1, అక్టోబర్ 2010, శుక్రవారం

ఆ ఫొటో




















బాపూజీ "అహింసా విధానము" తో
స్వాతంత్ర్య సముపార్జనను సాధ్యము చేసిన తీరు
ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేసింది.
గాంధి మహాత్ముడు నిర్మించిన ఈ బాట "అహింసో పరమో ధర్మః" అనే సిద్ధాంతము
పాశ్చాత్య దేశాలనే కాక యావత్ దేశాల మేధావులనూ, రాజకీయ నాయకులనూ, ప్రజలనూ
అన్ని వర్గాలనూ ఆకర్షించింది.
అనేక అంశాలను యుద్ధముతో అక్కర లేకుండా -
"అహింసయే ప్రథమ ధ్యేయమైన పద్ధతిని"
లోకానికి అందించిన నాయకుడు మన మోహన్ చంద్ కరం చంద్ గాంధీ.
"ఇలాంటి వ్యక్తి ఒకడు - మన మధ్య నిజంగా జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మలేరు"
అని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ నొక్కి వక్కాణించారు.
ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఫొటోలు ఎంపిక చేయ బడిన వానిలో ఒకటి
“ మహాత్మా గాంధీ – రాట్నము ” .
ఈ ఛాయా చిత్రాన్ని 1946 సంవత్సరంలో తీసారు.
మార్గరెట్ బర్క్ వైట్ తన cameraలో ఫ్లాష్ కొఱకై
ఆమె - three light balls ను ఉపయోగించినది.
ఆ నాడు వాతావరణం అనుకూలంగా లేదు;
కెమేరాలోని సాంకేతిక పరికరాల వాడుకలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి.
అయినప్పటికీ Gandhi at his Spinning Wheel” ఫొటో
ప్రపంచ ఛాయా చిత్రాలలో అగ్ర పీఠంలో చేరింది.
అందరి మన్ననలను పొందుతూ, నేటికీ ఎల్లరినీ ఆకట్టుకుంటూన్న
ఈ ఫొటోను తీసిన Margaret Bourke White భాగ్య శాలినియే కదా!

2 కామెంట్‌లు:

jaggampeta చెప్పారు...

ఈ ఫోటోకి ఇంత కథ ఉందా .ధన్యవాదాలు

kusuma చెప్పారు...

jaggampeta gaarU!

Thank you! sir!

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...