23, జూన్ 2009, మంగళవారం

డప్పుల సుబ్బారావు





Pramukhula Haasyam
డప్పుల సుబ్బారావు
By
kadambari piduri,

దుర్గాబాయి దేశ్ ముఖ్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న రోజులలో,

అనేక చిరస్మరణీయ సంఘటనలను,

"మన ఆంధ్ర దేశ చరిత్ర"లో పదిల పరుచుకొన దగినవి జరిగినాయి.

పైడా వెంకటా చలపతి గారు, మహర్షి సాంబ మూర్తి మున్నగు

వారు కాకినాడ టౌను హాలులో కాంగ్రెస్ సభను నిర్వ హించారు.

అప్పుడు జరిగిన లాఠీ ఛార్జిలో మహర్షి సాంబమూర్తి గాయాల పాలయ్యారు.హాలులో 4 అంగుళాల మందముతో రక్తము గడ్డ కట్టింది. వారము రోజుల దాకా ప్రజలు వచ్చి చూస్తూండేవారు.

బాయపు నీడి సుబ్బారావు సబ్ ఇనస్పెక్టరు.

సభలు, సమావేశాలను చెదరగొట్టడానికి

ఆయన అనుసరించిన ఒక పద్ధతి వార్తలలోనికి ఎక్కింది.

ప్రజా సమూహములను చెదరగొట్టడనికై, ఆయన చాలా డప్పులను తెప్పించి, వాయింపించేవాడు.

అందువలన ఆయనను అందరూ "డప్పుల సుబ్బారావు" అనే వారు.

ఇలాగ, ఈ సరికొత్త నామధేయం (నిక్ నేమ్) కలిగిన వ్యక్తి,

బహుశా "డప్పుల సుబ్బారావు మాత్రమే నేమో!"

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...