15, జులై 2012, ఆదివారం

తగువులు తీర్చిన జగన్నాథ పండితుడు








ఉత్తర హిందూస్థానానికి తెలుగువాళ్ళు 
ఎవరైనా వెళితే,
అక్కడివాళ్ళు ‘మీరు తెలుగు వారా? 
మీరు ఆంధ్రులా?’అని అడగరు.
మరి ఏమని అడుగుతారు?


“యే పండిత్ రాజ్ కీ దేశ్ వాశీ హై| 
              యే మల్లినాధసూరీ కే దేశ్ వాశీ హై|”
                                           అంటూ చెబుతారు.
“మీరు పండిత రాయల దేశము వారా?
    మీరు మల్లినాధ పరగణాల వారేనా?” 


అంటూ ప్రశ్నిస్తూ పరిచయాలను చేసుకుంటారు.
రాష్ట్రాన్నీ, సీమలనూ, దేశాలనూ 
ఆట్టే పరిగణనలోనికి తీసుకోకుండా
పాండిత్యాన్నిబట్టి మాత్రమే,
ఆగంతకుల గురించి ప్రస్తావించుకునే గొప్ప సాంప్రదాయాలు
అలనాటి (16వ శతాబ్దము నాటి)హిందూదేశములో,
ముఖ్యంగా ఉత్తరాదిని నెలకొని ఉన్న గొప్ప సామాజిక అంశము.
కవి- అనే పదము కన్నా “పండితుడు” అనే పదములో
పవిత్ర భావన గుబాళింపు ఉన్నది,
“ఋషి తుల్యుడు, దైవ సమానుడు”
అనే సమున్నత భావన అది.
జగన్నాధ పండిత రాయలు- వంటి
కొద్దిమంది మాత్రమే మనకు ఇలాగ చరిత్రలో గోచరిస్తూంటారు.


*******************************************


జగన్నాథ పండిత రాజ్ ఉపద్రష్ట గృహనామము కల కుటుంబము వ్యక్తి.
ఆ రోజులలో సాధారణముగ బ్రాహ్మణులు, “ఉంఛ వృత్తి”ని అవలంబించేవారు.
ప్రధానంగా భగవత్ సేవయే- తమ జీవన విధానముగా ఎన్నుకొనుటచే,
వారు లౌకిక భోగాదుల పట్ల విముఖులై-
స్వచ్ఛందముగా బీదరికములో ఉండుటయే ఇందుకు కారణము.
జగన్నాథ పండిత రాయలు అట్టి ఉంఛ వృత్తి- స్వీకరించాడు.
ఉంఛ వృత్తి:-
(విద్యార్ధిగా, బ్రహ్మచారి ఐన విద్యార్ధిగా యాచన చేయుట
      అనగా- ordinary Brahmin engaged in unchavritti 
                                              (i.e. begging for alms)
‘ఏ రోజుకు సరిపడే భోజనమును ఆ రోజుకు మాత్రమే సంపాదించాలి- అనేది
ఉంఛవృత్తిలోని నియమము.


సంఘసేవా దృక్పథంతో మెలగే తాపసులు, బౌద్ధ సన్యాసులు,
దీనిని ఒక పవిత్ర భావనా మార్గంగా- హిందూ సంఘముచే ఏర్పరచబడినది.
తాపసులు, బౌద్ధ సన్యాసులు,
దీనిని ఒక పవిత్ర భావనా మార్గంగా- హిందూ సంఘముచే ఏర్పరచబడినది.
ఈ క్రమంలో బ్రాహ్మణ విద్యార్ధులు యాచనచే లభించిన
ధాన్యాదులను, వారే వండుకునే వారు,
లేదా “గురు పత్ని” వండి, గురుకులములోని అందరికీ వడ్డనలు చేసేది. 
గురువు భార్య , కన్నతల్లి ప్రేమను విద్యార్ధులకు ఒసగేది.
ఈ క్రమంలో విద్యార్ధులు, భోజనం చేయడానికి- విస్తళ్ళు తయారుచేసుకునే వాళ్ళు.
అలాగ జగన్నాథుడు కూడా గ్రామంలోని
ఒక మర్రి చెట్టు, బాదం చెట్టు ఆకులను కోసి తెచ్చుకుని, విస్తళ్ళను కుట్టిపెట్టేవాడు.
ఐతే ఒక రోజు ఈ విధికి ఆటంకం ఏర్పడింది.
అక్కడ కాపలాదారు కొత్తగా వచ్చిఉన్నాడు.
కావలివాడు  నిరోధించాడు” ఈ చెట్లను తాకవద్దు.
మా అయ్యగారు నిషేధించాడు” అటూ అటకాయించాడు.
ఈ విఘాతమునకు నిర్ఘాంతపోయాడు జగన్నాథుడు.
“చక్రవర్తి- ఈ భూమిని మా యజమానికి
జాగీరుగా బహుమానంగా ఇచ్చారు” అన్నాడు ఆ కావలివాడు.
గ్రామ వ్యవహారాలను చూసే బాధ్యతలను కరణం చూసేవాడు.
అందుచేత జగన్నాథుడు గబ గబా కరణము వద్దకు వెళ్ళాడు.
(village karanam = 
        official incharge of village revenue and administration)
“ఆకులను కోసుకోవడానికై అనుమతి ఈయండి” అంటూ అడిగాడు.
కానీ ఆ కరణం నిర్లక్ష్యంగా నిర్ద్వంద్వంగా చెప్పేశాడు
“ఢిల్లీకి వెళ్ళు. పోయి,పాదుషాకు చెప్పుకో! నా చేతుల్లో ఏమీ లేదు”


