"సింహాచలము మహా పుణ్య క్షేత్రము, 
శ్రీ వరాహ నర సింహుని దివ్య ధామము."
వీర భాను దీపుడు, కిమిడి ప్రభువు, 
వల్లభాసావాస మల్లుడు, కొండ వీటి రెడ్డి రాజులు, 
శ్రీ కృష్ణ దేవ రాయలు గారి పట్ట మహిషి, మున్నగు వారు
 సింహాచల స్వామికి విలువైన కానుకలను సమర్పించారు. 
స్వామిని అర్చించి, పలువురు అనేక శిల్ప, మండప, 
సోపానాది నిర్మాణాలను వెలయించారు. 
18 వ శతాబ్ద ఆరంభం నాటికి సింహాచల క్షేత్రము 
కటకము పరిపాలకుల ఆధ్వర్యంలో ఉండేది; 
కాల క్రమేణా 
పూసపాటి విజయ నగర ప్రభువులు నిర్వహణలోనికి వచ్చినది.
నేటికీ ఇక్కడ ఉన్న అసంఖ్యాక శాసనాలు, 
దేవళమునకు భక్తులు సమర్పించిన భూ దానములు వగైరాలు, 
చక్రవర్తుల బహుమతులు – మున్నగునవి .
ఎన్నిటికో శిలా, శాసన రూపాదులలో ఉండి, 
History Reaserch చేసే వారికి 
అమూల్య వరములుగా ఒనగూడుతునాయి.
చైత్ర శుద్ధ ఏకాదశి మొదలు పౌర్ణమి వఱకు జరిగే 
“శ్రీ స్వామి వారికి కళ్యాణ మహోత్సవాలు”  
భక్త జనులకు నయన పర్వములు చేస్తున్నాయి. 
సింహాచల క్షేత్ర మహిమలను కీర్తిస్తూ 
శతకములు, సాహిత్యము వెలువడినవి.
విజయ రామ రాజు గజపతి అధికారములో ఉన్నప్పుడు 
ఒక విశిష్ట సంఘటన జరిగినది.  
మొగలాయీ సైన్యము దండ యాత్రలతో దేశము అల్ల కల్లోలముగ ఉన్నది. 
తురుష్క సైన్యం దేవాలయాలను ధ్వంసం చేసే వారు. 
సింహాచల క్షేత్రము కొండను ఎక్కాయి. 
కొంత మేర కళ్యాణ మండప స్థంభాలను పగల గొట్టారు. 
కోవెల తలుపులను కూడా విరగ్గొట్టి, లోనికి ప్రవేశించబోయారు.
అప్పటికే లోపల ఇద్దరు భక్తులు ఉన్నారు.
ప్రాణ త్యాగానికైనా సిద్ధ పడిన 
ఆ భక్తుల పేర్లు గోకుల పాటి కూర్మ నాథ కవి, హరి హర దాసు.
వారిరువురు తలుపులు మూసుకుని 
స్వామి మీద ఆశువుగా శతకమును చెప్ప సాగారు. 
కూర్మ నాథ కవి పద్యాలను చెప్తూంటే, 
హరి హర దాసు వ్రాయ సాగాడు.
వేద వ్యాసుని నుడువులుగా 
“మహా భారతము” అనే నామముతో ప్రసిద్ధికెక్కిన 
హిందువుల ఇతిహాసము ఐన “జయం” ను 
తన దంతముతో వినాయకుడు రాసి పెట్టిన 
మహత్తర సంఘటనకు సామ్యముగా ఇచ్చట  జరిగినది.
“ వై రి హర రంహ సింహాద్రి నర సింహ” అనే మకుటముతో 
సీస పద్య హారము వెలసినది. 
బయట ముష్కరుల సైన్యము 
ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ముట్టడి చేసారు. 
అప్పుడు ఒక విచిత్ర సంఘటన జరిగినది.
వేలాది తేనెటీగల దండు ఒక్కుమ్మడిగా ఆ ముష్కరులపై దాడి చేసాయి.
గుంపులు గుంపులుగా ఆ తేనెటీగలు దుష్ట బుద్ధి కల ఆ దుర్మార్గులను తరిమికొట్టాయి.
విశాఖ పట్టణములోని “తుమ్మెదల మెట్ట” దాకా 
శత్రువులను పార ద్రోలినాయి.
పూసపాటి విజయ రామరాజు పరిపాలనా కాలంనాటికి 
దేవాలయమునకు విశిష్ట సాంప్రదాయములు సమకూడినవి.
“శ్రీ స్వామి వారికి కళ్యాణ మహోత్సవాలు”  , 
వైశాఖ శుద్ధ తదియ నాటి “స్వామి వారి నిజ రూప దర్శనము” లబ్ధిని 
ప్రజా కోటి పొందుతున్నారు.
ఆ నాడు వలిచిన “సింహాచల స్వామి వారి ” చందనము తో 
కలిపిన దివ్య తీర్థము లభిస్తుంది.
అక్షయ తృతీయ ఉత్తరాది నుండి దిగుమతి ఐ, 
ఇప్పుడు మన దక్షిణ భారత సీమలలో కూడా 
ప్రాచుర్యంలోనికి వచ్చిన పండుగ. 
సింహాచలములో 
క్రీస్తు శకము 1293  నుండి ఒక ఆచారము ఏర్పాటు ఐనది.
గంధము, హరి చందనము, కర్పూరము మున్నగు సుగంధ ద్రవ్యాలను నూరుట –
ఒక పవిత్ర కార్యక్రమముగా మొదలు పెడ్తారు.
పురూరవ మహా రాజుకు ఆకాశ వాణి ఇచ్చిన ఆదేశము మేఱకు 
" అక్షయ తృతీయ నాడు, చందన వలుపు ఉత్సవము జరుగుటకు 
బీజము పడినదని పౌరాణిక గాథ.  
ఆ రోజు శ్రీ వరాహ నరసింహ మూర్తి నిజ రూప దర్శనము అందరికీ లభిస్తూన్నది.   
3 రోజులు ముందు నుండి "జల ధారలను" విగ్రహముపై చిలకరిస్తూ ఉంటారు.
ఇందు చేత గట్టిగా ఉన్న చందనము మెత్త బడి, వలవడానికి అనువుగా మారుతుంది.
కప్ప స్తంభము ఇచ్చటి ప్రత్యేకత.
"సంతాన వేణు గోపాల స్వామి" అనుగ్రహము లభించి, 
"దంపతులకు సంతానము కలుగును. 
"కప్పస్తంభము"ను తాకి, వరములు కోరుట ఇచ్చటి విశిష్టత.
;;;;;;; అక్షయ తృతీయ (‘చందనొత్సవం’)   
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి