29, మార్చి 2014, శనివారం

బ్లాంక్ చెక్ - వంద రూపాయలు

సమాజములోని అన్ని వర్గాలవారితో శరత్ చంద్ర చటోపాధ్యాయ్ స్నేహంగా మెలిగాడు. దేశబంధు చిత్తరంజన్ దాసు శరత్ బాబు సన్నిహితులలో ఒకరు. ఆయన పాలిటిక్సు పరంగా ప్రఖ్యాతి గాంచాడు.అయితే స్నేహ హస్తమును చాచిన సందర్భాలు ఇక్కడ- అనగా శరత్ చంద్ర జీవితగాథలో మనకు అగుపిస్తాడు. 
'శరత్ చంద్ర చటోపాధ్యాయ్ నాస్తికుడు' అనే జనాభిప్రాయము విస్తృతముగా ఉంది.

ఒకసారి దేశబంధు చిత్తరంజన్ దాసు శరత్ బాబుకు రాధాకృష్ణుల ప్రతిమను బహూకరించాడు. ఆ విగ్రహాన్ని శరత్ చంద్రుడు బహు భద్రంగా అట్టిపెట్టుకున్నాడు. అంతే కాదు! ఆ రాధాక్రిష్ణ విగ్రహమునకూ నిత్యమూ అర్చనలు చేసేవాడు. దేశబంధు చిత్తరంజన్ దాసు స్వాతంత్ర్య సమర కాలమున సర్వ విదితుడు. ఆయన భోగి, త్యాగి, యోగి కూడా! కొద్దిమంది మాత్రమే ఆతనిని కథకుడు, రచయితగా గుర్తెరిగి ఉన్నారు. "సాగర సంగీత్" (Sagar sangeeth) అనేగ్రంథాన్ని దేశబంధు చిత్తరంజన్ దాసు రచించారు. ఆయన ఒక పత్రికను నెలకొల్పారు కూడా. "నారాయణ" అనే ఆ పత్రిక అధిపతిగా దేశబంధు చిత్తరంజన్ దాసు అనేక బాధ్యతలను నిర్విరామముగా నిర్వర్తించేవారు.

"మా పత్రికకు ఒక కథను పంపించండి" అంటూ శరత్ చంద్ర చటోపాధ్యాయ్ ను కోరారు. దేశబంధు చిత్తరంజన్ దాసు కోరికపై శరత్ చంద్ర రాసి పంపించిన కథ పేరు "స్వామి"("swami"). 
ఆ కథను చదివిన చిత్తరంజన్ దాసు అమందానందకందళిత హృదయుడే ఐనాడు. 
ఆయన శరత్ చంద్ర చటోపాధ్యాయ్ కి ఒక "బ్లాంక్ చెక్" ను పంపించాడు. చెక్కుతో పాటు ఒక ఉత్తరమును రాసి పంపించాడు - "మహోన్నతమైన ఒక రచయిత నుండి ఒక గొప్ప కథను నేనీనాడు సంపాదించాను. 
చిత్తరంజన్ దాస్దాని విలువ కట్టే సాహసమును చేయలేను. అందుచేత ఈ ఖాళీ చెక్కును మీకు పంపిస్తున్నాను. మీ రచనకు మీ ఇష్టం వచ్చినంత మొత్తమును వేసుకుని మార్చుకొనవచ్చును."

శరత్ బాబు తనకు తోచినంత ధనాన్ని, ఎంత డబ్బునైనా- చెక్కులో రాసి, తీసుకోగల అద్భుత అవకాశం అది. ఎందుకంటే చిత్తరంజన్ దాసు పత్రికాధిపతి మాత్రమే కాదు, ఆ దేశబంధు- రెండు చేతులా ఇబ్బడిముబ్బడిగా ఆర్జిస్తూన్న వకీలు కూడా! ప్రఖ్యాతి గాంచిన లాయరు అతడు. కానీ శరత్ చంద్ర చటోపాధ్యాయ్ కేవలము నూరు రూపాయలకు మాత్రమే చిత్తరంజన్ దాసు ఇచ్చిన చెక్కుతో మార్చుకున్నాడు.

అటు దేశబంధు చిత్తరంజన్ దాసు, ఇటు శరత్ చంద్ర ఛటోపాధ్యాయల సంస్కార, అనుబంధాలకు ఎత్తి పట్టిన మణి దర్పణము ఈ సంఘటన.

@@@@@

(Sarat chandra Chatopadhyaya (15 sept 1876 - 16 Jan 1938) 

బ్లాంక్ చెక్ - వంద రూపాయలు  
(Link- new awa, web Magazine)
User Rating:  / 2 
Member Categories  - తెలుసా!
Written by kadambari piduri
Saturday, 15 March 2014 16:33
Hits: 206
{55342- }

11, మార్చి 2014, మంగళవారం

విశ్వనాథుని "త్రిలింగాలు"!

“త్రిలింగ విద్యా పీఠము” విజయవాడలో సాహిత్యకార్యక్రమాలను నిర్వహించే సంస్థ. 
ఆ సంస్థ ప్రోగ్రాములకై ఆర్ధిక సహకారమును అందించే వదాన్యులు చుండూరు వెంకట రెడ్డిగారు. అలాగే పాలనాది నిర్వహణలను ఎప్పటికప్పుడు పరిశీలించే కార్యదర్శి – కాంచనపల్లి కనకాంబ గారు. దండు సుబ్బావధానిగారు విద్యా బోధన చేసే ప్రధాన ఆచార్యులు. అక్కడ విద్యా విషయిక అంశాల ప్రధానాచార్య ఉపాధ్యాయులు. కార్యక్రమాలకు, పాల్గొన వలసిన వారికి, అతిధులకు త్రిలింగ సమాజ సభ్యులు ఇన్విటేషన్సును పంపించే వారు. ఒకసారి- త్రిలింగ విద్యా పీఠము సంస్థ తరఫున కవిసమ్మేళనమునకు దండు సుబ్బావధానిగారు కూడా ఆహ్వాన పత్రికలను పోస్టు చేసారు. ఐతే చిన్న పొరపాటు, ఎక్కడో ఏదో పొరపాటు వలన జరిగింది. అదేమిటంటే – ఒక ఉద్ధండ పండితునికి అసలు లేఖ వేయడమే మరిచారు ఆయనే కవి సామ్రాట్ బిరుదాంకితులు జగమెరిగిన పుంభావసరస్వతి శ్రీ విశ్వనాధ సత్యనారాయణ.

ఐనా సరే! సాహిత్య మమకారముతోటి పిలువని పేరంటానికి వెళ్ళారు విశ్వనాధ సత్యనారాయణ. అక్కడికి వచ్చిన విశ్వనాధ సత్యనారాయణగారిని చూసి, స్వాగతం పలికారు త్రిలింగ విద్యా పీఠము సభ్యులు.అసలే ముక్కు మీద కోపం విశ్వనాధ వారికి. సభ్యులకు ఇప్పటికీ జరిగిన పొరపాటును గురించిన గమనిక కలగలేదు. 
అందరూ ముందస్తుగా “శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారూ! మీరు ప్రసంగించండి.” అంటూ అడిగారు.

కనీసం సభా కార్యక్రమాలలో ఐనా తన నామాక్షరములు కలికానికైనా కనిపించ లేదు కదా! అవమానము వలన విశ్వనాధ ఆగ్రహంతో ఉక్కిరిబిక్కిరి ఔతూన్నారు. కవిసామ్రాట్ లేచి నిలబడ్డారు. మైకు దగ్గర నిలబడ్డారు, అటూ ఇటూ చూసారు. అంత రౌద్రంలోనూ పాండితీ ప్రకర్ష బాణసంచాలా రవ్వలను విరజిమ్మింది. 
“ఇది త్రిలింగ విద్యా పీఠం….”అన్నారు. ఆనక తారాజువ్వల్లా రెండే వాక్యాలను తన వాక్కులలో వేసారు ముక్తసరిగా. ఈ చుండూరు వెంకట రెడ్డి పుంలింగం, కాంచనపల్లి కనకాంబ స్త్రీ లింగం, దండు సుబ్బావధాని నపుంసక లింగం.”అని క్లుప్తంగా అనేసి గబ గబా వెళ్ళి రుసరుసలతో వెళ్ళి కుర్చీలో కూర్చున్నారు.

