గజ రాజు వదనమును కలిగి ఉన్న "వినాయకుడు" ను,
మొట్ట మొదట పూజ చేసి,
అర్చన కార్యక్రమాలను కొనసాగిస్తారు మన భారతీయులు.
కంబోడియా, థాయ్ లాండ్, మియన్మార్ (బర్మా), శ్రీ లంక మున్నగు
అనేక ఆసియా దేశాలలో "ఏనుగు" ఆరాధ్యనీయమైన జంతువు. అలగ్జాండర్ హిందూ దేశముపై దండెత్తినప్పుడు,
పురుషోత్తమ మహా రాజు/ పోరస్ ఎదిరించి, నిలువరించాడు.
ఆ గ్రీకు వీరునికి
"గజ దళములను యుద్ధ రంగంలో వాడ గలుగుతూన్న
భారతీయుల రణ చాతుర్యానికి" అబ్బుర పడ్డాడు.
అప్పటి దాకా యుద్ధములలో
కేవలం అశ్వములనూ, కాల్బలములను నేర్చుకుని ఉపయోగిస్తూన్న పాశ్చాత్యులు.
ఆ నాటి నుండే యూరోపులో పోరులో ఏనుగులను కూడా వాడటము మొదలు పెట్టారు.
కేరళలోనూ, గోవా నుండీ, అండ మాన్ దీవులూ, శ్రీలంక వఱకూ
సముద్రములోనే ఏనుగులు ఈదుకుంటూ వెళ్ళ గలవు;
ఇలాగ గజ రాజులకు శిక్షణను ఇచ్చిన ఘనత
ప్రపంచములోనే _
మన భారత దేశములోని మావటి వాళ్ళకే దక్కుతూన్నదీ -
అని మనం ఘంటా పథంగా చాట గలము.
రాజ స్థాన్లో గజేంద్రుల సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పారు.
మత్తేభాల పోషణ,సంరక్షణ,అజమాయిషీ చేయడం మావటి వాళ్ళ విధులు .
అలాంటి 51 మావటీల కోసమూ, వారి ఏనుగుల కోసమూ
“కుంద గ్రామము” ను నెలకొల్పారు.
”భారత దేశంలోని ప్రప్రథమ హస్తి గ్రామం”గా సంబరాలను జరుపుకుంటూ,
యాత్రా సందర్శకులకు ఈ గ్రామము ప్రత్యేక ఆకర్షణగా మారింది.
రాజ స్థాన్లో గజేంద్రుల సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పారు.
రాష్ట్ర ఉత్తర ప్రాంతంలో భూమిని కేటాయించారు.
చారిత్రక ప్రాముఖ్యత కలిగిన “ అమర్ కోట “ కు దగ్గరలో
ఈ mahouts village ని, రాజస్థాన్ స్టేట్ గవర్నమెంటు ఏర్పరచింది.
ఈ పల్లె రాష్ట్ర రాజధాని “జైపూర్”కు సమీపం లో ఉన్నది .
“ జంతు ప్రపంచానికి ఇది గొప్ప వరము.
ప్రస్తుతము 51 ఏనుగులకు ఇచ్చట వసతి సౌకర్యాలను కల్పిస్తున్నాము,
తక్కిన వానికి కూడా త్వరలోనే ఈ సదుపాయాలను ఏర్పాటు చేస్తాము.” అంటూ,
Rajasthan Tourism Minister Bina Kak అభిభాషించారు
“నాకు వర్ణించ లేనంతా ఆనందంగా ఉంది.
మావటి వారి యొక్క 40 సంవత్సరాల కల ఈ నాడు సాకారం పొందింది. "
అని “ గజ సంరక్షకుల అసోసియేషన్ ప్రెసిడెంట్ అబ్దుల్ రషీద్ చెప్పాడు.
అమర్ దుర్గంలోని 113 ఏనుగులు టూరిస్టులను అలరిస్తూంటాయి.
వైస్ ప్రెసిడెంట్ శ్యాం గుప్త
“ ఇటు స్వదేశీయులకూ, అట్టి విదేశీ టూరిస్టులకూ
ఏనుగు సవారీ ముఖ్య ఆకర్షణ, ప్రత్యేకించి,
ఇందుకోసమే డిమాండు ఉంటూన్నది కూడా!” అని వివరించారు.
జంతువుల కోసం నీటి కొలనును, వెటెర్నరీ క్లినిక్ నూ నిర్మించారు.
“ ఒక ఏనుగు రోజూ నాలుగు రౌండ్లు సవ్వారీలను తిప్పుతుంది.
ఇందుకు 20 డాలర్లు ఆదాయం, అంటే 20 డాలర్లు లభిస్తాయి.
అందులో నుండి 200 రూపాయలు జంతు సంక్షేమానికై చేర్చ బడతాయి. "
అని శ్యాం గుప్త చెప్పారు.
ప్రతి ఏటా 1.4 million tourists అమర్ దుర్గాన్నీ, పల్లెటూరునూ దర్శిస్తారు.
ఏనుగుల నెక్కి, సవారీ చేసే అవకాశమే ప్రధాన ఆకర్షణ కదా మరి!
కాస్త భూత దయకు మనసులో కూస్తంత జాగాను
మానవుడు ఇవ్వాలి.
రాజస్థాన్ రాష్ట్రం బాటలో
ఇతర రాష్ట్రాలు అడుగులు వేస్తే,
అటు జంతు సంరక్షణా దృక్పథంతో పాటు ఆదాయమూ,
ప్రజలకు వివిధ ఉపాధి మార్గాలూ ఏర్పడతాయి కదూ! ఔనా మరి!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి