31, డిసెంబర్ 2013, మంగళవారం

కేలండర్ తమాషాలు


క్రీస్తు శకము 1150 వర్షము హిందూ దేశ పంచాంగముల నిర్మాణములో మేలు బంతి. అప్పటిదాకా ప్రజలు అనుసరిస్తూన్న ఖగోళ జ్ఞాములలో- ఉన్న కొన్ని లోపాలను సరిదిద్దాడు భాస్కరాచార్యుడు. అధిక మాసమును, అలాగే లుప్త (శూన్య -మాసాలను ఏర్పరిచాడు. ఇందువల సంవత్సరమునకు నిర్ధారించిన రోజులు, నక్షత్రగమన గణనములూ ఒక కొలిక్కి వచ్చినవి. సంవత్సరమునకు 365. 258438 రోజులు- అని - ఘడియలూ, విఘడియలతో సహా నిర్మించగలిగాడు.

* * * * *

వెస్టర్న్ విజ్ఞానము ఫలితముగా కేలండరు ప్రజలకు అందుబాటులోనికి వచ్చింది. రోజువారీ దినచర్యలకూ, జీతభత్యాదుల గడువు వగైరాలు సకల పనులకు నేడు ఈ అంగ్రేజీ కేలండర్ ముఖ్య ఆధారమైనది. వారఫలాలనుఆట్టే నమ్మకున్నా- మొదటగా రాశి ఫలితములను ఓసారి చదివి, తతిమ్మా వార్తాది విశేషాలను పేజీలను పత్రికలను తిరగేస్తూ చదివే వాళ్ళు - పాఠకులలో గణించదగిన సంఖ్యలోనే ఉన్నారు. 

ద్వాదశ రాశుల పేర్లు ఇటు స్థానిక భాషలలో గానీ, అటు ఆంగ్లంలో గానీ ఏయే తేదీ మొదలై ఏయే తారీఖు వరకూ ఉంటాయో దాదాపు అధికశాతం మందికి తెలుసును. 


ప్రస్తుతం వాటినే పునః అవగాహనకై ఈ పట్టిక:-


Aries March 21 - April 19.
Taurus April 20 - May 20.
Gemini May 21 - June 21.
Cancer June 22 - July 22.
Leo - July 23 - August 22.
Virgo - August 23 - September September 22.
Libra - September 23 - October 22.
Scorpio - October 23 - November 21.
Sagittarius - November 22 - December 21.
Capricorn - December 22 - January 19.
Aquarius - January 20 - February 18.
Pisces - February 19 - March 20

* * * * *

1582 వ సంవత్సరం చరిత్రలో గుర్తుంచుకొనాల్సిన రోజు. ఎందుకంటే ఆనాడు 1582 ఫిబ్రవరి 24 తారీఖు - గ్రెగేరియన్ కేలండర్ ఆవిష్కరణ జరిగింది. అప్పటి దాకా "జూలియన్ కేలండరు" అమలులో ఉన్నది. "Juliyan Year " కాలమాన గణనములో చేసిన మార్పులతో కొత్తది ప్రజలకు అందుబాటులోనికి వచ్చినదే "గ్రెగేరియన్ కేలండర్".

ఆ మార్పులలో ఒకటి లీపు వత్సరము. ఇది హిందూ చాంద్రమానములోని అధిక మాసము, శూన్య మాసముల వంటిది. ప్రతి నాలుగు ఏళ్ళకు ఒకసారి "Leap year" వచ్చే రీతిగా మార్చారు. 

* * * * *

"నేపుల్స్" దక్షిణ ఇటలీ లో రేవు పట్టణము "నవ నగరము" అని ఈ మాటకు అర్ధము. గ్రీకు పదమైన "Neopolis" అనే మూల ధాతువు నుండి వచ్చినది "Naples". మెడిటరేనియన్ లోని ఈ కా పట్టణంలో ఒక డాక్టరు జన్మించాడు. అతని పేరు "అలౌసియస్ లిల్యుస్". ఈతని సలహాలు కేలండర్ విభాగమునకు నవ్య పరిణామాలను చేకూర్చినవి. 13 వ పోప్ "గ్రెగరీ", అలౌసియస్ లిల్యుస్ తో సలహా సంప్రదిపులు చేసాడు. అటు పిమ్మట వారిద్దరు కొత్త "కాలమాన పట్టిక"ను ప్రవేశపెట్టారు. అదే పోప్ గ్రెగరీ పేరుతో ప్రసిద్ధి చెందిన "గ్రెగేరియన్ కేలండర్".

* * * * *

గణితములో ఆసక్తి కలవారు ఇంగ్లీషు కేలండర్ మాదిరి తో అనేక ప్రయోగాలతో అనేక వింతలను సాధన చేస్తూ, సాధిస్తూ ఉంటారు. (Mr. India- అనే హిందీ సినిమాలో ఒకని పేరు 'కేలండర్'. "హవా హవాయీ ..... " పాటకు శ్రీదేవి చేసిన అద్భుత నాట్యము ఈ మూవీలోనిదే!) 
నేడు ప్రపంచవ్యాప్తంగా బహుళ వ్యాప్తిలో ఉండి అందరికీ ఆత్మీయమైనది ఇంగ్లీషు కేలండర్ యే కదా! 
so- మనం కొన్నిటిని రేఖామాత్రంగా చూద్దాము.

* * * * *

ఇంగ్లీషు కేలండర్ నాలుగు వందల ఏళ్ళకు ఒకసారి లీప్ సంవత్సరము తిరిగి ఆరంభం ఔతుంది. లీప్ సంవత్సరమునకు సంబంధించి అనేక విశేషాలు ఉన్నవి. ఐతే లీప్ సంవత్సరమునకు భిన్నమైన ఇతర ఏడాదులను గమనిస్తే కొన్ని తమాషాలు ద్యోతకం ఔతూన్నవి. ఈ జిజ్ఞాసలే కేలండర్ లోని అంకెలకు అనుయాయిలైన వారములు, నక్షత్రాలు ఇత్యాది విషయ సంగ్రహణలకు హేతువులు ఐనవి. 

అగణితమైన అంకెల గారడీల శోధనలకు ఆలంబనములు ఐనవి.

1) ఏ శతాబ్దమూ బుధ వారము, శుక్ర వారము , ఆది వారములతో ప్రారంభం అవదు. 
     అంటే తతిమ్మా- సోమ, మంగళ, గురు, శని వారములతో begin ఔతుందని అర్ధము.
2) అలాగే మంగళ , గురు, శని వారములతో ఏ శతాబ్దమూ కూడా ముగింపు అవదు.

3) లీప్ సంవత్సరము కానట్టి సంవత్సరములలో 
       ప్రతి సంవత్సరమూ ఒకే రోజున “వారము” తో నాంది, ముగింపులు అవుతూన్నవి. 
ఈ 2013 సంవత్సరం లీప్ వర్షము కాదు. అందుచేత 2013 కు ఇది వర్తించినదా? 
కాస్త ధ్యాస పెట్టి, పరిశీలించండి. 2013 జనవరిని ఒకసారి కేలండర్ 12 పేజీలను తిప్పి చూడండి.


2013 జనవరి 1 వ తేదీ రోజు – మంగళ వారం ఐనది {January 1 = Tues day & December 31 = Tues day}. ఇందాక చెప్పుకున్న షరతు ప్రకారం- డిసెంబర్ 31 వ తేదీ నాడు మంగళవారమే ఐనది.

అలాగే 2014 January- 1 - Wednesday ఐనది. 
అలాటప్పుడు December 31 నాడు ఏ వారం ఔతుందో గుర్తించారు కదూ! 
ఔను, కరెక్టే!  అది బుధవారమే ఔతున్నది.

* * * * *

ఇలాగ లెక్కలేనన్ని సంఖ్యల తమాషాలు- కేలండర్ పున్నెమా అని గణిత జిజ్ఞాసులకు లభిస్తూనే ఉన్నవి.



అందరికీ నూతన వత్సర శుభాకాంక్షలు. 

2014 Wish you Happy New Year. 

******************

కేలండర్ విశేషాలు (Link web mag: New Awa)  

User Rating:  / 2 
Member Categories  - తెలుసా!
Written by kusuma kumari
 Friday, 13 December 2013 09:16

Hits: 76
వ్యాసకర్త: కాదంబరి, konamanini 

( By: కోణమానిని )

24, డిసెంబర్ 2013, మంగళవారం

చర్చిలలో వింత శిల్పం - మూడు కుందేళ్ళు; క్రిస్మస్


పౌర్ణమినాడు జాబిల్లిని పరీక్షగా చేస్తే అక్కడ పేదరాశి పెద్దమ్మ కూర్చుని 
అట్లు పోస్తూ ఉంటుంది. మన ఇండియాలో ఈ కవితాత్మకమైన ఊహ “పేదరాశిపెద్దమ్మ కథలు” కు పునాది వేసింది. (ఈ పేరుతో నిర్మలమ్మ నటించిన సినిమా కూడా హిట్ ఐనది).