జగన్నాథుడు తల్లిదండ్రులకు ఈ దుర్ఘటనను వివరించాడు.
భార్య కామేశ్వరికి చెప్పాడు
“ముడి బియ్యమునూ, బెల్లమునూ మూట కట్టి ఇవ్వు”
(ఆ రోజులలో బాల్యంలోనే పెళ్ళిళ్ళు జరిగేవి)
Gur and pounded rice లను భుజంపైనిడుకుని,
పెద్దలకు పాదాభివందనములు చేసాడు జగన్నాథుడు.
విద్యార్ధి జగన్నాథుడు హుటాహుటిన ఢిల్లీకి
(ప్రాచీన కాలంలో పేరు – హస్తినాపురము) బయలుదేరాడు.
(gur and pounded rice for the journey,
and really went to Delhi!)
జగన్నాథుడు వీరావేశంతో డిల్లీ కోట వద్దకు చేరాడు,
కానీ “తన బోటి వారికి సింహద్వారము వద్దకు కూడా చేరలేరు" 
అని అర్ధమైపోయింది.
కులపతి మిశ్రా “మీకు ఆధారం దొరికే వఱకూ -
మా ఇంట్లో కొన్నాళ్ళు బస చేద్దురుగాని, రండి!” అని పిలిచాడు.
మిశ్రా కుటుంబీకులు జగన్నాథుని సమాదరించారు.
కొన్నాళ్ళకు అదృష్టము ఆతని తలుపు తట్టినది.
ఒకానొక రోజున  జగన్నాథుడు, 
అక్కడి సైనికులతో వాగ్వాదం  చేయాల్సి వచ్చినది.
ఆ ఇరువురు పర్షియన్ సైనికులు. (Persian speaking soldiers)
వాళ్ళిద్దరూ పరస్పరం పోట్లాడుకుంటుంటే,
అక్కడే ఉన్న జగన్నాథుడు ఒక్కడే ప్రత్యక్ష సాక్షి ఐనాడు.
రాజాస్థానానికి ఆ ఇద్దరు సైనికులు ” ఇతడు అంతా చూసిన వాడు.
(witnessed the quarrel) మాలో ఎవరు దోషియో కళ్ళారా చూసిన వ్యక్తి ఈతడే!
అంటూ జగన్నాథుని  కొలువుకు రప్పించారు.
స్థానానికి ; జగన్నాథుని కొలువుకు రప్పించారు.
ఆ పర్షియన్ భాషీయులు ఇద్దరిలో ‘ఎవరు నిర్దోషి?’ అని 
తేల్చడం కష్టమై పోయినది.
కొందరు సాక్షులలో ఒక్క జగన్నాధుని పలుకులే 
నిజ నిర్ధారణకు పనికి వచ్చాయి.
 జగన్నాథుడు స్వతహాగా ఏకసంథాగ్రాహి
(recall the altercation/ a single recitation)
అతను ఉన్నది ఉన్నట్లుగా అక్షరం పొల్లుపోకుండా
సైనికుల  సంభాషణను న్యాయాధికారికి చెప్పగలిగాడు.
(repeated the exchanges verbatim,
eventhough he did not know a word of Persian! )
“ఈ కొత్త మనిషికి పర్షియన్ అస్సలు తెలీదు.
ఐనప్పటికీ ఆ పరాయి భాషలోని సైనికుల వాదులాటను
ఉచ్చారణా దోషాలు సైతం లేకుండా సభాసదుల సమక్షంలో నుడివాడు,
జగన్నాథుడు సభాసదుల సమక్షంలో నుడివాడు.
సభలోని వారు, రాజోద్యోగులతో పాటు,
చక్రవర్తి కూడా జగన్నాథుని
“ఓయీ! నీ ఏకసంథాగ్రాహిత్వమునకు 
మేము ముగ్ధులమైనాము.  వహ్వా!”
జగన్నాథుని వేనోళ్ళ పొగడ్తలలో ముంచెత్తారు.
అతని పేరు, వివరాలను అడిగి తెలుసుకున్నారు.
“జగన్నాథా! నీ వంటి మేధావి
మాకు ఆస్థాన కవిగా ఉండడము
మాకు గర్వకారణమౌతుంది” అంటూ దీనారములను ఇచ్చాడు.
అలాగ కాకతాళీయంగా ఆ ఆస్థాన కవి పదవి 
ఆతనికి విలువైన కానుకగా లభించినది.
ఆ నాటి నుండీ “పండిత రాజ్ జగన్నాథ్ ( /జగన్నాథ పండిత రాయలు)” గా
గౌరవ స్థానాన్ని పురస్కారముగా పొందగలిగాడు.


