27, ఏప్రిల్ 2010, మంగళవారం

కవిరాజు answer
























" వీర గంధము తెచ్చినారము
వీరుడెవ్వరొ తెలుపుడీ!
పూసి పోదుము - మెడను వైతుము
పూల దండలు రక్తితో......." అనే పాట , నాటి భారత స్వాతంత్రోద్యమము సందర్భముగా దశ దిశలా మార్మ్రోగినది.
ఆ పాటను రాసిన వాడు " కవి రాజు - త్రిపురనేని రామ స్వామి.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

త్రిపురనేని రామస్వామి హేతు వాది, " పచ్చి నిహలిస్టు " అని,
దూషణ భూషణ తిరస్కారములను ఎదుర్కొన్నారు.
అయినప్పటికీ,
" కవి రాజు " అని పండితమ్మన్యుల చేత బిరుదును పొందారు.
తెనాలిలో వారి ఇంటికి గల "సూతాశ్రమము" అను పేరే
పండితప్రకాండుల కూడలి అయి, సరస్వతీ నిలయమై ప్రకాశించినది.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

పటిష్ఠమైన ఆస్థిక వాది విశ్వనాథ
సత్యనారాయణ కూడా ఆ చర్చా గృహానికి వస్తూ ఉండే వారు.
సూతాశ్రమంలో కవిరాజు అరటి చెట్టుకు పాదు చేస్తున్నారు.

" ఈశాన్యమూల కదళీ తరువును వేయకూడదట!"
సందేహాన్ని వెలిబుచ్చుతూ అన్నారు సనాతన ధర్మభావాలు బలంగా కల విశ్వనాథ.

"అవును! నిజమే! ఇంకో వారానికి ఇది పక్వానికి వస్తుంది,
అప్పుడు కోసేస్తాను లెండి!"
అనే చెణుకు కవిరాజు సమాధానంగా వెలువడింది.

Pramukhula Haasyam

సూతాశ్రమము

By kadambari piduri, Jan 16 2010 9:53PM

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


త్రిపురనేని రామస్వామి(1887 janavari 15 - 1943 janavari 16 ) - అంగలూరు లో,( క్రిష్ణా జిల్లా)ఒక రైతు కుంటుంబంలో జన్మించారు.
ఆతని కొడుకు " గోపీ చంద్" ,తండ్రీలెనే రచయితగా,మానసిక శాస్త్ర ప్రభావమును శైలిలో ప్రవేశ పెట్టి, కొత్త ఒరవడిని తెలుగు సాహిత్యంలో ప్రవేశ పెట్టాడు;
గోపీ చందు తనయుడైన సాయి చంద్ సినిమా నటుడు.
ఈ విధంగా కవిరాజు కుటుంబము, కళా జగత్తులో రాణించింది.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

త్రిపురనేని రామస్వామి చౌదరి , ప్రజలను చైతన్య పరిచే పాటలను రచించారు.
advocate ఐన త్రిపురనేని రామ స్వామి "తెనాలి" కేంద్రముగా తన కార్యకలాపాలను విస్తరించారు. ఆయన భావ జాలం, ప్రజలకు మేలు కొలుపుగా , కలమును విదిలించారు.హేతువాద భావాలతో సంఘములోని సనాతన వాదులలో అలజడి కలిగింది
ప్రజలను చైతన్య పరిచే పాటలను రచించారు.
విప్లవ తలపుల వ్యక్పక్తీకరణను సమర్ధవంతంగా నిర్వహించిన స్వాతంత్రోద్యమ వాది అతను.
సాహితీ వేదికగా తన గృహ సామ్రాజ్యాన్ని నిర్మించిన రామ స్వామి " సూతాశ్రమము" అని తన ఇంటికి నామ కరణము చేసారు.
సూత" నామ ధేయము మీద ఆయనకు గల మక్కువకు నిలువుటద్దాలూ " సూతాశ్రమ గీతాలు".

రామస్వామి యొక్క రచనలు -
_________________

సూతపురాణము
కొండవీటి పతనము
కుప్పుస్వామి శతకం
మాల దాసరి
గోపాలరాయ శతకం
పల్నాటి పౌరుషం
శంబూకవధ
సూతాశ్రమ గీతాలు
ధూర్త మావన శతకము
ఖూనీ ( విశ్వ నాథ సత్యనారాయణ రచన " వేన రాజు " పై విమర్శనాత్మకమైన రామ స్వామి రచన ఇది.)
భగవద్గీత
రాణా ప్రతాప్

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

త్రిపురనేని రామస్వామి ప్రముఖ హేతువాది," కవిరాజు" బిరుదాంకితుడై, జనులచే శ్లాఘించ బడ్డాడు. గా ప్రసిద్ధి చెందిన రచయిత, సంఘసంస్కర్త.
సంస్కృత భాషలోని " వివాహ మంత్రములు"ను, తేట తెలుగులో అనువదించి, సామాన్యులకు అర్ధమయ్యేలా అందుబాటులోనికి తీసుకు వచ్చాడు.

రావిపూడి వెంకటాద్రి మున్నగు శిష్యులతో ఆతని ఇల్లూ వాకిలీ కళ కళలాడుతూండేది.
తన గురువు ఐన రామ స్వామి బిరుదు ఐన" కవి రాజు" పేరుతో, - రావిపూడి వేంకటాద్రి , నాగండ్లలో " కవిరాజాశ్రమము"ను స్థాపించారు; తమ ఆలోచనలను ప్రచార కేంద్రముగా నెలకొల్పారు.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
1955లో త్రిపురనేని రామస్వామి చూపిన ఆధునిక పద్ధతిని అనుసరించి,విజయరాజకుమార్, పెళ్ళి చేసుకునారు. తెనాలిలో ఆంధ్రపత్రిక విలేఖరిగా పని చేస్తూన్న వెంకటప్పయ్య శాస్త్రి గారి కుమార్తె కన్యాకుమారిని పరిణయమాడారు. ఆచార్య రంగా, కొత్త రఘురామయ్య, ఆవుల గోపాలకృష్ణమూర్తి మొదలైన వారు ప్రముఖులు అనేకుల ఆశీస్సులతో, వారి పెళ్ళి గుంటూరులోని "సరస్వతీ మహలు"లో జరిగినది.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

8, ఏప్రిల్ 2010, గురువారం

ఆఫ్రికాలో హేమవిద్య
















ఏడు తరాల కథ – అది. అ నవల పెనుసంచలనమే కలిగించింది.
Alex Haley రచించిన అ విపుల రచనయే “The Roots“.

1750 సంవత్సరాల నుండి మొదలైన కథ ఇది.
సడన్ గా విశాలమైన నేల, సాక్షాత్తూ ఒక ఖండమే కనుగొనబడినది;
అక్కడికి పొలోమంటూ యూరోపియన్ జాతులు కోట్లాదిమంది వలస వెళ్ళారు.

మానవేతిహాసంలోనే కనీవినీ ఎరుగనట్టి, ”మహా వలసల చారిత్రాత్మక సంఘటన" అది.
అలా వెళ్ళి సెట్టిల్ అవుతున్నవారికి,
వందలాది ఎకరాలు సాగు చేసే అవసరం కలిగినది.
అందుకై మనుష్యులను కిడ్నాప్ చేయడానికి ప్రారంభించారు.
సదరు అమెరికా కాంటినెంటుకు దగ్గర ఆఫ్రికా ఖండము.

ఆఫ్రికా వాసులు చదువు సంధ్యలు లేనివారు,
నాగరికత వాసన అంతగా సోకని అమాయక మైన మరో ప్రపంచం.
తత్ఫలితమే అక్కడి జనులను సులభంగా కిడ్నాప్ చేసి,
తమ దేశలకు తరలించి, బానిసలుగా మలుచుకో గలిగారు.

