18, జులై 2010, ఆదివారం

మనిషి చేసిన అడవి


















ఇవాళ టి.వి. లో "వేడుక" అనే సినిమా వచ్చింది.
Jitender Y ఈ తెలుగు సినిమాకు దర్శకుడు.
"ఆనంద్"ఫేం 'రాజా' హీరోగా నటించిన ఈ picture - 31 May 2007న రిలీజ్ ఐంది.
ఇందులోవిలన్ "దంబుల్ల సుబ్బును నేను"అంటూ గర్జనలు చేస్తూంటాడు.
ఇంతకీ తమాషా ఏమిటంటే, నాకు " శ్రీ లంకలోని "దంబుల అభయారణ్యం" గుర్తుకు వచ్చినది.
ప్రపంచంలోనే తొలి మానవ నిర్మిత కృత్రిమ కాననము - గా ఇది చారిత్రక రికార్డును సాధించింది.
అందుకే, దంబుల్ల వనము గురించి కొన్ని వివరాలతో మన మాటా మంతీ !
[8 వ శతాబ్దిలో శ్రీ లంకలో అభివృద్ధి పరచ బడిన నామల్ ఉయన అనే అభయారణ్యం,
బొటనీ శాస్త్రజ్ఞుల గ్రంధాలలో చోటు చేసుకున్న పురాతన అభయారణ్యము
ఈ సంఘటనకు ఒక అపూర్వ చారిత్రక సంఘటన ప్రేరణగా, మూలాధారముగా నిలిచినది.
====================================
8 వ శతాబ్ది ప్రారంభంలో శ్రీలంకలో అభివృద్ధిపరచబడిన
"నామల్ ఉయన" అనే అభయారణ్యం ,
బొటనీ శాస్త్రజ్ఞుల గ్రంధాలలో చోటు చేసుకున్న పురాతన అభయారణ్యము
ఇది ఉష్ణ ప్రాంతాలలో ఇచ్చటనే "శీతల సీమల తరువు జాతి ఐనట్టి ".
దంబుల్లా అటవీ ప్రాంతంలో "తిస్సా" చక్రవర్తి జింకలను, సాధు జంతువులను, పక్ష్యాదులను వేటాడ సాగాడు.
అప్పుడు king Tissa" ను Arahat Mahinda's అనే బౌద్ధ బిక్షువు వారించాడు.
"మహారాజా! గాలిలో స్వేచ్ఛగా ఎగిరే విహంగాలకూ,
భూ మండలముపై సంచరించే జంతు జాలములకూ,
నీకు వలెనే జీవించే హక్కు ఉన్నది.
వానిని వధించకూడదు.
అవి ఈ సామ్రాజ్యంలో ఎక్కడైనా సరే! విహరించవచ్చును.
ఈ ధరణీతలములోని సమస్త జీవరాసులూ,
మనుషులతో సమానంగా బ్రతికే హక్కును కలిగిఉన్నవి.
వాటి అన్నిటికీ ప్రభువైన నువ్వు, సంరక్షకునిగా మాత్రమే వ్యవహరించాలి సుమా!"

చిత్రంగా మహాప్రభువు ఆ పలుకులను పెడచెవిని పెట్టకుండా,
వినయంగా అంగీకరించాడు.
ఆ అటవీసీమలను, అంటు తొక్కి, నాటిన మొక్కలను,
ప్రజలు ప్రత్యేక శ్రద్ధా భక్తులతో, అభయారణ్యంగా ఇను మిక్కిలిగా పెంచారు.
గౌతమ బుద్ధుని ప్రవచనములు ప్రజలను అంతగా ప్రభావితం చేసాయి;
అందరినీ ప్రకృతి ప్రేమికులుగా, శాంత మూర్తులుగా తీర్చిదిద్దాయి.
రాజులకూ, సైనికులకూ అక్కడ నివాసాలు ఏర్పరచుకున్న బౌద్ధ బిక్షుకులు ఆతిథ్యం ఒసగేవారు.
అందువలన విశ్రాంతి కుటీరములుగా విలసిల్లినవి.

King Devanampiya Tissa (307-267 B.C);
Mesua ferrea ; Dambulla forest ;;;;;;;
"గల్కిరియాగమ"అనే ప్రాంతాన్ని
"నామాల్ ఉయన అభయారణ్యము"
ప్రాచీనతతో, ప్రాకృతిక పరి రక్షణా కవచంగా వ్యాపించి,హరితదనంతో
శ్రీలంక దేశానికే గర్వ కారణంగా విలసిల్లుతూన్న్నది.
కనుకనే 2005 ,మే 8 వ తేదీన - Prime Minister Mahinda Rajapaksa
"జాతీయ రక్షిత అరణ్య సంపద"గా (a National Forest Reserve.)ప్రకటించాడు .
ప్రపంచ వింతలను, ఆధునీకరించే ఆలోచనతో చేసిన ప్రయత్నంలో ,
ఈ దంబుళ్ళ అభయారణ్యము, తొలి విడత జాబితాలో చేర్చగా, ప్రజలకు ఆనందం కలిగింది.

Wow - Wonders Of The World

మనిషి చేసిన అడవి ;

By kadambari piduri,
Feb 5 2010 2:30AM

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...