**************************


“ఈయన మన ఆంధ్రుడు” అని 
గర్వపడుతూ చెప్పుకోగలిగిన ఈ వ్యక్తి, ముంగండలో జన్మించాడు.
జగన్నాధ పండిత రాయలు యొక్క తల్లిదండ్రులు పేరుభట్టు, మహా లక్ష్మీ దంపతులు.
ఆతడే “జగన్నాధ పండిత రాయలు”.
“రసగంగాధరం”, “భామినీ విలాసము”,
“అసఫ్ విలాసము” మున్నగు గ్రంధాలు,
అన్నిటికీ మించి “గంగాలహరి” ప్రసిద్ధి గాంచినది.
జగన్నాధ పండిత రాయలు “పంచలహరులు” ను 
వక్కాణముగా రచించిన వ్యక్తి,:-
ఆ సంస్కృత స్తోత్రముల పేర్లు:-
“గంగా లహరి ”- దివిజ గంగానది స్తుతి
”అమృత లహరి ”- యమునా స్తుతి
“కారుణ్య లహరి”- శ్రీ విష్ణు మూర్తి స్తుతి
“లక్ష్మీ లహరి”-  శ్రీ లక్ష్మీదేవి స్తుతి
“సుధాలహరి”-  సూర్యస్తుతి.
;


Published On Friday, February 10, 2012 
By ADMIN. Under: విజ్ఞానం, వ్యాసాలు.   
   రచన  : కాదంబరి
haaram:జగన్నాధ పండిత రాయలు ; (LINK 2 )
,

14, జులై 2012, శనివారం

మరో అమరశిల్పి - రువారి మల్లిటమ్మ


సోమనాథపుర





























అమరశిల్పి జక్కన్న మన అందరికీ తెలుసు. 
తెలుగులో "అమరశిల్పి జక్కన" (నాగేశ్వరరావు, బి.సరోజ)
ఈస్ట్ మన్ కలర్ లో నిర్మించిన సినిమా కూడా వచ్చింది.


అమరశిల్పి జక్కన్న ఆచార్య వలెనే శిల్పకళా విద్యలో 
వాసికెక్కిన శిల్పి "రువారి మల్లిటమ్మ". 
పశ్చిమ చాళుక్యుల సామ్రాజ్యములో నివాసి, ప్రముఖ శిల్పాచార్యుడు. 
శిల్ప, దేవాలయ నిర్మాణ కళలలో చేయి తిరిగిన వాడు రువారి మల్లిటమ్మ. 
ఈతని కళా నైపుణ్యము 12 శతాబ్దములలో కర్ణాటక, 
దక్షినబారత రాష్ట్రాలలో విరాజమానమైనది. 
3వ నరసింహ చక్రవర్తి హొయసల పాలించాడు. 
ఆతని దండనాయకుని పేరు సోముడు. 
"సోమనాథపురములో 1268 CE లో ని గొప్ప కోవెల
సోమ నిర్మించిన గుడి.
ఈ గుడి మైసూరుకు 30 కిలోమీటర్ la దూరములో ఉన్నది.
అమృతేశ్వర దేవాలయము మున్నగు దేవళములలో విరాజిల్లినది. 
గోవిందపల్లి వద్ద 13వ శతాబ్దములో 
పంచలింగేశ్వరస్వామి కోవెల శిల్పాచార్యుడైన 
రువారి మల్లిటమ్మ ప్రజ్ఞకు తార్కాణము.
ఈ గుడి హొయసల శిల్ప శైలిలో కనువిందు చేస్తూన్నది. 
హొయసలలో- అద్భుత శిల్పాలను 40 పైనే 
అనుయాయులు,శిష్యులు చెక్కి నిలిపినారు. 


నేటికీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి 
ఇంజనీరులకు మార్గదర్శకునిగా 
వృత్తినైపుణ్యములో- మహామహుల నమోవాకములను 
అందుకున్న శిల్పకారుడు Ruvari Mallitamma
ఆధునిక చిత్రలేఖన, శిల్ప, వాస్తు, సివిల్/ భవన నిర్మాణ రంగములు 
రువారి మల్లిటమ్మ అడుగుజాడలను 
భక్తిభావముతో మననము చేసుకొంటున్నాయి అంటే అతిశయోక్తి కాదు.

;

User Rating: / 3 
Member Categories - తెలుసా!
Written by kusuma   
Sunday, 10 June 2012 14:28 
మరో అమరశిల్పి (సోమనాథపుర) రువారి మల్లిటమ్మ - new AvakAya


రువారి మల్లిటమ్మ (Link 2)


13, జులై 2012, శుక్రవారం

గుల్లెకాయి అజ్జి మండపము


ఆమె (By: kadambari)















శ్రావణబెళగొళ- అనే జైన పుణ్యక్షేత్రము సు ప్రసిద్ధమైనది. 
ప్రపంచ ఖ్యాతి గాంచిన ఈ జైన క్షేత్రము కర్ణాటక రాష్ట్రములో ఉన్నది. 
ఈ కోవెలకు దగ్గరలో ఒక చిన్న గుడి ఉన్నది. 
అదే "గుల్లికాయ అజ్జి దేవళము".