అతి కర్కశ చారిత్రక పరిణామంలో
దయనీయంగా నలిగిపోయిన
ఆఫ్రికా జాతీయుల వాస్తవ గాథ ఈ “ రూట్స్ “ అనే గ్రంధము.

ఏడవ తరానికి చెందిన హేలీ కఠోరమైన శ్రమకోర్చి,
తన మూలాలను కనుక్కోగలిగాడు.
అతని ఆత్మకథను అక్షరరూపంలో ప్రపంచ సాహిత్యానికి అందించాడు.
=====================================

ఆఫ్రికాలోని వ్యక్తుల నిత్య జీవన విధానాన్ని కళ్ళకు బొమ్మ కట్టించాడు
అలెక్సు హేలీ.మాండింకా తెగ వాడైన కుంటకి
ఒక రోజు “బుర్రా”గ్రామ వాస్తవ్యులైన ఫెలూస్ తెగవాళ్ళు పరిచయం ఐనారు.

“ ఏమిటి విశేషం? “ అని అడిగాడు కుంటా.
“ బంగారు రేణువులను
సేకరించుకుని రావడానికి వెళుతున్నాం.” అని, మట్టిలో గీతలు గీస్తూ,
- ‘ ఏ దిక్కుగా , ఏ ఏ ఊళ్ళు దాటుకుని వెళ్ళాలో ‘ చూపించారు.

ఆ తర్వాత కుంటా, లామిన్, జఫూర్ లతో ఒక రాత్రి, రెండు పగళ్ళు
ప్రయాణం చేశాడు .
కొట్టకొసకి, బంకమన్ను గోతుల దగ్గరికి చేరారు.

“నువ్వు తప్పకుండా వస్తావనే అనుకున్నాం.”
వాళ్ళు సంతోషంతో పలికారు.

మరుసటి రోజు నుండి వేకువ ఝాముననే లేచేవాళ్ళు.
బంకమన్ను పెళ్ళలు విచ్చదీసే వాళ్ళు.
పెద్ద పెద్ద ఖాళీ సొరకాయ బుర్రలను నీళ్ళతో నింపి ఉంచుకున్నారు.
ఆ సొరడొల్లలలో బంకమన్నును బాగా పిసికే వాళ్ళు.
వాటిని స్పీడుగా గిర గిరా త్రిప్పే వాళ్ళు.
నెమ్మదిగా, నిదానంగా తేరుకున్న మట్టి నీటిని వంపి వేసేవాళ్ళు.

“ బంగారు రేణువులు అడుగునకు చేరాయి కదూ!”
ఇలాగ ఏకదీక్షతో సాయంత్రం దాకా చేసేవారు. చేతులు నెప్పులు పుట్టేవి.
అడవి పావురాళ్ళ రెక్కలతో బోలుగా గూడులను నిర్మించి పెట్టుకునే వారు.
ఇలా అడుగున చేరిన బంగారు రేణువులను, ఆ గూళ్ళలో భద్రం చేసి, పైన
దూది కూరే వారు.
కుంటా వర్గం అలాగ – ఆరు – సెట్టులను చేయగలిగారు.

తక్కిన ఫ్రెండ్సు “ఇంకా ముందుకు వెళ్ళి, దంతాల వేట చేద్దామని ” అన్నారు.
కానీ కుంటా విముఖత చూపడంతో అందరూ ఇంటి ముఖం పట్టారు.
అతని తల్లి బింటా, ఉమరో, ఊరి జనాలను కలిసి, వారి పొగడ్తలను రిసీవ్
చేసుకుంటే ఎంజాయ్ చేసాడు .

ఈ పుస్తకం వారి అనేక ఆచార వ్యవహారాల అక్షర దృశ్య రూపము.
తక్కినవాటిని నెమ్మది మీద చూడవచ్చును.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Telusaa!

