2, జులై 2009, గురువారం

అరవై లక్షల గుర్రం స్వారీ!


ఐశ్వర్యా రాయ్ 1972 లో (మంగుళూరు వద్ద)జన్మించినది.ఆమె 1974 లో "ప్రపంచ సుందరి"గా ఎన్నిక అవడము భారతీయులకు ఎంతో గర్వ కారణమైనది.మణి రత్నం 1996 లో నిర్మించిన"ఇరువర్"అనే తమిళ సినిమాతో సినీ రంగంలోనికి అరంగేట్రం చేసింది.ఈ సినిమాయే తెలుగులో డబ్బింగు చేయ బడిన "ఇద్దరు".అలాగే "ఐష్ హీరోయిన్‌గా ఉన్నట్టి "జీన్స్"భారతీయ సినిమాలకు ఒక కొత్త ఒరవడిని సృష్టించినది.ఈ సినిమాలో ఐశ్వర్యా రాయ్ నటించిన యుగళ గీతము ,ఏడు ప్రపంచ వింతలు వద్ద చిత్రీకర జరగడం ఒక రికార్డు.ఈ సినిమా 1997 లో విడుదలైనది.తెలుగులో,నాగార్జున నటించిన "రావోయి చంద మామా"లో ఈమె నటించినది.హిందీ వెండి తెరకూ రాణి అయ్యి,అమితాభ్ బచన్,జయ బాధురి ల కోడలు అయి,అభిషేక్ బచ్చన్ ఇల్లాలు అయిన అద్వితీయ సౌందర్య రాశి ఐశ్వర్యా రాయ్,సారీ!ఐశ్వర్యా బచన్.

అరవై లక్షల గుర్రం స్వారీ!,

కండు కొండేన్-కండు కోండేన్అనే సినిమా షూటింగు నిమిత్తమై, ప్రఖ్యాత హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ యూరోప్ కు వెళ్ళింది. బ్రిటన్ షూటింగులో ఆ అందాల రాణి ఐశ్వర్యా రాయ్ పాల్గొన్నది. అప్పుడు ఆమెకు అపురూప సంఘటన తటస్థ పడింది.స్కాట్లండు రాణి మాత్రమే స్వారీ చేసే గుర్రం పై కూర్చుని స్వారీ చేసే అవకాశం ఐశ్వర్యాకు లభించింది. "ఆఫ్ట్రాల్!గుఱ్ఱమే కదా!" అని పెదవి విరవకండి. ఆ అశ్వరాజం గారి ధర అక్షరాలా రూ.60 లక్షల పైనే! అంతే కాదండీ! సాక్షాత్తూ రాణీ గారే స్వయంగా మన భారతీయ సినీ ప్రపంచపు మహా రాజ్ఞి ఐన ఐశ్వర్యా రాయ్ కి భోజన, ఆదరువులను వడ్డించింది కూడాను. ఈ సందర్భాన్ని పూస గుచ్చినట్లు చెప్పింది ఆ తేనె కళ్ళ సౌందర్య రాశి.

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...