గుల్లెకాయి అజ్జి మండపము 

              (गुल्लेकायी अज्जी मंडप) :-


Gullekayi Ajji ఈ గుడిలోని ప్రతిమకు ఒక స్థానిక స్థల  గాధ (legend) చెబుతారు. 
గంగ వంశ చక్రవర్తుల - మంత్రిగా వాసికెక్కినవాడు చాముండరాయుడు. 
క్రీస్తు పూర్వము 983 -  బాహుబలి/ గోమఠేశుని విగ్రహనిర్మాణానికి పూనుకుని, 
విజయవంతముగా పూర్తి చేసాడు. 
అంతటి ఘన విగ్రహాది నిర్మాణాలను తానే చేయగలవాడినని- అతనికి గర్వము కలిగింది.
ఇక తన కీర్తి దశదిశలా వ్యాపించేలా- మహామస్తకాభిషేకాన్ని చేయ పూనుకున్నాడు. 
తేనె, కుంకుమ, పసుపు, సింధూరము, పాలు మున్నగు పవిత్ర ద్రవ, ద్రవ్యాలతో- 
అభిషేకం చేయడము సంప్రదాయానుసారంగా జరుగుతుంది.
(బాహుబలి యువరాజు, [అశోక సామ్రాట్టువలె ] యుద్ధములు చేసాడు. 
రణభూమిలో రక్తపాతమును రోసాడు, ఫలితంగా "అహింసావాది"గా మారి,
"గోమఠేశ్వర స్వామి" గా వెలిసాడు.)
శ్రావణ బెలగొళ లోని బాహుబలి కి మహామస్తకాభిషేకమును  చేయాలని 
 చాముండరాయ స్థిరసంకల్పముతో ఉన్నాడు.
తన సిరిసంపదలు, గొప్పదనాన్నీ లోకులకు చాటడానికి 
ఈ కార్యమును ఒక సాధనముగా ఎంచుకున్నాడు. 
Bhagavan Bahubali అత్యంత ఎత్తైన మహా విగ్రహము.  
"నేనే ఈ విగ్రహానికి మహామస్తకాభిషేకము చేస్తాను" అన్నాడు.
భగవాన్ సంపూర్ణ అభిషేకము గొప్ప కార్యము. 
దేవుని  పెళ్ళికి అందరూ పెద్దలే!- అనేది సకల లోక విదిత జాతీయము. 
కానీ-  అమాత్యుడు - తన దర్ప, ఆడంబరములను ప్రకటించే 
పరికరముగా దీనిని ఎన్నుకున్నాడు. 
స్వామి కార్యములో ఎల్లరూ భాగస్వాములే కదా! =
ఈ విషయాన్ని విస్మరించాడు ఆయన.
బాహుబలీ స్వామి యొక్క పాదములు తడిసేదాకా పాలను - 
స్వామి శిరసు పైనుండి పోసారు. 
ఆపాదమస్తకమూ  క్షీరధారలలో తడిసినప్పుడే 
ఆ మహాభిషేకము పూర్తి  అవుతుంది.
చిత్రంగా ఆ రోజు - Chamundaraya తెప్పించిన పాలు ఐపోతున్నప్పటికీ- 
ఘన బాహుబలీ ప్రతిమ- పూర్తిగా తడవలేదు.   
కానీ ఎన్ని కుంభాల పాలను పోస్తున్నప్పటికీ కాలి చీలమండ దాటడం లేదు.
అందరూ విస్మయచకితులౌతూ, ఎటూ పాలుపోని స్థితిలో మల్లగుల్లాలు పడ్తున్నారు.
అందరిలోనూ ఉత్కంఠ నెలకొనసాగింది. 
"ఎక్కడనో ఏదో లోపం జరిగినట్లున్నది!
ఆ దొసగు ఏమిటో?" - అందరిలోనూ ఎంతగా ఆలోచనలు, 
ముప్పిరి గొన్నప్పటికీ  సమాధానము లభించ లేదు.    
అమాత్యుడు (Ganga dynasty minister Chavundaraya)  
 రాజ్యం నలుమూలలనుండీ తెప్పించిన పాలు అన్నీ ఐపోయినవి. 
అప్పుడు ఒక ముదుసలి స్త్రీ అక్కడికి వచ్చింది. 
ఆమె చేతిలో "పాలు నింపిన గుల్లెకాయ" ఉన్నది. 
"ఈ పాలను స్వామికి స్నానమునకై పోయాలి " అన్నది. 
ఆమె ప్రార్ధనను పెడచెవిని పెట్టేసిన ద్వారపాలక భటులు, 
"లోపలికి ప్రవేశము లేదు నీకు" అంటూ వెళ్ళగొట్టసాగారు.  
అది తెలిసిన రాజు "ఆమెను ఆవరణలోనికి రప్పించండి" అంటూ 
అమాత్య సచివులను పంపించాడు.
లోపలికి అడుగిడినది ఆ మహిళ. 
తీరా చూస్తే ......................... 
చేతిలో అతి చిన్న గుళ్ళికాయెడు పాలు 
(gullekai -outer shell of co-conut) మాత్రమే! 
కొబ్బరి చిప్ప అంత పాలు ఏ మూలకి సరిపోతాయి? 
ఇన్ని పాలను పోసిన తర్వాత కూడా తడవలేదు దైవము బొమ్మ! 
 రాజాజ్ఞ, రాణి అనుమతులతో 
ఆ "అజ్జి" (అవ్వ ) తీసుకు వచ్చిన పాలను అర్చకులు తీసుకుని, 
నిచ్చెనలతో కూర్చిన మంచెల మీదుగా ఎక్కారు. 
అవ్వ పాలను వాళ్ళు పోసిన పిమ్మట  జరిన అద్భుత దృశ్యము- 
అందరినీ చకితులను చేసినది.
గుళ్ళికాయ అజ్జి తెచ్చిచ్చిన పాలు శీర్షమునుండి జారసాగాయి. 
లిప్తపాటులో సంరంభం!  
బాహుబలి నఖశిఖపర్యంతమూ- తడిసిముద్దైనాడు. 
అటు పిమ్మట పాలు కారుతూనే ఉన్నవి. 
అలాగ నిర్విరామ క్షీర వర్షాలతో మడుగు ఏర్పడింది. 
ఆ కొలనులోని నీళ్ళు " పాల వెల్లువ లాగా- తెల్లగా ఉన్నవి.
అందుచే "బెలగొళ" అనే పేరు వచ్చింది. 
కన్నడములో "బెల= తెల్లని/ శ్వేత;
 (వెల్ల వేయుట; వెలుగు- మున్నగు పదాలకు మూలము ఇది)
                    కొల= కొలను
(“the Jaina’s white pond” నేడు ఆ పట్టణానికి కూడా 
"Shravana-beli-kola") అనే పేరు వచ్చినది.                                                                            
 ఆమెకై అందరూ చూసారు, అంతటా వెతికారు. 
"ఆమె ఎవరు? ఆమె ఏది? "                           
అపుడు వచ్చిన స్త్రీ- ఆమెయే జైన రక్షా దేవి "యక్షిణి పద్మావతి". 
(Jain guardian angel called Yakshi Padmavathi, old woman or Ajji)
12 వ శతాబ్దమునాడు కట్టిన గుళ్ళు ఆ సీమలో ఉన్నవి.
గుల్లికాయి అజ్జి మండపము ప్రత్యేక వాస్తు, శిల్ప శైలీ చాతుర్యములను భాసిస్తూ, 
సందర్శకులకు   నేత్రపర్వాన్ని కలిగిస్తూన్నది. 

