ఒక రోజు రుద్రపట్నం శ్యామ శాస్త్రి ప్రాచీన వ్రాత ప్రతులను సర్దుతూండగా
ఆయనకి ఒక తాళ పత్ర గ్రంధము కనబడినది
ఆ palm leaves లో ఉన్న శ్లోకాలను చదువుతూ,
అమితానంద ఉద్వేగాలతో ఆనంద బాష్పములతో పులకించిపోయారు.
1905 లో శ్యామ శాస్త్రి గుట్టలుగా ఉన్న తాటాకు గ్రంధ ప్రతులనుండి
అనుకోకుండా ఈ అమూల్య రచనను కనుగొన్నారు .
రుద్రపట్నం శ్యామ శాస్త్రి నివాస గృహం పేరు” అశుతోష్”.
అప్పటికి వారి కాలనీలో కరెంట్ లేదు.
అందుచే వారు టార్చ్ లైట్ ని వేసుకుని పని చేసారు.
కరెంటు లేకున్నప్పటికీ వారి నిష్కల్మష కృ
షి అసిధారావ్రతంలాగా కొనసాగించారు
ఆ కుటుంబీకులు అందరూ!
కౌటిల్య గ్రంథములోని శ్లోకాలను
ఫొటోలు తీయుట,
తర్జుమా చేయుట ఇత్యాది అనేక పనులు చేస్తూ,
శ్యామ శాస్త్రికి చేదోడు వాదోడుగా మనుమరాలు,మనుమడులు నిలిచారు.
మనుమలు చాణుక్యుని రచనను యావన్మందికీ పరిచయం చేసే
ఆ మహత్తరమైన బృహత్ కార్యంలో భాగస్వాములు ఐనారు.
ఈ మహత్తర కార్యము 1905 లో మైసూర్ లోని ఓరియంట్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్
(The Oriental Research Institute (ORI) జరిగింది.

ఆ Details, News English లో అచ్చు ఐనాయి.
´ Indian Antiquity and Mysore Review మొదలగు వివరాలు ప్రింట్ ఐనాయి.
అప్పటినుండీ, రమారమి 6 ఏళ్ళు అవిరళ కృషి చేసి,
1915లో ముద్రణా రూపంలో లోకానికి
అందించ గలిగారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి