9, జులై 2009, గురువారం

చెప్పులకు పూజ

"స్వాతంత్ర్య పోరాటము" అంటేనే ఉద్విగ్నభరిత సంఘటనలకు ఆలవాలమైన

వాతావరణమును ఆవిష్కరించుకున్నట్టి చారిత్రక యవనిక.

త్రిలింగ దేశములో అనగా నేటి మన తెలుగుదేశములో

కాశీనాధుని నాగేశ్వరరావుగారు, టంగుటూరి ప్రకాశంపంతులుగారు, దుగ్గిరాల సీతారామయ్యగారు, కొండా వెంకటప్పయ్యగారు, దుర్గాబాయి్ దేశ్ ముఖ్ గారు, మున్నగు దేశభక్తులు ఎందరో ఉద్యమించారు.

"భారతమాత"ను కించపరిచే ఎంత చిన్న సంఘటననైనా ప్రజలను ఎంతో ప్రభావితం చేసేది.

"లాయిడ్" అనే ఆంగ్లేయుడు లెక్చరర్గా పని చేసేవాడు.

అతడికి హిందువుల సాంప్రదాయాలు మూఢనమ్మకాలుగా కనిపించేవి. భారతీయులు అందరూ అతడి దృష్టిలో పరమ ఛాందసులు.

"మీరు రాతి బొమ్మలకు పూజలు చేస్తారు. ప్రతి వాటినీ 'దేవుళ్ళు'గా భావిస్తూ పూజిస్తున్నారు. అదీ ఒక పూజయేనా? అంతకంటె నా కాలిచెప్పుకు పూజ చేయండి.............".

ఈ మాటలు అందరికీ తెలిసింది. ఇంకేమున్నది? క్షణాల్లో జనులలో ఆవేశం ఉప్పొంగినది.విద్యార్ధులందరూ స్ట్రైకు చేసారు. కొండా వెంకటప్పయ్య నాయకత్వం వహించగా కాశీనాధుని నాగేశ్వరరావు ఆయనకు కుడిభుజంగా నిలిచారు. వరుసగా పదకొండు రోజులు స్ట్రైకు జరిగింది.అటు పిమ్మట రాజీ కుదిరింది.

కొస మెరుపు

------------

ఆ ఇద్దరు నాయక శిఖామణులను అధికారులు కాలేజీ నుండి ఇళ్ళకు పంపించి వేసారు.

Pramukhula Haasyam

(By kadambari piduri)

కామెంట్‌లు లేవు:

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...