30, జనవరి 2011, ఆదివారం

తెనుగు లెంక తుమ్మల సీతారామ మూర్తికి స్ఫూర్తి











తెనుగు లెంక బిరుదాంకితులు,తుమ్మల సీతారామ మూర్తి
తన జీవిత ప్రయాణానికి ప్రేరణ ఇచ్చిన సంఘటనలను నెమరు వేసుకునేవారు.
తండ్రి - గొప్ప ధర్మ నిష్ఠా పరుడు.
అల నాడు, 19, 20 వ శతాబ్దాలలో సాహిత్యాన్ని
సరస్వతీ దేవికి ప్రతి రూపంగా భావించారు.
నాయన కూడా బీదరికం అనుభవించారు.
నిరు పేదగా గడుపుతూ కూడా నీతి నియమాలకు కట్టుబడి ఉండే వారు.
ఒక పర్యాయం ఆయన స్నేహితుడు,
10 వీశల బంగారాన్ని దాచి పెట్టుకున్నారు.
అటు పిమ్మట, ఊరు నుండి చ్చాడు వచ్చాడు అతను.
"నా బంగారాన్ని ఇవ్వండి." అని అడిగారు.
తండ్రి "నేను భద్ర పరచి ఇస్తున్నాను కదా,
కాబట్టి, నాకు కొంత ద్రవ్యమును ఇవ్వు." అని అడగ లేదు,
అడిగినదే తడవుగా, పది వీశల అపరంజినీ ఆ మిత్రునికి ఇచ్చేసారు.
ప్రతిఫలాపేక్ష లేకుండా, జీవించడమే
మానవ జీవిత పరమావధిగా ఆచరణలో చూపిన మహానుభావుడు ఆయన.
తన తండ్రి నుండి ఈ విశిష్ట వ్యక్తిత్వాన్ని వారసత్వంగా పుణికి పుచ్చుకున్నారు తుమ్మల.
సబర్మతీ ఆశ్రమంలో కొంత కాలం ఉన్నారు తెనుగు లెంక .
జాతి పిత జీవన విధానము ఆయనను చాలా ప్రభావితం చేసింది.
మహాత్మా గాంధీ ఆశయాల ఆచరణా కర్తవ్య బద్ధుడైన
తుమ్మల సీతా రామ మూర్తి చౌదరిని " మహాత్ముని ఆస్థాన కవి"అని
ప్రజలు, ప్రేమతో ప్రస్తుతించారు.
పనిలో పనిగా ఒక కవి మంచి పద్య గానాన్ని ఈ ఫొటోలో చదవండి.
















(See LINK) ;
శ్రీ తుమ్మల సీతారామమూర్తిగారు ఆధునిక కవులలో పేరెన్నిక గన్నవారు.
ఇతను 1901 లో జన్మించారు. 1990లో కాలధర్మం చెందారు.
తెలుగు రైతు కుటుంబంలో పుట్టిన యీయన ప్రముఖ గాంధేయవాది.
సబర్మతీ ఆశ్రమంలో కొంతకాలం గాంధీగారి శిష్యరికం చేసి,
మహాత్ముని జీవిత చరిత్రను ‘మహాత్మ కథ’ గా రచించారు.
అదే కాక ఆయన ‘ఆత్మార్పణ’, ‘ధర్మజ్యోతి’, ‘శబల’,
‘గీతాదర్శనం’, ‘సర్వోదయ గానం’, ‘ఉదయగానం’, ‘నేను’,
‘తెనుగునీతి’, ‘సమదర్శి’, ‘పైరపంట’, ‘పరిగపంట’, ‘రాష్ట్రగానం’
మొదలైన గ్రంథాలు ఎన్నో రచించారు.
అన్నిటిలో బాగా ప్రసిద్ధి పొందిన గ్రంథం ‘రాష్ట్రగానం’

స్ఫూర్తి;;
_______

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...