిసాన్! :- ------------ 
కిసాన్ వాడే పనిముట్లు ;- గురించి కంబ కవికి కల అవగాహన అద్భుతం.
వ్యవసాయ విధాన వివరణలు కొనసాగిన పంక్తులు ఎన్నో!
"మకరందము, తేనె పుప్పొడి ; 
తొణికిస లాడుతున్న పుష్పముల పైన [ పుష్ప ఆసనము/ సింహాసనము 
లక్ష్మీ దేవి, ధనదేవత, ఆసీన ఐ ఉన్నది; 
సంతోష ఉల్లాస, దరహాసిని ఔతూ 
భూదేవి, విజయ లక్ష్మి ; కూర్చుని ఉన్నారు.|| 

"ఏదేమైనా - విధ్వంసం నుండి; పుడమిని, రక్షించు వారు  
 నేలను దున్నుతూ; నాగలి చేత పట్టి , 
పరిశ్రమిస్తూన్న కర్షకులు ; 
కనుక - భూగోళమునకు; 
విపత్తు ఏమీ సంభవించదు; 

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Manvetti = గడ్డ పలుగు/ పార ;
కార్ = వాన ; కారలన్ = వర్షము పై అధిపతి ; 
వెల్లాలను = వరదను నియంత్రించు శక్తి కల వ్యక్తి, రైతు : :- 
తెలుగులో "వెల్లువ" అను మాట, 'ఆనందం వెల్లువ ఎత్తింది ' ; 
'జనం వెల్లువెత్తినట్లు ' ఇత్యాది పద ప్రయోగములు ఉన్నవి. ...............
[in - meenakshisundaramwriter.blog ;- Tuesday, 28 January 2014;
                                                       Kambar’s 70 Poems on Agriculture] 

[ సి. సుబ్రమణ్యం, తమిళ విశ్వవిద్యాలయ , రిటర్ - వైస్ ఛాన్సలర్ - 
ఇట్లాంటి అనేక అంశాలను గూర్చి పరిశోధనలు చేసి, వెల్లడించినారు. ]

 { TAGS :- The 70 poems, which are collected as a book titled Eaer Ezhupathu, are recited in the wedding 

ceremonies of the Kongu Vellalar community.    
[C. Subramaniam, former Vice-chancellor, Tamil University, Thanjavur, in his book Kongunaattu Mangala 

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 62778 pageviews - 1033 posts, last published on Nov 5, 2015 -

30, సెప్టెంబర్ 2015, బుధవారం

చింతామణి గణపతి

గజాననుడు / కరివదనుని విశేషాలు కొన్ని :-
మహారాష్ట్రలోని ‘అష్టవినాయక కోవెలలు' ప్రసిద్ధి గాంచినవి.
వీనిలోని “చింతామణి గణపతి” గురించి స్థలపురాణ కథ ఉన్నది.
ఆ ప్రాంగణములో తరువు వెలయుటకు కారణమైనది.
******************************,

“శబల” అను ఆవు వశిష్ఠముని వద్ద ఉన్నది. చిటికెలో అద్భుతమైన విందు ఆ ధేనువు అనుగ్రహించింది. అతిథి గా, తన సైనిక పటాలంతో సహా వచ్చిన మహారాజు విభ్రమానికి లోనైనాడు.
“కామధేనువు వత్సం ఐన ఈ శబల మహారాజును ఐనట్టి నావద్ద ఉండుట సముచితము. కనుక నాకు ఇవ్వుము మునీ!” అని అడిగి, ముని కాదనగా భంగపడ్డాడు.
అతడే గాధిరాజు, విశ్వామిత్రుడు, ఋషిగా, బ్రహ్మర్షిగా ఎదిగిన చక్కని పౌరాణిక సంఘటన అది. ఇట్లాంటిది ‘చింతామణి అనే మణి ‘ కథ.
************,

ఈ అద్వితీయ రత్నమునకు సంబంధించి ఒక గాథ ఉంది.
పూర్వం కపిలముని వద్ద చింతామణి అనే మణి ఉండేది.
(కపిలముని యొక్క సహోదరి ‘ సతీ అనసూయ' )
చింతామణి కోరిన కోరికలను తీర్చే కల్పతరువు వంటిది. అక్కడి ప్రభువైన అభిజిత్తు, గుణవతిల కుమారుడైన గుణ రాజకుమారుడు ఒకమారు కపిలుని ఆశ్రమానికి వస్తాడు. ఆ ముని రాజకుమారునికి చింతామణి మహిమతో షడ్రసోపేతమైన భోజనము ఏర్పాటు చేస్తాడు. ఆ మణి సంగతి తెలిసి రాజకుమారుడు మణిని తనకిమ్మని కపిలుని అడుగుతాడు.
కపిలముని దానికి అంగీకరించక పోగా, రాజకుమారుడు ఆ మణిని దొంగిలించాడు. బాధతో కపిలుడు గణపతిని ప్రార్థించాడు.
విఘ్నేశుడు భక్త రక్షణకై ఇలకు అవతరించి, రాకుమారుని యుద్ధంలో ఓడించెను. పిమ్మట, అభిజిత్తు మహారాజు మణిని కపిలునికి తిరిగి ఇవ్వబోగా, కపిలుడు ‘ఆ మణి తనకు వలదని ‘ చెప్పి,
“శివపుత్రా! విఘ్నేశా! నీవు ఇక్కడే , భక్తచింతామణివై మమ్ములను అనుగ్రహించుము ’ అని ప్రార్ధించెను.
గణేశుడు అక్కడే కదంబ వృక్షము కింద వెలిసెను.
అప్పటినుంచి కపిలుడు ఆ గణేశుని ‘చింతామణి గణేశుని’గా కొలుస్తాడు.
ఈ చింతామణి గణేశ క్షేత్రం మహారాష్త్రలోని థేవూర్ లో (పుణే/ పూనా దగ్గర) ఉంది.
మహారాష్ట్రలోని అష్టవినాయకులలో ఒకటి ఈ చింతామణి వినాయకుడు.

****************,

ఎనిమిది విఘ్నవినాయకస్వామివార్ల పేర్ల పట్టిక :-

1) చింతామణి గణపతి; Chintamani, Theyur):
2) హేరంబ గణపతి;( hEramba gaNapati) :
3) బళ్ళాలేశ్వర ;పాళీ:                                                                             4) గిరిజాత్మజ, లేన్యాద్రి (Girjatmaja, Lenyadri):
5) మహా గణపతి, రాజన్ గావ్ (Mahaa GaNapati, Rajan gaaw):
6) మోరేశ్వర కోవెల (Moreshwar Temple):
7) సిద్ధివినాయక ఆలయ (Siddhiwinayaka dewalay, Siddhtek):
8) వరదవినాయక్ మహాడ్ (Varada Vinayaka, Mahaad);

&&&&&&&&&&
Important points:- కామధేనువు దూడ శబల ;
[rachana :- కుసుమాంబ1955 ] ; = http://jabilli.in/1274 

చింతామణి గణపతి ; September 20, 2015 =
link - web mag "JABILLI sept 2015"  

*************************************,  

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 61916 pageviews - 1029 posts, last published on Sep 15, 2015

15, సెప్టెంబర్ 2015, మంగళవారం

తొలి అనువాద గ్రంధము

ప్రపంచ సాహిత్యానికి అనువాదము, Translations 
అనేవి ఎంతో మేలు చేస్తున్నవి.
అనువాదప్రక్రియకు చెప్పదగిన స్థానం సారస్వత లోకమున ఉన్నది. 
బౌద్ధమత సిద్ధాంతములను చీనా భాషలోనికి 
అనువాదం చేసిన వారు తెలుసా!?
ఝిషెన్  [Zhichen] అను బౌద్ధ సన్యాసి 
ఈ మహా బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టాడు. 
ఝెషిన్ గాంధార [నేటి కాబూల్, పెషావర్] దేశ వాసి, కుషానుల కొలువులో పండితుడు.
హిందూదేశమున స్వర్ణయుగం - అని చరిత్రకారులు ప్రశంసించిన కాలం అది. 
కుషాణచక్రవర్తి కనిష్క ప్రభువు పూనికతోచైనాభాషకు ప్రోత్సాహం లభించింది. 
పాళీభాషలోని బౌద్ధగ్రంధాలను మానవాళికి అందించే ఆలోచన కలిగింది.
కనిష్కుని ఆదేశాలను అవధరించిన ఝిన్ [147 CE] 
చైనాభాషలోనికి ట్రాన్స్ లేషన్ చేయడం మొదలుపెట్టాడు. 
మహాయాన వాదము ప్రపంచ ప్రజలకు అందుబాటులోనికి వచ్చింది.
అప్పటి నుండి హిందూ, చైనా దేశాలు వాణిజ్యం పెంపొందింది. 
 చీనాంబరములు అనే పదము - పట్టు వస్త్రాలకు పర్యాయపదం ఐనది. 
 = అంటే "పట్టు వస్త్రాలు", చైనా దుస్తులు - చీనీ - చైనా సంబంది - అని అర్ధం.   
చీని చీనాంబరములు , పింగాణీ సామానులు మున్నగునవి వర్తకములలో మార్పిడి జరుగసాగినవి. 
అహింస, శాంతి సిద్ధాంతముల యొక్క విలువను లోకము గుర్తించసాగినది.
సంస్కృతీ  సూత్రముల పరస్పర ఆదాన ప్రదానములు కొనసాగినవి.
ప్రజ్ఞాపారమిత సూత్రములు - అని ప్రసిద్ధికెక్కినవి, ఝిషిన్ రచనలు. 
అనువాద రచనలయొక్క విలువ అందరికీ తెలుస్తున్నది.
అనువాద ప్రక్రియ - చైనా, సంస్కృత, పాళీ మున్నగు భాషలకు, అనేక 
భాషలకు వారధిగా గుర్తింపు కలిగినది. 
అనువాద రచన, సాహిత్యరంగములో ప్రధానస్థానాన్ని 
పొందుటకు కారణమైన వ్యక్తి, 
చీనీ భాషలో బౌద్ధ రచనల తొలి వ్యక్తిగా - చరిత్రలో లబ్ధప్రతిష్ఠ గాంచాడు. 
" ఝెషీన్" = లోక క్షేమ" అని ఆతని నామధేయానికి అర్ధము. 

==================================

toli anuwaada gramdhamu   

prapamcha saahityaaniki anuwaadamu, #Translations# anEwi emtO mElu chEstunnawi.
anuwaadaprakriyaku cheppadagina sthaanam saaraswata lOkamuna unnadi. 

mahaayaana waadamu prapamcha prajalaku amdubATulOniki wachchimdi.
appaTi numDi himduu, chainaa dESaaలు waaNijyam pempomdimdi. chini chiinaabaramulu = amTE "pTTu wastrAlu", pimgaaNI saamaanulu munnagunawi wartakamulalO maarpiDi jarugasaaginawi. 
ahimsa, Saamti siddhaamtamula yokka wiluwanu lOkamu gurtimchasaaginadi.
సంస్కృతీ  suutramula paraspara aadaana pradaanamulu konasaaginawi.
praj~naapaaramita suutramulu - ani prasiddhikekkinawi, jhishin rachanalu. anuwaada rachanalayokka wiluwa amdarikii telustunnadi.
anuwaada prakriya - chainaa, samskRta, paaLI munnagu bhaashalaku, anEka bhaashalaku waaradhigaa gurtimpu kaliginadi. 
anuwaada rachana, saahityaramgamulO pradhaanasthaanaanni pomduTaku kaaraNamaina 
wyakti, chiinii bhaashalO bauddha rachanala toli wyaktigaa - charitralO 
labdhapratishTha gaamchaaDu" jheshiin. "lOka kshEma" ani aatani naamadhEyaaniki ardhamu. 

****************  ****************    
[f. b. ;- తెలుగు సాహిత్య ప్రపంచం]

4, సెప్టెంబర్ 2015, శుక్రవారం

palindrome శ్లోకము



తాం భూసుతా ముక్తి ముదారహాసం | 
వందేయతో లవ్య భవం దయాశ్రీ||
          ===================================
taam bhuusutaa mukti mudaarahaasam| 
 wamdEyatO lawya bhawam dayaaSree||
        ***************************************

ఈ పై శ్లోకం లోని చమత్కారం ఏమిటో తెలుసా? 
ఇందులో ఒక విశేషం ఉన్నది.
కొంచెం పరిశీలిస్తే మీకే అర్ధమౌతుంది. 

14 వ శతాబ్దంలో దైవజ్ఞ సూర్య రచన ఇది! 
daivajna surya - ఈ పద్ధతిలో దాదాపు 40 శ్లోకములు - వ్రాసారు.

