12, ఫిబ్రవరి 2010, శుక్రవారం

రామస్వామి దీక్షితులు కనిపెట్టిన “హంసధ్వని రాగము”

-
-
-
-
-
-
-
-
-
-
-
--
-
-
-
-
-
-
-
-



కర్ణాటక సంగీత సరస్వతీదేవి కిరీటములో పొదిగి ఉన్న
త్రి రత్నములు శ్రీ త్యాగరాజు, శ్రీ ముత్తుస్వామి దీక్షితులు, శ్రీ శ్యామశాస్త్రి గార్లు.

ముత్తుస్వామి జనకుడు శ్రీ రామస్వామి దీక్షితులు,
“హంసధ్వని రాగమును” కనిపెట్టిన మేధావి.
ఈ భక్త శిరోమణి “ కాశ్యప” సగోత్రీకుడు.

అతని పూర్వీకులు ( గోవింద దీక్షితులు నిర్మించిన అగ్రహారము ఐన) గోవిందపురములో
రామస్వామి క్రీస్తు శకము 1735 లో జన్మించెను.
వేంకటేశ్వర దీక్షితులు, భాగీరథి అతని తల్లి దండ్రులు. వారు 1751లో పరలోకగతులైరి.
పిమ్మట రామస్వామి తంజావూరునకు వెడలెను.
అచ్చట రాజాస్థానములో సంగీత విద్వాంసుడు వీరభద్రయ్య వద్ద
రామస్వామి సంగీతవిద్యను అభ్యసించి, తిరిగి తన స్వగ్రామమునకు వచ్చెను.
సంగీతము పట్ల గల అమిత జిజ్ఞాసతో, అనురక్తితో,
మరల విద్యాభ్యాస ప్రయాణమును కొనసాగించెను.
మధ్వార్జున క్షేత్రమునందు వేంకట వైద్యనాథ దీక్షితులు అనే వైణికుడు నివసించు చుండెను.
వెంకట వైద్యనాథ దీక్షితులు యొక్క పూర్వీకుడు “వేంకటమఖి”అమోఘ పండితుడు;
వేంకటమఖి రచించిన “ చతుర్దండి ప్రకాశిక”
కర్ణాటక సంగీతము నేర్చుకొను వారికి కరదీపిక వంటిది.

వేంకట ముఖి 72 మేళ రాగములను సూత్రీకరించెను.
తనను ఆశ్రయించిన రామస్వామిలోని భక్తి శ్రద్ధలకు, సంగీతము పట్ల ఆసక్తి
వైద్యనాథులకు ఎంతో నచ్చాయి.

తన పూర్వీకులు ఒసగినట్టి, ఆ జన్యు రాగ సంపదలను,
వైద్యనాథ దీక్షిత పండితవరేణ్యులు నిష్కామముగా బోధించెను.
రామస్వామి సంగీత విద్యలను క్షుణ్ణముగా అభ్యసించెను.
స్వయంకృషితో రామస్వామి దీక్షితులు కనిపెట్టిన “హంసధ్వని రాగము”
కర్ణాటక సంగీతసీమలో ప్రాచుర్యము పొందినది.
వేంకట వైద్యనాథులు, రామస్వామి దీక్షితులు ఇద్దరూ అపురూపమైన గురు శిష్యులే!
వారు ఇరువురూ పరస్పరమూ పౌర్ణమి చంద్రుడు, పాల వెన్నెల వంటి వారు.

{ Telusaa!

హంసధ్వని రాగం

By kadambari piduri, Dec 21 2009 11:49PM }

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

హంస ధ్వని రాగము లో శ్రావ్యమైన ఒక త్యాగ రాయ కృతి ఇది;


అబీష్ట వరద ;;;
రాగం: హంస ధ్వని ;
29 - ధీర శంకరాభరణం జన్య ;
ఆరోహణ: స - రి 2 - గ3 - ఫ - ని3 - శ ;
అవరోహణ: స - ని 3 - ప - గ 3 - రి 2 - స ;
తాళం: ఆది
త్యాగరాజ కృతి ;

(పల్లవి) ;

అభీష్ట వరద శ్రీ మహా గణపతే ఆగమ
వేదాంత్యంతరహిత పతే || అభీష్ట ||

(అనుపల్లవి ):