ఆఫ్రికాలో హేమవిద్య

By kadambari piduri, Apr 6 2010 10:35AM

1, ఏప్రిల్ 2010, గురువారం

వీణ చిట్టి బాబు శిష్యరికం పొందిన భాగ్య శాలిని
















“ వీణ చిట్టి బాబు “ అని ప్రసిద్ధి గాంచారు ,
ప్రముఖ వైణిక విద్వాంసుడు చల్ల పల్లి చిట్టి బాబు ( 1936 – 1996 ).
ఎందరినో “ వీణా వాదన “లో తీర్చి దిద్దారు చిట్టి బాబు.
ఆయన వంటి వైణికుల వలన ప్రజలలో "వీణ "కు గౌరవం ఇనుమడించినది.

ఆయన శిష్యరికం పొందిన భాగ్య శాలిని “ లలితా ముఖర్జియా( కలకత్తాలో ఆమె నివాసము).

ఆమె తన వేణ వాదనా ప్రజ్ఞకు హేతువులను
తరచుగా జ్ఞాపకం చేసుకుంటూ, చెబుతూంటారు.
చిట్టి బాబు ఉన్నత వ్యక్తిత్వానికి అందరూ ముగ్ధులౌతూంటారు.
ఆ యా సంగతులను లలితా ముఖర్జియా పూస గుచ్చినట్లుగా వివరిస్తూ ఉంటారు.

" చిట్టి బాబు చాలా ఓర్పు కలిగిన టీచరు.
ఆయన మంచితనానికి మారు పేరైన మాష్టారు.
శిష్యులకు బోధించేటప్పుడు అలసట అనేది ఎరుగరు.
ప్రత్యక్షంగా బోధిస్తారు, విరామము లేని గానం చేస్తూ ఉంటారు.
చిట్టిబాబు మాస్టారు – చిన్న అంశమునైనా సరే! -
ఆయన కోరిన విధంగా, ఆయన అనుకున్న విధంగా
నేను వీణ మీద వాయించ గలిగే దాకా ,
అవిశ్రాంతంగా చెబుతూ, వాయించి చూపిస్తూనే ఉండే వారు.

మొట్ట మొదటి సంగీత పాఠము (lesson )ను
90 నిముషాల పాటు నేర్పారు.
అప్పటికి, కేవలం పల్లవిని మాత్రమే
నేను నేర్చుకో గలిగాను;” అని
శిష్యురాలు లలిత ఆనందంతో తన చిన్న నాటి అనుభవాలను తలుచుకున్నారు.

"ప్రాధమిక అవస్థలో ఉన్నది కదా; నాకెందుకు లెమ్మని "; తాను గొప్ప వైణిక విద్వాంసుణ్ణి కదా!
అనుకునే నిర్లక్ష్యపు వైఖరి చిట్టి బాబుకు లేదు;
శిష్యులకు పాఠాలను నేర్పే విషయంలో
చిట్టి బాబు శ్రద్ధాసక్తులు, ఓరిమి నిరుపమానమైనవి.
“ నాకు ఇదివరకు వాయిద్యాన్ని నేర్పిన ఉపాధ్యాయుడు,
notation ను notes లో రాసుకునే పధ్ధతిని అనుసరించారు.
కానీ చిట్టి బాబు _ ‘ నోట్సును కానీ, రాగ వరుసలను రాసుకుని అనుసరించరు.
ఆయన పాఠ్య ప్రణాళిక విభిన్నముగా ఉండేది.
మళ్ళీ మళ్ళీ వీణపైన వాయించి చూపించే వారు.
దానిలో ఎంతగా లీనమై పోయే వారు అంటే ,
తన్మయత్వంతో వాయిస్తూ ఉంటే,
వీణ ఇంచుమించుగా నేలను తాకేటంతగా
వంగి పోతూ వాయిస్తూ ఉండే వారు.’

లలిత ఇతర మార్గాలను ఫాలో అయ్యే ప్రయత్నం కూడా చేసేది.
ఆమె ఇతర పుస్తకములలోనుండి –
మ్యూజిక్ లెసన్సు నొటేషన్సును, రాగాల మెట్టులను రాసు కునేది;
అయితే ఆ రాగ బాణీలను,
చిట్టి బాబు నేర్పిన అద్భుతమైన రాగాలకూ
పోలికలూ, సారూప్యతలూ ఉండేవే కాదు..........”