పాలిండ్రోంస్ [palindrome ] = అంటే 'ముందు నుండి గానీ, వెనుక నుండి గానీ చదివితే - ఒకటే వస్తుంది.
పై శ్లోకమును ఇప్పుడు చదివి, చూడండి - 'తిరగమోతలు 'గా!

కేవలం ఇంగ్లీష్ వర్డ్స్ (English Words) తో కుస్తీ పడ్తూ, పాలండ్రోంస్ చేస్తున్నారు పాశ్చాత్యులు.
మన దేశంలో పద్య, శ్లోక, కావ్య, ప్రబంధాదులు 
అనేకానేకం సృజనలు జరిగినవి.
క్రీస్తు పూర్వం నుండే మన దేశంలో మాత్రమే 
సంభవించిన ' అపూర్వ సాహిత్య విన్యాసాలు ఇవి!' 

(#A palindrome is a word, phrase, number,
or other sequence of characters which 
reads the same backward or forward) # 

జై  భారతమాతా! 

********************,  ====================

"taam bhuusutaa mukti mudaarahaasam | 
wamdEyatO lawya bhawam dayaaSree||"

********************, 
ii pai SlOkam lOni chamatkaaram EmiTO telusA? 
imdulO oka wiSEsham unnadi.
komchem pariSIlistE miikE ardhamautumdi. 

14 wa SataabdamlO daiwaj~na suurya rachanalu, daadaapu 40 SlOkamulu - wraasaaru.
kEwalam imgliish warDs (#English Words)# tO kustii paDtuu, paalmDrOms 
chEstunnaaru pASchaatyulu.
mana dESamlO padya, SlO|ka, kaawya, prabamdhaadulu anEkaanEkam sRjanalu 

jariginawi. 
jai bhaaratamaatA! 

********************,

[ palindrome  శ్లోకము :-   ;- ఇన్ - F. B. Group ;- మన సంస్కృతి - ఆచారాలు సంప్రదాయాలు] 
&&&&&& 
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 61395 pageviews - 1026 posts, last published on Aug 27, 2015 -

********************,

  [  5:19పి. ఎమ్.  4/సెప్టెంబర్ /2015

27, ఆగస్టు 2015, గురువారం

అష్టచాప్ కవులు

అష్టచాప్ కవులు, శ్రీనాధ్ జీ సంప్రదాయం - అంటే ఏమిటో తెలుసా? 
నేడు కూడా కొనసాగుతూన్న ఆలయసాంప్రదాయాలలో ఇది ఒకటి. 
దివ్య ప్రేరణ: స్వామి సాక్షాత్ దర్శనము; దివ్యత్వం; భగవత్ భావనతో మమైకత్వ భావనలు - ఈ దివ్యసంగీతమునకి పునాదులు.
అమందానందము,అలౌకికపారవశ్యతలతో  భక్తి మార్గముద్వారా- మన సాంప్రదాయిక సంగీతము సుసంపన్నమైనది.
@@@@@@@@@@@@@@@@@@@@

కృష్ణ వల్లభుడు బిరుదు కలిగిన క్రిష్ణ భక్తుడు వల్లభాచార్యులు :- 
 భక్తి గాన సంప్రదాయాలను పుష్కలంగా ఆచరణలోనికి తెచ్చినట్టి ఆధ్యాత్మిక గురువు వల్లభాచార్యులు [945 A.D.] కృష్ణ భక్తిని వ్యాప్తిలోనికి తెచ్చిన వ్యక్తి వల్లభాచార్యులు
మీరాబాయి, సూరదాసు భజనలు, కీర్తనలు ప్రసిద్ధి. వీరి బోధ గురువు వల్లభాచార్యులు . 
విశేషముగా చెప్పుకోవలసినది వల్లభాచార్యులు మన తెలుగువాడు.
@@@@@@@@@@
అష్టచాప్ కవులు :-శ్రీ గుషైన్ జీ ; బాలకృష్ణుని స్నేహితులు ఎనిమిదిమంది :- క్రిష్ణయ్యకు 8 అంకె అంటే ఇష్టం కాబోలు, 
స్వామివారికి ఎనిమిదిమంది భార్యలు (అష్ట భార్యలు) ;-
5000 వేల సంవత్సరముల క్రితం క్రిష్ణునితో కూడి, ఆట పాటలతో నాటి వాతావరణాన్ని ఆహ్లాదభరితం చేసారు. క్రిష్ణయ్యకు ప్రియమిత్రులు 8 మంది.

మురళీధరుని స్నేహితుల పేర్లు ఇవిగో! :-
సుదామ = కుచేలుడు); 
రిషభ,
అర్జున, 
భోజ, 
తోక్, 
విశాల, 
సుబల, 
శ్రీధామ ;
@@@@@@@@@@@@@@@@@@@@


ఈ ఎనిమిదిమందీ దాల్చిన "అవతారములు" ఉన్నవి, 
అవి ఏమిటో, వారు ఎవరో తెలుసా?:- 
సంత్ సూరదాస్ ; 
కుంభన్ దాస్; 
పరనంద్ దాస్, 
ఛత్రభుజ్ దాస్, 
క్రిష్ణదాస్, 
నందదాసు;/నందదాస్; = 
క్షేత్ర్ స్వామి, (Chettar swaami); 
గోవింద్ దాస్) :-
ఈ ఎనిమిదిమంది మధురలోని శ్రీలీలా కీర్తనకారులు ఐనట్టి అష్టచాప కవులు.
@@@@@@@@@@@@@@@@@@@@

16 వ శతాబ్దంలో హవేలీ సంగీతమును అభివృద్ధి గాంచింది.
నాలుగుసార్లు ఈ భజన రాగాలాపనలు జరుగును. 
క్రిష్ణస్వామిని నాలుగుసార్లు కీర్తించు వేదికయే "పుష్టి మార్గ్".
వేకువఝామున మంగళ, శృంగార్, గ్వాల్, రాజ్ భోగ్ (ప్రసాద 
నైవేద్యాదులు) సమర్పణలు, శిఖిపింఛధారికి సమర్పిస్తారు. 
సాయంకాలం సందెవేళకు ఉత్థాపన్, సంధ్యా ఆరతి, శయన్ సేవలను 
వివిధరాగాలాపనలతో శ్రోతలను అలరిస్తూంటాయి. 
రాజస్థాన్ లోని ఉదయపూర్ వద్ద రాధావల్లభ ఆలయంలో, బృందావన్, 
నంద్ గావ్, బర్సానా లోని రాధారాణి గుడి - మున్నగు కోవెలలలో 
ఈ భక్తిసంగీత సంప్రదాయాన్ని అమలుచేస్తున్నారు. 
గుజరాత్ రాష్ట్రంలోని అనేక వేణుగోపాల ఆలయాలలో హవేలీ సంగీతంపుష్ఠిమార్గ్ లను భజన సంకీర్తనా ఆచారములలో పాటిస్తున్నారు. 
శ్రీకృష్ణస్వామిని కీర్తిస్తూ, వివిధరాగాలను ఎంచుకుని పాడుతారు, నిర్దిష్టరాగాలాపనలు ఆయా రోజులలో పాటిస్తూంటారు. 
జానపద ఫణితి ఎక్కువ శాతం అనుసరణ ఔతూంటుంది. భావ నృత్య, భజన సంగీతాదులకు, ధృపద్/ ధ్రుపద్, హవేలీ సంగీత్ - 
హిందూస్థానీ సంగీతాదులను 8 musctions గాయకులు అనుసరిస్తూంటారు. 
తబలా, హార్మోనియం, బాంసురీ, సారంగి, పఖ్వజ్, సుర్ పేటి, మజీరాజాంఝ్
(Surpeti; Majeera jhanjh)‎మొదలగు‬ వాయిద్యాలను ఉపయోగిస్తారు. 
సూరదాసు, కుంభన్ దాసు, పరనంద్ దాసు, ఛత్రభుజ్ దాసు, క్రిష్ణ దాసు, నందదాసు; = క్షేత్ర స్వామి, (Chettar swaami) గోవింద దాసు) :-  
నేటికీ వారి వారసులు - అనుయాయులు - 8 మంది, సంగీత భజన సాంప్రదాయాన్ని నిర్విఘ్నంగా పాటిస్తున్నారు.
శ్రీనాధ్ జీ సంప్రదాయ ఆచరణ :-
తోలారామ్ జీ ; క్రిష్ణదాస్ జీ; శ్యామ్ జీ, ప్రమోద్ :- హార్మోనియం వాదకులు;
నవీన్ చంద్ర - కీర్తనకారులు ; అమృత్ లాల్ జీ - సారంగ్ వాదక్; 
భన్వర్ లాల్ జీ, బ్రజేష్ జీ, చంద్రకాంత్ జీ - 
శ్రీజీ 'లాలి పాట'ను వీణావాద్య వాదన ద్వారా వినిపిస్తూ ఉంటారు.
హవేలీ సంగీతము, పుష్ఠిమార్గ్ సంగీతములు మన శాస్త్రీయసంగీతమునకు సిరిసంపదలు, అమూల్య నిధులు అందించినవి అనడం అతిశయోక్తి కాదు.
ఆ దివ్యభక్తి తత్వమునకు మనమెంతో ఋణపడిఉన్నాము కదూ!!!!!!!
@@@@@@@@@@ @@@@@@@@@@ 


@@@@@@@@@@@@@@@@@@@@ @@@@@@@@@@ 
         [ 59911 - konamanini ] 

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 61159 pageviews - 1025 posts, last published on Aug 17, 2015 -    

                    

17, ఆగస్టు 2015, సోమవారం

75 ప్లాటినం ఎక్కడ?

సినీ ఉత్సాహ సంబరములలో
కొన్ని ఇంగ్లీషు నేమ్సు, వీలైన చోట్ల  తెనుగు సేతలు వినబడుతున్నవి. 
వయసును గౌరవిస్తూ మన భారతీయులు చేసుకుంటున్న 
గృహవేడుకలు, ఇంటి వేడుకలు “షష్ఠి పూర్తి”. 
ఇంటి యజమానికి 60 ఏళ్ళు వచ్చినప్పుడు, 
ఉద్యోగ రిటర్మెంటు వేళ, చేసుకుంటూన్న పండుగ షష్ఠి పూర్తి. 
[సంస్కృత పదం 'షష్ఠి' +పూర్తి  తెలుగు మాట 'పూర్తి ' = సంపూర్ణమైనది ]
వెండితెర హుషారులను పరికిద్దాము.
""""""""""""'''''''''''''''

హైదరాబాద్ లో’జూబిలీ హిల్స్ కాలనీ’   ఉన్నది. 
పోష్ లొకాలిటి జూబిలీ హిల్సు – అని ప్రతీతి.
చలనచిత్రరంగంలో “జూబిలీ” అనే మాట తరచూ వినబడుతూన్నది.
"జూబిలీ" (Jubilee ) 50 సంవత్సరముల అవధికి ఉపయోగితం.  
""""""""""""'''''''''''''''

హీబ్రూ భాష, తరువాత లాటిన్, ఫ్రెంచ్ – ఇంగ్లీషు పదాలలో 
చోటు చేసుకున్న అందమైన మాట ఇది. 
49 సంవత్సరముల తరువాయి యాభయ్యవ ఏడాది – 
అనే సారాంశాన్ని కలిగినది.
'ష్మిత' – 'ఏదూ' వసంతాల పరిభ్రమణ చక్రమును 
యూదులు అనుసరిస్తున్నారు. 
అటువంటివి మళ్ళీ ఏడు వత్సరముల గుచ్ఛము ఔతుంది. 
7ఇంటూ 7 = 49 years. తదుపరి వచ్చే ఏడాదిలో,  
ఆ సంవత్సరమునందు వారి విశ్వాసాల ఆచరణ, 
కొత్త సమాజ నిర్మాణాలకు పునాదులు ఔతూంటాయి. 
చక్రవర్తులు, ధనికులు, సామాన్యులు, యావన్మందీ 
ఈ ఆచరణలో భాగస్వాములు ఔతున్నారు. 
ప్రజలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు;
బానిసలను విడుదల చేసి, పూర్తి స్వేచ్ఛను ఇస్తారు. 
అందరికీ ఎవరి భూములను వారికి తిరిగి ఇస్తారు. 
పాత ఋణాలను, బాకీలను, బకాయీలను రద్దు చేస్తారు. 
అంటే ఆర్ధికైబ్బందులు తొలగి, 
సమాజమునందు సమానత నెలకొల్పడానికి 
ఈ 'తీరున – తీరైన ‘స్వయం తీర్పులు' ;
వారు స్వచ్చందంగా తీసుకునే మంచి నిర్ణయాలు 
సంఘం యొక్క నవ్యతకు ఉపకరిస్తాయి.
తమ అప్పులు, ఋణపత్రాలు రద్దు అవడం వలన 
పేదలు, బీదా బిక్కీ ఆనందంతో మెలుగుతారు.
హీబ్రూ, బైభీల్ గ్రంధాలు , మతపరమైన 
ఈ మంచి కార్యక్రమాలను గ్రంధాలలో ఉటంకించినవి.
సరే! మనం అసలు విషయాన్ని పరికిద్దాం.   
&&&&&&&& [ 1 ] =======  
జూబిలీ  అంటేనే “యాభై ఏళ్ళు” ఐనప్పుడు – 
నేటి వ్యవహారికపదకోశాలలో జూబిలీ 
ఇవ్) అనుబంధ పదావళి కొన్ని చోటు చేసుకున్నవి. 
సిల్వర్ జూబిలీ, గోల్డెన్ జూబిలీ ;, డైమండ్ జూబిలీ -
ఇట్లాగ నిచ్చెనమెట్ల బాణీతోజూబిలీ వర్డ్సు వరుసగా 
నిఘంటువులలో స్థానం ఆర్జించినవి.    
ఇంకా అదనంగా సమకూరిన భావజాలం మెట్టు మెట్టు ఎక్కుతూ, 
జూబిలీ యొక్క సరసన చేరినవి.

షష్ఠి పూర్ణం , తదుపరి ఏవి ఉన్నవి? 
వాస్తవానికి 60 ఏళ్ళు – తర్వాత పండుగలు – 
ఆధునికులు సృష్టించినవి. 
సంతోషం కలిగించిన ఉత్తేజంతో 
ప్రజలు కొత్త కొత్త పండుగలను క్రియేట్ చేసుకొనగలుగుతున్నారు.
(వాలెంటన్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, ఫ్రెండ్ షిప్ డే – 
ఇత్యాది నవీన పర్వము, ఫెస్టివల్సు ఈ కోవలోనికే వస్తున్నవి )
""""""""""""'''''''''''''''

ఆంగ్లేయులు, యూరప్ ఖండవాసులు – 
పబ్లిక్ ఉత్సల లిస్ట్ లలో మొదటిది “సిల్వర్ జూబిలీ". 
సిల్వర్ జూబిలీ :- 25 ఏళ్ళకు జరుపుకునే పండుగ ఇది; 
పండుగ అనే కంటే. ఉత్సవ వేడుక అని చెప్పడమే సబబు.

పుష్కరము, కుంభ, మహాకుంభ మేళా, కుంభాభిషేకము ఇత్యాది 
హిందూ పండుగలు అన్నీ చాంద్రమానమును అనుసరించి, 
ఏర్పాటు చేసినవి.  మన దేశములో పంచాంగకర్తలు, ఖగోళశాస్త్రజ్ఞులు, నిపుణులు 
ఋతుచక్రమును “ఆరు” అనే సంఖ్య పునాదిగా విభజనలు చేసారు. కాలచక్రం “షట్” అను అంకె మీద ఆధారపడి ఏర్పరచిన 
గమనము అన్న మాట. 
ప్రభవ, విభవాది సంవత్సరములు 60 పేర్లు కలిగినవి. 
అంటే అరవై ఏళ్ళ తర్వాత, 
మరల మరల ఈ కాలచక్రం “ప్రభవ” మొదలుకొని నడుస్తుంది.
ధనము, భూమి కొలతలు వంటివి అన్నీ “షట్” ప్రమాణముగా మనకు నిర్మించి, ఇచ్చినారు మన ప్రాజ్ఞులు. 
అంకణము, మైలు, క్రోసు, యోజనము - ఇత్యాదులు 
దూరము, భూమి యొక్క కొలతలు. 
మునుపు రాగి కాణీలు, దమ్మిడీలు, పైసా/ పైస – ద్రవ్యమునకు 
మొదటి ప్రమాణములు. 
మూడు పైసలు, అణా (= 6 పైసలు), 
బేడ (12 నయా పైసాలు), వాడుకలో ఉండుట – 
క్రిందటి తరం వారికి తెలుసు.
అట్లాగే “పవిత్ర నదీ స్నానాలు” 
12 సంవత్సరములకు ఒక సారి వస్తూ ఉంటాయి. 
ఈ అవధిని “పుష్కర కాలము” , “పుష్కరం” అని చెబుతారు. 
“పదహారణాల తెలుగుదనం మూర్తీభవించిన” 
మొదలగు ప్రయోగాలు, “ఆరు” అంకె పట్ల గల మమకారంతో ఏర్పడినవే! 
మన జాతీయ జెండాలో అశోక ధర్మచక్రములోని ఆకులు 
6 ఇంటూ 4 = 24 ;  అదే మాదిరిగా మన త్రివర్ణపతాకములో  
ముచ్చటగా ఉన్నవి మూడు రంగులు. [ఆ మాటకు వస్తే 
చాలా దేశాల జెండాలు three colors కలిగి ఉన్న వి.  
""""""""""""'''''''''''''''

జాతకచక్రము 12 గ్రహములు, 12 రాసులు, రాశిఫలములు 
విసృతమైన రీతి ఇది. 
ఇప్పుడు పాశ్చాత్య విధానమును స్థూలముగా అవలోకన చేదాము.
పాప్యులర్ ఐన పదమైన “జూబిలీ” ని 
మరొక్కసారి సింహావలోకనము గావిద్దాము.
సిల్వర్ జూబిలీ = స్థానిక భాషలకు 
“వెండి జూబిలీ” అని అన్వయాన్ని సాధించడం కుదరలేదు.
కనుక మధ్యేమార్గంగా 
సిల్వర్ స్క్రీన్ కాస్తా - “వెండి తెర” గా రూపాంతరం గాంచినది.
25 ఏళ్ళు, పాతిక సంవత్సరములు – వ్యవధికి 
“సిల్వర్ జూబిలీ” అని విభజనం చేసారు మనవారు.
ఇక తక్కిన వాటిని తూనికలు, కొలతలు వేద్దాము. 
గోల్డెన్ జూబిలీ = 50 ఏళ్ళు; 
అసలైన మన భారతీయ కొలమాన సంఖ్యావిశేషం 60 ఏళ్ళు, 
డైమండ్ జూబిలీ” వద్ద మెరుపులీనింది. 
వెస్తెర్న్ కంట్రీస్ లో 60 ఇయర్స్ తర్వాతి గముత్ 100 years.  
అంటే 60 కి 100 కి నడుమ ఏ సెలెబ్రేషన్సుని ఏర్పరచ లేదు.
నూరేళ్ళ పండుగ ఉత్సాహాలను “ఛెంతినర్య్ ఛెలెబ్రతిఒన్స్” అని పిలుస్తున్నారు.
పాతిక – నెంబరు సోపానాన్ని అనుసరించి, 50 రెండో మెట్టు, 
కరెక్టే కదా! రైటే కానీ .............. 
కానీ తదుపరి స్టెప్ ను విస్మరించారు తెల్లదొరలు, 
అదే 75 వత్సర విశేషము.
నెక్స్ట్ స్టెప్ “సెంచనరీ సెలెబ్రేషన్సు” అనుకొని, ఏర్పరిచినారు.

                 Between 50 and 100 = ?

యాభైకీ, శత సంఖ్యా మానానికి మధ్య – డెబ్భై హుషారునకు
క్రొత్త పేరు ఒకటి అవసరమైనది. 
అందుకు ఆధునిక మేధావులు- డిక్షనరీల రచయితలకు 
నూతన నామధేయాన్ని అందించారు, 
అదే “ప్లాటినమ్ జూబిలీ" (Platinum Jubilee).
(It usually refers to a 70th or 75th anniversary.)

""""""""""""'''''''''''''''

ఇది సినీ యుగం. తిరుగు లేని వాత్సవం ఇది. 
పైన చెప్పిన సంవత్సరముల నామావళిని 
సినీరంగం రోజులకు అన్వయిస్తూ, అవే పద రత్నాలను స్వీకరించింది.
సిల్వర్ స్క్రీన్ వద్ద, బాక్సాఫీస్ విజయాలు నమోదు ఔతూ, 
ప్రేక్షకులకు, మూవీల నిర్మాతలకు, చలనచిత్ర రంగములో పనిచేస్తూ, 
ఉపాధి పొందుతూన్న సిబ్బందికీ – విజయోత్సవ సంరంభాలను 
ఘనంగా చేసుకునే బృహత్ అవకాశాలను అందిస్తున్నవి 
అనేక hit  pictures, బాక్సాఫీస్ వద్ద 
జయభేరి మోగించినట్టి, మోగిస్తూన్న వరల్డ్ సినిమాలు.   
వేరే పదవల్లరిని అన్వేషణ చేయాల్సిన అక్కర కలుగలేదు. 
ఇజ్రాయిల్, ఫ్రాన్సు, ఇంగ్లండు ఇత్యాది దేశాలలో అమలు ఔతూన్న సంప్రదాయ నామాలు, 
రెడీగా ఉండటం వలన , చలనచిత్ర రంగం, అందిపుచ్చుకున్నది.
సిల్వర్ జూబిలీ = పాతిక వారాలు ఆడిన సినిమా: 
50 వారములు నడిచిన హిట్ పిక్చర్ – గోల్డెన్ జూబిలీ: 
75 వీక్స్ = ప్లాటినం జూబిలీ ; 
ఈ రోజులలో సినిమాలు అనేక థియేటర్లలోఒకేసారి రిలీజ్ అయి, 
సొమ్ము చేసు కుంటున్నాయి. 
10 సినిమా హాల్సులో 10 రోజులు = అంటే ఒకే ధియేటరులో నూరు రోజులు, 
అనగా “శత దిన ఉత్సవములు” ఫలితాన్ని ఆర్ధికంగా రాబట్టుకోగలుగుతున్నారు. 
ఐతే ఎన్ని సినిమాహాళ్ళలో ఎన్ని రోజులు ఆడింది? అనే 
లెక్కలు జిగ్ జాగ్ పజిల్ లాగా ఔతుంది. 
అందుకని నేడు “ఏ సినిమా ఎన్ని వారములు ఆడింది?” అనే 
అంచనాలను మానివేసారు. 
రోజుల ప్రణాళికను బట్టి పండుగలు ఘనంగా చేస్తున్నారు. 
తడుముకొనకుండా అవే పేర్లు పెట్టి, పిలుస్తున్నారు.
50 రోజులు, వంద రోజుల ఫంక్షన్సుకు పెద్ద పీటలను వేస్తున్నారు.
డార్విన్ పరిణామసిద్ధాంత ప్రకారం, మనిషికీ, గొరిల్లాకూ – నడుమ 
ఉండాల్సిన లింకు గురించి శాస్త్రజ్ఞులు గాలిస్తున్నారు. 
ఇప్పుడు ఈ క్వశ్చన్ - where is 75 function name?

""""""""""""'''''''''''''''

అట్లాగే జూబిలీ  వరుసలలోని అంతరం – 75 – సంబంధితమైనది , 
ప్రస్తుత చర్చనీయాంశము. 
""""""""""""'''''''''''''''   

హమ్మయ్య! ఎట్లాగో భాషానిధుల నుండి ఒక పదమును సాధించగలిగారు – 
అదే “ప్లాటినం జూబిలీ” [Platinum Jubilee] . 
తమాషా ఏమిటంటే  - ప్లాటినం లోహానికి తెలుగు వర్డు ఏమిటబ్బా!? 
ప్చ్! ఇది భలే క్లిష్ట సమస్య కదూ! 
మన తెలుగువాళ్ళు “వజ్రం” అని తర్జుమా కింద జమ చేసేసారు. 
ఆపద్ధర్మ పదం “వజ్రోత్సం” అని చెప్పి, నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నాం. 

అదే భణితిలో నూరు రోజుల ఫంక్షనును “స్వర్ణోత్సవములు” అని నామ ఫలకం పైన స్థిరం చేసేసారు.
మనందరికీ ఎన్నెన్నో విభిన్న అంశాలను అందిస్తూ, 
వామనుడు త్రివిక్రమ అవతారం దాల్చి, ప్రపంచాలను సంభ్రమం లో ఓలలాడించిన పద్ధతిలో – 
వెండితెర సామ్రాజ్యాలు - అవేనండీ సినీ ప్రపంచములు విస్తరించినవి.
సకుటుంబ సపరివారం తో కలిసి కూర్చుని చూడగలుగు మూవీలతో 
మన సినిమాహాళ్ళు కళకళలాడాలి.
కొత్త కొత్త పదాలకు జీవం పోసిన ఇంత గొప్ప వినోద సాధనం సినిమారంగం 
నూరేళ్ళు, వెయ్యేళ్ళు, వేలాది ఏళ్ళు వర్ధిల్లాలని మనసారా కోరుకుందాము.
కేవలం సినిమాల పరంగానే కాకుండా 
వ్యక్తులకైతే - పుట్టినరోజులను - సంవత్సరాల పరంగా చేసుకుంటున్నారు. 
చరిత్ర పరంగా ఈ జూబిల్లి వంటి మాటలకు అధికాధిక వాడుక ఉన్నది. 

