9, జులై 2012, సోమవారం

విధి విలాసము - శ్రీరాముడు


 నంది గ్రామములో ఎల్లరికీ సంభ్రమం! అక్కడికి అందరూ ఎప్పుడో వచ్చేసారు. 
మూడు ఝాములైనా ఎవ్వరూ అక్కడినుండి అంగుళమైనా కదల్లేదు. 
వేచిచూస్తూనే ఉన్నారు ఆ వింత ముహూర్తం కోసరమని!!!!
మున్నెన్నడైనా కనీ, వినీ ఎరుగ లేదు, ఇప్పుడు జరుగుతూన్న సంగతి!
కాళ్ళకు తొడుక్కునే చెప్పులకు పట్టాభిషేకమట! 
సింహాసనము మీద పాదరక్షలను ఆసీనము చేయబోతూన్నారు!


ఇంత విడ్డూరపు సంఘటన చారిత్రక ఔన్నత్యాన్ని పొందుతుందని గానీ ముందు తరాల జనులలో నీతి నియమాల రూపచిత్రణలను చేస్తూ ప్రపంచమునకే ఆదర్శ సమాజము అంటే ఇదీ!...... ఇదే!.... 
అని పదే పదే చెప్పుకుంటూ, తమ ఆచరణకు నమూనాగా తీసుకునే శక్తి గలిగిన ఘటన ఇది! 
కొన్ని యుగాలనూ, కొన్ని కోట్లాది సంవత్సరముల దాకా జనుల ప్రవర్తనకు గీటురాయిగా అమరబోతూన్న మహోన్నత దృశ్యమాలిక ఇది!
కనుకనే ఇతిహాస రచనలకే కానుకగా అందబోతూన్న ఈ అద్భుత అంశము కోసమని ఆబాలగోపాలమూ అలాగే నిలువు కాళ్ళమీద నిలబడి ఎదురు చూస్తూనే ఉన్నారు.....


* * *
దశరధ మహారాజు పుత్రిక శాంత. 
అంగదేశాధిపతి రోమ పాదుడు, అయోధ్యాధిపతి దశరధ మహారాజు మంచి మిత్రులు. 
దశరధుడు తన మిత్రుడైన రోమ పాదునికి, శాంతను దత్తత ఇచ్చాడు.
ఆనాటి నుండీ, ఆమె రోమ పాదుని ప్రేమాభిమానాలను పొందుతూ, అంగదేశములో నివసించసాగినది.
రోమ పాదుడు సాధు జనులను దూషిస్తూ తూస్కరించి, అగౌరవపరిచాడు. 
తత్ ఫలితంగా అంగదేశము అనేక సంవత్సరాలు వర్షాలు లేక కరువు కాటకములతో అల్లాడింది. 
రోమ పాదుడు మంత్రులు, మునులు, పురోహితుల సలహా అడిగాడు.
"మహా రాజా! విభాండక ముని కుమారుడు ఋష్యశృంగుడు. బాలుని వలె స్వచ్ఛమైన మనసు గల ఋష్యశృంగుడు అడుగిడితే, మన సీమ సుభిక్షమై, పాడిపంటలు వృద్ధి పొంది, కళకళలాడుతుంది"
ఆంతరంగీకుల, శ్రేయోభిలాషుల సలహాలను అంగీకరిస్తూ, వెనువెంటనే ఆచరణకు ఉపక్రమించాడు రోమ పాదుడు.
అనేక ప్రయత్నాలతో ఋష్యశృంగుని రప్పించగలిగాడు రోమ పాదుడు. 


ఋష్యశృంగుని అంగదేశ ప్రవేశము జరిగిన వెంటనే ఆ రాజ్యములో వర్షాలు పడ్డాయి. వానలు పడి, అంగదేశము పాడిపంటలతో వర్ధిల్లుతూ, విలసిల్ల్లుతూ ఉంటే
ప్రజలు ఆనందభరితులౌతూ, రాజును కొనియాడారు.


* * *
రోమ పాదుడు కృతజ్ఞతతో తన కుమార్తె శాంతను ఋష్యశృంగ మునికి ఇచ్చి పెళ్ళి చేసాడు.
శాంత సంతోషముగా ఋష్యశృంగుని అర్ధాంగి ఐ, అరణ్య వాసిని ఐనది. 
శాంత భర్తను సేవిస్తూ, పర్ణశాలలో ఆనందముతో జీవనము గడుపసాగినది. 
పతిదేవుడు ఋష్యశృంగునికి యజ్ఞ యాగాది కార్యక్రమాలలో అండదండగా ఉంటూన్నది. 
అనేక రాజ్యాలకు వెళుతూ ఋష్యశృంగుడు, తన విధులను నిర్వహిస్తూండేవాడు. 
ఆతని తపోబలము వలన అనేక దేశాలు సుబిక్షములైనవి. 
దశరధుని నుండి ఆహ్వానపత్రికలు అందినప్పుడు,అయోధ్యకు శాంత,ఋష్యశృంగులు వెళ్ళారు. 
మళ్ళీ అయోధ్యాపురి నుండి ఆ భార్యాభర్తలకు పిలుపు వచ్చినది.


"శ్రీ రామ పట్టాభిషేకము జరుగును.
తామెల్లరూ ఈ మహోత్సవానికి తరలిరావలసినదిగా కోరుచున్నాము,
భవదీయుడు దశరధుడు" 


దశరధుని ఆనతితో సుమంత్రుడు ఈ లేఖను కుమార్తెకు, అల్లునికీ పంపించాడు. 
ఋష్యశృంగుడు, పత్నితో బయలుదేరాడు. 
వారు ఇతః పూర్వమే ఇతర రాజ్యాలకు వెళ్ళి వచ్చారు. 
అందుచేత ప్రయాణ సామగ్రిని సర్దుకొనుటకు ఆట్టే తడబాటుపడలేదు. 
దర్భలూ,దర్భాసనాలూ, వల్కలములూ, వ్యాఘ్రాసన చర్మము,
పాదుకలూ మున్నగు సరంజామాతో ఇరువురూ బయలుదేరారు. 