పాశ్చాత్య దేశాలలోమధ్య యుగములలో “మూడు కుందేళ్ళు బొమ్మ/ శిల్పము"   (Three Hares ) ఎంతో ప్రాధాన్యాన్ని కలిగింది. యూరోపులోని  కొన్ని  చర్చిలలో ఈ బొమ్మ ఉన్నది. ఐతే ఈ శిల్ప మూర్తిమత్వంలోని విశిష్టత ఏమిటి? అంత స్పెషాలిటీ ఉన్న దాని మూలము ఎక్కడిది? 
డిసెంబర్ 25 క్రిస్ మస్ పండుగ రోజు. 
క్రిస్ మస్ పండుగ వచ్చేస్తున్నది కదా! కనుక ఈ విశేష అంశము వైపు దృష్టి సారిస్తున్నాము. 

*****


మన జాతీయ చిహ్నాలలో ఒకటి నాలుగు తలల సింహము. 
సారనాధ్ స్థూపము నుండి ఈ సింబల్ ను స్వీకరించారు. 
మనకు మూడు మాత్రమే కనిపిస్తూంటాయి. 
ఆ నాలుగవ సింహము- వెనక వైపు ఉంటుంది 
కాబట్టి మనకు మూడే కనిపిస్తాయి. 
శిల్పి ఊహా చమత్కారానికి "శభాష్!" అనాల్సిందే!

అలాటి మరో శిల్పము/ మురల్/ చిత్తరువు - మూడు కుందేళ్ళు. 
మూడు కుందేళ్ళు వలయాకారంలో, ఒక హారమువలె ఏర్పడినవి. 
ఇవి ముక్కోణములో ఒకదాని వెనుక ఒకటి పరుగెడుతూన్నవి. 
ట్రయాంగిల్ ఆకారంలో ఏర్పడిన ఈ three hares కనికట్టు చమత్కారాలను చేస్తూన్న శిల్పము. 
కుందేళ్ళు ఇక్కడి శిల్పములో ఒక చమత్కారం అగుపిస్తుంది. 
ప్రతి ఒక్కకుందేలుకూ రెండు చెవులు ఉంటాయి. 
ఐతే రెండు కుందేళ్ళుకూ కలిపి- మూడు చెవులు ఉన్నవి. 

అంటే “6 చెవులకు” బదులు – ఈ చెక్కడములో ‘మూడు చెవులు” మాత్రమే సాక్షాత్కరిస్తూ ఉన్నవి.

*****

బౌద్ధ ఆరామములలో పారమార్ధిక ప్రతీక (Motif) కుందేలు. 
బౌద్ధ మతములో జంతువులకు చాలా ఇంపార్టెన్సును ఇచ్చారు. 
గౌతమ బుద్ధుని జాతక కథలలో కుందేలు ఉన్నత స్థానాన్ని కలిగి ఉన్నది. 
చైనా జాతక, రాశి చక్రం లో (China Zodiac ) నాలుగవ జంతువు "కుందేలు", "Yin" అని; 
దారు (చెక్క) స్వభావ సంబంధిగా గ్రహించారు.

లోహము, భూమి, నీరు, నిప్పు మున్నగు పృధ్వీ సంబంధిత వస్తువులకు ఒక్కొక్క జంతువు ప్రతీకగా ఎన్నుకొన్నారు. చైనా జాతక చక్రము వరుసగా 12 సంవత్సరములకు పట్టికను చైనీయులు ఏర్పరిచారు. ఆయా ఏడాదిలలో జన్మించిన మనుష్యుల స్వభావ, జీవన విధానాలను చెబుతారు. 
(మన హిందూ దేశ పంచాంగములలో సాయన, చాంద్ర మానములు పునాది చేసుకుని, నక్షత్ర - రాశి పొంతనలనూ, జన్మ లగ్నములనూ లెక్క కట్టి- భవిష్యత్తు ఎలా ఉంటుందో విశ్లేషించే ప్రయత్నాన్ని చేస్తారు. ఈజిప్టు, పర్షియా మున్నగు దేశాలలో "రమదా" వంటి గణనలు ఉన్నాయి.) 
జపాన్, కొరియా, వియత్నాం, మున్నగు ఆసియా దేశాలలో ఈ జాతకమును ఆసక్తిగా పరికిస్తారు.

*****

మళ్ళీ అసలు సంగతికి వద్దాము. ఈ త్రి శశముల ప్రాచీనతను నిర్ధారించే అన్వేషణలో హిస్టారియన్సు కనుక్కున్న సంగతులు విస్మయాన్ని కలిగిస్తాయి. చైనాలో క్రీస్తు పూర్వము 6వ శతాబ్దముల నాటివి-అని వీటి ప్రాచీనతకు చారిత్రక ఆధారములు లభించినవి. మగావు గుహలలో ఈ బొమ్మలను చరిత్రకారులు కనుగొన్నారు. 518 - 618 లలో పరిపాలించిన సూయి వంశ చక్రవర్తులు గుహ ఆరామాలను నిర్మింపజేసారు. 407 Mogao Cave; Sui dynasty (581-618) లలో ఈ అద్భుత శిల్పాలు ప్రత్యక్షమైనవి.

*****

తూర్పు నుండి పడమటి సంధ్యా రాగం- ఎలాగ చేరినది?

"ప్రాచీన చీనా లో పట్టు వస్త్రాలు నేసారు. వానిపై చందమామను అందులో మూడు కుందేళ్ళు చిత్రించారు. 
ఈ 3 కుందేళ్ళు బొమ్మతో , 
పత్ర హరిత పురుషుడు (Green Man ) బొమ్మ కూడా 
సమాన ప్రాధాన్యతను గడించింది.

******

చైనా దేశములో ఉత్పత్తి ఔతూండే పట్టు దుస్తులు, హిందూదేశంలో చేనేత వస్త్రాలు (సిల్క్/ చీనీ సిల్క్), సుగంధ పరిమళ దినుసులు, శిల్ప, చిత్రలేఖనాది లలితకళాఖండాలూ ప్రపంచ సముద్ర యానానికి "వర్తకపు దారులను" వేసాయి. కళాజగత్తులోని కొన్ని అంశాలలో ఈ/ రెండు అంశాలూ చోటుచేసుకున్నవి. చైనా గుహలలోని త్రి శశముల చెక్క శిల్పాలు సాగరయానమార్గాల ద్వారా 
పాశ్చాత్య ప్రపంచానికి పరివ్యాప్తి ఐనవి. అవి ఎంతగా వ్యాప్తి గాంచాయంటే- తూర్పు దేశాలలో ఇంచుమించు విస్మరించబడినవి- కానీ పాశ్చాత్య యూరపు దేశాలలోగిళ్ళలో కళకళలాడుతూన్నవి. 

ఆద్యంతము లేని హారము వలె ఏర్పడిన చిన్ని జంతువులు ఈ 3 కుందేళ్ళు. 
మన వాళ్ళు వీటినే "చెవుల పిల్లులు" అంటారు. 
ఈ విచిత్ర దారు చెక్కడములు ఆ పదమును సార్ధకము చేసినవి అనిపిస్తుంది. 
చెవుల పిల్లులు చర్చిలలో ప్రధాన జాగాలలో గ్రీన్ మ్యాన్, మూడు కుందేళ్ళు ఉండేవి. 
ఆహూతులకు బాగా అగుపించే చోట్లు- అంటే ప్రవేశ ద్వారము పైన, మధ్య కమ్మె మీదనో, పై కప్పు నడుమ గానీ చటుక్కున ఎల్లరికీ కనిపించేలా ఎంపిక చేసిన ప్రదేశాలలో వీటిని అలంకారములుగా ఉంచుతున్నారన్న మాట.

ఛాన్సెల్ రూఫుల మీద, సెంట్రల్ రిబ్ ల మీద- ఇలా ప్రత్యేక ప్రాంతాలలో ఉండటానికి కారణము - 
చర్చిలను, అందులోని శిల్ప, చిత్రలేఖనాదుల నిర్మాణదార్లు- 'తమ యొక్క కట్టడము ' అనే ఆనవాళ్ళుగా 
(the builders' signature marks )- వీటిని ఉంచేవారు - అని విశ్లేషణ ఉన్నది.

*****

వర్తక వాణిజ్యముల కార్యక్రమాలలో- ఆదాన ప్రదానములు కూడా చారిత్రక పరిణామముగా నిర్మితమౌతూ వస్తూన్నవి. 
అలాటి కళా, వస్తువులు, ఆభరణాది సామగ్రి, సంస్కృతీ భావజాలాలలో - ఇవి కూడా విపణివీధిలనుండి- ప్రజల మనసులను హత్తుకున్నవి ఇవి.

*****

Church, Chapel, Cathedral and Basillica- మొదలగునవి ఆరాధనా కేంద్రములు. 
వీనిలో చర్చి, చాపెల్ ల ప్రధాన ద్వారాల కమ్మెల పై మూడు కుందేళ్ళు బొమ్మ ఉన్నది. మధ్య శతాబ్దములలో ఇవి జనబాహుళ్యము ఇష్టపడిన కళా ఖండము ఇది. కనుకనే "కానుక"గా లభించిన ఈ ఆర్టును వారు హత్తుకున్నారు.

నేడు టిబెట్, మున్నగు దేశములలో శ్రవణేంద్రియ భాగ్యశాలులైన కుందేళ్ళు- పజిల్ బొమ్మలు కనువిందు చేస్తూన్నవి.

********************

క్రిస్మస్ శుభాకాంక్షలు.

***** 

క్రిస్ మస్ - మూడు కుందేళ్ళు ;  User Rating:  / 2 

Member Categories  - తెలుసా!
Written by kadambari piduri
Friday, 13 December 2013 09:16

;

19, డిసెంబర్ 2013, గురువారం

కిట్ కాట్ పేరెలాగ వచ్చింది?

కిట్ కాట్: చాక్లేట్లను తినే వాళ్ళందరికీ ఈ పేరు సుపరిచితమైనదే,

ఈ పేరును ఎక్కణ్ణించి సంగ్రహించారు?

క్రిస్టఫర్ కాట్లింగ్ – అనే చెఫ్ (వంటలలో  ప్రవీణుడు) ఒక షాపు నడుపుతూండేవాడు. 
ఆతని టిఫినీ సెంటరు ఎప్పుడూ కవులు, పబ్లిషర్లు, కార్యకర్తలు- మొదలైన వారితో కళకళలాడ్తూండేది.

సాహితీపిపాసులు గుమిగూడి, వారు చేసే చర్చోపచర్చలతో సదా సందడి సందడిగా ఉండేది. ఆ వాదోపవాదాలలో కొత్త కవితా రీతులూ, సంఘ, సామాజిక సిద్ధాంతాలెన్నో మొలకలెత్తి, చిగుళ్ళు తొడిగి, నవీన మధుర  ఫలములు సమాజానికి లభించేవి.

***********************************,

క్రిస్టఫర్ కాట్లింగ్ – అనే చెఫ్ (వంటలలో  ప్రవీణుడు).

Christopher Catling నడిపే చిన్న food  inn, బ్రిటన్ దేశభక్తులతో కిటకిటలాడ్తూండేది. 
అతడు కస్టమర్ లకు అందించే ’మీట్ పై ’ (meat pie)ను తింటూ అందరూ మాట్లాడుకునేవారు. బ్రిటన్ దేశచరిత్రలో మైలురాళ్ళను నెలకొల్పిన సంభాషణలు అనేకం ఆ చోట జరిగేవి.

కిట్ కాట్  లు జాకబ్ టాన్సన్ [1655 - 1736] ప్రాచీన ఆంగ్ల సాహిత్యాన్ని ప్రచురించేవాడు. 
"ఇవిగో వచ్చేసాయి, మన కాట్ లింగ్ గారి చేతి “కిట్ కాట్ లు” అంటూ నవ్వుతూ ఆ చిరుతిళ్ళను ఆస్వాదించేవాడు. 
జాకబ్ టాన్సన్ ప్రచురణ కర్త. ఆ చిన్న హోటల్లో ఐటమ్ లను, “మీట్ పై” ముక్కలకు జాకబ్ టాన్సన్ సరదాగా పెట్టిన పేరు “Kit Kat ” ఆ బుల్లి కెఫే యజమాని నామధేయాన్ని, ఇంగ్లీష్ భాషలో చిన్న శ్లేషపదముగా తీసుకోవడానికి బాగా తమాషాగా ఉపయోగపడింది.

Jacob Tonson పుస్తకప్రచురణ ద్వారా అనేక మంది (జాన్ డ్రైడెన్, జాన్ మిల్టన్ మున్నగు) కవుల రచనలు  18 వ శతాబ్దములో వెలుగులోనికి వచ్చినవి.

అంతే కాదు- అతడు విల్లియం షేక్ స్పియర్ ఇత్యాది ప్రముఖుల రచనలను కూడా కాపీరైట్సు- ని పొంది, ఇంగ్లీష్ లిటరేచర్ లోని విలువైన సాహితీ విలువలు- ప్రపంచానికి సన్నిహితపరిచాడు. అందువలన – ప్రపంచ సారస్వతము కొత్త పుంతలు తొక్కింది. ఛందస్సు, మతముల వరకే పరిమితమైన వ్రాతలు , కొత్త కోణాలలో కాంతిరేఖలను వెదజల్లసాగాయి. చరిత్ర, సామాజిక, ఆర్ధిక, మానసిక, రసాయన , సైన్సు – మున్నగు నవీనపంధాలలో వృద్ధి చెందాయి. ఎంతగా అభివృద్ధి గాంచాయనగా – అవధులు లేనంతగా, ఆ గగన పర్యంతము-అన్నంతగా ఐనవి.

జాకబ్ టాన్సన్ [1655 - 1736]| mutton pies కి పెట్టిన తమాషా నిక్ నేమ్, తర్వాత విక్రయాల గ్రాఫు గిన్నీస్ బుక్ రికార్డు స్థాయిలో ఫేమస్ ఐనది.

***************************************,


Kit Kat

Link for photo  (See)

Kit Kat Chunky bars కూడా బాగా పాప్యులర్ ఐనవి. 
Kit Kat  club 18 వ సెంచరీలో ఇంగ్లండులో- “హాస్య, విట్స్ (wits), నవ్వులతో వాతావరణం ప్రపుల్లంగా ఉండేది. దేశభక్తుల సమాహారముగా ఆ గదులు భాసించేవి. Jacob Tonson పుణ్యమా అని, ఒక క్లబ్ పేరు కాస్తా ఆహారరంగంలో నిలిచి, అందరి నాలుకల పైన ఆడుతూన్నది. పోప్, స్టీల్, అడ్డిసన్, కాన్ గ్రీవ్ మున్నగు వారు; ఈ కిట్ కాట్ క్లబ్ శాశ్వత సభ్యులు అనవచ్చును.

***********************************,

Kit Kat అనేది ఒకచాక్లేట్, ఔనా!? గత ద్విదశాబ్దాల క్రితం, నువ్వుజీడీలు, నిమ్మతొనలు, తీపి బిళ్ళలు, అటు  తర్వాత బిస్కట్లు – బాల బాలికలు తినే తినుబండారములు. వాటి తర్వాత పిప్పరమెంట్లు, లాలీపప్సు, అలాగే కిట్ కాట్ లూ- ఆధునీకరణతో ఫ్యాక్టరీలలో పెద్ద ఎత్తున తయారై  విపణివీధులలో వెల్లువెత్తినవి.

“Kit Kat Chunky bars “Have a Break, Have a Kit Kat” వగైరా వ్యాపార ప్రకటనలు, మార్కెట్ లోకి ప్రవేశించి, వాణిజ్యసరళికి ఆధునిక మార్గాలను ఏర్పరిచినవి. కిట్ కాట్ క్లబ్ - 18 వ సెంచరీలో  న్యూ వేవ్ లో సంచలన సూక్తులను రూపుదిద్దినవి. వ్యాపార ప్రకటనలు, అడ్వర్టైజ్ మెంట్సు కోసము- సారస్వతము ఆలంబనముగా- దీటైన పదాలూ, పలుకులూ చిత్రీకరణలైనవి. ఇది ఒక వింత పరిణామమే!!

***********************************,

17 వ శతాబ్దం ద్వితీయార్ధం చివర్లో, 18 వ  శతాబ్దములో – చిత్రంగా కిట్ కాట్ సైజు అనేది- ఒక స్టాండర్డ్ కొలత లాగా నిలద్రొక్కుకున్నది.

***********************************,

సర్ గాడ్ ఫ్రే అనే ఆర్టిస్టు కూడా Kit Kat Club లో మెంబరు.

అతను, కిట్ కాట్ చాక్ లెట్సుని ఫై కవర్ ని 36 by 28 inches కొలతలతో chocklate ను రూపొందించాడు. గతంలో కొన్ని ఏళ్ళు, ఆంధ్రదేశంలో “హార్లిక్స్ మూతలు” మూతలకు పేరుగా నిలిచినవి.

అదే విధంగా కిట్ కాట్, ఎర్రని రంగు cover, దానిపైనున్నటువంటి అక్షరములూ(Letters) కూడా 36/28 సైజు వాణిజ్య ఆకర్షణ ఐన కొలతగానూ, రంగు,లోగోలు – అదే తీరున స్థిరపడినవి.

***********************************,

అప్పుడప్పుడూ – కొన్ని నవీన గమనాలు గమ్మత్తుగా – ప్రజల వాడుక లో నానుడులలో – గడుసుగా జాగాను గడిస్తాయి – 
బట్టలు ఉతికే సబ్బుపొడి- అంటే “సర్ఫ్” నేది వాడుకంట; సబ్బు ఏ కంపెనీదైనా, ఏ బ్రాండుకు చెందినదైనా “సర్ఫ్, రిన్ బార్” అనీ, లక్సు సోపు, లైఫ్ బాయ్” అనీ- ఇలాగే స్థిరపడిన లిస్టులోని కొన్ని ఊత పదములు.

ఇంత అద్భుతంగా చాక్ లెట్సు కి మారుపేరుగా ఐ, 
చాకో బార్ లకు నిర్దేశిత కొలమానంగా అవతరించిన ఈ Kit Kat కి ఎవరైనా సరే,అభినందిస్తారు కదా!!!!!

పిల్లాజెల్లాకు, పిన్నలు, పెద్దలకు, అత్యంత చాక్ లెట్ ఐ, ఇంటింటింటా చప్పరిస్తూ, లొట్టలేస్తూ యావన్మందీ ఆస్వాదిస్తూ తింటూన్న ఈ కిట్ కాట్ , అదిగో;టి.వి. లో ప్రకటనలలో ప్రత్యక్షం; వహ్వారే!!!!!!

***********************************,
(Essay by:- kONamaanii)
***********************************,
కిట్ కాట్ పేరెలాగ వచ్చింది?
September 27, 2013 By: జాబిల్లి Category: కథలు 

7, డిసెంబర్ 2013, శనివారం

రంగీలా రే రంగీలా! కుల్ధారా

1970 లో వచ్చిన "ప్రేమ్  పూజారి" లో ఒక అందమైన పాట 
"రంగీలా రే, తేరే రంగ్ మే, యూ రం హై| మేరా మన్ ఛలియారే..........."   

1995 లలో రిలీజ్ ఐనది "రంగీలా" (रंगीला)
అందచందాలకు ప్రతిబింబంగా నిలబెట్టబడిన ఊర్మిళ మటోణ్డ్ కర్ ; 
ఠక్కున అందరికీ గుర్తుకు వచ్చే పేరు- దర్శక కర్మ- రామ్ గోపాల్ వర్మ.  


*****

"రంగీలా" అనగానే ఊర్మిళ, రాంగోపాల్ వర్మలు మనకు చటుక్కున జ్ఞాపకం వస్తారు. 
"హై రామా.. అనే పాటని "కులధారా శిధిలాల"లో ప్రత్యేక ఆసక్తితో తీసాడు వర్మ. 
కుల్ధారా శిధిలాలనే ఎందుకు ఎన్నుకున్నాడంటే- దానికి తనదైన శైలిలో వివరణ నిచ్చాడు.
అలాంటి అపూర్వ అభిప్రాయాల్ని తెలుసుకోవాలంటే 
"నా ఇష్టం" అనే ఆతని ఆత్మ కథాగత ఒపీనియన్సును చదవండి .


*****

సరే! ఈ పుస్తకం సంగతులను అటుంచండి. 
కుల్ధారా శిధిలాల కథా కమామిషూ ఏమిటి?

కుల్ధారా అనే మారు మూల పల్లెటూరు, రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. 
జైసల్మీర్ పట్టణానికి పశ్చిమ దిక్కులో 15 Km దూరాన ఉన్న కుగ్రామం 
ఈ Mysterious Ghost-Town: Kuldhara Ruins -Rajasthan.
అలనాటి కుల్ధారా వైభవంగా ఉండేది. అక్కడ నివసిస్తూన్న పాలీవాలా బ్రాహ్మణులు ఈ పరగణాల సిరిసంపదలకు మూల స్తంభాలు. 
వారు అమోఘమైన పండితులు, అంతే కాదు, సుడి తిరిగిన వాణిజ్యవేత్తలు కూడా!

అంతేనా! వాళ్ళు వ్యవసాయంలో కూడా చేయి తిరిగిన వాళ్ళు. 
నీళ్ళు లేని రాజస్థాన్ ఎడారి (Thar Desert పై సమృద్ధముగా పంటలు పండించేవారు. 
ప్రతి నీటిబొట్టునూ వృధాకానీకుండా బావులనూ, నీటి వనరుల కేంద్రాలనూ నిర్మించారు. 
ఆనాడు వీరు ఇళ్ళను బంగారు ఇటుకలతో కట్టించారు- అని జనశృతి. 
అలాగ ఎనలేని సిరిసంపదలు కలిగిన కుల్ధారా 
అకస్మాత్తుగా “దయ్యాల దిబ్బ” గా మారిపోయింది, 
నేడు శిధిలాలుగా దీనావస్థలో మిగిలిపోయింది.

ఎందుకని అలాగ?

ఇందుకు కారణమైన చారిత్రక సంఘటనలను స్థానికులు చెబ్తూంటారు.


*****

మహర్వాల్ దీవాన్ స్వరూప్ సింగ్. అతని కొడుకు సలీం సింగ్.  ఇతనికి ఇతర సంస్థానాధీశులు, సామంతులు, ఇత్యాదుల మధ్య జరిగిన పొడసూపినట్టి వివిధ సమస్యలూ, సంభవించిన సంఘర్షణలూ కుల్ధారా మహోజ్జ్వల చరిత్రను వింత మలుపులు తిప్పినవి. జైపూర్ మండలాలపై అధికారం చెలాయించే సలీం సింగ్ అనే దళపతి క్రూరత్వానికి మారు పేరు. మహారాజు రాజ్యాధికారాలను అప్పగించడంతో ఆతని ఆగడాలకు అడ్డూ ఆపూ లేకుండా పోయింది. రాజు క్రమంగా నిస్సహాయతతో స్తబ్ధుడై మిగలగా, దళపతి ఆర్ధిక వ్యవహారాలను చేజిక్కించుకుని నిరంకుశత్వంతో, దుష్ట ప్రవర్తనతో చెలరేగిపోసాగాడు. అందమైన స్త్రీలను జనానాలోకి నిర్దయగా చేర్చుకునేవాడు. లెక్కలేనన్ని పన్నులను వసూలు చేసేవాడు. అలాగ ఊళ్ళలో తిరిగేటప్పుడు, కుల్ధారా పట్టణములోని ఒక చక్కని పడుచుపై ఆతని కళ్ళు పడ్డాయి. ఆ కన్నె ’పాలివాలా బ్రాహ్మణ’ కుటుంబిని.

*****

సలీం సింగ్ క్రూరుడు.అప్పటికే ఏడుగురు స్త్రీలను పెళ్ళాడాడు సలీం సింగ్. 
16 ఏళ్ళ కుల్ధారా సుందరీమణిని తన అడ్డాలోకి తెచ్చుకోవాలనే 
దుష్ట తలంపుతో చాలా కిరాతకపు చర్యలకు తెగించాడు. 
షోడశ వర్ష ప్రాయ బాలికకై ఆమె తండ్రికి కబురు పంపించాడు. 
అతను తన కుమార్తెను ఒక క్రూరునికి ఇచ్చి పెళ్ళి చేయడానికి నిర్ద్వందంగా నిరాకరించాడు. 
అప్పుడు సింగ్ పూర్తిగా ప్రతినాయకుడు ఐనాడు. 
పగతో కక్ష సాధింపు క్రియలు మొదలెట్టాడు. 
అర్ధం పర్ధం లేని సుంకములను విధించాడు. 

ఆ పాలీవాలా బ్రాహ్మణులను ఎన్ని రకాలుగా వేధించాలో అన్ని రకాలుగా వేధించసాగాడు. 
చుట్టుపక్కల 82 గ్రామాలలో వర్తక వర్గీయులైన ఆ బ్రాహ్మణులు ఉన్నారు. 
అందరినీ ప్రతీకారంతో నానా బాధలు పెట్టసాగాడు.


*****

 రాజస్థాన్ ఎడారులలో పాలీవాల వారు అత్యంత జాగరూకతతో త్రవ్వించిన బావి ఉన్నది. మంచినీళ్ళకు అందరికీ ఆధారమైన బృహత్ కూపము (బావి)అది. ప్రజలకు ఎంతో ఉపయోగపడుతూన్న జలధారల ఊటబావి అది. అందులో సింగ్ జంతు కళేబరాలను వేయించాడు. నీళ్ళు కలుషితాలై, జనుల ఆరోగ్యభంగహేతువైనవి.

ఒక్క రాత్రిలో మహా వలసలు :- 

శాకాహారులైన పాలీ బ్రాహ్మణులు ఈ చర్యతో విసిగిపోయారు. 
రాత్రికి రాత్రే 84 పల్లెల వారూ దృఢనిశ్చయానికి వచ్చారు. 
చేతనైనంత బంగారమును, సంపత్తినీ మోసుకుంటూ కదిలారు. 
వెళ్తూ వెళుతూ వారు శపించారు. 
"ఇక మీదట అక్కడ ఎవరూ ఉండకూడదు..ఉంటే నేలమట్టమై పోతారు.”

వాక్శుద్ధి కలిగిన వారి వాక్కు వెంటనే వాస్తవమైంది. 
ఫలితంగా కుల్ధారా నిర్జన సీమ ఐంది.

పట్వా (కుల పెద్ద) తనయ ఆత్మహత్య చేసుకున్నది. 
ఆమె రక్తంతో ప్రతి ఇంటి తలుపుపై గుర్తులు వేశారు వాళ్ళు. 
నేటికీ అక్కడి ప్రజలు చీకటి పడిన తర్వాత ఆ ఊరి వేపుకి వెళ్ళరు. 
అక్కడ టూరిస్టు డిపార్టుమెంటు వారి బోర్డు కూడా “సాయంత్రము తర్వాత ఇటు ఎవరూ నడవకూడదు” అని ఉన్నదట! ఒకే రాత్రిలో తటస్థపడిన మహావలస సంఘటన ఇది. 
మేధావులు అందరూ (ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ మున్నగు జాగాలకు) తరలివెళ్ళడంతో 
సహజంగానే కుల్ధారా ప్రాంతాలు నిస్తేజమైనాయి. 
ఒకప్పుడు ధన ధాన్య భోగ భాగ్యాలతో విలసిల్లిన ఆ సీమలు – 
'దయ్యాల ధామములు'– అనే చిత్రంగా (బొమ్మగా, సినిమా) విచిత్రంగా మారిపోయినవి.