[ centuries or millennia (100, 200, 300, 1000, 2000, 3000 etc.) ... 
  70 years, Platinum Jubilee ; ఈ మాదిరిగా.......... ]

""""""""""""'''''''''''''''


sinii utsaaha sambaaramulaku konni imgliishu nEmmm su, 
weelaina chOTla  tenugu sEtalu winabaDutunnawi. wayasunu gaurawistuu mana bhaaratiiyulu chEsukumTunna gRhawEDukalu “shashThi puurti”. imTi yajamaaniki 60 ELLu wachchinappuDu, udyOga riTarmemTu wELa, chEsukumTUnna pamDuga shashThi puurti. ii padaaniki samskRtam shashThi – unnadi. sampuurNamainadi – puurti – ainadi.
wemDitera hushaarulanu parikiddaamu.
haidaraabaad lO’juubilii hils kaalani‘   unnadi. pOsh lokaaliTi juubilii hilsu – ani pratiiti.
chalanachitraramgamlO “jUbilii” anE maaTa tarachuu winabaDutuunnadi.
"ఝూబిలీ" 50 samwatsaramula awadhiki upayOgitam.  \
\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\\ 
hiibruu bhaasha, taruwaata laaTin, phremch – imgliishu padaalalO chOTu chEsukunna amdamaina maaTa idi. 
49 samwatsaramula taruwaayi yaabhayyawa EDAdi – anE saaraamSaanni kaliginadi.
shmita – Edu wasamtaala paribhramaNa chakramunu yuudulu anusaristunnaaru. aTuwamTiwi maLLI EDu watsaramula guchCamu autumdi. 7imTU 7 = 49 యేర్స్. tadupari wachchE samwatsaramunamdu waari wiSwaasaala aacharaNa, kotta samaaja nirmaaNAlaku punaadulu autuumTAyi. chakrawartulu, dhanikulu, saamaanyulu, yaawanmamdii ii aacharaNalO bhaagaswaamulu autunnaaru. kiilakamaina nirNayaalu, baanisalanu wiDudala chEsi, puurti swEchCanu istaaru. amdarikii ewari bhuumulanu waariki tirigi istaaru. paata RNAlanu, baakiilanu, bakaayiilanu raddu chEstaaru. amTE aardhikaibbamdulu tolagi, samaajamunamdu samaanata nelakolpaDAniki ii tiiruna – tiiraina ‘swayam tiirpulu ‘ upakaristaayi.
pEdalu, biidaa bikkii , tama appulu, RNapatraalu raddu awaDam walana AnamdamtO melugutaaru.
hiibruu, bainil gramdhaalu , mataparamaina ii mamchi kaaryakramaalanu gramdhaalalO uTamkimchinawi.
sarE! manam asalu wishayaanni parikiddaam.   =

juubilii  amTEnE “yaabhai ELLu” ainappuDu – nETi wyawahaarikapadakOSAlalO juubilii 
iv) anubamdha padaawaLi konni chOT chEsukunnawi. 
silwar juubilii, gOlDen juubilii ;, DaimamD juubilii ;; imkaa adanamgaa samakuurina bhaawajaalam meTTu meTTu ekkutuu, juubilii ;;;;;;;;;  sarasana chErinawi.
shashThi puurNam , tadupari Ewi unnawi? waastawaaniki 60 ELLu – tarwaata pamDugalu – aadhunikulu sRshTichinawi. samtOsham kali-gimchina uttEjamtO prajalaku kotta kotta pamDugalanu kriyET chEsukonagalugutunnaaru.
(waalemTans DE, phaadars DE, madars DE, phremDship DE – ityaadi nawiina parwadulu, phesTiwalsu I kOnikE wastunnawi )
****************************;
aamglEyulu, yuurap khamDawAsulu – pablik uytsawaala listUlO modaTidi “silwar juubilii – 25 ELLaku jarupukunE pamDuga idi; pamDuga anE kamTE. utsawa wEDuka ani cheppaDamE sababu.
||||||||[ pushkaramu, kumbha, mahaakumbha mELA, kumbhaabhishEkamu ityaadi himduu pamDugalu annii chaamdramaanamunu anusarimchi, ErpATu chEsinawi.  mana dESamulO pamchaamgakartalu, khagOLaSAstraj~nulu, nipuNulu Rtuchakramunu “Aru” anE samkhya punaadigaa wibhajanalu chEsaaru. kaalachakram “shaT” anu make miida aadhaarapaDi Erparachina gamanamu anna maaTa. prabhawa, wibhawaadi samwatsaramulu 60 pErlu kaliginawi. amTE arawai ELLa tarwaata, marala marala ii kaalachakram “prabhawa” modalukoni naDustumdi.
dhanamu, bhuumi kolatalu wamTiwi annii “shaT” pramaaNamugaa manaku nirmimchi, ichchinaaru mana praaj~nulu. amkaNamu, mailu, krOsu, yOjanamu, aamDa, ityaadulu duuramu, bhuumi yokka kolatalu. 
munupu raagi kaaNiilu, dammiDIlu, paisa – drawyamunaku modaTi pramaaNamulu. muuDu paisalu, aNA (= 6 paisalu), bEDa (12 nayaa paisaalu), waaDukalO umDuTa – krimdaTi taram waariki telusu.
aTlaagE “pawitra nadii snaanaalu” 12 samwatsaramulaku oka saari wastuu umTAyi. ii awadhini “pushkara kaalamu” , “pushkaram” ani chebutaaru. 
“padahaaraNAla telugudanam muurtiibhawimchina” modalgu prayOgaalu, “Aru” make paTla gala mamakaaramtO ErpaDinawE! 
mana jaatiiya jemDaalO aSOka dharmachakramulOni aakulu 6 imTU 4 = 24 ;  dE maadirigaa triwarNapataakamu, muchchaTagaa unnawi muuDu ramgulu. 
************,
jaatakachakramu 12 grahamulu, 12 raasulu, raaSiphalamulu wisRtamaina riiti idi. |||||||||||||||
ippuDu paaSchAtya widhaanamunu sthuulamugaa awalOkana chEdaamu.
paapyula aina padamaina “juubilii” ni sim haawalOhanamu gaawiddaamu.
silwar juubilii = sthaanika bhaashalaku “wemDi juubilii” ani anwayaanni saadhimchaDa kudaralEdu.
kanuka madhEmaargamgaa silwar skriin kaastaa - “wemDi tera” gaa ruupaamtaram gaamchinadi.
25 ELLu, paatika samwatsaramulu – wyawadhiki “silwar juubilii” ani wibhajanam chEsaaru waaru.
ika takkina waaTini tuunikalu, kolatalu wEddAmu. gOlDen juubilii = 50 ELLu; asalaina mana bhaaratiiya kolamaana samkhaawiSEsham 60 ELLu, “ DaimamD juubilii” wadda merupuliinimdi. 
western kamTriis lO 60 iyars tarwaati gamut 100 యేర్స్.  amTE 60 ki 100 ki naDuma E selebrEshansuni Erparacha lEdu.
nuurELLa pamDuga utsaahaalanu “ఛెంతినర్య్ ఛెలెబ్రతిఒన్స్” ani pilustunnaaru.
paatika – nembaru sOpaanaanni anusarimchi, 50 remDO meTTu, karekTE! kaanii tadupari sTep nu wismarimchaaru telladoralu, adE 75 watsara wiSEshamu.
neksT sTep “semchanarii selebrEshansu” anukoni, Erparichinaaru.
yaabhaikii, Sata samkhyaa maanaaniki madhya – DebBai – hushaarunaku - krotta pEru okaTi awasaramainadi. amduku aadhunika mEd-haawulu Dikshanariila rachayitalaku nuutana naamadhEyaanni amdimchaaru, adE “platinum juubilii“.
*************************;
idi sinii yugam. tirugu lEni waatsawam idi. paina cheppina samwatsaramula naamaawaLini siniiramgam rOjulaku anwayistuu, awE pada ratnaalanu swiikarimchimdi.
silwar screen wadda, baaksaaphiis wijayaalu namOdu autuu, prEkshakulaku, muuwiila nirmaatalaku, chalanachitra ramgamulO panichEstuu, upaadhi pomdutuunna sibbamdikii – wijayOtsawa sam rambhaalanu ghanamgaa chEsukumTunnaaru.  wErE padawallarini anwEshaNa chEyaalsina akkara kalugalEdu. ijraayil, phraansu, imglamDu ityaadi dESAlalO amalu autuunna sampradaaya naamaalu, reDIgaa umDaTam walana , chalanachitra ramgam, amdipuchchukunnadi.
silwar juubilii = paatika waaraalu Adina sinimaa: 50 waaramulu naDichina hiT pikchar – gOlDen juubilii: 75 weeks = plaaTinam juubilii ; 
ii rOjulalO sinimaalu anEka thiyETarlalO kEsaari riliij ayi, sommu chEsu kumTunnAyi. amTE okE dhiyETarulO nuuru rOjulu, anagaa “Sata dina utsawamulu” phalitaanni aardhikamgaa raabaTTukOgalugutunnaaru. aitE enni sinimaahaaLLalO enni rOjulu ADimdi? anE lekkalu jig jag pajil laagaa autumdi. amdukani nEDu “E sinimaa enni waaramulu ADimdi?” anE amchanaalanu maaniwEsAru. rOjula praNALikanu baTTi pamDugalu ghanamgaa chEstunnaaru. taDumukonakumDA awE pErlu peTTi, pilustunnaaru.
50 rOjulu, wamda rOjula phamkshansuku wlru pedda piiTalanu wEstunnaaru.
Darwin pariNAmasiddhaamta prakaaram, manishikii, gorillaakuu – naDuma umDAlsina limku gurimchi SAstraj~nulu gaalistunnaaru.
aTlaagE juubilii  warusalalOni amtaram – 75 – sambamdhitamainadi , prastuta charchaniiyaamSamu. 
hammayya! eTlaagO bhaashaanidhula numDi oka padamunu saadhimchagaligaaru – adE “plaaTinam juubilii”. tamaashaa EmiTamTE  - plaaTinam lOhaaniki telugu warDu EmiTabbA!? pch! idi bhalE klishTa samasya kaduu! mana teluguwaaLLu “wajram” ani tarjumaa kimda jama chEsEsaaru. aapaddharma padam “wajrOtsam” ani cheppi, niSchaya taambualaalu puchchukunnaam. 
adE bhaNitilO nuuru rOjula phamkshanunu “swarNOtsawamulu” ani naama phalakam paina sthiram chEsEsaaru.
manamdarkii ennennO wibhinna amSAlanu amdistuu, waamanuDu triwikrama awataaram daalchi, prapamchaalanu sambhramam lO OlalADimchina paddhatilO – wemDitera saamraajyaalu wistarimchinawi.
sakuTumba sapariwaaram tO kalisi kuurchuni chUDagalugu muuwiilatO mana sinimaahaalulu kaLaLADAli.
kotta kotta padaalaku jiiwam pOsina imta goppa winOda saadhanam sinimaaramgam nuurELLu, weyyELLu, wElaadi ELLu wardhillaalani manasaaraa kOrukumdaamu.

''''''''''''''''''''''''''''''''''''
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 60828 pageviews - 1024 posts, last published on Aug 14, 2015 

14, ఆగస్టు 2015, శుక్రవారం

లోకకళ్యాణం

లోకకళ్యాణం జనఆదర్శం 
ఉన్నతలక్ష్యం సమోన్నత లక్ష్యం
అందుకనే మనమందరము 
             సాగిద్దాము మన పయనం - || || 
ఆత్మస్థైర్యం ఘనమౌ ధనము
       ఘన మౌలిక పెన్నిధి
చేపట్టుదము వెలుగుల జ్యోత;
           విజ్ఞానజ్యోతి  
అందుకనే మనమందరము  
             సాగిద్దాము మన పయనం - || || 
ప్రపంచశాంతి ఉన్నతధ్యేయం   - 
             హిమ శృంగ ధ్యేయం  
సమతాభావన  ఎల్లరి గమ్యం - 
             సమోన్నత గమ్యం  
అందుకనే మనమందరము 
             సాగిద్దాము మన పయనం - || || 

"వందే మాతరం!" మధు నినాదము!
          మన ముందంజకు గగనమార్గము!   
నిత్యప్రగతీ మధుర ఫలములను
         మాతృభూమికి భక్తితొ ఒసగే
చక్కని ఫలితం, తెలుయుము నేస్తం
        అందుకనే మనమందరము 
              సాగిద్దాము మన పయనం - || || 

========================

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 60745 pageviews - 1023 posts, last published on Aug 14, 2015 - 7 followers
Create new postGo to post listView blog
తెలుగురత్నమాలిక

సాహితీ నీరాజనం – శ్రీ చీమకుర్తి శేషగిరిరావు

ఆంధ్రస్య మాంధ్ర భాషా చ| 
న అల్పస్య తపసః ఫలం|| 
అని అప్పయ్య దీక్షితులు ఉవాచ.     

“సాహితీ నీరాజనం”:-
శ్రీ చీమకుర్తి శేషగిరిరావు గారి ప్రధమవర్ధంతిలో “సాహితీ నీరాజనం” సమర్పించబడినది. బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు సంపాదకుడు. సాహితీ నీరాజనం – శ్రీ శేషగిరిరావు గారి ఉదాత్త భావాలు, ఆశయాలకు వివరణాత్మక వేదిక. శ్రీ శేషగిరిరావు గారిని సన్నిహితులు వివరించిన అనేక విశేషాలను ఇందు ఉటంకించారు.
తెలుగుభాషాసమితి కార్యాలయములో నెలనెలా నిర్వహించే సాహిత్యగోష్ఠులలో -సాహితీవేత్తలు ముద్రించవలసిన 
అపురూప గ్రంథాలను గూర్చి చర్చించి, నిర్ణయాలు తీసుకుంటూండేవారు.
బొమ్మకంటి శ్రీనివాసులు పేర్కొన్న ముఖ్య అంశాలను గమనిద్దాము. 
1) క్రీ.శ. 580 – 620 మధ్య మాధవవర్మ మహారాజు సంస్కృత పుస్తకాన్ని రాసారు. జనాశ్రయుడు – అను పేరుతో మాధవ వర్మ మహారాజు రచించిన వ్యాకరణ/ ఛందస్ గ్రంధం “జనాశ్రయ ఛందో విచితిః”. 
ఆ నాడు వాడుకలో ఉన్నట్టి తెలుగు ఛందస్సులను ఈ పొత్తము వివరిస్తున్నదని, కనుక ఆ రాజు రచనను వెలుగులోనికి తేవాలని 
శ్రీ శేషగిరిరావు భావించారు.
2) అట్లాగే శ్రీచిలకపాటి రామానుజశర్మ రచన “వినోద కథా కల్పవల్లి” మున్నగు వానిని తెలుగు గోష్టి తరఫున ముద్రించాలని శ్రీ శేషగిరిరావు ఆశించారు.
****************
తిరుమల రామచంద్ర “మరుగై పోయిన మహా మేధావి” అనే వ్యాసంలో మిత్రులైన ‘శ్రీ చీమకుర్తి శేషగిరిరావు’ గురించి వివిధ అంశాలను వివరించారు.
“శ్రీ చీమకుర్తి శేషగిరిరావు ప్రాచ్య పాశ్చాత్య విజ్ఞాన ఖని. 
ఏ విషయాన్నయినా కదళీపాకంగా వివరించేవారు. 
రాజనీతి శాస్త్రం లో, ఆర్థిక శాస్త్రం లో, పరమాణు శాస్త్రం లో, 
వైద్యశాస్త్రం లో శ్రీ చీమకుర్తి శేషగిరిరావుగారు – స్నాతకోత్తర విద్యార్థులకు బోధించే వారు. 
ఇక మాతృభాష తెలుగు, భాష కళ, వాస్తు ఆయనకు కొట్టిన పిండి. బైజంటైన్ కాలం నుండి బలిద్వీపం వరకు వీరవిహారం చేసేవారు. 
పెద్ద బాలశిక్ష మొదలు పిటకాల వరకు, ఎక్కాలు మొదలు ఎలెక్ ట్రానిక్స్ వరకు నిద్రలో కూడా బోధించగల మహా మేధావి” 
అని (పేజీ 15) ఆశ్చర్యాన్ని అతను వ్యక్తం చేసారు.
****************

సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్” 
చీమకుర్తి శేషగిరిరావు సహృదయులు. ఆయనతో కలిసి పనిచేయడం 
గొప్ప అనుభవం. ఎవరినీ నొప్పించేవారు కాదు. 
చంద్రునిలో మచ్చలాగ ఆయనకు ఒక అలవాటు ఉండేది. 
ఇప్పుడు బడా బడా పరిశోధకులుగా, రచయితలుగా ఊరేగుతున్న, 
ఊరేగిన పలువురికి ఆయన తెర వెనుక రచయిత. 
'అన్నగారూ! ఈ పని బాగలేదండీ! అపాత్రులను గొప్పవారిని చేయడం కూడా పాపమే! – అని పలుమారు (తి॥ రా॥ ) అన్నాను. 
అందుకు చీమకుర్తి శేషగిరిరావు జవాబు ఈ రీతిగా -
“తమ్ముడూ! కొందరు కొన్ని పదవులలోనికి వస్తారు. 
వారు తమ పదవులని నిలబెట్టుకోడానికి కొన్ని పనులు చేయాలి. 
అలాంటి వారి వల్ల కొన్ని మంచిపనులు జరుగుతాయి. 
కనుక మనం వారిని సమర్థించి మంచి పనులు చేయించాలి.” అనేవారు. నిజమే! ఇలాటి రాజనీతి అవసరమేమో! అని తి॥ రామ॥ భావించారు. పచ్చని మేని చాయకు మెరుగులు పెట్టే - తెల్లటి ఖద్దరు పంచ, చొక్కాలతో, 
బిళ్ళ మడుపు జరీ ఉత్తరీయంతో, కత్తిరించిన మీసాల మధ్య దర్శనమిచ్చే 
ఆ అన్నగారు చిరస్మరణీయులు. -అంటూ 
“మరుగై పోయిన మహా మేధావి” అనే శీర్షికతో – వ్రాసిన వ్యాసంలో తిరుమలరామచంద్ర అనేక అభిప్రాయాలను వెలిబుచ్చారు.
****************
ఆచార్య తిరుమల తెలిపినవి కొన్ని :-
3) ఎవరూ చదవని ‘అహదనక శాసనము’ ను చదవాలని శ్రీ చీమకుర్తి శేషగిరిరావు ఆశించారు. వివిధ విశేషాలను మూలమట్టం నుండి పరిశోధించిన కర్తవ్యనిష్ఠాగరిష్ఠులు శ్రీ చీమకుర్తి శేషగిరిరావు. ఆదిశంకరాచార్యుల కాలనిర్ణయాదులు ఆమూలాగ్రం గాలించి, పఠితలకు అందించుటకై బహు పరిశ్రమ చేసారు శ్రీ శేషగిరిరావు.
4) శ్రీ ఆదిశంకరాచారుల కాల నిర్ణయ పద్ధతి :- క్రీ.శ. 538 లో జన్మించారని శ్రీ శేషగిరిరావు అభిప్రాయం. ఇందుకు ఆయన చూపిన ఉపపత్తుల పట్టిక – శ్రీ శేషగిరిరావు గారి పరిశ్రమకు దర్పణాలు.
అ] 12వ శతాబ్ది ఇవతల డాక్టర్ పోతుకూచి సుబ్రహ్మణ్య శాస్త్రి వంటి అనేకమంది ఉద్ధండుల వాదనలను శ్రీ శేషగిరిరావు పరిశీలించారు.
ఆ) ‘శంకర మందారం’ లో పేర్కొన 3889 కావ్యబద్ధాలు.
ఇ) కాంపూచియా పాలకుడు (877) ఇంద్రవర్మ తన గురువు ఐన శిసోమునికి – ఇచ్చిన ‘దానశాసనము ‘లో ‘శంకర శిష్యునిగా’ పేర్కొన్నారు.
ఈ) ‘సంక్షేపశారీరం’ అనే వేదాంత గ్రంధ రచయిత సర్వజ్ఞాత్మ ముని, ఈ ముని యొక్క గురువు సురేశ్వరాచార్యుడు.
ఉ) సర్వజ్ఞుడు ‘రాజన్య వంశీయుడైన ‘మను కులాదిత్యుడు పరిపాలిస్తున్నాడు అనుట
ఊ) వరాహమిహిరుడు 5-6 శతాబ్దాలవాడు, ఇతను ‘మధుర ప్రాంతాన్ని రాజన్య వంశీయులు పరిపాలిస్తున్నారని – పేర్కొన్నాడు.
ఋ) ఆ వంశీయుల దొరికినవి.
ౠ) ఋగ్వేద భాషాకర్త స్కందస్వామి; 
స్కందస్వామి శిష్యుడు ఐన మహేంద్రుడు -
మహేంద్రుడు ఉదహరించిన వ్యక్తి “కుమారిల భట్టు”. 
కుమారిలుడు శ్రీ ఆదిశంకరాచార్యులకు వరిష్ట సమకాలికులు.
ఎ) ఆంధ్ర దేశీయుడైన భావవివేకుడు – గౌడపాదుని రచనలు ‘మాండూక్యకారికలు’ ఉదహరించుట
ఏ) గోకర్ణుడు కాశ్మీర చక్రవర్తి, వైదిక మతోద్ధరణలో 
ఆదిశంకరాచార్యులకు తోడ్పడ్డాడు.
ఒక అంశాన్ని నిర్ణయించడానికై శ్రీ శేషగిరిరావు వంటి పండితులు నిదర్శనాలను సేకరించుటకై కొన్ని వేల గ్రంధాలను అన్వేషణ చేసి, 
గాలించి – అందుకు పడిన శ్రమను తలుచుకుంటే మాతృభాషాభిమానులకు కళ్ళు చెమరుస్తాయి.
****************
చీమకుర్తి శేషగిరిరావు గారి వ్యక్తిగత జీవితం కూడా చైతన్యపూర్ణమైనది. మాతృ దేశానికి స్వాతంత్ర్య సముపార్జనా పోరాట కాలం అది. 
ద్వితీయ ప్రపంచ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, ఉద్యమాలు నిర్వహించారు. ఆయన 1942 లో ఉప్పు కొటార్ల పై దాడి చేసారు. 
తత్ఫలితంగా అరెస్టు వారెంటు వచ్చింది.చీమకుర్తి శేషగిరిరావు తప్పించుకుని, అజ్ఞాతవాసం 1946 మార్చి వరకు చేసారు. 
అజ్ఞాత వాసములో ఉంటూనే, ఉద్యమాన్ని నడిపారు. ఆ తరుణాన బొంబాయిలో – క్యాంపు ఆర్గనైజరుగా ‘సూర్జీ వల్లభదాస్' ఉన్నారు. 
మూంజీ గారి గెరిల్లా క్యాంప్ కు చీమకుర్తి శేషగిరిరావు యువకులను సమీకరించి పంపిస్తూండే వారు. 
1946 మార్చి తర్వాత అజ్ఞాతవాసాన్ని చాలించారు. 
1947 లో కాంగ్రెస్ సోషలిస్ట్ వింగ్ లో చేరారు. 
1948 లో సోషలిస్టు పార్టీ నుంచి కూడా విడిపోయి, నిర్మాణ కార్యక్రమాలను కొనసాగించారు. అప్పటికి ఆస్తి యావత్తూ కరిగిపోయింది. 
ఉద్యోగాన్వేషణలో చెన్నపురి చేరారు. అక్కడ తెలుగు భాషా సమితి వారి తెలుగు విజ్ఞాన సర్వస్వం – లో అసిస్టెంట్ కంపైలర్ గా చేరారు. 
ఆయన ద్వారా తెలుగు సంస్కృతికి గొప్ప సేవ లభించింది. 
జూన్ 14, 1913 లో వెల్లటూరు (పొన్నూరు తాలుకా, గుంటూరు జిల్లా) జన్మించిన 
శ్రీ చీమకుర్తి శేషగిరిరావు గారు 90 సంవత్సరముల బ్రతుకుబండి – సారస్వత మైలు రాళ్ళకు – బంగారు ధగధగల పూతలను అలది,  తన లక్ష్యములను అందుకుని, చరితార్థమైనది.
****************

శ్రీ చీమకుర్తి శేషగిరిరావు గారి జీవిత సంఘటనలు :- 
చిల్లర ఆదినారాయణ, ఆదెమ్మ – వీరి జన్మదాతలు. 13 జూన్ 1913 లో బాపట్ల తాలూకా – వెల్లటూరు గ్రామమునందు జన్మించారు. 
చీమకుర్తి వెంకటప్పయ్య, నర్సమ్మ గార్లు (కౌండిన్య సగోత్రీకులు)- 
1926 లో దత్తత తీసుకున్నారు. 
విద్య :- వెల్లటూరు, శ్రీ రంగపట్నం, చేబ్రోలు, తెనాలి, గుంటూరు ఎ.సి. కాలేజి. ముదివర్తి సుబ్బారావు, సత్యవతి ల పుత్రిక ‘రాజ్య లక్ష్మి’తో 1931 లో పరిణయం; దత్తపుత్రిక : లలితా కుమారి; 1931 – 54 దాకా స్వాతంత్ర్య పోరాటంలో కార్యశీలి; 
16 సెప్టెంబర్ 1994 భోపాల్ లో దేహయాత్ర చాలించు వఱకూ 
సాహిత్యచైతన్య యాత్రను కొనసాగించిన ధన్యజీవి చీమకుర్తి శేషగిరిరావు.
****************

గుండ్లపల్లి ఆదినారాయణ ‘ఆరు దశాబ్దాలుగా నేనెరిగిన మిత్రుడు’ అని శ్రీ చీమకుర్తిశేషగిరిరావు స్నేహబాంధవ్యాలు గురించి వ్యాసీకరించారు. ఆర్థికస్థోమత అంతగా లేని కారణంగా చేబ్రోలు నుండి గుంటూరుకు, 
కాలినడకను షుమారు 10మైళ్ళు రోజూ నడిచి వెళ్ళి చదువు కొనసాగించారు. 
శ్రీరంగపట్నం అనే కుగ్రామం లో సంస్కృతము నేర్పిన 
శ్రీ వైష్ణవులైన గురువు ల ద్వారా వారి భావి జీవితమునకు కావలసిన 
గట్టి పునాది ఆనాడే యేర్పడటం ఆయన గొప్ప అదృష్టం. 
(శ్రీ మాన్ గుదిమెళ్ళ లక్ష్మీనారాయణ- వద్ద 
కావ్యత్రయం - రఘువంశం, కుమారసంభవం, మేఘ సందేశం అధ్యయనం) : కష్టపడి విద్యనభ్యసించుటచే, వారికి బాల్యము నుండి సద్బుద్ధి, కష్టసహిష్ణుత, పరోపకార పరాయణత ఏర్పడెను. 
చీమకుర్తి గ్రామవాసులు ఐన వెంకటప్పయ్య దంపతులకు 13వ ఏట దత్తపుత్రుడుగా చీమకుర్తి గ్రామం చేరటం జరిగినది. 
పులికొండ వాస్తవ్యులైన ముదివర్తి సుబ్బారావు గారి జ్యేష్ఠ పుత్రిక రాజ్యలక్ష్మిగారితో వివాహము ఐదు రోజులు వైభవముగా జరిగినది.
శ్రీ చీమకుర్తి శేషగిరిరావు స్వతహః స్వాతంత్ర్యేచ్ఛ గలవాడు అగుటచే – విద్యాభ్యాసానంతరము ఉద్యోగమును ఆశించక నిష్కామముగా గ్రామాభివృద్ధికై పాటుపడుతూ, ప్రజాబాహుళ్యమునకు అందుబాటులో నుండి, అందరి మన్ననలకు పాత్రుడైనాడు. సలహాసంప్రదింపులకై వచ్చువారికి మంచి ఆదరణ లభించేది. ఏదైన మంచిపనికి పూనుకుంటే ప్రోత్సాహమిచ్చి, ముందు నిలబడేవారు. 
ఆ రోజులలోనే మా బోటి మిత్రులతో కలిసి కాంగ్రెస్ కార్యక్రమములలో పాల్గొనేవారు. గ్రామములోని యువకులను, విద్యార్ధులను చేరదీసి, 
వారిలో దేశభక్తిని పూరించి, కాంగ్రెస్ సేవకులుగా తీర్చిదిద్దుటలో నిమగ్నమై వుండేవారు. స్వయంగా నూలు వడికి ఖద్దరు ధరించటం ఆ నాటి నుండే ఆరంభమైంది. వారు చనిపోయేవరకు ఖద్దరు ధరించటం మానలేదు.
1935 లో దేవరంపాడులో – 
ప్రకాశం గారికి సంబంధించిన ఉప్పుసత్యాగ్రహ శిబిర ప్రాంగణమున – 
అప్పటి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులైన బాబు రాజేంద్రప్రసాదు గారిచే ఆవిష్కరించబడిన 30 అడుగుల ఎత్తు గల “విజయధ్వజ ప్రతిష్ఠా” కార్యక్రమములో మాతో బాటుశ్రీ చీమకుర్తి శేషగిరిరావు పాల్గొన్నారు.
1937 లో జరిగిన జిల్లా బోర్డు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించుటలోబాధ్యత వహించి, సుంకర వెంకట సుబ్బారెడ్డి వగైరాలతోపాటు శ్రమించి కాంగ్రెస్ విజయమునకు కారకులైనాడు.
1939 లో చీమకుర్తి వాస్తవ్యులు సుంకర వెంకట సుబ్బారెడ్డి ఒంగోలు తాలూకా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనప్పుడు మా మిత్రుడు శ్రీ చీమకుర్తి శేషగిరిరావు కార్యదర్శిగా వుండి, తాలూకా కాంగ్రెస్ కార్యక్రమాలను ఎంతో సమర్ధతతో నిర్వహించారు. 
శేషగిరిరావు ఈ పదవిని 3 సంవత్సరముల పాటు అంటే 
1941 వరకు నిర్వహించారు.
ఆ రోజులలో చీమకుర్తిలోని వారి ఇంటిలో కాంగ్రెస్ సేవకులకు భోజన సదుపాయములు చక్కగా అమరుతూ ఉండేవి. 
కుటుంబసభ్యులు సనాతన ధర్మ సంప్రదాయ పరాయణులైనను, 
శ్రీ చీమకుర్తి శేషగిరిరావుగారి ఆశయాలకు అనుగుణంగా – 
కుల, మత, వర్గ వివక్షతలు ఇంటిలో పాటించే కాదు.
గుండ్లాపల్లి ఆదినారాయణగారి వ్యాసము – క్విట్ ఇండియా ఉద్యమం, ఫ్రీడమ్ పోరాటములో సగటుమనిషి పాత్రకు నిలువుటద్దాలు.
ఆ) కనుపర్తి సముద్రతీరస్థ కుగ్రామం, 
అక్కడ ప్రభుత్వం వారి ఉప్పుకొఠారు ఉన్నది. 500 జనసమూహముతో 
ఆ కొఠారు పై దండెత్తినారు. ఉప్పు పండించి – నిల్వ చేసే కొఠారులు అవి. బ్రిటిష్ గవర్న్ మెంట్ ‘కాల్పులు జరుపు ఉత్తర్వులతో ఒక మహ్మదీయ పోలీస్ అధికారిని, పిస్టలును ఇచ్చి కాపలా ఉంచారు. కానీ భయభ్రాంతుడైన అతను వీరిని అడ్డగించలేదు. ఆ కారణమున ఆ పోలీసు అధికారిని డిమోట్ చేసారు.
ఇ) కనుపర్తి లో దేశభక్తుడైన వైశ్య ప్రముఖుల్లు కీ.శే. మేడా శ్రీరాములుగారు ఆనాటి మిట్టమధ్యాహ్నం ఆతిథ్యం ఇచ్చారు. 
ఎండ తీవ్రంగా ఉన్న అపరాహ్ణం – తలవని తలంపుగా వెళ్ళిన జనం అందరికీ ఇంట్లో ఉన్న బెల్లపు అరిసెలు ఫలహారం పెట్టారు, 
మజ్జిగ కలిపిన అన్నమును, అందరి దోసిళ్ళలో పోసి, అందరి ఆకలిని తీర్చారు మేడా శ్రీరాములు గారు. 
అక్కడినుండి అమ్మనబ్రోలుకు వెళ్ళసాగారు. మార్గమధ్యంలో మందీ మార్బలంతో పోలీసువారు ఎదురైనారు.
సాగి విజయరామరాజు, గుండ్లాపల్లి, సీతారామాంజనేయులు, కనపర్తి నారాయణరావు గార్లు అంతకుముందే పోలీస్ నిఘా లో ఉన్నారు. 
తాము అరెస్టు కాక తప్పదని గ్రహించారు, 
ఉద్యమాన్ని కొనసాగించు నిమిత్తం ఇంకా పోలీసుల లిస్టుకి ఎక్కని 
శ్రీ చీమకుర్తి శేషగిరిరావును జనమధ్యానికి పంపి, జనులలో కలిపారు మిత్రబృందం. వారి పథకం ఫలించింది. 
ఈ మిత్రబృందం అరెస్టు ఐనాక, అజ్ఞాతములోకి వెళ్ళారు శ్రీ చీమకుర్తి శేషగిరిరావు, అజ్ఞాతములో ఉంటూ, ఉద్యమాలను దిగ్విజయంగా కొనసాగిస్తూ, నాయకులకు కొండంత అండగా నిలిచారు శ్రీ చీమకుర్తి శేషగిరిరావు. 
పైన పేర్కొన్న వ్యక్తులను బళ్ళారి దగ్గర ఉన్న ఆలిపూరు క్యాంపు జైలుకు పంపించారు. శాసనోల్లంఘనం చేసిన పెద్దిభొట్ల రామచంద్ర రావు, రామచంద్రుని వెంకటప్పయ్యలకు రెండు సంవత్సరాల కారాగార శిక్షను విధించారు. పోలీసులనుండి తప్పించుకున్నప్పటికీ శ్రీ చీమకుర్తి శేషగిరిరావుపై పోలీసువారు కేసు నమోదు చేసారు.
అజ్ఞాతవాసంలో శ్రీ చీమకుర్తి శేషగిరిరావుగారికి విప్లవవీరులతో సాన్నిహిత్యమేర్పడింది. ప్రతివాది భయంకర వెంకటాచారి, అచ్యుత పట్వర్ధన్, జయ ప్రకాశ్ నారాయణ మున్నగు వారి సాన్నిహిత్యము వలన – వారి ఆశయాలకు ఆకర్షితుడైనారు చీమకుర్తి శేషగిరిరావు. గుంటూరు కేంద్రముగా వారి కార్యక్రమాలలో శేషగిరిరావు పాల్గొనుచుండే వారు.
ఈ) ప్రభుత్వాన్ని కూలదోయడం ప్రధాన కర్తవ్యం. అందుకై ప్రభుత్వ ఆస్థులను – అనగా రైల్వే స్టేషన్ లను, ప్రభుత్వ ఆఫీసులను బాంబులతో ధ్వంసం చేయుట, ప్రభుత్వమునకు వ్యతిరేకంగా కరపత్రములను ముద్రించి, ప్రజలకు ప్రభుత్వ సేవకులను పంచుట ; తంతి, తపాల సౌకర్యములను విచ్ఛిన్నము చేసి, ప్రభుత్వ కార్యకలాపాలను స్తంభింప చేయుట ప్రధాన ఆశయాలుగా వుండేవి. ఈ కార్యక్రమంలో భాగంగా బొంబాయికి వెళ్ళారు చీమకుర్తి శేషగిరిరావు. తిరిగివచ్చాక, వారు నిర్ణయించుకున్న పథకంలో / పంథాలో భాగంగా ఈ క్రింది విధంగా నిర్ణయించిరి.
ఒంగోలులో బాంబును తయారుచేసి, ప్రభుత్వ ఆస్తులైన జిల్లా కోర్టు, తాలూకా ఆఫీసులలో ఆ బాంబులను పెట్టి, రికార్డులను నాశనము చేయవలెనని నిశ్చయించిరి.
తన బావమరిది ముదివర్తి సత్యనారాయణను, అనుచరులైన రావినూతల వెంకటేశ్వర్లు, వేమూరు వెంకటసుబ్బయ్య లను నియోగించినారు. 
బాంబు నిర్మాణమునకు కావలసిన సామగ్రిని చీమకుర్తి శేషగిరిరావుగారు – గుంటూరు నుండి పంపి అందించినారు. 1943 జనవరి 26 న పేల్చాలని అనుకున్నారు. 
“ప్రతి సంవత్సరం జనవరి 26 న ‘పూర్ణ స్వరాజ్య’ గా పరిగణించాలి.” అని 1930 లో కాంగ్రెస్ కమిటీ తీర్మానం ఉన్నది. 
కనుక ప్రతి ఏడాదీ జనవరి 26 న కాంగ్రెస్ సేవకులు, ఉద్యమకారులు కాంగ్రెస్ జెండాను ప్రతిష్ఠించి, వందనం ఆచరించి, 
‘సంపూర్ణ స్వరాజ్య సంపాదన’ కై ప్రతిజ్ఞను తీసుకొనటం ఆచారముగా వస్తూన్నది. 
అందుచేత ఉత్సాహవంతులైన ఈ ముగ్గురు యువకులు బాంబు తయారు చేయుటకై 1943 జనవరి 23 న పూనుకున్నారు. జిల్లాకోర్టు చేరువలో నున్న షేక్ రహిం తుల్లా సాహెబ్ గారి మేడ పై భాగంలో బాంబు నిర్మాణమునకు పూనుకొనిరి. నిర్మాణ లోపముచే ఆ బాంబు అర్ధంతరంగా పేలింది. 
అక్కడి ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు ఐనవి. 
ఎట్లో ప్రాణాపాయం నుండి బయటపడగలిగారు. 
వారు పోలీసుల నుండి తప్పించుకుని, తలా ఒక దిక్కుకు వెళ్ళారు, 
చివరకు ఎట్లో గుంటూరులో ఉన్న చీమకుర్తి శేషగిరిరావుగారి మకామునకు చేరుకోగలిగిరి
****************
[ముదివర్తి సత్యనారాయణ ఒంగోలులోని రంగారాయుడి చెరువులో కూర్చున్నారు. గాయాల మంటలను తట్టుకోవడానికి, నీళ్ళలో దాక్కుంటారని ఊహించిన పోలీసులు చెరువు ఒడ్డున రోజంతా నిఘా వేసారు. 
ఐతే ముదివర్తి సత్యనారాయణ – యోగాసనములు, సూర్య నమస్కారములు, జలస్తంభన మున్నగు విద్యలను అభ్యసించిన నిష్ణాతులు. 
అన్ని గంటలసేపూ – చెరువు నీళ్ళలోనే ముక్కు మూసుకుని, 
మునిగి కూర్చున్నారు. పోలీసులు ‘ఎవరూ దాగి ఉండలేదని’ నిర్ధారించుకుని మరలిపోయారు. అర్థరాత్రికి నెమ్మదిగా బైటికి వచ్చారు సత్యనారాయణ.]
ఉ) కడియాల యానాదయ్య :- మరో శోచనీయ సంఘటన జరిగింది. కడియాల యానాదయ్య కీర్తిపాడు (ఒంగోలు తాలూకా) వాస్తవ్యులు, ఒంగోలు జిల్లా బోర్డు కాంగ్రెస్ సభ్యుడు. బాంబు ప్రేలుడులో గాయపడిన యోధులకు కడియాల యానాదయ్యచౌదరి రక్షణ కల్పించాడు – అనే నెపంతో యానాదయ్యను నిర్బంధించి, తీవ్రంగా హింసించారు. 
ఆ హింసకు తట్టుకోలేక, పోలీసు వారి అధీనంలో ఉండగనే యానాదయ్య ప్రాణాలు కోల్పోయిరి. ఆ విషయాన్ని కప్పిపుచ్చి, ‘బావిలో పడి చనిపోయె’నని పోలీసులు కట్టుకథను కల్పించి ప్రజలను మభ్యపెట్టిరి. [యానాదయ్య దేహాన్ని చెట్టుకు ఒక రోజంతా వేలాడదీసి ఉంచారని, ప్రజలను భయం కలగాలని – ముందరి తరం స్థానికులకు,తెలుసు.] ప్రభుత్వము వారి ఘోరహింసలకు భయపడి, నిజము గ్రహించినను ప్రజలెవ్వరును ముందుకు రాలేక పోయిరి. (పేజీ 25). యానాదయ్య విషాద సంఘటన శేషగిరిరావుగారిని విపరీతంగా కలిచివేసినది.
‘ఆంధ్రకేసరి ప్రకాశంగారి కాంస్య విగ్రహ ప్రతిష్ఠ” సంచికలోని వ్యాసంలో శేషగిరిరావు ఇట్లాగ అన్నారు: “గాంధీజీ నాయకత్వమున సాగిన భారత స్వాతంత్ర్య సంగ్రామములో నిస్వార్ధ జీవనులు కీర్తికాంక్ష లేకుండా తమ ప్రాణాలను ఆహుతి చేసారు. పోలీసుల నిరంకుశ హింసాకాండకు లోనై ఎందరో అంతరించారు. వారిలో కొందరి పేరులు మాత్రమే పుటలలోనికి రాగలిగినవి. తక్కినవారివి అజ్ఞాతంగానే వుండి పోయినవి. అట్టి అజ్ఞాత దేశభక్తులలో ఒకడుగా పేర్కొనదగిన వాడు కీర్తిశేషుడు యానాదయ్య.”
[పేజీ 25] బాంబు కేసుకు సంబంధించిన రావినూతల,వేమూరి, తదితరులను అరెస్టు చేసి, కేసులు పెట్టినందున వారికి కారాగారశిక్ష విధించబడినది.తదుపరి పాటిబండ్ల నాగేశ్వరరావు, ప్రతివాది భయంకర వెంకటాచారి మున్నగువారిని కుట్ర కేసులను బనాయించి, వారిపై కేసు పెట్టిరి. కాని ప్రభుత్వము వారు యెన్ని విధములుగా శ్రమించినను శ్రీ చీమకుర్తి శేషగిరిరావు గారిని పట్టుకొనలేక పోయారు. మిత్రుడు శేషగిరిరావు అజ్ఞాతవాసంలో నున్నప్పుడు, గుంటూరు, నెల్లూరు, మద్రాసు, బాపట్ల మొదలైన పట్టణాలలో రకరకములైన పేర్లతో, వివిధ వేషములతో సంచరిస్తూ పోలీసుల బారి నుండి తప్పించుకుంటుండే వారు. ఒక చోట పౌరాణికుడుగాను, మరో చోట పిల్లలకు పాఠాలు చెప్పు ఉపాధ్యాయుడుగాను ఉంటూ కాలం గడిపినారు. ఎక్కువకాలం బాపట్ల వాస్తవ్యులు, సహృదయులు, ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధులు కీ.శే. పిల్లుట్ల హనుమతరావుగారి యింటిలో, వారి కుటుంబ సభ్యులలో ఒకరుగా కాలము గడిపిరి.శేషగిరిరావు తన జీవితపర్యంతం ఆ కుటుంబమునకు సహాయ సలహాదారుగా వుండి, వారి నెంతో ప్రేమతో ఆదరణతో చూచే వారు.
b) మా శిక్షాకాలం (గుండ్లపల్లి) పూర్తి అయిన పిదప 1944 మే నెలలో మమ్ములను జైలు నుండి విడుదల చేయుట జరిగినది. అప్పటికింకా శేషగిరిరావు అజ్ఞాత వాసంలోనే ఉన్నారు. (గుండ్లపల్లి వారి వలె, మిత్రవర్గములో జైలుశిక్షకు గురైన వారిలో భట్రాజు కృష్ణమూర్తి మున్నగు వారు ఉన్నారు. ఆ సంఘటనల పరంపరను -“గుంటూరు జిల్లాలో క్విట్ ఇండియా ఉద్యమము” అనే వ్యాసము (సాహితీ నీరాజనం ‘ 50-65 పుటలు)నందు శ్రీ చీమకుర్తి శేషగిరిరావు గారి స్వకీయ రచన, పఠితలను సంభ్రమానంద, ఉత్తేజభరితులను చేస్తుంది.)
(గుండ్లపల్లి వారి వలె, మిత్రవర్గములో జైలుశిక్షకు గురైన వారిలో భట్రాజు కృష్ణమూర్తి మున్నగు వారు ఉన్నారు. ఆ సంఘటనల పరంపరను -“గుంటూరు జిల్లాలో క్విట్ ఇండియా ఉద్యమము” అనే వ్యాసమునందు శ్రీ చీమకుర్తి శేషగిరిరావు గారి స్వకీయ రచన, పఠితలను సంభ్రమానంద, ఉత్తేజభరితులను చేస్తుంది. – ‘సాహితీ నీరాజనం ‘ 50-65 పుటలు)

1946 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన అనంతరం, వారి ప్రభుత్వం శేషగిరిరావు మీద నున్న వారంట్లను రద్దు చేసిన ఫలితంగా వారు అజ్ఞాతవాసం నుండి బయటకు రాగలిగారు. అజ్ఞాతవాసం నుండి బయటకు వచ్చిన తర్వాత గ్రామాభ్యుదయ కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటూ ఉండే వారు. ప్రకాశం గారు ప్రవేశపెట్టిన ఫిర్కా డెవలప్ మెంటు పథకంలోను, ఫుడ్ కమిటీలలోను, ఖాదీ నిర్మాణ కార్యక్రమములలోను చురుకుగా పాల్గొనే వారు. ఆ తర్వాత శేషగిరిరావు ప్రత్యక్ష రాజకీయాల నుండి వైదొలగి 1954 లో మద్రాసు చేరారు. శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, శ్రీ మోటూరు సత్యనారాయణ గారల ఆధ్వర్యంలో నడపబడుచున్న తెలుగు భాషా సమితిలో సహాయ సంగ్రాహకుడుగా ఉద్యోగములో చేరిరి.
ధనార్జన వాంఛ లేని వ్యక్తి శేషగిరిరావు, తన ప్రియ చెలికాడు, తోటి స్వాతంత్ర్య సమరయోధుడైన వేమూరి వెంకట సుబ్బయ్య గారికి చీమకుర్తిలోని తన స్థలము నుండి 240 గజముల స్థలమును ఉచితముగా ఇచ్చి, అందు భవన నిర్మాణమునకు కూడ పూనుకొనిరి. ఆ విషయమున చీమకుర్తివాసులనుండి, తన మిత్రులు, బంధువుల నుండి సేకరించి, భవన నిర్మాణము చాల వరకు పూర్తి చేయగలిగిరి. ఈ భవన నిర్మాణమునకు వారు పడిన శ్రమ మరువరానిది.వారి మరణానంతరము, శేషగిరిరావు గారి బావమరిది ముదివర్తి లక్ష్మీనరసింహరావు గారు చీమకుర్తి వెళ్ళి భవన నిర్మాణము పూర్తి చేసి శేషగిరిరావు గారి సంకల్పమును నెరవేర్చినందుకు వారి ఆత్మ ఎంతో సంతోషించి ఉండునని తలచుచున్నాను. – అంటూ ఇంకా అనేక విశేషాలను పొందుపరిచి, రచించిన పెద్ద వ్యాసములోని ప్రతి వాక్యము, పదము ఉటంకించదగినవే!
****************
నేలపాడులో తమ ఇంటిలో ఉద్యమకర్తలకు రహస్యంగా రక్షణ కల్పించిన 
ఐ. చక్రధర్ తెలిపిన ఉభయుల మైత్రీ అనుభవాలు 
“నేనూ మా శేషగిరీ” అనే మంచి essay 
“మహా మనీషి  శ్రీ చీమకుర్తి” గురించి బి.ఎన్. శాస్త్రి రచన, ఇరువురి సాహితీ అభిరుచుల మేలుకలయికలను చక్కగా వివరించారు.
వాకాటక మహాదేవి, ఆదిలాబాదు సర్వస్వము, 
మహబూబునగర జిల్లా సర్వస్వము, మున్నగు అనేక బృహద్గ్రంధముల 
నొక్క చేతి మీదుగ రచించి, ప్రచురించుట అపూర్వ విషయం” అని ఆశీర్వదించినారు శేషగిరిరావు. 
చీమకుర్తి శేషగిరిరావు పానుగల్లులోని పచ్చల సోమేశ్వర ఆలయము దర్శించారు, ఛాయా సోమేశ్వరాలయ శిల్పసంపద కబ్బురపడినారు. చీమకుర్తి శేషగిరిరావు 
“55 ఏళ్ళ కిందటి మాట.మేము ఒంగోలు హైస్కూలులో విద్యార్ధులం. గాంధీజీ వ్యష్టి సత్యాగ్రహానికి పిలుపు నిచ్చాడు. పేరుకు “వ్యష్టి” అయినా అది ఒక పెద్ద వుద్యమ రూపాన్ని దాల్చింది. 
గాంధీ గారు గంగా జల సదృశుడు” అని చీమకుర్తివారు చెప్పిన వాక్యమును మననం చేసుకున్నారు టి. సూర్యనారాయణరావు 
( in  “ధన్యజీవి శ్రీ చీమకుర్తి శేషగిరిరావు”)
*********************
బొల్లాపల్లి సుబ్బారావు గారి రచన – “మా అన్నగారు” :-
1] సాహితీ నీరాజనంలో – చెన్నపురిలో క్రమబద్ధంగా సాగిన శ్రీ చీమకుర్తి శేషగిరిరావు గారి దినచర్యను విపులీకరించారు.
2] ముక్త్యాల రాజావారు అప్పగించిన బృహత్తర కార్యం ‘గౌతమబుద్ధుని 2500 జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకసంచికను అంకితభావంతో దిగ్విజయంగా పూర్తి చేసారు.
3] శ్రీ చీమకుర్తి తన అన్న్ వెంకటేశ్వర్లు వద్ద కావ్యపఠన వలన సంస్కృత, ఆంధ్ర, ఇంగ్లీషు భాషలపై కలిగిన పటుత్వం – వారి సంభాషణలలో ద్యోతకమయ్యేది. జన్మతః బ్రాహ్మణుడు, తెల్లని శరీర ఛాయ, రూపసి, చలువ చేసిన అతి తెల్లని ఖాదీబట్టలతో చూపరులకు కంపించినప్ప్టికి, వారు వైదిక ధర్మాలనేమి అంతగా పాటించేవారు కాదు.సనాతన ధర్మ నియమాలు, వైదిక మత సాంప్రదాయాలు బాగా ఆకళింపు చేసుకున్నప్పటికీ, ఛాందసపరమైన యే సంప్రదాయాన్ని మూఢంగా పాటించేవారు కాదు. 
దేవునిపై అపార భక్తి విశ్వాసములున్నప్పటికి మూఢభక్తి భావంతో దేవాలయాలకు వెళ్ళేవారు కాదు.
బ్రాహ్మణుడైనప్పటికిని, జాతి, కులవర్ణ వివక్షతలు పాటించడం వారి ఆశయాలకు విరుద్ధం. చీమకుర్తిలో ఒక మహమ్మదీయుడు ఆయన మిత్రుడు,
తన విజ్ఞానమును అంతయు క్రోడీకరించి, భావితరాల వారికి విజ్ఞానాభివృద్ధికి యెంతో దోహదం చేసారు. సకలశాస్త్రములలో నిపుణుడు. అరిషడ్వర్గాలను కూడ అదుపు చేయగల్గిన సాధుమూర్తి.అంటూ నీరాజనములను అర్పించారు బొల్లాపల్లి సుబ్బారావు గారు.
****************
ఎం. పి.ఆర్. రెడ్డి వ్యాసం – “క్విట్ ఇండియా ఉద్యమంలో నేనూ శేషగిరిరావూ” 1942 ఆగస్టు 8 న గాంధీ ఇచ్చిన నినాదము “విజయమో వీరస్వర్గమో” (Do or die) – డిల్లీ నుండి ధనుష్కోటి వరకూ యువకులను ఉత్తేజపరచినది. మధురాంతకం మాధవరావు మొదలగు మహామహులు పాల్గొన్న వైనమును తెలిపారు. కొన్ని ఆసక్తికర అంశాలు :- గాంధీజీ ఉద్దేశ్యానికి దూరంగా జరిగి, ఉత్తరప్రదేశ్, బీహారు రాష్ట్రాలలో – సతారాలో నానాపాటిల్ ‘సమాంతర ప్రభుత్వం’ ‘మేము ఆయుధలతో పోరాడాము- అని పాటిల్ ఒప్పుకున్నాడు. అప్పుడు గాంధీజీ ” క్రూర ప్రభుత్వపు దమననీతిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. పిరికివాళ్ళ అహింసా విధానము కంటే ధైర్యవంతుల ఈ హింసా విధానము న్యాయసమ్మతమే!” అని అభినందించారు. ఆగస్టు తిరుగుబాటులో అనేక త్యాగాలు చేసినవారికి ఇది ఊరట కలిగించింది. (స్వాతంత్ర్యానంతరము అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వారు దీనిని మరుగుపరిచారు. గాంధీజీ అహింసా విధానాన్ని మాత్రమే బల పరిచారని – వాదాన్ని – తమ రాజకీయ లబ్ధికొరకై ప్రచారంలోకి తెచ్చారు, పాఠ్య పుస్తకములలో జొప్పించారు.- అని రచయితల లేఖనములు.)
****************
నేలపాడులో తమ ఇంటిలో చీమకుర్తి శేషగిరిరావు వంటి ఉద్యమకర్తలకు రహస్యంగా రక్షణ కల్పించిన ఐ. చక్రధర్ తెలిపిన ఉభయుల మైత్రీ అనుభవాలు “నేనూ మా శేషగిరీ” అనే మంచి essay . ‘సాహితీనీరాజనం’ లో ఎ.కె. మూర్తి, ముదివర్తి రాఘవరావు (శ్రీ చీమకుర్తి జీవితంలో కొన్ని మెఱుపులు),
శ్రీ చీమకుర్తి శేషగిరిరావు అగ్రధిత రచనలు, ప్రాచీన అర్వాచీన ఆసక్తికర పదముల మూల రూపాలు, సాహిత్య, శాసన, చారిత్రక సంస్కృతీ పరిశోధనతో మమేకమైన ఉద్ధండ పండితుల వ్యాసాలు ఉన్నవి. ప్రతి అక్షరములో ఆయా మహానుభావులు తమ జీవితములలోని అణువణువూ వెచ్చించి, శ్రద్ధాసక్తులను మేళవిస్తూ ధారపోసిన శ్రమశక్తిని ప్రతిఫలిస్తున్నవి.
****************
ఇందుకూరి సూర్యనారాయణరాజు (లైబ్రేరియన్): హరిశంకర్ ;మున్నగు స్నేహితుల స్పందనలు ఇందున్నవి.
****************
ముదివర్తి రాఘవరావు – రాసిన వ్యాసం – శ్రీ ‘చీమకుర్తి’ జీవితంలో కొన్ని మెఱుపులు, గుర్తుంచుకున్న, గుర్తుంచుకోదగిన అనుభవాలను తెలిపారు.
శ్రీ చీమకుర్తి శేషగిరిరావు అగ్రధిత రచనలు :- 
అమూల్య వ్యాసాల మంజూష. 
1) తెలుగులో విజ్ఞానసర్వస్వములు;:- సర్వంకష రచనలకు పునాది, ప్రపంచ సాహిత్యంలో మొదలుకుని వివరించారు. 
2)సుహృల్లేఖ : 3) అథర్వవేదము – భారతీయ సమ్మిశ్ర సంస్కృతికి మూల కందము ; 4) సంస్కృతి – గాంధేయ దృక్పథము ; 
5) నామ సంకీర్తనం – విధి విధానం ; 6) పదముల మాటున ప్రాచీన సంస్కృతి 7) యుగము ; 8) ‘యొక్క ‘ విభక్తి వ్యుత్పత్తి ; 
9) గాంధీజీ నిర్యాణము (శ్రీ చీమకుర్తి శేషగిరిరావు గారు, 
కలకత్తా నుండి ఫిబ్రవరి 1, 1948 న – భార్య రాజ్యలక్ష్మికి రాసిన లేఖ ఇది ; ఇందులో ఆయన తన ఆవేదనను వ్యక్తీకరించిరి.  
10) ఆత్మ నివేదన;
వీనితో బాటు – ఈ అనుబంధమునందు అదనంగా ఉన్న కొన్ని విలువైన వ్యాస లహరి :-
1) తెలుగు దేశములోని బౌద్ధ స్తూపాలు, బౌద్ధ విహారాలు ; – బిరుదరాజు రామరాజు : 
2) శ్రీధాన్యకటక నగర ప్రాథమిక నాణెములు; – పురాణం రాధాకృష్ణ ప్రసాద్ ; 3) ‘కాలు ‘ పద పరిశీలన :- పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి :; 
4) ఉత్తరాంధ్రలో ప్రసిద్ధ దేవాలయాలు (చారిత్రక విశేషాలు) :- 
మైనేని కృష్ణకుమారి : 
5) తెలుగు సంస్కృతి విస్తరణ (రాంభొట్ల కృష్ణమూర్తి): 
6) కారల్ మార్క్స్, గుడిపాటి వెంకట చలమూ – సి. ధర్మారావు : 
7) మహావ్యక్తి మాధవ విద్యారణ్యస్వామి – గడియారం రామకృష్ణ శర్మ ;
8) హిందూమతం – జీవితధ్యేయం – పుల్లెల శ్రీరామచంద్రుడు : 
9) రచయిత ఎందుకు రాస్తాడు? – బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు : 
10) ఆధునిక తెలుగు సాహిత్యం (తొమ్మొదో శతాబ్దపు సాహిత్యరీతులు) :- అక్కిరాజు రమాపతిరావు ; 
11) రంగనాథ రామాయణం అందించే అక్షరానందం –వి.వి.ఎల్.నరసింహారావు 
12) తెలుగులో అనుకరణవాచకాలు - రవ్వా శ్రీహరి; 
13) తెలుగు కవిత – గాంధీయ ప్రభావం – ఎన్. గోపి ; 
14) తెలుగు భాషకు సేవ చేసిన మహానుభావులు – వి.వి. సుబ్రహ్మణ్య శర్మ ; 15) రామాయణ కల్పవృక్షం – గుబాళించిన హాస్య పరిమళాలు ;- 
వెలుదండ నిత్యానందరావు ;: 
16) కన్యాశులకంలో వెంకమ్మ ;- ముక్తేవి భారతి : 
17) హంపీ క్షేత్రం – కె. రుక్నుద్దీన్ ;
     తెలుగు గోష్ఠి హారములోని పూలు ఈ పరిశోధక వ్యాసములు.
****************
1995 లో ప్రధమవర్ధంతి సందర్భంగా వెలువడిన అమూల్య పుస్తకం ఇది. వెరసి శ్రీ చీమకుర్తి శేషగిరిరావు స్వీయ అనుభవాలను వర్ణించిన పేజీలు, చదువరులను ఉద్విగ్నభరితులను చేస్తుంది. షార్టు ఫిల్మ్ తీయదగినన్ని అనుభవాల సంపుటి. చీమకుర్తి శేషగిరిరావు ఆంధ్ర, సంస్కృత ఆంగ్లాది భాషలలో గొప్ప అభినివేశము కలిగిన వ్యక్తి, రచనా నైపుణ్యత, ప్రజ్ఞా శక్తి కల మనీషి, వారి అనుభవ మందార సుమాలను లోకానికి అందించాలనే ఆసక్తి, ఆయన పట్ల భక్తిప్రపత్తులు, ప్రేమానురాగాలు కలిగిన అనేకమంది పూనిక కూడా ఇట్లాంటి మంచి గ్రంధము – స్మృత్యంజలిగా రావడానికి హేతువు ఐనది. (అసంఖ్యాక స్వాతంత్ర సంగ్రామ భాగస్వాములు త్యాగనిరతి వెలుగులోకి రానివి ఎన్నెన్నో! యువతకు మార్గదర్శినులు అగు ఇటువంటి ఆణిముత్యాల ఆవశ్యకతను ఈ పుస్తకం తెలుపుతున్నది.) 
**************************************************************