* * *
ఋష్యశృంగుడు, శాంత అయోధ్యలోనికి అడుగు పెట్టారు.
వారి రాక తెలిసి, కౌసల్య, సుమిత్ర, కైకేయి, అంతఃపురములోని అతివలు 
ముని దంపతులకు ఎదురేగి, స్వాగతము పలికారు. 
దశరధుడు అల్లుడు ఋష్యశృంగునీ, పుత్రికామణి శాంతనూ ఆప్యాతగా పలకరించాడు. 
శ్రీరామ, లక్ష్మణ, శత్రుఘ్నులు, బంధువులు ప్రేమాభిమానాలతో 
క్షేమసమాచారములు అడిగుతూ, ముచ్చట్లు చెప్పారు. 
భక్తితో ప్రజలు "అమ్మా! శాంతా! సర్వోన్నతుడైన ఋష్యశృంగ మౌని పాదముద్రలతో
ఈ పుడమి సస్యశ్యామలమౌతూన్నది" అంటూ శ్లాఘించారు.
ఋష్యశృంగుడు, శాంత తన పతిదేవుని సజలనయనాలతో సంతోషాంతరంగిణి ఔతూ వీక్షించినది.
" సోదరుడు రామచంద్రుని పట్టాభిషేకమునకు ఇంక నాలుగు రోజులే ఉన్నవి,
ఏర్పాట్లు అన్నీ బాగుగా జరుగుచున్నవి కదా!?" మందస్మిత వదన నవ్వుతూ అన్నది.
"సోదరివి, నీవే శుభ అభ్యంగనస్నానమునకై, నలుగు పెట్టవలసిఉన్నది. 
మరి ఈ లేపన విద్య నేర్చుకున్నావా?" లక్ష్మణ సతి ఊర్మిళ సరదాగా అన్నది.
భరత, శత్రుఘ్నుల భార్యలు మాండవి, శ్రుతకీర్తి కూడా, పరిహాసోక్తులతో శృతి కలిపారు.


* * *
అందరూ చెప్పుకునే కబుర్లతో, చందమామ కూడా మేలమాడిన వెన్నెల వానలతో అయోధ్యలోని ఆ రాజభవనము మెలకువతో కళకళాలాడుతూండగనే, భళ్ళున తెల్లవారింది.
ఋష్యశృంగుడు, "శాంతా! తెల్లవార వచ్చెను, ఇక నిద్దుర లెమ్మని" తట్టాడు. 
ఋష్యశృంగుని సందడికి శాంత నవ్వుతూ 
"అసలు మాకెవ్వరికీ కనురెప్పలు అరముడిస్తేనే కదా, 
అందరమూ జాగరణములోనే ఉన్నాము లెండి!" అన్నది.
పరిచారికలు హడావుడిగా ఏమో గుసగుసలాడ్తూ, రహస్యంగా మాట్లాడుకుంటున్నారు.
"ఏమిటి చెలులూ! అలాగ చెవులు కొరుక్కుంటూన్నారు?" 
ఊర్మిళ నుడువులకు దాసీలు తటపటాయిస్తూ అన్నారు. 
"ఏమోనమ్మా! మాకు సైతమూ ఏమి జరుగుతున్నదో,
అసలేమి జరగబోతూన్నదో అర్ధము కావడము లేదు"


"అదేమిటి? ఎందుకా అలజడి మీలో ఈ పొద్దున?" 
మాండవి పదంపడి ప్రశ్నార్ధకమై నిలబడింది.
శ్రుతకీర్తి కూడా అదే ప్రశ్నను రెట్టిస్తూన్నట్లుగా. 
ఇంతులతో శాంత కూడా కుతూహలముతో, 
కొంత గాభరాతో ఆ సంభాషణను వినసాగింది.
"కైకేయీ మహలులోకి మంధర రుసరుసలాడ్తూ వెళ్ళింది.
ఏమేమి చాడీలు చెబ్తూన్నదో? ఏ కొంప ముంచబోతూన్నదో?" 
కౌసల్య కడ ఉండే పరిచారిక తనలోని వణుకును అణచిపెడుతూ చెప్పింది. 
మధ్యాహ్నము మందర ఎదురైతే, ఈమె రంగవల్లులను వేస్తూన్నది; మందరను ఎగతాళి చేసింది. 
ఎప్పుడైతే మందర కోపంతో విసవిసా నడుస్తూ, గునగునా వెళ్ళిందో 
అప్పటి నుంచీ ఈమె మనసు మనసులో లేదు. 
ఈమెకు అన్నీ దుశ్శకునాలే గోచరిస్తూన్నాయి, అందుకే ఇలాగ ఈమె బెంబేలు!!!!!
శాంత అక్కడ ఆ ఉదయం, ఆకాశం అరుణ వర్ణమౌతూ భీతిని కలిగిస్తూన్నది. 


* * *
ఝాము ఝాముకూ అందరిలో ఇదీ అని చెప్పలేని ఏదో గుబులూ, భయము ముప్పిరిగొనసాగాయి.
మంగళ తూర్యారావాలు ఉన్నట్టుండి ఆగిపోయాయి.కారణమేమిటి? అందరిలో ఒకే ప్రశ్న.
శాంత , ఋష్యశృంగు కారణమేమిటి? 
"మంగళ తూర్యారావాలు ఉన్నట్టుండి ఆగిపోయాయి.కారణమేమిటి?" అందరిలో ఒకే ప్రశ్న.


కైకేయి కోపగృహములో ఉన్నది. 
తన ముద్దుల మూడవ భార్యను అనునయించి,
ఆమె ఆగ్రహమునకు హేతువును అరయడానికై లోనికి దశరధుడు వెళ్ళాడు. 
ఇన్ని గంటలైనా బైటికి రానే లేదు, లోపల ఏమి జరుగుతూన్నదో ఎవ్వరికీ బోధపడడం లేదు. 
ప్రతి ఒక్కరూ "ఉత్కంఠ నిండిన రాగి కలశములలాగా ఉన్నారు." 
రాణివాసములలోనూ, ఆస్థానములోనూ, కోటలోనికీ 
ఆ  మాటకు వస్తే చక్రవర్తుల నివాసాలలోనికి భద్రతా కారణాల దృష్ట్యా 
ప్రవేశానికి అనుమతి లభించడం 
కొంత సంక్లిష్ట వ్యవస్థగా ఏర్పడిందనే చెప్పవచ్చును.


ఇప్పుడేదో అసాధార పరిస్థితి ఏర్పడబోతూన్నదని అందరి డెందాలలోనూ 
ఏదో వాటిల్లబోతూన్న కీడు గూర్చిన సంశయాలు పడగలెత్తుతూన్నాయి.
ఉన్నట్టుండి, కైకేయి నుండి "తనయుడు శ్రీరాముని రమ్మన"మని ఆదేశం.
మందహాస వదనుడు రాముడు ఆ కోపగృహములోనికి వెళ్ళాడు,
కొద్ది నిముషాల అనంతరము ఇవతలికి వచ్చాడు.
అయోధ్యాపురి భవితవ్యాన్ని మలుపు తిప్పిన విశేషము జరిగింది.