9, జులై 2012, సోమవారం

విధి విలాసము - శ్రీరాముడు


 నంది గ్రామములో ఎల్లరికీ సంభ్రమం! అక్కడికి అందరూ ఎప్పుడో వచ్చేసారు. 
మూడు ఝాములైనా ఎవ్వరూ అక్కడినుండి అంగుళమైనా కదల్లేదు. 
వేచిచూస్తూనే ఉన్నారు ఆ వింత ముహూర్తం కోసరమని!!!!
మున్నెన్నడైనా కనీ, వినీ ఎరుగ లేదు, ఇప్పుడు జరుగుతూన్న సంగతి!
కాళ్ళకు తొడుక్కునే చెప్పులకు పట్టాభిషేకమట! 
సింహాసనము మీద పాదరక్షలను ఆసీనము చేయబోతూన్నారు!


ఇంత విడ్డూరపు సంఘటన చారిత్రక ఔన్నత్యాన్ని పొందుతుందని గానీ ముందు తరాల జనులలో నీతి నియమాల రూపచిత్రణలను చేస్తూ ప్రపంచమునకే ఆదర్శ సమాజము అంటే ఇదీ!...... ఇదే!.... 
అని పదే పదే చెప్పుకుంటూ, తమ ఆచరణకు నమూనాగా తీసుకునే శక్తి గలిగిన ఘటన ఇది! 
కొన్ని యుగాలనూ, కొన్ని కోట్లాది సంవత్సరముల దాకా జనుల ప్రవర్తనకు గీటురాయిగా అమరబోతూన్న మహోన్నత దృశ్యమాలిక ఇది!
కనుకనే ఇతిహాస రచనలకే కానుకగా అందబోతూన్న ఈ అద్భుత అంశము కోసమని ఆబాలగోపాలమూ అలాగే నిలువు కాళ్ళమీద నిలబడి ఎదురు చూస్తూనే ఉన్నారు.....


* * *
దశరధ మహారాజు పుత్రిక శాంత. 
అంగదేశాధిపతి రోమ పాదుడు, అయోధ్యాధిపతి దశరధ మహారాజు మంచి మిత్రులు. 
దశరధుడు తన మిత్రుడైన రోమ పాదునికి, శాంతను దత్తత ఇచ్చాడు.
ఆనాటి నుండీ, ఆమె రోమ పాదుని ప్రేమాభిమానాలను పొందుతూ, అంగదేశములో నివసించసాగినది.
రోమ పాదుడు సాధు జనులను దూషిస్తూ తూస్కరించి, అగౌరవపరిచాడు. 
తత్ ఫలితంగా అంగదేశము అనేక సంవత్సరాలు వర్షాలు లేక కరువు కాటకములతో అల్లాడింది. 
రోమ పాదుడు మంత్రులు, మునులు, పురోహితుల సలహా అడిగాడు.
"మహా రాజా! విభాండక ముని కుమారుడు ఋష్యశృంగుడు. బాలుని వలె స్వచ్ఛమైన మనసు గల ఋష్యశృంగుడు అడుగిడితే, మన సీమ సుభిక్షమై, పాడిపంటలు వృద్ధి పొంది, కళకళలాడుతుంది"
ఆంతరంగీకుల, శ్రేయోభిలాషుల సలహాలను అంగీకరిస్తూ, వెనువెంటనే ఆచరణకు ఉపక్రమించాడు రోమ పాదుడు.
అనేక ప్రయత్నాలతో ఋష్యశృంగుని రప్పించగలిగాడు రోమ పాదుడు. 


