8, జూన్ 2009, సోమవారం

పోతన చేసిన సరస్వతీ విశేష వర్ణన










మహా కవి పోతన శ్రీ శారదాంబను ఇటుల స్తుతించెను:
క్షోణి తలంబు నెన్నెదురు సోగక మ్రొక్కి నుతించు, సైకత
శ్రోణికి ఛంచరీక చయ సుందరవేణికి, రక్షితామర
శ్రేణికి, తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి, అక్షధామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్"


శ్రీ సరస్వతీదేవి అక్షమాల, చిలుక, తామర పూవు, పుస్తకములను ధరించెను.
ఆమెకు ప్రణతులొనర్చినాడు మన భక్త పోతన.
ఐతే ఈ పద్దెములో "వీణ" నుడువ బడలేదు.

పోతన తరువాతి కాలము నాటికి
చదువుల తల్లి "వీణాధారిణి" అయి,
"లలిత కళా రాణి"గా అవతరించినది.
సృష్టిలో కళలకు గల
ప్రాధాన్యము ముగ్ధ మనోజ్ఞముగా ఆవిష్కరించబడి
మన సంస్కృతిని విభిన్నముగా,
జగజ్జేగీయమానంగా, ఉత్తేజమయంగా ఉద్భవిల్లజేసినది కదా!
''''''''

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...