అంతటి మహానుభావుని స్టూడెంటుగా ఉన్నందుకు ఎంతో సంతోషంతో
“ తన పూర్వ జన్మ పుణ్యము వలన ఆయన శిష్యరికము లభించినది.”
అని చిర కాల జ్ఞాపకములుగా తన మనో పర్ణ కుటీరములో పదిల పరచుకున్నారు.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

"అభినందన” మొదలుగా గల
అనేక హిట్ సినిమాలలో హీరోగా వేసిన అందాల నటుడు కార్తీక్.
ఈతని తండ్రి ముత్తురామన్.

ముత్తు రామన్ నటించిన సినిమా
“కలై కోవిల్ “కు ఒక ప్రత్యేకత ఉన్నది.
ఈ సినిమాకు సంగీత రచనను – విశ్వనాథన్ రామ్మూర్తి చేసారు.
ఈ మ్యూజిక్ రూప కల్పనలో
తెలుగు వైణికుడు చిట్టిబాబు వీణను వాయించాడు.
అంతేకాదు అధిక శాతం పాలు పంచుకున్నాడు కూడా!

1964 విడుదల ఐన “కలై కొవిల్”
సంగీత ప్రధానమై , ప్రేక్షక లోకం మన్ననలను పొందింది.
1960 – 1970 దశకంలో దక్షిణాది సినీ ప్రపంచంలో
అనేకం “వీణా వాయిద్యము నేపథ్యంగా” వెలువడి,
వీనుల విందొనరించాయి.

చిట్టిబాబు( October 13, 1936 - February 9, 1996 )
“లైలా మజ్ఞు” లో బాల నటునిగా ఉన్నాడు.
కానీ అతడు నటుడిగానే పరిమితం అవలేదు.
గొప్ప వైణిక విద్వాంసునిగా పరిణతి చెందాడు.
మహా మహోపాద్యాయ ఈమని శంకర శాస్త్రి వద్ద ఆత్మీయ శిష్యరికం చేసి,
గురువుకు తగ్గ శిష్యుడు ఐనాడు.

అప్పటి అనేక సినిమాలలో చిట్టి బాబు యే
వీణను శ్రావ్యంగా వాయించాడు.

“బాపు” దర్శకత్వంలో వచ్చిన “ సంపూర్ణ రామాయణము” లో
టైటిల్ సాంగు “జగదానంద కారకా!.....” అనే
త్యాగ రాజు కృతి వినిపించిన వీణా నాదము చిట్టి బాబుదే!

రాజాజీ రచన “దిక్కర్త పార్వతి" కథ ఆధారంగా తీసిన సినిమాకు
దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు అవడం ఒక ఎత్తు ;
ఈ అవార్డు గెలిచిన చలన చిత్రమునకు (కన్న దాసన్ రాసిన గీతాలకు)
music director మరెవరో కాదు, చిట్టి బాబు యే!
వాణీ జయ రాం పాడిన ”"ఆగాయం మఘై పొగిందాల్ ………” పాట
ఆ రోజులలో సూపర్ హిట్ ఐనది.

చల్లపల్లి రంగారావు కుమారుడైన చిట్టి బాబు
” Veena is my mission in life” అని పలికాడు.

ప్రాచీన వేద శ్లోకాలు, అలాగే కర్ణాటక సంగీత బాణీలు
ఆతని అంగుళుల కదలికతో మృదు స్వరాల వరాలై
శ్రోతల శ్రవణేంద్రియాలకు లభించాయి.
కోకిల స్వరములను వీణా తంత్రులపై వినిపించి ,
అనితర సాధ్య వైణిక విద్వాంసునిగా ప్రపంచమంతా ప్రఖ్యాతి గాంచాడు చిట్టిబాబు .

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Chitravalokanam

చిట్టిబాబు

By kadambari piduri, Jan 23 2010 12:26AM

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...