చిత్రమేమిటంటే – ఈ చారిత్రక సంచలనాత్మక చేదు నిజం – 
కుల్ధారా శిధిలాల కథను- వార్తలలోకి ముఖ్య శీర్షిక అయ్యేలా చేసినవి.


*****

ఏది ఏమైనా- “రంగీలా” పుణ్యమా- అని, 
ఇప్పుడు మళ్ళీ Kuldhara The Ghost Town ప్రజలకు 
తాతవా (తాజా తటిల్లతా వార్తా) విశేషమైనది;
హాట్ మంకి టాపిక్ గా మారినది. 
టూరిస్టులు ఒకసారి “కుల్ధారాకి వెళ్ళి చూడాలి” అని అనుకునేటట్లుగా చేసినవి "रंगीला" వంటి సినిమాల షూటింగులు, హంగామాలు. 


***** ***** ***** ***** ***** ***** ***** ***** ***** 

కుల్ధారా దెయ్యాల దిబ్బ - రంగీలా సినిమా (Link - New Awa.- Magazine)
 Member Categories - తెలుసా!
    Written by kusuma kumari 
    Sunday, 08 September 2013 07:48 

    Hits: 349 

Words:-

Paliwals, the inhabitants of Khaba (Fort), 
migrated from Pali dt, Rajasthan.














25, నవంబర్ 2013, సోమవారం

జావా , ఇండొనేషియా ద్వీపాల భవిష్యత్ సూక్తికారుడు

మన త్రిలింగ దేశంలో(ఆంధ్ర. ఒరిస్సా, కర్ణాటక; కటకం నుండి) శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి "కాలజ్ఞానము" గీతాలు పరివ్యాప్తి గాంచినవి. 
ఇలాంటి నుడువులు ఇండొనేషియా ద్వీపసముదాయాలలో (ఆగ్నేయ ఆసియా దేశాలు ఇవి) ప్రజల నాలుకలపై విస్తృత సూక్తి, గీతాల, జానపదములుగా ఆడుచున్నవి. “జయోభయో భవిష్యద్ వాక్కులు” జనులు భక్తిప్రపత్తులతో మననం చేస్తున్నారు.

* * * * * * * * *

జావా- పశ్చిమ ప్రాంతమునకు రాజు జయోభయో (1135 - 1157). 
ఐర్లింగ చక్రవర్తి అనంతరం – జావాదేశం ముక్కలుచెక్కలైంది. 
ఆ పరిస్థితులలో ఉదయించిన ఆశాజ్యోతి “జయ అభయ సామ్రాట్”. తూర్పు జావా , కెదిరి రాజ్య స్థాపకుడు "శ్రీ మపాంజి జయాభయ": (జావా భాషలో “జయోభయో” అని ఉచ్ఛారణా పదము ఇది.) ఋతు జయభయ – అని గౌరవసూచిత నామము. శాంతి సౌభాగ్యాలకు ప్రతీక ఈతని పాలనాకాలము. ఇతను హిందూ దేవుడు “శ్రీ మహా విష్ణువు” యొక్క అవతారము- అని ప్రజలు భక్తిపూర్వక విశ్వాసము. 

“విదర్భ”- నేటి కెదిరి మండలం లో, “పమెనాంగ్” లోని అంతర్భాగం. 
విదర్భ = అంటే సహస్ర (= వెయ్యి) నగరములు. 
జయోభయో తండ్రి “గెండ్రాయన”. పాండవుల వంశీయుడు అని ప్రఖ్యాతి చెందిన అర్జునుని పుత్రుడు అభిమన్యుడు, అభిమన్యు ని సుతుడు పరీక్షిత్తు, పరీక్షిత్తు కుమారుడు యుదయన (=ఉదయనుడు). 
ఈ విధంగా జయోభయో వంశవృక్ష గాధలు “మహాభారత ఇతిహాసము లోని పాండవ సంజాతులై ఉన్నవి.

జయోభయో భార్య దేవీ సారా. ఆ రాజ దంపతులకు నలుగురు కుమార్తెలు – 
౧) దేవీ జయామి జయ; ౨) ప్రమేష్ఠి దేవి, ౩) ప్రాముని, దేవీ ౪) శశాంతి ~ అనే నలుగురు. 
జయోభయో చతుర్ పుత్రికల పరిణయాది బాధ్యతలను నిర్వర్తించాడు. 
హిందూ మతములో చతుర్ ఆశ్రమములు; జీవిత దశలు; గమన యాత్రలో- బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థాశ్రమములు- తత్ ప్రకారము, మోక్షగామియై, వానప్రస్థమును స్వీకరించాడు. జయోభయో చరమదశను “మెనాంగ్ గ్రామము” లో ప్రశాంతంగా గడిపాడు.

* * * * * * * * *

కెదిరి మండలంలోని ఉప జిల్లా “పాగు” లో మెనాంగ్ గ్రామంలో ఉన్నది. ఆ కుగ్రామమునకు జయోభయో వెళ్ళాడు, అక్కడ పట్టు వదలని నిష్కామ తపసు చేసాడు. ఆ దీక్ష వలన జయోభయో కి వాక్శుద్ధి వంటి అతీత శక్తులు లభించినాయి. 

* * * * * * * * *

ప్రాచీన జావా దేశములో జయోభయో పాలనలో పురా జావా సాహిత్య స్వర్ణ యుగముగా విలసిల్లినది. జయోభయో (1135 - 1157) భవిష్యత్తును తెలిపే గ్రంధాన్ని రచించాడు. అటు తర్వాతి కాలంలో - జయాభయ వాక్కులు అధికాధికం నిజమైనవి.

"ఇండొనేషియా పతనమౌతుంది, తెల్లవాళ్ళు ఆక్రమించి, పాలిస్తారు. అటు పిమ్మట పసుపు వన్నె జాతి వారు (Yellow dwarfs) పాలించుతారు" అని చెప్పాడు. ద్వితీయ ప్రపంచ సంగ్రామ సమయంలో వలస వచ్చిన డచ్ వారు దేశాన్ని ఏలారు. పిమ్మట జపాన్ దేశం (పసుపు వన్నె పొట్టివారు) కూడా ఇండొనేషియాను పరిపాలించింది. చిత్రంగా – జయోభయో మాటలని వాస్తవం చేస్తూ ఇండొనేషియా ప్రజలు జపాన్ సైన్యం రాకను స్వాగతం పలుకుతూ వీధులలో డాన్సులు చేసారు.  అలాగే ఇండొనేషియా స్వాతంత్ర్యం పొందుతుంది – ఫెటిల్లున రెండు ప్రపంచ యుద్ధాలూ, కొద్ది సంవత్సరములలోనే గగనపర్యంతం పెరిగిన ఆధునిక సైన్సు, చరిత్రాది శాస్త్ర విజ్ఞానములు - జయాభయ నుడువులను సార్ధకపరిచినవి. విశాల కెదిరి సామ్రాజ్యము సాహిత్యమునకు స్వర్ణయుగమై భాసించినది. అనేక బృహత్ గ్రంధాలు వెలువడినవి. అంతే కాదు! జావా ద్వీప నేపథ్యంగా – మహాభారత ఇతిహాసం రూపొందింది.

సెరత్ జయభయ ముసరర్, సెరత్ ప్రనీతివాక్య్ ; ఇతరులు చేర్చినవి 
జయభయ వాణీ సేకరణలు; ఎంపు సెడహ్, ఎంపు పానులూహ్ అనే ఇద్దరి కృషి- ఈ సేకరణలలో సింహభాగము వీరిది ముఖ్య స్థానము. (Prelambang Jayabaya, a prophetic book) 
పరివ్రాజక “సెడాహ్”, ఆతని సోదరుడు పానులూహ్ ల కృషికి ఫలితమే “మహాభావివాణి”.
1157 లో ఈ బృహత్కార్యము ప్రచురణతో వెలుగొందింది.