శ్రోతలు అవాక్కయ్యారు. కొన్ని సెకండ్లు సభలో నిర్ఘాంత పడిన ప్రేక్షకుల మౌనంతో వాతావరణం కొన్ని లిప్తలసేపు నిండిపోయింది. ఆ తర్వాత సభాసదులందరికీ కవి సామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ వాక్కుల శ్లేషలోని హాస్యం సుబోధకం ఐంది. 
"అసలేమి జరిగిందో!" – అనుకుంటూ ఆహూతులు యావన్మంది నవ్వులతో పరిసరములు ప్రతిధ్వనించినవి. తర్వాత వాకబు చేసుకుని జరిగిన మిస్టేకుకు నాలిక కరుచుకున్నారు నిర్వాహక వర్గం వారు.

ఈ పట్టున కవి సామ్రాట్ వారి కోపాన్ని పూర్తిగా సమర్ధించలేము. 
ఎందుకంటే వ్యక్తిత్వములో అంతర్లీనంగా ఉండవలసిన అంశము ధృతి, ఆత్మ సంయమనం, ఆత్మ నిగ్రహము. శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు ఆర్ష ధర్మాన్ని అమితంగా ఆరాధించిన మహా మనీషి. ప్రాచీన సంస్కృతిని చాటే భావజాలము ఆయన రచనలకు పునాదులుగా నిలిచిన దోహదములు. మరి చిన్న విషయాలకు ఆగ్రహముతో ప్రతిబింబించే ప్రవర్తన ఏమంత సంభావ్యం కాదు. ఆ సభను ఏర్పాటు చేయడానికి నిర్వాహకులు ఎంత కష్టపడి ఉంటారు?- అనే కోణంలో ఆలోచించవలసిన వ్యక్తి ఆయన.

ఏదెలాగున్నా అనన్య ప్రజ్ఞా ధురీణులు శ్రీ విశ్వనాధ సత్యనారాయణ. పాండితీ ప్రకర్షకు మారుపేరు ఆయన. ప్రతి సందర్భములోనూ కవి సామ్రాట్ ఈ రీతిగా రియాక్టు అవడము వలన - సాహితీ బృందావనాన అగణిత చమత్కార పారిజాతాలు విరబూసినవి.
కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ; (సెప్టెంబర్ 10, 1895- 18 అక్టోబర్ 1976)

@@@@@


1
విశ్వనాథుని "త్రిలింగాలు"!  (Link for Essay- web mag- NewAwa)
User Rating:  / 3 
Member Categories - ప్రముఖుల హాస్యం
Written by kadambari piduri
Thursday, 20 February 2014 04:43
Hits: 197

*********@@@@@*************,

55155 wieus; కోణమానిని; 
Another Essay, in my Blog "Konamanini 2009 April" (Link) 

నందమూరు (ఉంగుటూరు) ;శోభనాద్రి;విశ్వనాథ సత్యనారాయణ 

24 ఎప్రిల్ 2009 శుక్రవారం

24, ఫిబ్రవరి 2014, సోమవారం

“రఘుపతి రాఘవ రాజా రామ్" ( “రామ్ ధున్” ) బాణీ కట్టిందెవరు?

ప్రఖ్యాత గీతం “రఘుపతి రాఘవ రాజా రామ్” కు సంగీతబాణీ కట్టినది ఎవరో తెలుసా?

ఆయనే ప్రఖ్యాత పండిట్ విష్ణు దిగంబర్ పలూస్కర్. 
విష్ణు దిగంబర్ పలూస్కర్ గారికి లోకమాన్య తిలక్,మహాత్మా గాంధీజి మొదలైన ప్రముఖులతో సాన్నిహిత్యం ఉండేది. 
“రామ్ ధున్” మహాత్మా గాంధీకి చాలా ఇష్టమైన పాట.

సత్యాగ్రహ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతూన్న రోజులు అవి. 
దండి ఉప్పు సత్యాగ్రహం (Dandi March) సమయాలలో “రఘుపతి రాఘవ రాజా రామ్ ”ఈ పాటను అందరూ పాడేవారు. ప్రధానంగా భక్తి కీర్తనలు ఆలపించే విష్ణు పలూస్కర్ ఈ గీతమునకు ట్యూన్ ని కట్టాడు. 
జాతిపిత పండిట్ విష్ణు దిగంబర్ప లూస్కర్ కి రాగమును కూర్చమని- విష్ణు దిగంబర్ పలూస్కర్ కి చెప్పారు. విష్ణు దిగంబర్ పలూస్కర్ అమితానందంతో ఆ మహత్తర బాధ్యతను స్వీకరించారు. 

1907 లో లాలా లజపతి రాయ్ అరెస్టు ఐనప్పుడు విష్ణు దిగంబర్ పలూస్కర్ “పగ్రీ సంభాల్ జట్టా" అనే గీతమునకు సంగీత బాణీలను కట్టి, పాడారు. పండిట్ విష్ణు సమకూర్చిన బాణీలతో ఆ దేశభక్తి గీతాలు- ఉద్యమకారులలో ఉత్సాహ ఉద్వేగములు ఉవ్వెత్తున ఎగసిపడ్తూ పరవళ్ళు తొక్కించేవి.

**********

విష్ణు దిగంబర్ పలూస్కర్ (1872-1931)”సంగీత భాస్కరుడు”. 
విష్ణు దిగంబర్ పలూస్కర్ ప్రాచీన భక్తి గీతములను తీసుకుని, సాంప్రదాయిక స్వరములను కూర్చుటలో సిద్ధహస్తుడు. 
“వందేమాతరం” గీతమును పండిట్ విష్ణు దిగంబర్ పలూస్కర్ బాణీ కూర్చిన తర్వాత, 
“ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగులు”లో దేశభక్తి గీతముగా 
“వందేమాతరం…..” ను ఆలపించుట సంప్రదాయముగా ఏర్పడినది.

**********

మీరజ్ సీమ రాజు విష్ణు దిగంబర్ పలూస్కర్ లో సంగీత ప్రతిభ ఉన్నదని 
ఈతని 12 ఏళ్ళ వయసులోనే గుర్తించిన వ్యక్తి ; బాలక్రిష్ణ బువా పండితునికి “ఈ బాలునికి సంగీతము నేర్పమని” అప్పగించారు. 
బాలక్రిష్ణ బువా పండితుని వద్ద విష్ణు దిగంబర్ పలూస్కర్ సంగీత విద్యకు శ్రీకారము చుట్టబడినది.

***********

సంగీతమును ప్రజలకు హృదయంకిము అయ్యేలాగా, అందరికీ చేరువలోకి తెచ్చాడు శ్రీ పండిట్ విష్ణు దిగంబర్ పలూస్కర్. అప్పటిదాకా చక్రవర్తుల పోషణలో ఉన్నతశిఖరములను చేరిన కళలు- ప్రజాస్వామ్య యుగములో- ప్రజలకు చేరువ అవ్వాల్సిన అవసరం కలిగినది. 
హిందూస్థానీ సంగీతమును జనుల మానస సరోవరములలో విరబూసే సహస్రదళ పద్మములా విరబూయించిన ఘనత పండిట్ విష్ణు దిగంబర్ పలూస్కర్ దే! 
పండిట్ విష్ణు దిగంబర్ పలూస్కర్ సాంప్రదాయ హిందూస్థానీ, ఘరానా రీతులు ఇత్యాదులు- పండితులకే పరిమితమవకుండా, పామరులకు సైతం అందుబాటులోకి తేగలిగాడు. ఇందుకు ఆయన స్థాపించిన “గాంధర్వ మహావిద్యాలయ” తొలి కాంచన సోపానమైనది. 
ఆయన శిష్య ప్రశిష్యులు ఎందరివో నిష్కామ సేవలు, నిస్సందేహంగా ఈ రంగంలోని మూలస్థంభాలు.