(పుట : 1)
******************;
పెదవులపైన చెరగని చిరు నవ్వులు ఆ నీలమోహనునికి పెట్టని ఆభరణములు!

అందుకే లోపల అంత లోపలలోనే జరిగినట్టి అయోధ్యాపురి భవితవ్యాన్ని మలుపు తిప్పిన ఆ విశేషము దాని బీజము ఎలాటిది? 
అందరితోపాటుగా శాంతకూ, ఆమె భర్తకూ కూడా అంతుబట్టడం లేదు. 
ఇవతలికి వచ్చిన ఇనకులాబ్ధి సోముడు "జననీ! నేను 12 ఏళ్ళు అరణ్యవాసము చేయవలెను, నన్ను ఆశిర్వదించండి!" 
కౌసల్య మాత్రమేనా? అక్కడున్న యావన్మందీ ఉలిక్కిపడ్డారు అనేకంటే దాదాపు మూర్ఛవస్థలో మునిగారనడమే సబబు.
ముని ఋష్యశృంగుడు కూడా,
అటవీ సీమలనుండి తన తోటి వచ్చిన ఇతర తాపసుల వైపు నిర్ఘాంతపడి, చూస్తూ నిలబడ్డాడు.


శాంత "ఇదేమిటి? స్వామీ! ఇలాగ ఎలాగ సంభవిస్తూన్నది? తాము భూత వర్తమానాలనే కాదు, భవిష్యత్ కాలమును కూడా తెలుప గల దార్శనికులు గదా?
ఇప్పుడు మనము చూస్తూన్నది వాస్తవమేనా? కల కాదు కదా?"


ఋష్యశృంగుని వద్ద సిద్ధ సమాధానములు లేని ప్రశ్నల వర్షమై 
ఆతని అర్ధాంగి శాంత తారట్లాడుతూంటే 
నిస్సహాయుడై శిలాప్రతిమ వోలె నిలబడ్డాడు ఋష్యశృంగుడు. 


* * *
కొంత తడవు గడిచాక అనేక సంఘటనా పరంపరలు పెను వేగముతో జరిగిపోయాయి,
సీతాదేవి, లక్ష్మణుడు కూడా నీలమోహనశ్యాముని అనుసరించారు.
"ప్రపంచములో ఎవ్వరైనా ఈ రీతిగా భోగ భాగ్యాలను తృణప్రాయముగా త్యజిస్తూ స్వచ్ఛందముగా, అరణ్యవాసమును మహదానందముగా స్వీకరించారా?" 
శాంత, ఋష్యశృంగులు తత్తరపడ్డారు,
ధరణీపుత్రి సీతాదేవి "నారచీరలను ఏ పద్ధతిలో కట్టుకోవాలి?" అని శాంతను అడిగింది. 
శాంత ఆమెకు నార చీరలను ఇచ్చింది. 
కళ్ళలో నుండి ఉబికి వస్తూన్న కన్నీళ్ళను అణచిపెట్టడం శాంత తరం కావడం లేదు.
క్రితం క్షణం దాకా తన నయన ద్వయిలో ద్విగుణీకృత శోభలతో రాణి ఆహార్యములో విరిసిన జానకీ సౌందర్యము ఇప్పుడు వల్కలధారణముకై తన కడ ఉన్నది? 
లాక్షణికులూ, వేదాంతవేద్యులూ, తార్కికులూ విధివిలాసమునకు ఇంతకు మించిన తార్కాణం ఎత్తి చూపగలరా? 


ఋష్యశృంగుని అవస్థ కూడా శాంత మానసిక కల్లోలానికి భిన్నంగా లేదు.
ఆ వైభోగ సీమలో అప్పటికప్పుడు సర్వసంగపరిత్యాగులు ధరించే వస్త్రాదులు దొరుకవు. 
శ్రీరామచంద్రుని వివేచనా పరిధి అత్యంత వైశాల్యమైనది.
తత్ క్షణమే శాంత, ఋష్యశృంగులకు "వల్కలధారణా నిమిత్తమై" కబురందినది.
సీతమ్మకూ, శ్రీరామచంద్రునికీ, తమ్ముడు లక్ష్మణునికీ ఋష్యశృంగ, శాంతలు వల్కలాదులు ఇచ్చారు.
చూస్తూండగానే పురవీధులన్నీ ప్రజల వేదనా ఘోషలతో నిండిపోయాయి. 
సకల జనవాహిని సంవేదనా సాగరములను దాటుతూ సీతా, రామ, లక్ష్మణులు వెడలిపోయారు.


* * *
అటు పిమ్మట దశరధుడు పరలోకగతుడైనాడు.
భరతుని మాతులుడు యుధాజిత్తు. 
భరతుడు తన మేనమామ యుధాజిత్ వద్దకు వెళ్ళి ఉన్నాడు. 
కేకయ రాజ్యము నుండి అయోధ్యకు తిరిగి వచ్చిన భరతుడు తల్లి కైకేయి అత్యాశకు ఖిన్నుడైనాడు. 
అన్న రాముని వెదుకుతూ వెళ్ళాడు.


సాకేత సార్వభౌముడు "తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాను" అని అన్నాడు. 
కొసకు భరతుడు ఆ స్థిర సంకల్పుని వేడగా అనుంగు సోదరుని ప్రార్ధన మన్నించి, శ్రీరాముడు పాదుకలను ఇచ్చాడు.
ఇచ్చిన పాదుకలు, ఆ పాదుకలకు, భరతుడు పూజిస్తూ, పట్టాభిషేకము చేస్తూన్నాడు.


