10, జూన్ 2009, బుధవారం

మట్టి దిబ్బల కింద మహా నగరము








కోటి లింగాల "
==========
కరీం నగరు జిల్లాలో ,కోటి లింగాల "అనే మహా నగరము ఉన్నట్లుగా త్రవ్వకములలో బయల్పడినది.
"మునుల గుట్ట"వద్ద శాత వాహనుల కాలము నాటి అమూల్య వస్తువులు లభించినవి.
అపురూప నాణెములు ,టెర్రకోట పూసలు ,పాత్రలు,నగలు దొరికినవి.
మట్టి దిబ్బల కింద మహా నగరము మనకు లభించిన అమూల్యచారిత్రక సంపద.



శ్రీ ముఖుని కాలము నాటి సంస్కృతి పరిఢవిల్లినది.
కోటి ఇసుక రేణువులతో " ఉద్భవించుటచే "కోటి లింగాల"నామ ధేయమును కలిగినది.
గోదావరి తీరాన "కోటి లింగాల"(కరీం నగర్ జిల్లా)
శాత వాహనుల కాలమునాటిదనీ,
క్రీస్తు పూర్వము 2 వ శతాబ్దము నుండి
క్రీస్తు శకము 2 వ శతాబ్దంవరకూ
నిర్మాణము కొనసాగినందున,మహా నగరము ఏర్పడినదనీ,చారిత్రక ఆధారాలు లభ్యమైనవి.
చెత్తను పార వేసేందుకు "ప్రత్యేకంగా కుండీలు,మురుగు కాలవల నిర్మాణము ఇక్కడి ప్రత్యేక విశేషాలు.
మునుల గుట్ట"వద్ద లభించిన వస్తువులు అనేక వైవిధ్య భరితములుగా ఉన్నవి.
నాగ లింగము,సింహముల బొమ్మ చెక్కిన ఫలకము,బౌద్ధ సంస్కృతికి ఆనవాళ్ళు.

-------------------------------------------------------

ఎల్లం పల్లి ప్రాజెక్టు వలన 'ముంపునకు గురి అయ్యే'ప్రదేశాలలో ఇదీ ఒకటి.
అనుకోకుండా బయల్పడి,లభించిన ఈ అమూల్య చారిత్రక సంపదను పరి రక్షించడానికి అధికారులు సముచితమైన చర్యలను చేపడుతున్నారని ఆశిద్దాము.

1 కామెంట్‌:

amma odi చెప్పారు...

మంచి టపా!

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...