వినాయకరావు పట్వర్ధన్, ఓంకామఠ్ ఠాగూర్, నారయణరావు వ్యాస్, శంకర్ రావ్ వ్యాస్, బి.ఆర్. డియోధర్ మున్నగువారు- పండిట్ విష్ణు దిగంబర్ పలూస్కర్ యొక్క శిష్యులై, హిందుస్థానీ ; సాంప్రదాయ సంగీతమును ప్రజలకు కరతలామలకం చేసారు. 
సంగీతప్రపంచములో అనర్ఘ రత్నములైన ఇట్టివారు- కళామతల్లికి చేసిన పూజలు తరువాతి తరముల వారికి లభించిన గొప్ప వరములైనవి. 
ఆబాలగోపాలమూ సంగీత కళను ఆప్యాయతతో అభ్యసించే మేలిమి మలుపు ఏర్పడినది.

**********

పండిట్ విష్ణు దిగంబర్ పలూస్కర్ కుమారుడు “దత్తాత్రేయ విష్ణు పలూస్కర్” తన తండ్రి ఆశయాలను ఆచరిస్తూ, సంగీత ఉద్యమమును కొనసాగించిన ధన్యజీవి. 
పండిట్ విష్ణు దిగంబర్ పలూస్కర్ రచించిన “సంగీత్ బాల్ ప్రకాశ్” 3 వాల్యూములు, రాగములను గూర్చి వెలువరించిన 18 భాగములు సంగీతప్రపంచములో అనర్ఘ రత్నములు.

(రచన: కోణ మానిని)
**********

“రఘుపతి రాఘవ రాజా రామ్" 
బాణీ కట్టిందెవరు? (లింక్- New Awa - Web Magazine) 
Print Email User Rating:  / 2 
Member Categories - తెలుసా!
Written by kusuma kumari
Thursday, 13 February 2014 10:41
Hits: 200
Image: gajananbuwajoshi.com
IMAGE: GAJANANBUWAJOSHI.COM

12, ఫిబ్రవరి 2014, బుధవారం

కాళికాంబా సప్తశతి

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి "కాళికాంబా సప్తశతి".
“ముడుమాల” ఒక మారుమూల పల్లెటూరు. 
ఐతే ఆ చిన్ని కుగ్రామం గొప్ప అదృష్టం చేసుకున్నదనే చెప్పాలి. 
ముడుమాలలో ఉన్నది “సిద్ధప్ప మఠము”. 
ముడుమాల లో అపూర్వ తాళపత్ర గ్రంథములు కొన్ని ఉన్నవి. 
“కాళికాంబా సప్తశతి” అట్టి మహత్తర గ్రంథము.

కడప జిల్లాలోని కందిమల్లయ్యపల్లె- ఈ పేరు చెవినబడగానే 
స్ఫురణకు వచ్చే పేరు “జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి”. 
శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారికి – సిద్ధప్ప అనే భక్తుడు శిష్యుడై తరించిన చోటు “కందిమల్లయ్యపల్లె”.

***************************,
“కాలజ్ఞానము” గురించి ఆంధ్రదేశములోని ఆబాలగోపాలమునకూ తెలుసును అంటే అతిశయోక్తి కాదు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వములు, గేయభణితి- ప్రజల నాలుకలపై ఆడుతూండేవి. 
“పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి” తత్వములను ఆశువులుగా చెప్పిన నుడువులు జనుల డెందములను భిత్తికలుగా చేసుకున్నవి. 
భవిష్యత్ కాలమున ఈ ప్రపంచ వేదికలో రాబోతూన్న అనేక మార్పులను గూర్చి వాక్రుచ్చిన దీర్ఘ దర్శి ఆయన.
*******************,

చరిత్రలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, కాలజ్ఞానము రచయితగా ప్రసిద్ధి కెక్కారు. ఐతే వీరబ్రహ్మేంద్ర స్వామి విరచిత గ్రంథము ఇంకొకటి సైతం ఉన్నది. “కాళికాంబా సప్తశతి” అనే పద్యసంపుటి- జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఘంటము నుండి విస్తృతమై ఉన్నది. 700 చిట్టి పద్దెముల పొత్తము – అని పేరును బట్టే బోధ పడ్తూన్నది. 
సి.పి. బ్రౌన్ గారు పూనిక చేతనే ఈ కాలజ్ఞానము భద్రపరచబడి, ఈ నాటికి మనకు లభించినవి.

***************************,

“కాళికాంబాసప్తశతి” లో అనేక అంశాలు అనుకోకుండ పరిశీలనలోనికి వస్తూ ఉన్నవి. జగద్గురు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, వేమన- సమకాలీనులే! అందుచేతనే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు – వేమనను గూర్చి, తన పద్యాల్లో తలిచి, మెచ్చుకున్నారు కూడా;

    “వేదవిద్యలెల్ల బాధాకరమ్ములు;
    ఎంగిలింత మ్రింగ హేమమాయె;
    హేమమైన బ్రహ్మ వేమన్న ఒక్కడే!…………. .” {59} 

ఈ రీతిలో బ్రహ్మం గారు రచనాపరంగా ఎలాంటి భేషజాలు లేని నిగర్వి- అనే విశేషం పాఠకులను ఆశ్చర్య చకితులను చేస్తుంది.
*******************,

ఇద్దరు కవులకు ; సంఘ సంస్కరణ ముఖ్య గమ్యం. ప్రాథమికముగా వీరు ఇరువురూ మూఢాచారములను నిరసించినారు. తమ నిరసనలను తెలిపే వారధికి వలె -వాక్కు లనూ, పద్యరచనలనూ ఉపయోగించారు. వేమనకు వలెనే “ఆటవెలది” ఛందస్సులో రచన చేసారు. ఇద్దరూ “అచలయోగులు, స్వరయోగులు”. వేమన మూఢాచారాల్ని తీవ్రంగా దూషించాడు. జగద్గురు శ్రీశ్రీశ్రీ శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా అంతే, కానీ, ఆయన తత్వములను బోధించే ‘యోగిపుంగవుని’గా ప్రసిద్ధికెక్కాడు.

*******************,

జ్ఞాన నేత్రమునకు యోగశాస్త్రములో అగ్రస్థానం ఉన్నది. ఇడ, పింగళ, సుషుమ్న – అనే మూడు నాడులు ప్రథమ గణ్యాలైనవి. ఆ త్రయాన – భ్రుకుటీ స్థానం
(ఫాలము, కనుబొమ్మల నడుమ, అనగా బొట్టు పెట్టుకునే ప్రాంతాన ఆజ్ఞాచక్రము ఉన్నది. ఆజ్ఞాచక్రము తెరుచుకుంటే అపారమైన కాంతి, తేజో పారావారము గోచరము ఔతుంది.

    “మూర్తి రూపురేఖ భ్రూమధ్యమున నిల్ప;
    దివ్యమైన వెలుగు తేజరిల్లు;
    మూర్తి లేని రాయి ముఖ్యమ్ము గాబోదు
    కాళికాంబ! హంస! కాళికాంబ!” {77} 

కొన్ని చోట్ల వేమనకూ, బ్రహ్మం గారికీ కొన్ని కొన్ని భావాలలో విభిన్నత కనిపిస్తుంది.