శాంతకు ఇప్పటికీ "తాను సీతమ్మకు నారచీరలను కడుతూన్నప్పుడు కలిగిన భీతి, వణుకు" ఇంకా తగ్గనేలేదు. 
ఋష్యశృంగుడు "మేము పర్ణశాలనుండి తెచ్చుకున్న వృక్షముల (భూర్జ తరు) బెరడులు అవతారమూర్తుల మేని స్పర్శతో పునీతములైనాయి, ఔరా! విధి విచిత్రము ఇదే సుమా!" అనుకున్నాడు.
అనుకుంటూనే ఆ కుగ్రామములోని "శ్రీరామ పాదుకా పట్టాభిషేకము" తిలకిస్తూన్న ప్రేక్షకులలో ఋష్యశృంగుడు, తన ధర్మ పత్ని శాంత ఇరువురూ భాగస్వాములౌతూ, తాదాత్మ్య చిత్తులై, తిలకిస్తూ ఉన్నారు. 
;

విధి విలాసము - శ్రీరాముడు, శ్రీరామ పాదుకా పట్టాభిషేకము  (patrika.haaram.com)



రచయిత : కాదంబరి (కోణమానిని)         ప్రచురణ తేది: 3/30/2012 12:00:00 AM

My story:  మూడు తరాలు  in - my Blog - కోణమానిని-  గురువారం 7 జూన్ 2012
(మూడు తరాలు ; బామ్మ సణుగుడు విరామమెరుగని ఆమె గొణుగుడు సాగుతూనే ఉన్నది.)



7, జులై 2012, శనివారం

కనకడి కిటికీ (Kanaka’s window)



"కనకడి కిటికీ"(Kannada - ಕನಕನ ಕಿಂಡಿ; 
English - Kanaka’s window) అంటే ఏమిటి? 
ఈ పేరు రావడానికి కారణమేమిటి? 
ఇందుకు ఒక ఆసక్తికరమైన సంఘటన మూలము.


కనకదాసు (1509–1609) కన్నడ కవికనకదాసు 
'కురుబ గౌడ' కులజాత మణిదీపము. 
నిమ్నజాతీయుడైన కనకదాసు- 
కన్నడ భక్తి సాహిత్యములో వెదజల్లిన శరచ్చ౦ద్రికా రాశి.


"ఉడుపి" కర్ణాటకరాష్ట్రములోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రము. 
బాలకృష్ణమూర్తి ఇక్కడ కొలువై ఉన్న దైవము. 
ఉడుపి అనగా "తారా దైవము యొక్క సీమ"- అంటే 
"చుక్కల రేడు ఐన చంద్రుని స్థలము" అని అర్ధము. 
కనకదాసు ఉడిపి కోవెలలోనికి అడుగిడటానికి సమ్మతించలేదు, 
ఆ గుడి పూజారులు.ఆ మహా భక్తుడు వేదనతో కుమిలిపోసాగాడు.
మహాభక్త కనకదాసు ఆక్రందన అంతా ఆలాపనగా మారినది. 
ఆ ఆలాపనే 
"బాగిలను తెరెదు సేవెయను కొడో హరియే" అన్న కీర్తన.


ఆ కీర్తన పూర్తికాగానే అచ్చటి గోడ కూలిపోయింది. 
కీర్తనకారుడు కనకదాసు కు "శ్రీ బాలగోపాలుడు" 
తానే దర్శనమొసగిన ఆ వైనముతో, 
మూఢ విశ్వాసాలతో కొట్టుమిట్టాడుతూన్న అగ్ర జాతుల వారు లజ్జ పడ్డారు. 
అందరూ గేయకర్త కనకదాసును ప్రశంసించారు. 


ఈ పవిత్ర అద్భుత సంఘటనను 
కనుల పంటగా పొందిన వారిలో ఉన్న వ్యక్తి "శ్రీ వాదిరాజ స్వామి". 
పడిపోయిన గోడ స్థానే మళ్ళీ గోడను నిర్మించజేసారు శ్రీ వాదిరాజ స్వామి. 
కొత్తగా గోడలో "కిటికీ" ని జాగ్రత్తగా అమర్చారు. 
కనకదాసు బాలకృష్ణుడి దర్శనమును పొందిన 
ఆ శిధిల కుడ్యపు స్థానములో కట్టిన ఒక చిన్న కిటికీకి చారిత్రక ప్రాధాన్యం ఏర్పడినది. 
ఈ చిన్న కిటికీ నామమే "కనకదాసు కిటికీ". 
నేటికి కూడా ఆ గవాక్షము ద్వారా క్రిష్ణ ప్రతిమకు అర్చనలు చేస్తూండటమే 
ఒక సంప్రదాయమై స్థిరపడినది.


అంతకు పూర్వము తూర్పు దిక్కు వైపుకు ఉన్న చిన్ని క్రిష్ణమ్మ బొమ్మ 
కన్నడ సంకీర్తనకారుడైన కనకదాసు కూర్చున్న వేపుకు అంటే 'పశ్చిమ ముఖంగా' తిరిగింది. 
ఈ అద్భుత సంఘటన జరిగిన చోటు
"ఉడుపి దేవళము".
* * * * *
కర్ణాటక సంగీతములోని ఉగాభోగ సంప్రదాయములో 
తాదాత్మ్య స్వర మాధురి నెలకొల్పినది కనకదాస. 
సాహిత్యము మాత్రమే ఆధారము కాకుండా శ్రావ్య ఆలాపనము 
శ్రవణములకు భోగమును చేకూర్చే సరి కొత్త రాగ ప్రస్తావనలుగా 
నాద సరస్వతీ కిరీటములో మణిభాసురములగుట వింతగా 
15 వ శతాబ్దమునుండీ- 19 వ శతాబ్ది నాటికి సుస్థిరమైనవి.


ఈ పధ్ధతికి పురందర దాసు, కనకదాసులు శ్రీకారము చుట్టి, నాంది పలికారు. 
19వ శతాబ్ది నాటికి తమిళ సంగీత కళాబిమానులు  సైతము 
ఈ ఉగాభోగాలాపనా సంస్కృతిని తమ లోగిలిలోనికి ఆహ్వానము పలికారు.
సంగీత నందనవనములో మేల్బంతి ఐన 
భక్త కనకదాసు కర్ణాటక రాష్ట్రానికి గర్వకారణమైన సంగీత, సాహిత్య తేజో ప్రభాకరుడు.