* * * * * * * * *

అలాగే ఉత్తర దిక్కునుండి వచ్చే yellow men వలన వాళ్ళు కూడా వెళ్ళగొట్టబడతారు- అని జయాభయ నుడివెను. జయాభయ పలికినట్లుగానే “పంట నాట్లు కోతకు వచ్చే నాటికి జపాన్ వారి పాలనకు తెర పడింది.” ఇలాటి ఆటుపోట్లకు సంచలనాలకూ కేంద్ర బిందువైంది ఎక్కువగా ‘జావా ద్వీపము . ("With the minor exception that three crops had been harvested, Jayabaya's prophecy had been realized.") డోలాయమాన స్థితిలో ఉన్నవి ఈ “ఈస్ట్ ఆసియా దేశాలు . అప్పుడు 1944 లో డచ్ నియంతృత్వం నుండి ఇండొనేషియా ప్రజలకు విముక్తి కలిగించింది జపాన్. సెకండ్ వర్ల్డ్ వార్ లో జర్మనీ (హిట్లర్) తో చేతులు కలిపినందున – జపాన్ కూడా ఓటమి పాలవడం ఖాయమైంది. 
అందుచేత అత్యవసరంగా – జపాన్ రెండో ప్రపంచ యుద్ధపు ఆఖరి డంకారావం మ్రోగే సమయానికి – ఇండొనేషియాకు స్వాతంత్ర్యం ఇచ్చి, 1945 ఆగస్ట్ 9 వ తేదీన 
(The Japanese officially granted Indonesia its independence on 9 August 1945) ప్రకటన చేసింది. 
ర్యాటు ఆదిల్ ప్రకారమే "when iron wagons could drive without horses and ships could sail through the sky"), ”

19 వ శతాబ్దపు పాశ్చాత్యులు రుద్దిన సేద్య విధానాలు ప్రజలలో తీవ్ర వ్యతిరేకత మొదలైనది. 
ఇచ్చట సుగంధ ద్రవ్యాలు పుష్కలంగా ఉన్నవి, అందుచేత యూరోపు నుండి పాశ్చాత్యుల వలసలు ఆరంభమైనవి. డచ్, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆధిపత్యంలో నిరంకుశ వ్యాపార పాలనా విధానాల వలన, అణచివేతకు ఇండొనేషియా ప్రజలు మగ్గిపోయారు.

వారి పద్ధతులలో – ప్రజలపై బలవంతంగా రుద్దిన Cultiveer stelse. 16 వ శతాబ్దం నుండి ఈ తభావతు మొదలైంది. యూరపు వాణిజ్యకర్తలు ఆధిపత్యపు పోరులో క్రమంగా స్పెయిన్, పోర్చుగీసు వారు స్థిరపడ్డారు. పిమ్మట వారిని Dutch వణిక్కులు వెళ్ళ గొట్టగలిగారు.  

జావాద్విపంలో స్వలాభాలకై డచ్ వాళ్ళు ప్రవేశపెట్టిన వ్యవసాయ విధానాలు స్థానికులలో వ్యతిరేకత పెంచాయి. స్వేచ్ఛా భావాలు పెల్లుబికే తరుణంలో జపాన్ వారి ఆగమనం ఇండొనేషియన్ జనుల ఆశలకు ఊపిరి పోసాయి.
*************************
;
JayabhayO (photo curtecy)






















photo curtecy  (Link)

Ratu Jayabaya ఆశు పద్య, గద్య, లేఖనములు ప్రసిద్ధమైనవి (famous oracles or prophesies) . 
అతని భవిష్యద్ వాణి పలుకులు “ Serat Jayabaya Musarar, Serat Pranitiwakya” గా లోక ప్రఖ్యాతమైనవి. జయోభయో అనుయాయులు, శిష్యపరంపరాగతముగా, ఈ సారస్వత స్వరూపము రక్షించబడుతూన్నది.

జయోభయో విరచితములు- దీర్ఘ పద్య ఛందస్సులు, చాలా పెద్ద పాదములు కల “పదముల వంతెన” అనవచ్చును. జయోభయో నుడువులలో వేరొకటి :- 

"The Javanese would be ruled by whites for 3 centuries and by yellow dwarfs for the life span of a maize plant prior to the return of the Ratu Adil: whose name must contain at least one syllable of the Javanese Noto Negoro."

జయాభయ – గుర్రాలు కట్టని(పూన్చని) ఇనుప బోగీలు, లోహ నావలు ఆకాశములో చరిస్తాయి – అంటూ ముందే చెప్పగలిగన దీర్ఘ ద్రష్ట.

**************************** 
Prophecy of Satriyo Piningrit ;  (Link for matter):

న్యాయదేవతకు రక్షణ కవచము వోలె భాసిల్లును చక్రవర్తి. 
సాంత్రియో పినింగిత్ (Santryo piningith) - 
అనగా అజ్ఞాత యోధ/ గుప్త్  క్షత్రియుడు - కి ప్రతీక - గా సామ్రాట్టు సంభవించబడుచున్నాడు. 
జయాభయో - రచనలలో - "మైతేయుని సంఘము నిర్వహించే విధులను చెప్పారు. కల్కి అవతారము
కృత యుగము, సత్య యుగము- కాలచక్ర పరిభ్రమణ విశేష ఘటనలు చోటు చేసుకుంటాయి. 
ఈ పద్ధతిలో - భవిష్య వాక్కు కర్త  "సాంత్రియో పినింగిత్" ప్రతిబింబమై వరలుట- - ఈ జావా ద్వీప చారిత్రక ఘటన సూత్రీకరణ జరిగినది.


*********************************
౧, ౨, ౩, ౪, ౫, ౬, ౭, ౮, ౯, ౧0
*********************************

జావా , ఇండొనేషియా ద్వీపాల భవిష్యత్ సూక్తికారుడు

User Rating:  / 2 
Member Categories - తెలుసా!
Written by kadambari piduri
Tuesday, 20 August 2013 08:51
Hits: 338 

14, నవంబర్ 2013, గురువారం

జమ్మి చెట్టు కథ

జమ్మి చెట్టు ఆకులను బంగారముతో సమానముగా భావిస్తూ, ఆదాన ప్రదానములుగ ఉన్న ఆచారముగా- మన ఆంధ్రదేశములో వ్యాప్తిలో ఉన్నది. 

"ఆప్త తరువు" ను మహారాష్ట్రలోని ప్రజలు పూజిస్తారు. 
ఆ తర్వాత ఆ చెట్టు  ఆకులను తీసుకుంటారు. ఈ పత్రములను 'బంగారము 'నకు ప్రతీకగా జనులు భావిస్తారు. కాంచన సంకేతమైన ఆ  కులను ప్రజలు ఒకరి  కొకరు ఇచ్చి పుచ్చుకుంటూంటారు./ ఇలాటి పరస్పర ఆదాన ప్రదాన ఆచారముచే- అందరి మనసులలో ఉన్నట్టి పాత వైషమ్యాలు తొలగిపోయి, స్నేహభావము నెలకొంటుంది.  
ఆప్త వృక్షానికి పూజచేసి, బంగారు ఆకులని పిలిచే ఆ ఆకులని స్వర్ణానికి సంకేతంగా, ఒకరికొకరు అందించుకుంటారు  
మహారాష్ట్రీయులు (Shanu and Apta tree/ Aapati trees) ఆపతి తరువు హరిత దళాలను ఇలాగే వినియోగిస్తారు. వారు అత్తి చెట్టు ఆకులు, తెల్ల ఆరె చెట్టు పత్రములుతో వ్రతాన్నిచేస్తారు. ఇందుకు కారణముగా ఒక కథ కలదు.
;


















*********

కౌత్స, వరతంతు కథ:

ప్రతిష్ఠానపురంలో నివసిస్తూన్న దేవదత్తుని తనయుడు కౌత్సుడు. తండ్రి కౌత్సుని విద్యాభ్యాసము కొరకు వరతంతు అనే ఋషికి బాధ్యతను అప్పజెప్పాడు. వరతంతు గురువు వద్ద విద్యను అభ్యసించాడు కౌత్సుడు. దేవదత్తుని కుమారుడు కౌత్సుడు. గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి ఐనది. గురుకులమునుండి ఇంటికి వెళ్ళే తరుణం వచ్చింది. 

"గురువర్యా! మీకు ఏ గురుదక్షిణను నేను ఇవ్వవలెను? మీరు ఏదైనా వస్తువులను తెమ్మని ఆనతి ఇస్తే తెస్తాను" వరతంతు దరహాసముతో "నీ శ్రద్ధాసక్తులూ, వినయవిధేయతలే నాకు నీవు ఇస్తూన్న నిజమైన గురుదక్షిణ, అది చాలును నాకు! నీవు పరిపూర్ణ విద్యావంతునివైనావు. నాకు ఆ తృప్తి చాలును" అంటూ ఆశీస్సులు ఇచ్చాడు. కానీ కౌత్సునికి మనసులో ఎంతో వెలితి! ఇన్ని ఏళ్ళుగా భోజనము పెట్టి సాకిన గురు దంపతులు కన్నవారిని తలపించేలా చదువులు చెప్పారు. అట్టి మహనీయులకు ఏమి ఇవ్వక తాను గృహోన్ముఖుడు ఐతే ఎలా?" అదుచే శిష్యపరమాణువు పట్టు విడువక "మీ కోసం ఏదో ఒకటి నేను తెస్తాను,చెప్పండి స్వామీ!” 

అయ్యవారికి ఈ బాలుని మొండితనం చిరాకు తెప్పించింది. విసుగుతో "ఐతే నాకు బంగారు నాణెములు కావాలి. నేను నీకు 14వేదములు నేర్పాను. ఒక్కొక్క శాస్త్రానికీ ఒక్కొక్క కోటి చొప్పున 140 కోట్ల హేమ టంకములు తీసుకురా!" అని పలికాడు.

అందుకు "సరే!" నని కౌత్సుడు అంగీకరించి, వరతంతు వద్ద సెలవు తీసుకున్నాడు.


*********

అటు తర్వాత బహు యోచన చేసాడు. తండ్రి, హితుల సలహా తీసుకున్నాడు. ధర్మదాత అని పేరు పొందిన రఘు మహారాజు వద్దకు వెళ్ళాడు. 
(రఘు చక్రవర్తి వంశీయుడే శ్రీరామచంద్రుడు, కనుకనే ఆతనిని 'రఘుపతి" అని కూడా పిలుస్తారు)

కౌత్సుడు వెళ్ళే వేళకు రఘు చక్రవర్తి "విశ్వజిత్ యజ్ఞము"ను చేసాడు. యజ్ఞ యాగాలు చేసే ప్రభువులు 'అడిగిన వారికి లేదనకుండా దానము చేయాలి. ఆ ప్రకారము అప్పటికే ప్రజలందరికీ రాజభవనములోని డబ్బు, దస్కమూ, సొమ్ములను యావత్తూ తన సర్వస్వము దానము చేసేసాడు. ఆయన కోటలోకి - ధనమును యాచించుటకు వచ్చినప్పుడు రఘు చక్రవర్తి కోశాగారం ఖాళీ ఐంది. కౌత్సుడు తన ’గురుదక్షిణ’ సంగతి తెల్పగా, ఖిన్నుడు ఐనాడు ఆ చక్రవర్తి.

"కౌత్సా! ఎల్లుండి రమ్ము!" అని చెప్పాడు. 

మూడురోజుల గడువులోపల రాజు అంత ధనాన్ని తీసుకురావాలనుకున్నాడు. అతను ఇంద్రుని వద్దకు వెళ్ళి ద్రవ్యమును కోరాడు. ధనపతి కుబేరుని పిలిచాడు మహేంద్రుడు. 
"కుబేరా! రఘు సామ్రాట్టు ముఖ్యపట్టణము అయోధ్య. ఆ రాజధానిలోని షాణు, అపర్తి చెట్లు (Shanu and Aapati trees) పై స్వర్ణ నాణాల వర్షము పడేలా చేయి!" అంటూ అజ్ఞాపించాడు సురపతి. 
అయోధ్యలో ఎడతెరిపి లేకుండా సువర్ణ వర్షం కురిసింది. అలాగ వర్షించిన ధనమును పూర్తిగా కౌత్సునికి ఇచ్చేసాడు రఘువు. [సురవర అనుగ్రహముతో లభించిన అగణిత అపరంజి రాసులు అవి!]

కానీ కౌత్సుడునికి డబ్బు అంటే వ్యామోహము లేదు. తన గురుదక్షిణకు అవసరమైన 140 కోట్లు మాత్రమే తీసుకున్నాడు కౌత్సుడు. అతడు"మహాప్రభువుకు కృతజ్ఞతలు" చెప్పి గృహోన్ముఖుడైనాడు.

*********

గురువు గారు కోరిన నాణెములు తీసుకుని తక్కినవి రఘురాజుకు తిరిగి ఇచ్చేసాడు కౌత్సుడు.

దానముగా ఇచ్చిన వాటిని మళ్ళీ తీసుకోకూడదు రాజు. కావున రఘువు "ఈ డబ్బును నేను తీసుకోను" అంటూ నిరాకరించెను. అప్పడు కౌత్సుడు మిగిలిన డబ్బును ప్రజలకు అందరికీ పంచాడు. అయోధ్యా పట్టణమునందు తెల్ల ఆరె చెట్ల పైన కనకవర్షము కురిసిన రోజు ఆశ్వీజ శుక్ల దశమి.

పథాన్ నివాసి ఐన కౌత్సుని అన్వేషణ వలన ఆపతి తరువుల కుందన వృష్టి కురిసి, ధనరాసులనిలయాన్ని చేసింది అయోధ్య నగరము సిరి సంపదలు పొంగులు వారి సుఖసంతోషములతో విలసిల్లసాగినది. నాటినుండీ ప్రజలు అత్తి చెట్టు ఆకులను/తెల్ల ఆరె చెట్టు పత్రములను' పసిడి 'కి ప్రతీకలుగా భావిస్తూన్నారు. ఇరుగుపొరుగువారికీ, బంధు మిత్రులకూ ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటూండడం నవ రాత్రి, దసరాల ఆనవాయితీ ఐనది.

వరతంతు గోత్రము :- 

ఋషుల మూలములను స్వీకరించి, జనులు – ఆయా గోత్రములవారు ఐనారు. ఈ పద్ధతిలో- “వరతంతు గోత్రీకులు” ప్రవర, ఋషిమూలములు ఏర్పడినవి. ఈ సంప్రదాయము ఆయా వ్యక్తుల ప్రాచీనతకు పునాదులు. ఇందుచే శాస్త్రజ్ఞులకు- మనుష్య జాతి జీన్సు, పరిణామములు – మున్నగు అనేక అంశముల గూర్చి సులభముగా రీసెర్చ్ చేయడానికి అనువైన వాతావరణము ఏర్పడింది.) 

User Rating:  / 1 
PoorBest 

8, నవంబర్ 2013, శుక్రవారం

ఎలిఫెంట్ ఆపిల్ అనబడే నేరేడు కథ

“गजाननं भूतगणादिसेवितं कपित्थ जम्बू फल चारु भक्षणम्।।
उमा सुतं शोक विनाश कारकं नमामि विध्नेश्वर पादपकंजम्।।“

గజాననం భూతగణాది సేవితం కపిత్థం జంబూఫల చారు భక్షణం
ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంజం

"సకల జీవకోటి చేత సేవలూ, పూజలు అందుకుంటున్న గజవదనునికి, వెలగపండును, నేరేళ్ళు (Elephant apple (Kaith) and Jambolana (Jamun)మున్నగునవి భుజించేటటువంటి, 
ఉమాపుత్రుడు, వేదనలను బాపు వాడైన స్వామి గణేశుని చరణారవిందములకు నమస్కరించుచున్నాను."

ఈ ప్రార్థన అనాది కాలం నుండి భారతదేశములో ప్రచలితమైయున్నది.

"కరి మింగిన వెలగ పండు: అని సుమతీ శతకకారుడు నుడివిన మాటలు 
గొప్ప జాతీయముగా చెలామణి కాబడుతోంది.

గజాననునికి ఇష్టమైన పదార్ధాలలో వెలగపండ్లు మాత్రమే కాక 
నేరేడు పళ్ళు (Indian black plum), ఆకులు కూడా ఉన్నవి. నేరేడు చెట్టు, నేరేడు ఫలం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నవి. నేరేడు చెట్టు పళ్ళే కాదు, కాండపు బెరడుతో సహా ఆయుర్వేద ఔషధాల తయారీకి ఉపయోగితమౌతూన్నవి.

జంబూ ఫలము- అని నేరేడుకు కల సంస్కృత నామధేయం. 
మన దేశానికి ప్రాచీన నామము “జంబూ ద్వీపము” అని నేరేడు తరువులు విరివిగా ఉండుటచేతనే అని పరిశోధకుల అభిప్రాయాలు. 
{ నేరేడు:-(Syzigium cumunii) ; naval fruit ,Indian black berry}

ఋతుపవన సీమలలో పెరుగుతుంది ఈ సతత హరిత తరువు. ఆరోగ్య సంవర్ధని ఐన నేరేడు పండుకు పండగల రోజులలో తినవలెనని నియమ సిద్ధాంతాలను ఏర్పరచుటచే, అడపాదడపా నేరేడు పండును భారతీయుల ఫలహార, పదార్ధముగా వినియోగంలోనికి వస్తూనే ఉన్నది. 
ఇట్టి సూత్రములు ఉండకున్నచో, ప్రజలకు పరిచయానికి దూరంగా ఒక అడవి చెట్టుగానే మిగిలిపోయేది.

పండుగల వేళలలో వింత ఐన వగరు రుచిని ఆస్వాదించే అవకాశాన్ని కలిగిస్తూన్న 
ఈ పండు కథా కమామిషూలను కొంచెం పరిశీలిద్దామా?

॑॑॑॑॑॑॑॑

బాలక్రిష్ణమూర్తి ఫ్యాన్సీ డ్రస్సులు, బాల బాలికల విచిత్ర వేషధారణల పోటీలు, ఈ హంగామాలూ, 
"శ్రీ క్రిష్ణాష్టమి" నాడు, మన ఆంధ్రప్రదేశ్ లో శ్రావణ, భాద్రపద మాసాలలో, పండుగ నెలలలో నేరేడుపండును ఒకటైనా తినాలంటారు. ఆహార విషయాది నియమాలలో - పొరపాటున జరిగే జీవ హింసఅనే పాపమును నివృత్తి చేసేటందుకని- ఈ నేరేడు పండును తినాలని ఒక సరదా సాంప్రదాయాన్ని పెద్దలు ఏర్పరిచారు. 
నేరేడుపండు మేను ఛాయ శ్రీ కృష్ణమూర్తిది.