*******************

యోగము, ప్రాణాయామము, నిష్ఠ, క్రమశిక్షణలలో గొప్ప పట్టు కలిగిన సాధువు వీరబ్రహ్మేంద్ర స్వామి.
“కాళికాంబా సప్తశతి” లో ఉపబలకములు ఐన నుడువులు అగుపిస్తూన్నవి.
“కండ, కుండలించి; కుండలి నాడించి; జమిలి మోత నాగసరము నూద ..”
“దృష్టి మధ్యమందు; దేవుడెప్పుడు నుండు; కష్టమేమి లేక కాంచ వచ్చు ;తుష్టి గూర్చి గురుడు తోవలు చూపించు: కాళికాంబ! హంస! కాళికాంబ!”

*******************,
“రాజయోగము” అనే సిద్ధాంతము (మౌంట్ ఆబూ) ఆ నాటికే నాటుకున్నదని 361 పద్యమువలన తెలుస్తున్నది.

    “సాంఖ్యయోగములను సాధింపవచ్చును:
    బ్రహ్మపదము చేరవచ్చు దాన:
    రాజయోగులకును రాచబాటది కదా!
    కాళికాంబ! హంస! కాళికాంబ!” {361}

    “నాద,బిందు,కళల నయముగ గుర్తించి;
    వాద భేదములను వంచి గురుడు;
    సమయజేయు దేహ సందేహ దాహమ్ము
    కాళికాంబ! హంస! కాళికాంబ!” (91)

    “తన్ను తా గ్రహింప తారకయోగమౌ:
    రాయి కొయ్య గొలువ- రాదు ముక్తి; …
    కాళికాంబ! హంస! కాళికాంబ!” (112)

*******************
“భారతీయుడు” – పద ప్రయోగము:-

“భారతీయుడు” అనే పదవ్యుత్పత్తి ఏనాటి నుంచి ప్రయోగములో ఉన్నదో – అనే అంశముపై- భాషా, చారిత్రకుల మీమాంసలు ఉన్నవి. 298 లో ఈ పదప్రయోగం ఉంది.

“మంత్ర తంత్ర యంత్ర మాహాత్మ్య గాథలు:
భారతీయులకును- భారమాయె: …”

ప్రపంచములోని ఇతర మతాలలోనూ, ఇతర సంఘాలలోనూ – ఇన్ని కట్టుబాట్లూ- మూఢనమ్మకములూ- తద్వారా ఏర్పడిన- మనకు గోచరించుట లేదు. అలాటి ఆచారములు, సాధారణప్రజల నిత్యజీవన వ్యవహారములకు పెను అడ్డంకిలు ఐనవనీ-అలాటి విపరిణామాలను గుర్తించిన మహనీయుడు పోతులూరి. ఈ పైన ఉదహరించిన పద్యంతో పాటు అనేక సోదాహరణములు ఉన్నవి.

    “మంత్ర తంత్ర యంత్ర మాహాత్మ్య గాథలు:
    భారతీయులకును భారమాయె: …”
    జనులపాలికివియె శాపనార్థము లాయె:
    కాళికాంబ! హంస! కాళికాంబ!”

    “తెట్ట గట్ట బూది, తిరుమణి, తిరుచూర్ణ;
    ములు మొగాన బూయ ముక్తి రాదు;
    చిత్తశుద్ధి లేని చేష్టలు దుష్టాలు;
    కాళికాంబ! హంస! కాళికాంబ!” (309)

    “తళుకుబెళుకు వస్త్రములు దాల్చువారలు;
    వ్రేళ్ళ నుంగరములు పెట్టువారు;
    వాని విలువ తప్ప వారికి వెల లేదు……” (364) 

*******************,
జగద్గురువు “యోగశాస్త్రము, ప్రాణాయామము, తపస్సు” లను అభిమానించి, సాధన చేసి వానిలో ప్రావీణ్యతలను సాధించారు. బ్రహ్మము, తేజస్సు, నాడులు, ఇత్యాది పదాలను అలవోకగా వాడగలిగారు.

    “మేళమెంతొ చేసి మెప్పులు గనెనయా:
    మేళజతలు పదియు మెఱపు నొకటి;
    పదిని మించి ఎంచ బ్రహ్మంబు లేదయా ….. ” (421)

    “ఎట్లు నిస్సరణమొ? (=ముక్తి)
    ఏమొకొ మహిమమ్ము? :
    శివుని మాయ యేమొ? చెప్పరాదు:
    అనుచు బ్రహ్మవిదులు కనుగొనిరా జ్యోతి ……” (428)

    “అడవిలోన గురుడు పడి యాకటం బడి;
    అడవి నెల్ల తినెదమంచు జూడ;
    పరికెలోన గచ్చపొదలు బలిసియున్నవి కదా! ……” (436) 

{పరికె= నాలుగు రోడ్ల కూడలి/ జంక్షన్/ శృంగాటకము}

    “కిటికి నుండి సూర్యకిరణమ్ము గను రీతి;
    ఆత్మలోన మోక్ష మరయవలయు:
    ఆత్మ యనెడి కిటికి కవి యెన్ని మూతలో
    కాళికాంబ! హంస! కాళికాంబ!” (441) 

********************,

మున్ముందు తాను రాసే “కాలజ్ఞానము” నకు పునాదులు ఐన తేట తేట ఆశు కవితలు ఇక్కడు గోచరిస్తున్నవి.

“ఆకసమ్ము పైన అంత శూన్యమ్మని;
పలుకు నరులకెల్ల బ్రహ్మ సాక్షి;
పిండమండమైన పృధివి బ్రహ్మాండమౌ; ………” (586);

*******************,
పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి సమాజపరముగా ఆటుపోట్లు, మిట్ట పల్లాలు చూసారు, కాళికాంబాసప్తశతి లో వానిని చిత్రించారు.

    “సెలవొసంగు టెట్టు లిల దేవుడైనాడు;
    సుకృతకర్మతోడ జూచె నన్ను;
    అజ్ఞతయును దీఱె నలజడులును మాఱె; …………..” (593) అన్నారు.

    “నాల్గుజాతులకును నాగేటి మొనలోన;
    ప్రాణమున్నదంచు పలికినారు;
    ఇలను దున్నువారు బలభద్రులగుదురు” (622)

    “ఉపనిషత్తులందు నుపదేశికులయందు;
    శ్రుతులయందు శ్రద్ధ చూపవలయు;
    శ్రద్ధ లేక ముక్తి సాధింప శక్యమా?” (649)

    “పుస్తకములు చదువ పూర్ణత్వమబ్బదు;
    హృదయసంపుటముల చదువవలయు;
    పారిశుధ్యమొకటె పరమాత్మ చేర్చును ………..” (658) 

*******************,

    “కన్నులకును పొరలు కడకు వీడితె కదా:
    జ్ఞానమనెడి జ్యోతి కానవచ్చు:
    కన్నులకును మాయ మబ్బు (=చీకటి)న వేసె; ……” (461)

    “మనసు బుద్ధులకును మరసీల గొన్నట్లు;
    గురుని పాదచింత గూడదాయె;
    ఎఱుకయనెడి సుత్తె నెగురగొట్టగవలె; ……… “(416)

    “గళమునందు నిలువ గాయత్రి మంత్రంబు;
    బడవ మాంత్రికులతొ గొడవ యేల?;
    సూత్రధారి ముక్తి చూపగా నోపడు;
    కాళికాంబ! హంస! కాళికాంబ!” (493)

****************************

    “మంత్రతంత్రములకు మాతృకామూర్తివి:
    పదములకును జ్ఞాన పథము నీవు;
    శూన్యజాలమునకు శూన్యసాక్షిణి నీవు:
    కాళికాంబ! హంస! కాళికాంబ!” (506)

    “సర్వశుభము లీయ శాంకరి వౌదువు;
    భవ్యవాక్కులీయ వాణివీవ;
    కోరుకుల నొసంగు నారాయణి నీవ:
    కాళికాంబ! హంస! కాళికాంబ!” (513)