కనకడి కిటికీ ; Web magazine (New AvKy)
User Rating: / 2
Member Categories - తెలుసా!
Written by kadambari piduri   
Sunday, 03 June 2012 12:44
;

5, జులై 2012, గురువారం

ఆరుద్ర - అశ్వశాల/ హస్త బల్


giri durgamu











;
;
;                                                                            భాగవతుల శివ శంకర శాస్త్రి 
(Bhagavatula Siva Sankara Sastri) 
"ఆరుద్ర" (Arudra) కలం పేరుతో 
ప్రఖ్యాతి గాంచారు. "సమగ్రాంధ్ర సాహిత్యము" 
తెలుగు సాహిత్యానికి 
ఆయన అందించిన 
విశిష్ట ఉద్గ్రంధరత్నము.
విజయనగరంలో మహారాజా వారి 
“హస్త బల్” అనే నాటకశాల (hasti= elephant) ఉన్నది. 
ఆ స్టేజీ మీద ఆరుద్రకు సన్మానం వైభవంగా జరిగింది. ఆ సన్మాన సభలో దిగ్గజాల్లాంటి పండితులు మాట్లాడారు. "మహారాజా వారు ఏనుగులు కోసమని కట్టిన 
ఈ ‘హస్తబల్ ‘ స్థలంలో సాహిత్యంలో గజరాజు వంటి ఆరుద్ర గారికి 
సత్కారం జరగడం గొప్ప ఔచిత్యం.” 
అంటూ వక్తలు తమ ప్రసంగాలలో ఉటంకించారు.


అపరిమిత శ్రమతో అద్భుత పరిశోధనలను, అందించిన ఆరుద్ర మాట్లాడుతూ 
మహారాజా వారికి ఏనుగులు లేవు. 
ఇక్కడ ఆయన ఏనాడూ ఏనుగుల్ని కట్ట లేదు. 
ఇది అశ్వశాల మాత్రమే! 
'stable’ అంటే గుర్రాల శాల. తెలుగులో “ఇ” అని - 
ఇంగ్లీష్ లో S అనే letter ఆదిని ఉన్న పదాలకు 'ఇ'ని చేర్చే పదాల పరిణామం ఉన్నది. 
ఉదాహరణకు ‘ఇస్కూలు ’ అని పలుకుతారు. 
అలాగే stable పరిణతి జరిగింది. 
స్టేబుల్, ఇస్టేబుల్, అస్తేబుల్, అస్తబల్ అయి, హస్త బల్ ఐనది” అన్నారు.


చరిత్రను అంత నిశిత పరిశోధన చేసిన ఆరుద్ర మీద ప్రశంసల జల్లులు కురిశాయి.


* * * * *


కొన్ని సినిమాలకి తాపీ ధర్మా రావు, ఆరుద్ర సంయుక్తంగా రచనల పని చేసారు. 
వెండి తెర పైన “ తాపీ, ఆరుద్ర” అని వేసే వారు. 
అందుకు, ఆరుద్ర అందుకున్న చమత్కారం ఇది.
“ఒకరు తాపీ, మరొకరు ఆదుర్దా”


ఒకరు తాపీ, మరొకరు ఆదుర్దా.”ఆరుద్ర-అశ్వశాల (NEW AvakAya)
User Rating: / 2 
Member Categories - ప్రముఖుల హాస్యం
Written by kusuma   
Friday, 28 October 2011 13:57

1, జులై 2012, ఆదివారం

"అజిబీధ- పపా - విశ్వేసకి", పింగళి


శ్రీ కృష్ణార్జున యుద్ధము ; అజిబీధ-పపా విశ్వేసకి(1963)















;                                         "అజిబీధ- పపా - విశ్వేసకి" - 
     ఈ పేరు ఎవరిదో గుర్తు పట్టగలరా?
అలనాటి సినిమా శ్రీ కృష్ణార్జున యుద్ధం లోనిది. 
శ్రీ కృష్ణార్జున యుద్ధం - లో గీతరచన కూడా వారిదే! 
(కె.వి.రెడ్డి సుందరమైన పనితనంతో- పింగళి పద వైచిత్రీ నైపుణ్యాలు తోడైనది. 
1963 లో విడుదలైన ఈ తెలుగు మూవీ అద్భుత విజయాలతో నిర్మాతలకు 
కాసులపంటలను పండించింది). 
ఇలాటి చమత్కార పదాల సృష్టి కర్త వేరెవరో కాదు, పింగళి నాగేంద్ర రావు
పింగళి పద చిత్ర కవితా విన్యాసాలకు నోచుకున్నట్టి-  
మాయాబజార్, పాతాళభైరవి, మిస్సమ్మ- 
అలాగ ప్రతి చలనచిత్రమూ ఆణిముత్యము అని 
                            సకలాంధ్ర జనులకూ విదితమే!


"వచ్చిన వాడు అర్జునుడు, ఫల్గుణుడు, 
        సుభద్రా పరిణయమే ముఖ్య గమ్యము" 
          బావ శ్రీకృష్ణపరమాత్మ అందదండలు ఉండనే ఉన్నాయి. 
ఇక యతి వేషంలో కోటలో పాగా వేయడమెంతసేపు?! 
ఔరా! ఆహాహా! ఇంతటి చమత్కార కథ లభిస్తే 
గమ్మున ఊరుకుంటాడా మన పింగళి నాగేంద్ర రావు వారు!? 
సంభాషణలలో ఆయన హస్తవాసి అమోఘమైనదని నిరూపించేసారు.


* * * * * *
ఇంతకీ పాఠక మహాశయులారా! 
"అజిబీధ- పపా - విశ్వేసకి" 
ఈ పద నామధేయానికి మూలము ఏమిటో మీరు కనిపెట్టారా?


ఉరుము ఉరిమితే, మెరుపు మెరిస్తే ఫస్టు ఫస్టుగా 
ఒక వ్యక్తి పేరును తలుస్తారు. ఏకైక మనిషి నామమది, 
"జయమ్" - అనే పేరుతో వేదవ్యాస మహర్షి రచించిన 
                                మహేతిహాసమే మహాభారతము. 
మహాభారతములోని పాండవ మధ్యముడు అర్జునుడు. 
మేఘాడంబర వేళలలో, సౌదామినీ ఝలక్ ల తరుణాలలో భయం వేస్తే 
(పాత రోజులలో లెండి!)  గబగబా గభాలున ఉచ్ఛరిస్తారు ఆతని పది పేర్లనీ!
నిజానికి అన్ని పేర్లూ నుడవాలి గానీ, 
అత్యధిక ప్రజలకు మొదటి రెండు మూడు పేరులు మాత్రమే నెమరుకు వస్తాయి. 
(అర్జున, ఫల్గుణ - పార్ధ, కిరీటి......అంటూంటారు) 
తర్వాతి పేర్లన్నీ గాలిదేవుడికన్న మాట! 
సరే! మరి ఇప్పుడు అర్జునుని ఎన్ని పేర్లతో పిలిచారు? 
                                             కొంచెం పరికించుదము!