తొలి పుటలలో – యార్లగడ్డ నిర్మల పుస్తకమును కంపోజింగ్ చేసారు. 
ముదివర్తి రాఘవరావు, బొల్లాపల్లి సుబ్బారావు సంపాదకులైన బొమ్మకంటి శ్రీనివాసాచారులు గారికి కుడిభుజములుగా నిలిచారు. 
అచ్చు పనిలో, నా సంపాదకత్వ బాధ్యతలో ముప్పాతిక వంతు పంచుకుని, నా పనిని సుకరం చేసారు” 
అంటూ కృతజ్ఞతాంజలి అర్పించారు.
**************************************************************

250 పేజీలకు పైన ఉన్న “సాహితీ నీరాజనం” వెల – Rs. 100/- ముద్రణ చాలా ఉన్నత ప్రమాణాలను కలిగినది. 
కంటికి శ్రమ కలుగని రీతిగా, ముద్రణ అందంగా ఉన్నది. 
ఎక్కడా అచ్చుతప్పులు లేవు. ప్రచురణకర్తల దీక్షా దక్షతలకు నిదర్శనం చక్కని ముద్రణ. 
FONTLINE GRAPHICS, Baghlingampalli టైప్ సెటింగు.
ప్రతులు:-
శ్రీ చీమకుర్తి సంస్మరణ సమితి,
1-9-34/5/E, రామ్ నగర్, హైదరాబాదు – 500 048 

*******************************************************************

సాహితీ నీరాజనం – శ్రీ చీమకుర్తి శేషగిరిరావు ; pustakam 
వ్యాసకర్త: కాదంబరి
More articles by అతిథి » Written by: అతిథి 

Tags: Articles by Kadambari, spotlight 


*******************************************************************

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 60708 pageviews - 1022 posts, last published on Aug 5, 2015 -

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...