    “ఈశు జూచి కూడ నిది’నిబద్దనలేరు (=నిజము);
    వాసి లేని యొడలు పాసిపోయె;
    మోసపోయి నరులు మూర్ఖులైపోయిరి;
    కాళికాంబ! హంస! కాళికాంబ!” (562)

    “మేకలెల్ల గూడి యాకు మేసెడి తావు;
    తోకచాలు, పిల్లమేక వచ్చు;
    అట్టి తీరు భక్తులా హరి వెనకుంద్రు; ….” (578)

    “ఆకసమ్ము పైన అంత శూన్యమ్మని;
    పలుకు నరులకెల్ల బ్రహ్మ సాక్షి;
    పిండమండమైన పృధివి బ్రహ్మాండమౌ;
    కాళికాంబ! హంస! కాళికాంబ!” (586) 

*********************************,

“కన్యాశుల్కం” లాంటి ఆధునిక రచనలలోనూ, 19- వ శతాబ్దము తర్వాత సామాజిక వాడుకలో ఉన్న పదాలు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వ్రాతలలో కనిపిస్తూన్నవి. “కులము గోత్రమంచు కూసెడి మలపల్ని….”; నాలిముచ్చుల్ని, పోకిరిసన్నాసులు; దగుల్బాజీ వాళ్ళ పోకడలను ఏకిపెట్టాడు.

“మతము మత్తుమందు గూర్చు మార్గమ్ము కారాదు…… “- (694 ప||) అని ఎలుగెత్తి ఘోషించాడు.

*******************,
కడప మాండలికములు:-

కడప మాండలికములు:- విరివిగా స్వామి ఘంటము నుండి ముగ్గులో చుక్కల లాగా చమక్ మంటూ తారసిల్లుతూన్నవి.

కిటికి; {పరికె= నాలుగు రోడ్ల కూడలి/ జంక్షన్/ శృంగాటకము;
మరసీల; గడె, సంతకాయ, గడె= గడియ; తొఱ్ఱి;తుఱగలి= వెలుతురు;హుకుము (=హుకుం);

************************************;


700 ఆటవెలదులు మణులై ఉన్న ఈ అమూల్య పుస్తకము పునర్ముద్రణలు వెలువడినవి.

“కాళికాంబా సప్తశతి”
పేజీలు 176
వెల: రు. 20-00
సర్వస్వామ్యాలు శ్రీవీరబ్రహ్మేంద్రస్వాములవారి మఠమునకు చెందినవి.


ప్రతులకు:
మేనేజరు,
శ్రీవీరబ్రహ్మేంద్రస్వాములవారి మఠం,
కంది మల్లయ్య పల్లె,
కడప జిల్లా – 516503 ఆంధ్రప్రదేశ్   
కాళికాంబా సప్తశతి ; 
More articles by అతిథి »
Written by: అతిథి
Tags: Articles by Kadambari, spotlight
potuluri

వ్యాసకర్త: కాదంబరి, konamanini

Essay: (Link: web magazine: Pustakam.net  
*********** 
VIEWS: 54921; 

31, డిసెంబర్ 2013, మంగళవారం

కేలండర్ తమాషాలు


క్రీస్తు శకము 1150 వర్షము హిందూ దేశ పంచాంగముల నిర్మాణములో మేలు బంతి. అప్పటిదాకా ప్రజలు అనుసరిస్తూన్న ఖగోళ జ్ఞాములలో- ఉన్న కొన్ని లోపాలను సరిదిద్దాడు భాస్కరాచార్యుడు. అధిక మాసమును, అలాగే లుప్త (శూన్య -మాసాలను ఏర్పరిచాడు. ఇందువల సంవత్సరమునకు నిర్ధారించిన రోజులు, నక్షత్రగమన గణనములూ ఒక కొలిక్కి వచ్చినవి. సంవత్సరమునకు 365. 258438 రోజులు- అని - ఘడియలూ, విఘడియలతో సహా నిర్మించగలిగాడు.

* * * * *

వెస్టర్న్ విజ్ఞానము ఫలితముగా కేలండరు ప్రజలకు అందుబాటులోనికి వచ్చింది. రోజువారీ దినచర్యలకూ, జీతభత్యాదుల గడువు వగైరాలు సకల పనులకు నేడు ఈ అంగ్రేజీ కేలండర్ ముఖ్య ఆధారమైనది. వారఫలాలనుఆట్టే నమ్మకున్నా- మొదటగా రాశి ఫలితములను ఓసారి చదివి, తతిమ్మా వార్తాది విశేషాలను పేజీలను పత్రికలను తిరగేస్తూ చదివే వాళ్ళు - పాఠకులలో గణించదగిన సంఖ్యలోనే ఉన్నారు. 

ద్వాదశ రాశుల పేర్లు ఇటు స్థానిక భాషలలో గానీ, అటు ఆంగ్లంలో గానీ ఏయే తేదీ మొదలై ఏయే తారీఖు వరకూ ఉంటాయో దాదాపు అధికశాతం మందికి తెలుసును. 


ప్రస్తుతం వాటినే పునః అవగాహనకై ఈ పట్టిక:-


Aries March 21 - April 19.
Taurus April 20 - May 20.
Gemini May 21 - June 21.
Cancer June 22 - July 22.
Leo - July 23 - August 22.
Virgo - August 23 - September September 22.
Libra - September 23 - October 22.
Scorpio - October 23 - November 21.
Sagittarius - November 22 - December 21.
Capricorn - December 22 - January 19.
Aquarius - January 20 - February 18.
Pisces - February 19 - March 20

* * * * *

1582 వ సంవత్సరం చరిత్రలో గుర్తుంచుకొనాల్సిన రోజు. ఎందుకంటే ఆనాడు 1582 ఫిబ్రవరి 24 తారీఖు - గ్రెగేరియన్ కేలండర్ ఆవిష్కరణ జరిగింది. అప్పటి దాకా "జూలియన్ కేలండరు" అమలులో ఉన్నది. "Juliyan Year " కాలమాన గణనములో చేసిన మార్పులతో కొత్తది ప్రజలకు అందుబాటులోనికి వచ్చినదే "గ్రెగేరియన్ కేలండర్".

ఆ మార్పులలో ఒకటి లీపు వత్సరము. ఇది హిందూ చాంద్రమానములోని అధిక మాసము, శూన్య మాసముల వంటిది. ప్రతి నాలుగు ఏళ్ళకు ఒకసారి "Leap year" వచ్చే రీతిగా మార్చారు. 

* * * * *

"నేపుల్స్" దక్షిణ ఇటలీ లో రేవు పట్టణము "నవ నగరము" అని ఈ మాటకు అర్ధము. గ్రీకు పదమైన "Neopolis" అనే మూల ధాతువు నుండి వచ్చినది "Naples". మెడిటరేనియన్ లోని ఈ కా పట్టణంలో ఒక డాక్టరు జన్మించాడు. అతని పేరు "అలౌసియస్ లిల్యుస్". ఈతని సలహాలు కేలండర్ విభాగమునకు నవ్య పరిణామాలను చేకూర్చినవి. 13 వ పోప్ "గ్రెగరీ", అలౌసియస్ లిల్యుస్ తో సలహా సంప్రదిపులు చేసాడు. అటు పిమ్మట వారిద్దరు కొత్త "కాలమాన పట్టిక"ను ప్రవేశపెట్టారు. అదే పోప్ గ్రెగరీ పేరుతో ప్రసిద్ధి చెందిన "గ్రెగేరియన్ కేలండర్".

* * * * *

గణితములో ఆసక్తి కలవారు ఇంగ్లీషు కేలండర్ మాదిరి తో అనేక ప్రయోగాలతో అనేక వింతలను సాధన చేస్తూ, సాధిస్తూ ఉంటారు. (Mr. India- అనే హిందీ సినిమాలో ఒకని పేరు 'కేలండర్'. "హవా హవాయీ ..... " పాటకు శ్రీదేవి చేసిన అద్భుత నాట్యము ఈ మూవీలోనిదే!) 
నేడు ప్రపంచవ్యాప్తంగా బహుళ వ్యాప్తిలో ఉండి అందరికీ ఆత్మీయమైనది ఇంగ్లీషు కేలండర్ యే కదా! 
so- మనం కొన్నిటిని రేఖామాత్రంగా చూద్దాము.

* * * * *

ఇంగ్లీషు కేలండర్ నాలుగు వందల ఏళ్ళకు ఒకసారి లీప్ సంవత్సరము తిరిగి ఆరంభం ఔతుంది. లీప్ సంవత్సరమునకు సంబంధించి అనేక విశేషాలు ఉన్నవి. ఐతే లీప్ సంవత్సరమునకు భిన్నమైన ఇతర ఏడాదులను గమనిస్తే కొన్ని తమాషాలు ద్యోతకం ఔతూన్నవి. ఈ జిజ్ఞాసలే కేలండర్ లోని అంకెలకు అనుయాయిలైన వారములు, నక్షత్రాలు ఇత్యాది విషయ సంగ్రహణలకు హేతువులు ఐనవి. 

అగణితమైన అంకెల గారడీల శోధనలకు ఆలంబనములు ఐనవి.

1) ఏ శతాబ్దమూ బుధ వారము, శుక్ర వారము , ఆది వారములతో ప్రారంభం అవదు. 
     అంటే తతిమ్మా- సోమ, మంగళ, గురు, శని వారములతో begin ఔతుందని అర్ధము.
2) అలాగే మంగళ , గురు, శని వారములతో ఏ శతాబ్దమూ కూడా ముగింపు అవదు.

3) లీప్ సంవత్సరము కానట్టి సంవత్సరములలో 
       ప్రతి సంవత్సరమూ ఒకే రోజున “వారము” తో నాంది, ముగింపులు అవుతూన్నవి. 
ఈ 2013 సంవత్సరం లీప్ వర్షము కాదు. అందుచేత 2013 కు ఇది వర్తించినదా? 
కాస్త ధ్యాస పెట్టి, పరిశీలించండి. 2013 జనవరిని ఒకసారి కేలండర్ 12 పేజీలను తిప్పి చూడండి.


2013 జనవరి 1 వ తేదీ రోజు – మంగళ వారం ఐనది {January 1 = Tues day & December 31 = Tues day}. ఇందాక చెప్పుకున్న షరతు ప్రకారం- డిసెంబర్ 31 వ తేదీ నాడు మంగళవారమే ఐనది.

అలాగే 2014 January- 1 - Wednesday ఐనది. 
అలాటప్పుడు December 31 నాడు ఏ వారం ఔతుందో గుర్తించారు కదూ! 
ఔను, కరెక్టే!  అది బుధవారమే ఔతున్నది.

* * * * *

ఇలాగ లెక్కలేనన్ని సంఖ్యల తమాషాలు- కేలండర్ పున్నెమా అని గణిత జిజ్ఞాసులకు లభిస్తూనే ఉన్నవి.



అందరికీ నూతన వత్సర శుభాకాంక్షలు. 

2014 Wish you Happy New Year. 

******************

కేలండర్ విశేషాలు (Link web mag: New Awa)  

User Rating:  / 2 
Member Categories  - తెలుసా!
Written by kusuma kumari
 Friday, 13 December 2013 09:16

Hits: 76
వ్యాసకర్త: కాదంబరి, konamanini 

( By: కోణమానిని )

24, డిసెంబర్ 2013, మంగళవారం

చర్చిలలో వింత శిల్పం - మూడు కుందేళ్ళు; క్రిస్మస్


పౌర్ణమినాడు జాబిల్లిని పరీక్షగా చేస్తే అక్కడ పేదరాశి పెద్దమ్మ కూర్చుని 
అట్లు పోస్తూ ఉంటుంది. మన ఇండియాలో ఈ కవితాత్మకమైన ఊహ “పేదరాశిపెద్దమ్మ కథలు” కు పునాది వేసింది. (ఈ పేరుతో నిర్మలమ్మ నటించిన సినిమా కూడా హిట్ ఐనది).

పాశ్చాత్య దేశాలలోమధ్య యుగములలో “మూడు కుందేళ్ళు బొమ్మ/ శిల్పము"   (Three Hares ) ఎంతో ప్రాధాన్యాన్ని కలిగింది. యూరోపులోని  కొన్ని  చర్చిలలో ఈ బొమ్మ ఉన్నది. ఐతే ఈ శిల్ప మూర్తిమత్వంలోని విశిష్టత ఏమిటి? అంత స్పెషాలిటీ ఉన్న దాని మూలము ఎక్కడిది? 
డిసెంబర్ 25 క్రిస్ మస్ పండుగ రోజు. 
క్రిస్ మస్ పండుగ వచ్చేస్తున్నది కదా! కనుక ఈ విశేష అంశము వైపు దృష్టి సారిస్తున్నాము. 

*****


మన జాతీయ చిహ్నాలలో ఒకటి నాలుగు తలల సింహము. 
సారనాధ్ స్థూపము నుండి ఈ సింబల్ ను స్వీకరించారు. 
మనకు మూడు మాత్రమే కనిపిస్తూంటాయి. 
ఆ నాలుగవ సింహము- వెనక వైపు ఉంటుంది 
కాబట్టి మనకు మూడే కనిపిస్తాయి. 
శిల్పి ఊహా చమత్కారానికి "శభాష్!" అనాల్సిందే!

అలాటి మరో శిల్పము/ మురల్/ చిత్తరువు - మూడు కుందేళ్ళు. 
మూడు కుందేళ్ళు వలయాకారంలో, ఒక హారమువలె ఏర్పడినవి. 
ఇవి ముక్కోణములో ఒకదాని వెనుక ఒకటి పరుగెడుతూన్నవి. 
ట్రయాంగిల్ ఆకారంలో ఏర్పడిన ఈ three hares కనికట్టు చమత్కారాలను చేస్తూన్న శిల్పము. 
కుందేళ్ళు ఇక్కడి శిల్పములో ఒక చమత్కారం అగుపిస్తుంది. 
ప్రతి ఒక్కకుందేలుకూ రెండు చెవులు ఉంటాయి. 
ఐతే రెండు కుందేళ్ళుకూ కలిపి- మూడు చెవులు ఉన్నవి. 

అంటే “6 చెవులకు” బదులు – ఈ చెక్కడములో ‘మూడు చెవులు” మాత్రమే సాక్షాత్కరిస్తూ ఉన్నవి.

*****

బౌద్ధ ఆరామములలో పారమార్ధిక ప్రతీక (Motif) కుందేలు. 
బౌద్ధ మతములో జంతువులకు చాలా ఇంపార్టెన్సును ఇచ్చారు. 
గౌతమ బుద్ధుని జాతక కథలలో కుందేలు ఉన్నత స్థానాన్ని కలిగి ఉన్నది. 
చైనా జాతక, రాశి చక్రం లో (China Zodiac ) నాలుగవ జంతువు "కుందేలు", "Yin" అని; 
దారు (చెక్క) స్వభావ సంబంధిగా గ్రహించారు.

లోహము, భూమి, నీరు, నిప్పు మున్నగు పృధ్వీ సంబంధిత వస్తువులకు ఒక్కొక్క జంతువు ప్రతీకగా ఎన్నుకొన్నారు. చైనా జాతక చక్రము వరుసగా 12 సంవత్సరములకు పట్టికను చైనీయులు ఏర్పరిచారు. ఆయా ఏడాదిలలో జన్మించిన మనుష్యుల స్వభావ, జీవన విధానాలను చెబుతారు. 
(మన హిందూ దేశ పంచాంగములలో సాయన, చాంద్ర మానములు పునాది చేసుకుని, నక్షత్ర - రాశి పొంతనలనూ, జన్మ లగ్నములనూ లెక్క కట్టి- భవిష్యత్తు ఎలా ఉంటుందో విశ్లేషించే ప్రయత్నాన్ని చేస్తారు. ఈజిప్టు, పర్షియా మున్నగు దేశాలలో "రమదా" వంటి గణనలు ఉన్నాయి.) 
జపాన్, కొరియా, వియత్నాం, మున్నగు ఆసియా దేశాలలో ఈ జాతకమును ఆసక్తిగా పరికిస్తారు.

*****

మళ్ళీ అసలు సంగతికి వద్దాము. ఈ త్రి శశముల ప్రాచీనతను నిర్ధారించే అన్వేషణలో హిస్టారియన్సు కనుక్కున్న సంగతులు విస్మయాన్ని కలిగిస్తాయి. చైనాలో క్రీస్తు పూర్వము 6వ శతాబ్దముల నాటివి-అని వీటి ప్రాచీనతకు చారిత్రక ఆధారములు లభించినవి. మగావు గుహలలో ఈ బొమ్మలను చరిత్రకారులు కనుగొన్నారు. 518 - 618 లలో పరిపాలించిన సూయి వంశ చక్రవర్తులు గుహ ఆరామాలను నిర్మింపజేసారు. 407 Mogao Cave; Sui dynasty (581-618) లలో ఈ అద్భుత శిల్పాలు ప్రత్యక్షమైనవి.

*****

తూర్పు నుండి పడమటి సంధ్యా రాగం- ఎలాగ చేరినది?

"ప్రాచీన చీనా లో పట్టు వస్త్రాలు నేసారు. వానిపై చందమామను అందులో మూడు కుందేళ్ళు చిత్రించారు. 
ఈ 3 కుందేళ్ళు బొమ్మతో , 
పత్ర హరిత పురుషుడు (Green Man ) బొమ్మ కూడా 
సమాన ప్రాధాన్యతను గడించింది.

******

చైనా దేశములో ఉత్పత్తి ఔతూండే పట్టు దుస్తులు, హిందూదేశంలో చేనేత వస్త్రాలు (సిల్క్/ చీనీ సిల్క్), సుగంధ పరిమళ దినుసులు, శిల్ప, చిత్రలేఖనాది లలితకళాఖండాలూ ప్రపంచ సముద్ర యానానికి "వర్తకపు దారులను" వేసాయి. కళాజగత్తులోని కొన్ని అంశాలలో ఈ/ రెండు అంశాలూ చోటుచేసుకున్నవి. చైనా గుహలలోని త్రి శశముల చెక్క శిల్పాలు సాగరయానమార్గాల ద్వారా 
పాశ్చాత్య ప్రపంచానికి పరివ్యాప్తి ఐనవి. అవి ఎంతగా వ్యాప్తి గాంచాయంటే- తూర్పు దేశాలలో ఇంచుమించు విస్మరించబడినవి- కానీ పాశ్చాత్య యూరపు దేశాలలోగిళ్ళలో కళకళలాడుతూన్నవి. 

ఆద్యంతము లేని హారము వలె ఏర్పడిన చిన్ని జంతువులు ఈ 3 కుందేళ్ళు. 
మన వాళ్ళు వీటినే "చెవుల పిల్లులు" అంటారు. 
ఈ విచిత్ర దారు చెక్కడములు ఆ పదమును సార్ధకము చేసినవి అనిపిస్తుంది. 
చెవుల పిల్లులు చర్చిలలో ప్రధాన జాగాలలో గ్రీన్ మ్యాన్, మూడు కుందేళ్ళు ఉండేవి. 
ఆహూతులకు బాగా అగుపించే చోట్లు- అంటే ప్రవేశ ద్వారము పైన, మధ్య కమ్మె మీదనో, పై కప్పు నడుమ గానీ చటుక్కున ఎల్లరికీ కనిపించేలా ఎంపిక చేసిన ప్రదేశాలలో వీటిని అలంకారములుగా ఉంచుతున్నారన్న మాట.

ఛాన్సెల్ రూఫుల మీద, సెంట్రల్ రిబ్ ల మీద- ఇలా ప్రత్యేక ప్రాంతాలలో ఉండటానికి కారణము - 
చర్చిలను, అందులోని శిల్ప, చిత్రలేఖనాదుల నిర్మాణదార్లు- 'తమ యొక్క కట్టడము ' అనే ఆనవాళ్ళుగా 
(the builders' signature marks )- వీటిని ఉంచేవారు - అని విశ్లేషణ ఉన్నది.

*****

వర్తక వాణిజ్యముల కార్యక్రమాలలో- ఆదాన ప్రదానములు కూడా చారిత్రక పరిణామముగా నిర్మితమౌతూ వస్తూన్నవి. 
అలాటి కళా, వస్తువులు, ఆభరణాది సామగ్రి, సంస్కృతీ భావజాలాలలో - ఇవి కూడా విపణివీధిలనుండి- ప్రజల మనసులను హత్తుకున్నవి ఇవి.

*****

Church, Chapel, Cathedral and Basillica- మొదలగునవి ఆరాధనా కేంద్రములు. 
వీనిలో చర్చి, చాపెల్ ల ప్రధాన ద్వారాల కమ్మెల పై మూడు కుందేళ్ళు బొమ్మ ఉన్నది. మధ్య శతాబ్దములలో ఇవి జనబాహుళ్యము ఇష్టపడిన కళా ఖండము ఇది. కనుకనే "కానుక"గా లభించిన ఈ ఆర్టును వారు హత్తుకున్నారు.

నేడు టిబెట్, మున్నగు దేశములలో శ్రవణేంద్రియ భాగ్యశాలులైన కుందేళ్ళు- పజిల్ బొమ్మలు కనువిందు చేస్తూన్నవి.

********************

క్రిస్మస్ శుభాకాంక్షలు.

***** 

క్రిస్ మస్ - మూడు కుందేళ్ళు ;  User Rating:  / 2 

Member Categories  - తెలుసా!
Written by kadambari piduri
Friday, 13 December 2013 09:16

;

19, డిసెంబర్ 2013, గురువారం

కిట్ కాట్ పేరెలాగ వచ్చింది?

కిట్ కాట్: చాక్లేట్లను తినే వాళ్ళందరికీ ఈ పేరు సుపరిచితమైనదే,

ఈ పేరును ఎక్కణ్ణించి సంగ్రహించారు?

క్రిస్టఫర్ కాట్లింగ్ – అనే చెఫ్ (వంటలలో  ప్రవీణుడు) ఒక షాపు నడుపుతూండేవాడు. 
ఆతని టిఫినీ సెంటరు ఎప్పుడూ కవులు, పబ్లిషర్లు, కార్యకర్తలు- మొదలైన వారితో కళకళలాడ్తూండేది.

సాహితీపిపాసులు గుమిగూడి, వారు చేసే చర్చోపచర్చలతో సదా సందడి సందడిగా ఉండేది. ఆ వాదోపవాదాలలో కొత్త కవితా రీతులూ, సంఘ, సామాజిక సిద్ధాంతాలెన్నో మొలకలెత్తి, చిగుళ్ళు తొడిగి, నవీన మధుర  ఫలములు సమాజానికి లభించేవి.

***********************************,

క్రిస్టఫర్ కాట్లింగ్ – అనే చెఫ్ (వంటలలో  ప్రవీణుడు).

Christopher Catling నడిపే చిన్న food  inn, బ్రిటన్ దేశభక్తులతో కిటకిటలాడ్తూండేది. 
అతడు కస్టమర్ లకు అందించే ’మీట్ పై ’ (meat pie)ను తింటూ అందరూ మాట్లాడుకునేవారు. బ్రిటన్ దేశచరిత్రలో మైలురాళ్ళను నెలకొల్పిన సంభాషణలు అనేకం ఆ చోట జరిగేవి.

కిట్ కాట్  లు జాకబ్ టాన్సన్ [1655 - 1736] ప్రాచీన ఆంగ్ల సాహిత్యాన్ని ప్రచురించేవాడు. 
"ఇవిగో వచ్చేసాయి, మన కాట్ లింగ్ గారి చేతి “కిట్ కాట్ లు” అంటూ నవ్వుతూ ఆ చిరుతిళ్ళను ఆస్వాదించేవాడు. 
జాకబ్ టాన్సన్ ప్రచురణ కర్త. ఆ చిన్న హోటల్లో ఐటమ్ లను, “మీట్ పై” ముక్కలకు జాకబ్ టాన్సన్ సరదాగా పెట్టిన పేరు “Kit Kat ” ఆ బుల్లి కెఫే యజమాని నామధేయాన్ని, ఇంగ్లీష్ భాషలో చిన్న శ్లేషపదముగా తీసుకోవడానికి బాగా తమాషాగా ఉపయోగపడింది.

Jacob Tonson పుస్తకప్రచురణ ద్వారా అనేక మంది (జాన్ డ్రైడెన్, జాన్ మిల్టన్ మున్నగు) కవుల రచనలు  18 వ శతాబ్దములో వెలుగులోనికి వచ్చినవి.

అంతే కాదు- అతడు విల్లియం షేక్ స్పియర్ ఇత్యాది ప్రముఖుల రచనలను కూడా కాపీరైట్సు- ని పొంది, ఇంగ్లీష్ లిటరేచర్ లోని విలువైన సాహితీ విలువలు- ప్రపంచానికి సన్నిహితపరిచాడు. అందువలన – ప్రపంచ సారస్వతము కొత్త పుంతలు తొక్కింది. ఛందస్సు, మతముల వరకే పరిమితమైన వ్రాతలు , కొత్త కోణాలలో కాంతిరేఖలను వెదజల్లసాగాయి. చరిత్ర, సామాజిక, ఆర్ధిక, మానసిక, రసాయన , సైన్సు – మున్నగు నవీనపంధాలలో వృద్ధి చెందాయి. ఎంతగా అభివృద్ధి గాంచాయనగా – అవధులు లేనంతగా, ఆ గగన పర్యంతము-అన్నంతగా ఐనవి.

జాకబ్ టాన్సన్ [1655 - 1736]| mutton pies కి పెట్టిన తమాషా నిక్ నేమ్, తర్వాత విక్రయాల గ్రాఫు గిన్నీస్ బుక్ రికార్డు స్థాయిలో ఫేమస్ ఐనది.

***************************************,


Kit Kat

Link for photo  (See)

Kit Kat Chunky bars కూడా బాగా పాప్యులర్ ఐనవి. 
Kit Kat  club 18 వ సెంచరీలో ఇంగ్లండులో- “హాస్య, విట్స్ (wits), నవ్వులతో వాతావరణం ప్రపుల్లంగా ఉండేది. దేశభక్తుల సమాహారముగా ఆ గదులు భాసించేవి. Jacob Tonson పుణ్యమా అని, ఒక క్లబ్ పేరు కాస్తా ఆహారరంగంలో నిలిచి, అందరి నాలుకల పైన ఆడుతూన్నది. పోప్, స్టీల్, అడ్డిసన్, కాన్ గ్రీవ్ మున్నగు వారు; ఈ కిట్ కాట్ క్లబ్ శాశ్వత సభ్యులు అనవచ్చును.

***********************************,

Kit Kat అనేది ఒకచాక్లేట్, ఔనా!? గత ద్విదశాబ్దాల క్రితం, నువ్వుజీడీలు, నిమ్మతొనలు, తీపి బిళ్ళలు, అటు  తర్వాత బిస్కట్లు – బాల బాలికలు తినే తినుబండారములు. వాటి తర్వాత పిప్పరమెంట్లు, లాలీపప్సు, అలాగే కిట్ కాట్ లూ- ఆధునీకరణతో ఫ్యాక్టరీలలో పెద్ద ఎత్తున తయారై  విపణివీధులలో వెల్లువెత్తినవి.

“Kit Kat Chunky bars “Have a Break, Have a Kit Kat” వగైరా వ్యాపార ప్రకటనలు, మార్కెట్ లోకి ప్రవేశించి, వాణిజ్యసరళికి ఆధునిక మార్గాలను ఏర్పరిచినవి. కిట్ కాట్ క్లబ్ - 18 వ సెంచరీలో  న్యూ వేవ్ లో సంచలన సూక్తులను రూపుదిద్దినవి. వ్యాపార ప్రకటనలు, అడ్వర్టైజ్ మెంట్సు కోసము- సారస్వతము ఆలంబనముగా- దీటైన పదాలూ, పలుకులూ చిత్రీకరణలైనవి. ఇది ఒక వింత పరిణామమే!!

***********************************,

17 వ శతాబ్దం ద్వితీయార్ధం చివర్లో, 18 వ  శతాబ్దములో – చిత్రంగా కిట్ కాట్ సైజు అనేది- ఒక స్టాండర్డ్ కొలత లాగా నిలద్రొక్కుకున్నది.

***********************************,

సర్ గాడ్ ఫ్రే అనే ఆర్టిస్టు కూడా Kit Kat Club లో మెంబరు.

అతను, కిట్ కాట్ చాక్ లెట్సుని ఫై కవర్ ని 36 by 28 inches కొలతలతో chocklate ను రూపొందించాడు. గతంలో కొన్ని ఏళ్ళు, ఆంధ్రదేశంలో “హార్లిక్స్ మూతలు” మూతలకు పేరుగా నిలిచినవి.

అదే విధంగా కిట్ కాట్, ఎర్రని రంగు cover, దానిపైనున్నటువంటి అక్షరములూ(Letters) కూడా 36/28 సైజు వాణిజ్య ఆకర్షణ ఐన కొలతగానూ, రంగు,లోగోలు – అదే తీరున స్థిరపడినవి.

***********************************,

అప్పుడప్పుడూ – కొన్ని నవీన గమనాలు గమ్మత్తుగా – ప్రజల వాడుక లో నానుడులలో – గడుసుగా జాగాను గడిస్తాయి – 
బట్టలు ఉతికే సబ్బుపొడి- అంటే “సర్ఫ్” నేది వాడుకంట; సబ్బు ఏ కంపెనీదైనా, ఏ బ్రాండుకు చెందినదైనా “సర్ఫ్, రిన్ బార్” అనీ, లక్సు సోపు, లైఫ్ బాయ్” అనీ- ఇలాగే స్థిరపడిన లిస్టులోని కొన్ని ఊత పదములు.

ఇంత అద్భుతంగా చాక్ లెట్సు కి మారుపేరుగా ఐ, 
చాకో బార్ లకు నిర్దేశిత కొలమానంగా అవతరించిన ఈ Kit Kat కి ఎవరైనా సరే,అభినందిస్తారు కదా!!!!!

పిల్లాజెల్లాకు, పిన్నలు, పెద్దలకు, అత్యంత చాక్ లెట్ ఐ, ఇంటింటింటా చప్పరిస్తూ, లొట్టలేస్తూ యావన్మందీ ఆస్వాదిస్తూ తింటూన్న ఈ కిట్ కాట్ , అదిగో;టి.వి. లో ప్రకటనలలో ప్రత్యక్షం; వహ్వారే!!!!!!

***********************************,
(Essay by:- kONamaanii)
***********************************,
కిట్ కాట్ పేరెలాగ వచ్చింది?
September 27, 2013 By: జాబిల్లి Category: కథలు 

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...