1) పార్ధ= పృధా తనయుడు- పార్ధుడు. అలాగే కుంతీ పుత్రుడు "కౌంతేయుడు"(కుంతీ దేవి మొదటి పేరు పృధ- ఆమె దత్తత తీసుకోబడిన పిమ్మట "కుంతీ దేవి" ఐనది)
2) జిష్ణు= ఎవరూ అర్జునిని జయించ లేరు,
3) కిరీటి = ఇంద్రుడు -కిరీటము-ను సుతుని శీర్షమున ఉంచి, అలంకరించాడు. 
           దగ ద్ధగాజమాన కిరీటము కలిగినందున- "కిరీటి".
4) శ్వేతవాహన= తన రథమునకు తెల్లని రంగు కల గుఱ్ఱములను పూన్చిన వాడు
5) బీభత్స= రణరంగములో శత్రువులను వణుకు పుట్టించే వాడు  ;
6) విజయ - విజయము సాధించే వాడు;
7) ఫల్గుణ= ఉత్తర ఫల్గుణ- అనే నక్షత్రమున జన్మించిన వాడు;
8) సవ్యసాచి = కుడి, ఎడమ,-రెండు చేతులతోనూ 
బాణములను సంధించే ప్రావీణ్యత అర్జునుని సొమ్ము
9) ధనంజయ= (धनन्‍जय) = గొప్ప సంపదలను గడించిన విజేత
10) గాండీవి=  గాండీవము- అనే నామము కల ధనుస్సు కలిగిన వ్యక్తి అర్జునుడు;


అర్జునుని ఇతర పేర్లని కూడా చూద్దాము.
అర్జున= తెల్లని వాడు
కృష్ణ= నల్లని మేని వన్నె కలవాడు 
               (కుంతీదేవి, కృష్ణుని పై భక్తితో తన  తనయుని "కృష్ణ" అని పిలిచినది)
గుడాకేశ= దట్టమైన కేశములు కలవాడు
కపిధ్వజుడు= రధముపై ధ్వజ చిహ్నము 'హనుమంతుడు'
భారత= కురు వంశ మూలపురుషుడు (scion) 
శకుంతలా  దుష్యంతుల కొడుకు "భరతుడు"- పేరును అర్జునుడు పొందాడు.
పరంతప= తన ఏకాగ్రతతో రిపులను గెలిచే వాడు
కృష్ణ= నల్లని మేని వన్నె కల వాడు


సన్యాసి గారికి బారసాల చేసారు మన పింగళి వారు.
ఇంకా "పాండవ మధ్యమ, మహా బంధు, పరంగం, కౌంతేయ" ఇత్యాది 
సమాస విశేషణ నామధేయాలు అర్జునినికి అనేకము ఉన్నవి. 
ఇన్ని పేర్లలో- పది పేర్లను సెలెక్ట్ చేసి 
"అజభీదపపావిశ్వేసకీ స్వామి"ని సృష్టించారు 
పింగళి నాగేంద్రరావు గారు. 
అదీ సంగతి. 
అది సరే గానీ, ఆ పేర్ల మొదటి అక్షరాలతో అల్లిన దండ కదా 
ఈ మాయా ఋషి 'వరుని' పేరు! పింగళి నాగేంద్ర రావూజీ 
అందులో ఇమిడ్చి, ఇరికించిన దశ నామావళి స్ఫురణకు వస్తున్నవా? 
ఇప్పుడు చిటికెలో ఆ దశ నామావళినీ పట్టేసారు కదూ! 
అవి ఇవిగో, కనండి!
"అజిబీ- ధపపా - విశ్వేసకి" - 
10 పేర్లలోని మొదటి అక్షరాల సొగసరి, గడసరి కూర్పు ఇది.


అర్జునుడు, జిష్ణు, బీభత్స, ధనుంజయ (ధనము+ జయము), 
ఫల్గుణ, పార్ధ, విజయ, శ్వేతవాహన, సవ్యసాచి, కిరీటి


ఇవీ పింగళి శంఖములో చేరిన తీర్ధ జలములు. 
అంతేనా? అంతే కాదు, అర్జున, శ్రీకృష్ణులు- 
"నర నారాయణులు" అవతారసంభూతులు. 
ఈ ద్వయ నామాలలో "నర/నరుని" అంశయే 
 సాంప్రదాయం ప్రకారం ఆశ్రమములలో 
సన్యాసాశ్రమమును స్వీకరించే  అర్హతను పొందిన వారికి 
ఋషి/ మఠాధిపతులు నూతన నామమును అనుగ్రహిస్తారు. 
 పింగళి నాగేశ్వరరావు 
;


కానీ పింగళి నాగేశ్వరరావు                          బలరాముని దుర్గమును చేరి, 
గడ్డాలు, మీసాలతో                                    దొంగసన్యాసిగా మారిన అర్జునునికి 
సరి కొత్త పేరును పెట్టారు!


చప్పట్లోయ్! చప్పట్లు!!!!!!!!


"అజిబీ- ధ పపా - విశ్వేసకి" - గారికీ జై జై జోహార్లు.

అజిబీధ- పపా - విశ్వేసకి (newAvakAya- web mag)
User Rating: / 1 
Member Categories - మాయాబజార్
Written by kadambari piduri   
Saturday, 23 June 2012 13:33
;

27, జూన్ 2012, బుధవారం

భక్తపూర్ big tree
















భక్తపూర్ దేవాలయాలు ఉన్న ఊరు.
ఈ చిన్న సిటీ నేపాల్ లో ఉన్నది.
ఇక్కడ ఉన్న పెద్ద చెట్టును ఫొటో ఇది.
నయనానందకరం,
ప్రకృతి ప్రేమికులకు ఆనందదాయకమీ మహా తరువు. 