॒॒॒॒॒॒॒॒

గుజరాతీ భాషలో "లంబూ జీవతి ఛే| తో జంబూ ఖావు ఛే||" 
అనే సామెత ఉన్నది. 
అంటే నేరేడును తింటే చక్కెరవ్యాధి పరారు  అని అర్థం

నేరేడు చెట్టు (Jamun) బహుళ ప్రయోజనకారి. రైల్వే స్లీపర్లు, పొలాల్లో మోటారు పంపు సెట్లకు ఆధారముగా, పెట్టెలు వగైరా వస్తు తయారీ- ఇత్యాదులలో చెట్టుపట్ట (బెరడు) ఉపయోగంలో ఉన్నది. నేరేడు పండు. నేరేడు చెట్టు 100 సంవత్సరాలు ఉండే ఘన మహా వృక్షము.

॑॑॑॑॑॑॑॑
;
strange fruit, Jamun 

;




















"జంబూ ద్వీపము"; శ్రీకృష్ణమూర్తి దేహఛాయకు ప్రతిబింబము కాబట్టి, గుజరాత్ మున్నగు రాష్ట్రాలలో జంబూ తరువును పవిత్ర పాదపముగా గౌరవిస్తారు. కార్తీక మాసము "పిక్ నిక్" లూ, వనభోజనాల సందడి- ముఖ్యంగా నేరేడు, ఉసిరిక చెట్లు ఉన్న తోటలను వనభోజనాలు చేసేటందుకు ఎన్నిక చేస్తారు. *

॑॑॑॑॑॑॑॑

ఈ మహావృక్షము పేరు ఆఫ్రికా దేశాలలో ఉన్నది. 
ఇంతకీ సంస్కృత పదమైన "జంబూ" అనే మాట"జంబులా ట్రీ" గా ఆఫ్రికా ఖండానికి ఎలాగ చేరింది?

పోర్చుగీసులు వాళ్ళు వలస సామ్రాజ్యాన్ని స్థాపించే ప్రయత్నములో భారతదేశానికి వచ్చారు. అప్పుడు అలాగ అప్పట్లో కేవలము ధనము మాత్రమే కాక ప్రకృతి దినుసులు కూడా ఆదానప్రదానములలో విదేశాలకు తీసుకుపోబడినవి. పోర్చుగీసులు 16 వ శతాబ్దిలో ఇండియాకు వచ్చారు. (పోర్చుగీసులను "బుడతకీచులు" అని కూడా పిలిచేవారు). కొందరు పోర్చుగీసులు ఈ విత్తనాలను విదేశాలకు చేర్చారు. వాళ్ళు అప్పట్లో బ్రెజిల్ దేశానికి వెళ్ళారు. అట్లా వారు కాలూనిన బ్రెజిల్ సీమలలో జంబూబీజములను చల్లారు. బ్రెజిల్ వాతావరణము అనుకూలత చేత నేరేళ్ళూ అక్కడ నలుమూలలా విపరీతంగా అభివృద్ధి గాంచినవి.

బ్రెజిల్ దేశములోని వాతావరణము ఇటువంటి వృక్షాలు పెరగడానికి అనువుగా ఉండడంతో ఆ వాతావరణములో జంబూపాదపములు ఏపుగా పెరిగినవి. ఇబ్బడిముబ్బడిగా పెరిగి, ఆ దేశమంతటా చిటికెలో వ్యాపించినవి. అచ్చటి ప్రజలు "Jambula tree"అంటూ ఈ చెట్లను పిలుస్తారు.

॑॑॑॑॑॑॑॑

మొత్తానికి ఈ పేరును మూల ధాతువుగా ఉన్న పాశ్చాత్యదేశాలలోని నామావళిని పరిశీలిద్దాము.

మాల్ దీవులలో - "ధంబూ" : jawanise - "juwet", "dhuwet" 
పోర్చుగీస్:- Jamelaw, jambOlaw, jalat

॑॑॑॑॑॑॑ఇలాగ జంబూ ధ్వని ప్రధానముగా అనేక భాషలలో కాస్త స్థానిక భాషల యాసల మార్పులు చేర్పులతో జంబూ ఫలము, జంబూ చెట్టు వన్నె వాసికెక్కింది. మన దేశాలలో కన్నా, పశ్చిమ ఖండాలలో ఈ పళ్ళ రసాలను, కలర్సు తయారీ, హెల్త్ డ్రింక్స్, ఖాద్య పదార్ధాలకు మంచి రంగునూ, అదనపు రుచినీ కలుగ జేసే అనుపానంగానూ బహుళ స్థాయిలో వాడుతున్నారు.విదేశీ లిటరేచర్ లోనూ ఈ జమ్బూ వృక్షమునకు చోటు కలిగినది కూడా!

"Strange Fruit" అనే పాట హిట్ ఐనది.

"""""""""""""""""""""""""""""""""""""""""""""""""",



User Rating:  / 0 
PoorBest 

5, నవంబర్ 2013, మంగళవారం

కుమారీ పూజ


కుమారీ పూజ - శ్రీ దేవీ నవరాత్రోత్సవములలో - జరిగే ఆచారము. 
ఉత్తరాదిన నేపాల్, మహారాష్ట్ర ఇత్యాది కొన్ని రాష్ట్రములలో అనుసరిస్తున్నారు ప్రజలు. 
దుర్గా మాతను నేపాల్ దేశములో “తలేజు” అని పిలుస్తారు.

కౌమారి- అనగా బాల్యాన్ని అనుసరించే దశ. 
కుమారీ దశను దాటగనే అంకురించేదే యవ్వనము. 
ఈ లేత ప్రాయము సౌకుమార్య సౌందర్యానికి ప్రతిబింబము. 
కనుకనే ఈ కుమారీ దశను ఎన్నుకుని అలాటి బాలికలను మందిరములో ఆసీనలు గావిస్తారు. 
ఇందువలన. గుడి ప్రాంగణము కళకళ లాడ్తూంటుంది.

******

కుమారీ గృహము:-























నేపాల్ లో అలా పూజించవలసిన బాలికను ముందు ఎన్నిక చేస్తారు. 
శాక్య, బజరాచార్య (=వజరాచార్య) మున్నగు వంశ బాలికలను ఈ పీఠములో ఆసీనులను చేస్తారు.

రాయల్ కుమారీ/ రాజ కుమారి- అని ఈ అర్చిత బాలిక-ను పిలుస్తారు. “సజీవ దేవత" గా అర్చనలు చేస్తారు.ఆమె "కుమారీ గృహము” (Royal Kumari of Kathmandu- Kumari ghar) లో ఆమెను ఉంచి, షోడశోపచారములు చేస్తూంటారు. పవిత్రభావముతో కొలుస్తారు. కౌమారీ దశ వఱకు మాత్రమే ఆమెను- చూస్తారు. కౌమారదశ పూర్తి అయి, యవ్వనములోకి అడుగు పెట్టిన కన్యకను లౌకిక జీవితములోనికి ప్రవేశించినదని - భావము. అటు తర్వాత ఆ అమ్మాయి సంఘములో సాధారణ జీవితమునకు సంబంధించిన జవ్వని- గా గౌరవింపబడుతుంది.

2008 అక్టోబర్ లో మతీనా శాంఖ్య - అనే చిన్నారి రాజకుమారి "కుమారీ దేవత" ఐ, 
పూజలను అందుకొన్నది. (Royal Kumari of Kathmandu : Kumari Ghar)
;
















******

కుమారీ పూజలు- ఉత్తరాదిలో- బెంగాల్ ఇత్యాది రాష్ట్రాలలో ఆచరణలో ఉన్నవి.
ఐతే ఆయా రాష్ట్రములలో వివిధ పద్ధతులు ఉన్నవి. కొన్ని సీమలలో అలంకృత బాలికను- ఒకరోజు మాత్రమే పూజిస్తారు.

కుమారి:- శిశువుల ఆరోగ్యానికి, కేరింతలు కోసమై:
త్రిమూర్తి:- దీర్ఘాయుస్సు, ఆరోగ్య భాగ్యాల కోసము:
కళ్యాణి:- విద్యాభివృద్ధి, మంచి స్నేహశీలి, మంచి మైత్రిని సంపాదించుట కోసము:
రోహిణి:- స్థిమిత బల సంపన్నత : 
చండిక:- సిరి సంపదలు అనుగ్రహించుట|
శాంభవి:- ధైర్యశక్తి|
దుర్గ:- అసాధ్య పనులను సైతమూ చేసే కార్య సాధకులు అగుట|
సభద:- అభీష్టఫలదాయిని

ఈ రీతిగా వయసులవారీగా సకల ఈప్సితములు నెరవేర్చగలిగే 
9 శక్తిస్వరూపిణులుగా కుమారీలకు అర్చనలు చేస్తూంటారు. 

*********** 

User Rating:  / 1 
PoorBest 

***********
My blog: akhilavanitha (Link);
Tuesday, December 25, 2012
గుజరాత్ లో పార్శీల కోవెల (Link)
వారి అర్చనా స్థలము ఈ "అగ్ని ఆలయము".
పార్శీల మతము జొరాష్ట్రియన్.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...