ఋష్యశృంగుని అంగదేశ ప్రవేశము జరిగిన వెంటనే ఆ రాజ్యములో వర్షాలు పడ్డాయి. వానలు పడి, అంగదేశము పాడిపంటలతో వర్ధిల్లుతూ, విలసిల్ల్లుతూ ఉంటే
ప్రజలు ఆనందభరితులౌతూ, రాజును కొనియాడారు.


* * *
రోమ పాదుడు కృతజ్ఞతతో తన కుమార్తె శాంతను ఋష్యశృంగ మునికి ఇచ్చి పెళ్ళి చేసాడు.
శాంత సంతోషముగా ఋష్యశృంగుని అర్ధాంగి ఐ, అరణ్య వాసిని ఐనది. 
శాంత భర్తను సేవిస్తూ, పర్ణశాలలో ఆనందముతో జీవనము గడుపసాగినది. 
పతిదేవుడు ఋష్యశృంగునికి యజ్ఞ యాగాది కార్యక్రమాలలో అండదండగా ఉంటూన్నది. 
అనేక రాజ్యాలకు వెళుతూ ఋష్యశృంగుడు, తన విధులను నిర్వహిస్తూండేవాడు. 
ఆతని తపోబలము వలన అనేక దేశాలు సుబిక్షములైనవి. 
దశరధుని నుండి ఆహ్వానపత్రికలు అందినప్పుడు,అయోధ్యకు శాంత,ఋష్యశృంగులు వెళ్ళారు. 
మళ్ళీ అయోధ్యాపురి నుండి ఆ భార్యాభర్తలకు పిలుపు వచ్చినది.


"శ్రీ రామ పట్టాభిషేకము జరుగును.
తామెల్లరూ ఈ మహోత్సవానికి తరలిరావలసినదిగా కోరుచున్నాము,
భవదీయుడు దశరధుడు" 


దశరధుని ఆనతితో సుమంత్రుడు ఈ లేఖను కుమార్తెకు, అల్లునికీ పంపించాడు. 
ఋష్యశృంగుడు, పత్నితో బయలుదేరాడు. 
వారు ఇతః పూర్వమే ఇతర రాజ్యాలకు వెళ్ళి వచ్చారు. 
అందుచేత ప్రయాణ సామగ్రిని సర్దుకొనుటకు ఆట్టే తడబాటుపడలేదు. 
దర్భలూ,దర్భాసనాలూ, వల్కలములూ, వ్యాఘ్రాసన చర్మము,
పాదుకలూ మున్నగు సరంజామాతో ఇరువురూ బయలుదేరారు. 


* * *
ఋష్యశృంగుడు, శాంత అయోధ్యలోనికి అడుగు పెట్టారు.
వారి రాక తెలిసి, కౌసల్య, సుమిత్ర, కైకేయి, అంతఃపురములోని అతివలు 
ముని దంపతులకు ఎదురేగి, స్వాగతము పలికారు. 
దశరధుడు అల్లుడు ఋష్యశృంగునీ, పుత్రికామణి శాంతనూ ఆప్యాతగా పలకరించాడు. 
శ్రీరామ, లక్ష్మణ, శత్రుఘ్నులు, బంధువులు ప్రేమాభిమానాలతో 
క్షేమసమాచారములు అడిగుతూ, ముచ్చట్లు చెప్పారు. 
భక్తితో ప్రజలు "అమ్మా! శాంతా! సర్వోన్నతుడైన ఋష్యశృంగ మౌని పాదముద్రలతో
ఈ పుడమి సస్యశ్యామలమౌతూన్నది" అంటూ శ్లాఘించారు.
ఋష్యశృంగుడు, శాంత తన పతిదేవుని సజలనయనాలతో సంతోషాంతరంగిణి ఔతూ వీక్షించినది.
" సోదరుడు రామచంద్రుని పట్టాభిషేకమునకు ఇంక నాలుగు రోజులే ఉన్నవి,
ఏర్పాట్లు అన్నీ బాగుగా జరుగుచున్నవి కదా!?" మందస్మిత వదన నవ్వుతూ అన్నది.
"సోదరివి, నీవే శుభ అభ్యంగనస్నానమునకై, నలుగు పెట్టవలసిఉన్నది. 
మరి ఈ లేపన విద్య నేర్చుకున్నావా?" లక్ష్మణ సతి ఊర్మిళ సరదాగా అన్నది.
భరత, శత్రుఘ్నుల భార్యలు మాండవి, శ్రుతకీర్తి కూడా, పరిహాసోక్తులతో శృతి కలిపారు.