Bhaktapur big tree


;;;;;;;;; 

20, జూన్ 2012, బుధవారం

"సావేరీ- ఉదయ రాగము"



సరస్వతీ వీణ















;
సావేరీ రాగమునకు ఒక ప్రత్యేకత ఉన్నది.      
ప్రభాత కాలములో ఆలపించే మృదు రాగం ఇది. 
కనుకనే దీనిని "ఉదయ రాగము" అని సంభావిస్తారు.
గాయత్రీ మంత్రము- ఉచ్ఛారణకు ఇది మేలైన రాగముగా ఎన్నుకోబడినది. 
కర్ణాటక సంగీతములో జన్య రాగములలోని- 
15 వ మేళకర్త రాగము, మాయామాళవ గౌళ రాగము విభాగమునకు సంగీత శాస్త్రజ్ఞులు చేర్చారు. 
సావేరీ రాగము- కరుణరస ప్రభావిని.   మనసులను ఆర్ద్ర రస ప్లావితము చేస్తుంది. 
అందుచేతనే  ఉషోదయమున గానము చేసే రాగాభరణములలో 
(భూపాళ రాగము మున్నగు వానివలె)- 
ఇది ముఖ్యస్థానాన్ని అలంకరించినది. 
(Sama Veda,Morning  raga(Saweri Raga) 
గాయత్రీ మంత్రోచ్ఛారణము :- మెదడులోని ప్రకంపనలు సున్నితముగా కదలడము"ను 
Waves నకు మేధస్సును పాజిటివ్ దృక్పధ మార్గములో, 
ఆశావహ కోణములలో చలించే రీతిని- రికార్డు చేసారు, 
వైజ్ఞానికముగా ఇది నిరూపితమైనది.
అత్యంత పురాతన కాలములో - క్రీస్తు పూర్వము -
వేద కాలములో భారత దేశములో 
సంగీతమునకు సిద్దాంతబద్ధత ఏర్పడిన అద్బుతము ఇది.
ఇండియాలో కర్ణాటక సంగీత, శాస్త్రీయ  సంగీతములకు
పునాది "సామవేదము" గా అవతరించినది. 
   

7, జూన్ 2012, గురువారం

మూడు తరాలు




బామ్మ సణుగుడు విరామమెరుగని ఆమె గొణుగుడు సాగుతూనే ఉన్నది.
ఇంట్లోకి అప్పుడే అడుగుపెట్టిన అన్నయ్య కేసి చూస్తూ,
“ఏమిటన్నయ్యా! బయట మళ్ళీ ఏం విడ్డూరాలు అగుపడ్డాయి? 
ఇంత కుంభవృష్టిలో ఇద్దరూ ఎక్కడైనా ఆగి,నెమ్మదిగా 
 రావాల్సింది! ఇలాగ తడిసి ముద్దలౌతూ వచ్చారు?” 
తువ్వాళ్ళు ఇద్దరికీ ఇస్తూ అన్నాడు ప్రదీప్.
ప్రదీప్ కి స్కూటర్ తాళాలను ఇస్తూ చిన్నగా నవ్వేసాడు అనురాగ్.
వంటింట్లోకి వెళ్ళి పాలగిన్నెను స్టవ్వుపై పెట్టేసి, 
అక్కడే ఫిల్టర్ లో ఉన్న డికాక్షన్ ను, చక్కెరను గిన్నెలో కలిపి, 
వేడి కాఫీని ఒక స్టీలు గ్లాసులో పోసి బామ్మకు ఇచ్చాడు.
వానలో తడిసి, చలికి వణుకుతూనే చీర మార్చుకున్నది.
కాసె పోసి, మడి కట్టుకునే ఆ ఏడు గజాల చీరకట్టు తెలుగుదనపు అందానికి ప్రతీక.
అనురాగ్ బామ్మకు పొగలు కక్కుతూన్న కాఫీ గ్లాసును అందించాడు.
ఆమె కోపం కాస్త చల్లబడింది.
మేడ మీదనుంచి అమ్మ వచ్చింది.
“కేకేసి పిలిస్తే వచ్చేదాన్నిగా! కాఫీ మీరే కలుపుకున్నారే!” కాస్తంత నొచ్చుకొంటూ అన్నది.
“మన  యువతరం పిల్లకాయల్లో బద్ధకాన్ని పోషించేది-
ఇలాటి అమాయకపు సాంప్రదాయపు మాతృమూర్తుల ప్రేమలే, కదరా అన్నాయ్!”
తమ్ముడు ప్రవీణ్ గడుసు మాటలకు చిరునవ్వును బదులుగా ఇచ్చాడు అనురాగ్.
‘వీడెప్పుడూ ఇంతే! పోసుకోలు కబుర్ల రాయుడు! 
తామిద్దరూ లోనికి రాగానే టీ కలిపి ఇచ్చి సేదదీర్చే ప్రయత్నాలేమీ చేయడు,
కానీ అమ్మ లాంటి వాళ్ళను మాత్రం- బోల్తా కొట్టించే డైలాగు బాణాలను 
తన మాటల తూణీరంలోఅట్టిపెట్టుకుంటాడు.
సెగల పానీయం అంగిట్లోకి జారాక, బామ్మ శాంతించింది.
కోడలుతో అన్నది-
“చూశావా కలికాలం చోద్యాలు కాకపోతే ఇదేమిటి?
మన కాలంలో ఎరుగుదుమా?”
కిసుక్కున నవ్వాడు ప్రవీణ్.
అతని వైపు కొరకొరా చూసింది బామ్మ.
” అనురాగ్ నెమ్మది, వీడెప్పుడూ ఇంతే! పెద్దవాళ్ళను లెక్క పెట్టడు. 
గంపలు గంపల నిర్లక్ష్యాన్నివసతో కలిపి పోసి ఉంటుంది తన ముద్దుల కోడలు!” అనుకుంది.
పరిస్థితిని బ్యాలెన్సు చేస్తూ అన్నాడు అనురాగ్.
“దారిలో ఓ చిన్న ఇన్సిడెంటు జరిగింది”
ప్రవీణ్ సోఫాలోకి ఒక్క గంతు వేసి, కూర్చుంటూ అడిగాడు.
బామ్మ, అనురాగ్ ల వివరణలతో వెలువడిన కథా సారాంశం ఇది.


***                           ***                             ***                              ***


అనురాగ్ , బామ్మను గుడికి తీసుకువెళ్ళాడు.
గంట తర్వాత బయలుదేరుతూంటే దేవళంలో 
బామ్మ యొక్క చిన్ననాటి స్నేహితులు తారసిల్లారు.
అనుకోకుండా కలవడంతో అందరూ సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
ఇంకేం! ఆ పాత స్నేహితుల ఇంటికి వాళ్ళు తీసుకెళ్ళారు.
పాత స్నేహాలతో కొత్త చుట్టరికాలను కలిపేసింది బామ్మ!
అదే, తన పెద్ద మనుమడితో ఆ ఇంటి కన్యామణితో వివాహ బంధాన్ని కుదిరించేసింది.