కవీంద్ర రవి వినుత
కనక మయ దివ్య చరణ
కమలములు నమ్మితిని ||అభీష్ట ||

(చరణం ) :

ముక్తి మార్గమునకు మొదటి దైవము
నీ శక్తి సుముఖత భక్తులగు వారికి
సిద్ధి బుద్ధి వర ఫలము నొసగిన
సద్గురు శ్రీ త్యాగ రాజు పొగడిన ||అబీష్ట ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


వందేహం జగద్వల్లభం దుర్లభం
మందర ధరం గురుం మాధవం భూధవం

నర హరిం మురహరం నారాయణం పరం
హరిం అచ్యుతం ఘన విహంగ వాహనం
పురుషోత్తమం పరం పుండరీకేక్షణం
కరుణాభరణం కలయామి శరణం

నంద నిజ నందనం, నందక గదా ధరం
ఇందిరా నాధ మరవింద నాభం
ఇందు రవి లోచనం హిత దాస పదం
ము-కుందం యదు కులం గోప గోవిందం

రామ నామం యజ్ఞ రక్షణం లక్షణం
వామనం కామితం వాసు దేవం
శ్రీ మదావాసినం శ్రీ వెంకటేశ్వరం
శ్యామలం కోమలం శాంతమూర్తిం



2 కామెంట్‌లు:

Sai Brahmandam Gorti చెప్పారు...

హంసధ్వని రాగం ముత్తుస్వామి దీక్షితార్ ముందుకాలం నుండే వుంది. ఆయన కనుక్కున్న రాగమని ఎవరు చెప్పారు?
మీరు చెప్పిన త్యాగరాజ కృతి "అభీష్ట వరద" ఆయన పేరు మీద ఎవరోరాసి ప్రజల్లోకి నెట్టిన ప్రక్షిపమది.
ఆ కృతి త్యాగరాజు రాయలేదు. త్యాగరాజూ, దీక్షితార్లపై తప్పుడు సమాచారం అనాదిగా ప్రజల్లోకి నెట్టబడుతూనే వుంది.

మీకు దీక్షితార్ గురించి మరిన్ని వివరాలు కావాలంటే త్యాగరాజు పైన వచ్చిన ఈ క్రింది వ్యాస పరంపర చదవండి.


మొత్తం అయిదున్నాయి. మొదటి దాని లింకే ఇస్తున్నాను.సంగీతాభిమానులు కాబట్టి వీలయితే చదవండి.


http://www.eemaata.com/em/issues/200809/1337.html

బ్రహ్మానందం

kadambari చెప్పారు...

శాయి బ్రహ్మానందం గొర్తి గారికి,
నమస్కారములు. మీరు నా రచన(ల )ను చదువుతూన్నందుకు,
నాకు చాలా సంతోషము కలిగినది.
మీ రచనలను 4 years నుండి చదువుతున్నాను.
మీ రచనలు నిర్ద్వంద్వంగా ఎంతో విలువైనవి .

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

సంగీతము పట్ల నాకు ఎంతో భక్తి కలదు;అంతే కానీ, "సంగీత పాండిత్యము నాకు ఎక్కువ లేదు.
నన్ను ఆకర్షించిన అంశాలను( అంటే అందరికీ ఇదివరలో తెలిసిన అంశాలనే , మరల) సంతోషంగా పంచుకునే అభిలాషతో మాత్రమే రాస్తున్నాను.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

“హంసధ్వని రాగమును” కనిపెట్టిన వ్యక్తి ,
నిజానికి ముత్తుస్వామి తండ్రి శ్రీ రామస్వామి దీక్షితులు కూడా కాదు;
ఆ మహనీయుడు “ చతుర్దండి ప్రకాశిక”ను రచించిన వేంకట మఖి .
ఈ అమోఘ పండితుడు వెంకట వైద్యనాథ దీక్షితులు యొక్క పూర్వీకుడు . "
అని మూడు అంచెలలో వ్యాసీకృతము చేసినాను.
గమనించ వలసినదిగా కోరు చున్నాను.
Thank you very much.
please, give your valuable opinions on my other articles also.

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...