* * *
అందరూ చెప్పుకునే కబుర్లతో, చందమామ కూడా మేలమాడిన వెన్నెల వానలతో అయోధ్యలోని ఆ రాజభవనము మెలకువతో కళకళాలాడుతూండగనే, భళ్ళున తెల్లవారింది.
ఋష్యశృంగుడు, "శాంతా! తెల్లవార వచ్చెను, ఇక నిద్దుర లెమ్మని" తట్టాడు. 
ఋష్యశృంగుని సందడికి శాంత నవ్వుతూ 
"అసలు మాకెవ్వరికీ కనురెప్పలు అరముడిస్తేనే కదా, 
అందరమూ జాగరణములోనే ఉన్నాము లెండి!" అన్నది.
పరిచారికలు హడావుడిగా ఏమో గుసగుసలాడ్తూ, రహస్యంగా మాట్లాడుకుంటున్నారు.
"ఏమిటి చెలులూ! అలాగ చెవులు కొరుక్కుంటూన్నారు?" 
ఊర్మిళ నుడువులకు దాసీలు తటపటాయిస్తూ అన్నారు. 
"ఏమోనమ్మా! మాకు సైతమూ ఏమి జరుగుతున్నదో,
అసలేమి జరగబోతూన్నదో అర్ధము కావడము లేదు"


"అదేమిటి? ఎందుకా అలజడి మీలో ఈ పొద్దున?" 
మాండవి పదంపడి ప్రశ్నార్ధకమై నిలబడింది.
శ్రుతకీర్తి కూడా అదే ప్రశ్నను రెట్టిస్తూన్నట్లుగా. 
ఇంతులతో శాంత కూడా కుతూహలముతో, 
కొంత గాభరాతో ఆ సంభాషణను వినసాగింది.
"కైకేయీ మహలులోకి మంధర రుసరుసలాడ్తూ వెళ్ళింది.
ఏమేమి చాడీలు చెబ్తూన్నదో? ఏ కొంప ముంచబోతూన్నదో?" 
కౌసల్య కడ ఉండే పరిచారిక తనలోని వణుకును అణచిపెడుతూ చెప్పింది. 
మధ్యాహ్నము మందర ఎదురైతే, ఈమె రంగవల్లులను వేస్తూన్నది; మందరను ఎగతాళి చేసింది. 
ఎప్పుడైతే మందర కోపంతో విసవిసా నడుస్తూ, గునగునా వెళ్ళిందో 
అప్పటి నుంచీ ఈమె మనసు మనసులో లేదు. 
ఈమెకు అన్నీ దుశ్శకునాలే గోచరిస్తూన్నాయి, అందుకే ఇలాగ ఈమె బెంబేలు!!!!!
శాంత అక్కడ ఆ ఉదయం, ఆకాశం అరుణ వర్ణమౌతూ భీతిని కలిగిస్తూన్నది. 


* * *
ఝాము ఝాముకూ అందరిలో ఇదీ అని చెప్పలేని ఏదో గుబులూ, భయము ముప్పిరిగొనసాగాయి.
మంగళ తూర్యారావాలు ఉన్నట్టుండి ఆగిపోయాయి.కారణమేమిటి? అందరిలో ఒకే ప్రశ్న.
శాంత , ఋష్యశృంగు కారణమేమిటి? 
"మంగళ తూర్యారావాలు ఉన్నట్టుండి ఆగిపోయాయి.కారణమేమిటి?" అందరిలో ఒకే ప్రశ్న.


కైకేయి కోపగృహములో ఉన్నది. 
తన ముద్దుల మూడవ భార్యను అనునయించి,
ఆమె ఆగ్రహమునకు హేతువును అరయడానికై లోనికి దశరధుడు వెళ్ళాడు. 
ఇన్ని గంటలైనా బైటికి రానే లేదు, లోపల ఏమి జరుగుతూన్నదో ఎవ్వరికీ బోధపడడం లేదు. 
ప్రతి ఒక్కరూ "ఉత్కంఠ నిండిన రాగి కలశములలాగా ఉన్నారు." 
రాణివాసములలోనూ, ఆస్థానములోనూ, కోటలోనికీ 
ఆ  మాటకు వస్తే చక్రవర్తుల నివాసాలలోనికి భద్రతా కారణాల దృష్ట్యా 
ప్రవేశానికి అనుమతి లభించడం 
కొంత సంక్లిష్ట వ్యవస్థగా ఏర్పడిందనే చెప్పవచ్చును.


ఇప్పుడేదో అసాధార పరిస్థితి ఏర్పడబోతూన్నదని అందరి డెందాలలోనూ 
ఏదో వాటిల్లబోతూన్న కీడు గూర్చిన సంశయాలు పడగలెత్తుతూన్నాయి.
ఉన్నట్టుండి, కైకేయి నుండి "తనయుడు శ్రీరాముని రమ్మన"మని ఆదేశం.
మందహాస వదనుడు రాముడు ఆ కోపగృహములోనికి వెళ్ళాడు,
కొద్ది నిముషాల అనంతరము ఇవతలికి వచ్చాడు.
అయోధ్యాపురి భవితవ్యాన్ని మలుపు తిప్పిన విశేషము జరిగింది.


(పుట : 1)
******************;
పెదవులపైన చెరగని చిరు నవ్వులు ఆ నీలమోహనునికి పెట్టని ఆభరణములు!

అందుకే లోపల అంత లోపలలోనే జరిగినట్టి అయోధ్యాపురి భవితవ్యాన్ని మలుపు తిప్పిన ఆ విశేషము దాని బీజము ఎలాటిది? 
అందరితోపాటుగా శాంతకూ, ఆమె భర్తకూ కూడా అంతుబట్టడం లేదు. 
ఇవతలికి వచ్చిన ఇనకులాబ్ధి సోముడు "జననీ! నేను 12 ఏళ్ళు అరణ్యవాసము చేయవలెను, నన్ను ఆశిర్వదించండి!" 
కౌసల్య మాత్రమేనా? అక్కడున్న యావన్మందీ ఉలిక్కిపడ్డారు అనేకంటే దాదాపు మూర్ఛవస్థలో మునిగారనడమే సబబు.
ముని ఋష్యశృంగుడు కూడా,
అటవీ సీమలనుండి తన తోటి వచ్చిన ఇతర తాపసుల వైపు నిర్ఘాంతపడి, చూస్తూ నిలబడ్డాడు.