***                            ***                               ***                                ***


"మన బామ్మకు హ్యాట్సాఫ్ అన్నాయ్! ఇదే ఏ మ్యారేజ్ బ్యూరో ద్వారానో ఐతే
దండిగా ఫీజులు అయ్యేవి. ఒక్క దమ్మిడీ ఖర్చు చేయకండానే నీకు పెళ్ళి కుదిర్చేసింది,
బామ్మా! నా మ్యారేజ్ కికూడా నువ్వే బాధ్యత తీసుకోవాలి”
“అంతకంటేనా? భగవంతుడు శీతకన్ను వేయకుండా ఉంటే  
నీక్కూడా బాసికం కట్టడం నా చేతుల మీదుగానే జరిపిస్తానురా భడవా!”


***                                     ***                                 ***                                   ***


దారి మళ్ళిన సంభాషణను చెవి పట్టుకుని,
మళ్ళీ అసలు సంగతికి తెచ్చారు.
ఇంటికి తిరిగివస్తూన్నారు, అంతలోనే కుండపోత వాన.
“మనం ఏదైనా పనిమీద వస్తేనే ఇలాటి అవాంతరాలన్నీను!  
హ్హు, ఇలాగ అంకపొంకాల వాన,నా చిన్నప్పుడు తిరునాళ్ళకు వెళూంటే కురిసింది.
మళ్ళీ ఇదిగో ఇప్పుడు ఇలాగ ఈ దబాటు వాన!”
బామ్మ విసురుతూన్న నానార్ధాలను వినాలనిపించిందో ఏమో-
వాన చినుకులు నింగికీ నేలకూ ఏకధారలుగా మారాయి. 
“Rain! rain! gO away!” పిల్లలు కేరింతలాడ్తూన్నారు. 
“కురిసింది వాన! నా గుండెలోన…..” కుర్రకారు హమ్ చేస్తూన్నారు.
అంతలోనే చిన్న సంఘటన!
ఆట్టే బయటికి రాని బామ్మకు  అది సహించరాని విషయమే!
కింద కాలువలుగా నీళ్ళు వడివడిగా ప్రవహిస్తూన్నాయి. 
పాదం లోతు జల ప్రవాహాలు రోడ్డు అంతటా!
అందరూ స్కూటర్లూ, బల్కులూ, మోపెడ్లనూ ఆపేసారు. 
షాపుల ముందరా, బస్ స్టాండులలో,
షెల్టర్లు ఎక్కడ దొరికితే అక్కడ ముడుచుకునుంటూ నిలబడ్డారు.
బామ్మతో బాటుగా అనురాగ్ కూడా ఒక ఇంటి చూరులాంటి చోటులో నిలుచున్నాడు.
అప్పటికే చాలామంది పిప్పళ్ళ బస్తాలో కూరినట్లుగా ఉన్నారు జనం. 
‘బామ్మకు అసలే మడి. మడి పేరుతో ఎవ్వరినీ, 
ఇంట్లో వాళ్ళను కూడా తాకకుండా ఉండే అలవాటును చేసిన సాంప్రదాయం…..’
“ఛి ఛీ!” అనుకుంటూ ఎవ్వరినీ తాకకుండా పక్కకు పక్కకు ఒదుగుతూ
పాపం! ఆమె నానా అవస్థలు పడుతూన్నది. 
ఇప్పుడు అందరూ అటుకేసి చూస్తూన్నారు.
హఠాత్తుగా జరిగిన ఆ సంఘటనన.
ఒక యువకుడు తన గర్ల్ ఫ్రెండును చటుక్కున రెండు చేతుల్లో ఎత్తుకుని
దబ్బున ఆ సన్నని ప్రవాహాన్ని దబ్బున దాటేశాడు.
అతడి కరకమలాలలో ప్రేయసి కిలకిలా నవ్వుల గ్రుమ్మరింతలు.
బామ్మ లాంటి వాళ్ళు నిశ్చేష్ఠులౌతూ, కాస్సేపటిదాకా అలాగే ఉన్నారు
‘ఇంతలు కన్నులుండ విప్పార్చి అలాగే వీక్షిస్తూ…………..’
యువత, పిల్లలూ ఆట్టే రియాక్టు అవలేదు కానీ,
ఎవరికి తోచినట్లుగా వాళ్ళు కామెంట్సు చేస్తూ మాట్లాడుకుంటూన్నారు.
“గురుడు సినిమాల్లో హీరోగా ట్రై చేసుకోవచ్చు”
“లవరేనంటావా?” “ఝనక్ ఝనక్ పాయల్ నో? పుస్కి పుస్కీనో ఐ ఉంటుంది”
“ఇలాటి వానలో తడుస్తూంటే ఇప్పుడు బాగానే ఉంటుంది,
రేపు జలుబూ, దగ్గూ….”
అప్పటికే మరి కొందరు ఆరుబైటకు అడుగేశారు, జడివానకు జడియకుండా.
అప్పటికి కాస్త తగ్గుముఖంపడ్తూన్న వానను చూస్తూనే బామ్మ 
“ఇక! పద! త్వరగా ఇల్లు చేరదాము”
“బామ్మా! నువ్వూ, తాతయ్యా 
మీ పెళ్ళైన కొత్తల్లో ఎప్పుడైనా సరదాగా
వర్షంలో తడుస్తూ ఆటలాడుకున్నారా?”
ప్రవీణ్ చిలిపితనానికి తల్లి, 
అప్పుడే ఆఫీసు నుండి వచ్చిన తండ్రి ముసిముసినవ్వులు నవ్వుకుంటూ......
వంటింట్లోకి వేళ్ళి, భోజనపదార్ధాలను  మైక్రో ఓవెన్ లోనూ, 
స్టవ్వు మీదా వేడి చేసే కార్యక్రామాన్ని మొదలెట్టారు.
అనురాగ్ “తనకు ఇందాక బామ్మ ద్వారా పరిచయం ఐన 
కన్నెపిల్ల బొమ్మని మనసులో ప్రతిష్ఠించుకుని” తన కలకు వన్నెలను అద్దుతున్నాడు.
ప్రవీణ్ కొంటె మాటలకు బదులుగా బామ్మ తర్జని చూపిస్తూ అన్నది
“భడవా! పెద్దంతరం చిన్నంతరం ఎరగరు కదా 
ఈ కాలం పిల్లలు  మరీ కలికాలం కదూ! ” *


మూడు తరాలు
1892- జనవరి 2012 ; (Link- web)
Posted on January,2012 by విహంగ
http://vihanga.com/?p=1893

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...