శాంత "ఇదేమిటి? స్వామీ! ఇలాగ ఎలాగ సంభవిస్తూన్నది? తాము భూత వర్తమానాలనే కాదు, భవిష్యత్ కాలమును కూడా తెలుప గల దార్శనికులు గదా?
ఇప్పుడు మనము చూస్తూన్నది వాస్తవమేనా? కల కాదు కదా?"


ఋష్యశృంగుని వద్ద సిద్ధ సమాధానములు లేని ప్రశ్నల వర్షమై 
ఆతని అర్ధాంగి శాంత తారట్లాడుతూంటే 
నిస్సహాయుడై శిలాప్రతిమ వోలె నిలబడ్డాడు ఋష్యశృంగుడు. 


* * *
కొంత తడవు గడిచాక అనేక సంఘటనా పరంపరలు పెను వేగముతో జరిగిపోయాయి,
సీతాదేవి, లక్ష్మణుడు కూడా నీలమోహనశ్యాముని అనుసరించారు.
"ప్రపంచములో ఎవ్వరైనా ఈ రీతిగా భోగ భాగ్యాలను తృణప్రాయముగా త్యజిస్తూ స్వచ్ఛందముగా, అరణ్యవాసమును మహదానందముగా స్వీకరించారా?" 
శాంత, ఋష్యశృంగులు తత్తరపడ్డారు,
ధరణీపుత్రి సీతాదేవి "నారచీరలను ఏ పద్ధతిలో కట్టుకోవాలి?" అని శాంతను అడిగింది. 
శాంత ఆమెకు నార చీరలను ఇచ్చింది. 
కళ్ళలో నుండి ఉబికి వస్తూన్న కన్నీళ్ళను అణచిపెట్టడం శాంత తరం కావడం లేదు.
క్రితం క్షణం దాకా తన నయన ద్వయిలో ద్విగుణీకృత శోభలతో రాణి ఆహార్యములో విరిసిన జానకీ సౌందర్యము ఇప్పుడు వల్కలధారణముకై తన కడ ఉన్నది? 
లాక్షణికులూ, వేదాంతవేద్యులూ, తార్కికులూ విధివిలాసమునకు ఇంతకు మించిన తార్కాణం ఎత్తి చూపగలరా? 


ఋష్యశృంగుని అవస్థ కూడా శాంత మానసిక కల్లోలానికి భిన్నంగా లేదు.
ఆ వైభోగ సీమలో అప్పటికప్పుడు సర్వసంగపరిత్యాగులు ధరించే వస్త్రాదులు దొరుకవు. 
శ్రీరామచంద్రుని వివేచనా పరిధి అత్యంత వైశాల్యమైనది.
తత్ క్షణమే శాంత, ఋష్యశృంగులకు "వల్కలధారణా నిమిత్తమై" కబురందినది.
సీతమ్మకూ, శ్రీరామచంద్రునికీ, తమ్ముడు లక్ష్మణునికీ ఋష్యశృంగ, శాంతలు వల్కలాదులు ఇచ్చారు.
చూస్తూండగానే పురవీధులన్నీ ప్రజల వేదనా ఘోషలతో నిండిపోయాయి. 
సకల జనవాహిని సంవేదనా సాగరములను దాటుతూ సీతా, రామ, లక్ష్మణులు వెడలిపోయారు.


* * *
అటు పిమ్మట దశరధుడు పరలోకగతుడైనాడు.
భరతుని మాతులుడు యుధాజిత్తు. 
భరతుడు తన మేనమామ యుధాజిత్ వద్దకు వెళ్ళి ఉన్నాడు. 
కేకయ రాజ్యము నుండి అయోధ్యకు తిరిగి వచ్చిన భరతుడు తల్లి కైకేయి అత్యాశకు ఖిన్నుడైనాడు. 
అన్న రాముని వెదుకుతూ వెళ్ళాడు.


సాకేత సార్వభౌముడు "తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాను" అని అన్నాడు. 
కొసకు భరతుడు ఆ స్థిర సంకల్పుని వేడగా అనుంగు సోదరుని ప్రార్ధన మన్నించి, శ్రీరాముడు పాదుకలను ఇచ్చాడు.
ఇచ్చిన పాదుకలు, ఆ పాదుకలకు, భరతుడు పూజిస్తూ, పట్టాభిషేకము చేస్తూన్నాడు.


శాంతకు ఇప్పటికీ "తాను సీతమ్మకు నారచీరలను కడుతూన్నప్పుడు కలిగిన భీతి, వణుకు" ఇంకా తగ్గనేలేదు. 
ఋష్యశృంగుడు "మేము పర్ణశాలనుండి తెచ్చుకున్న వృక్షముల (భూర్జ తరు) బెరడులు అవతారమూర్తుల మేని స్పర్శతో పునీతములైనాయి, ఔరా! విధి విచిత్రము ఇదే సుమా!" అనుకున్నాడు.
అనుకుంటూనే ఆ కుగ్రామములోని "శ్రీరామ పాదుకా పట్టాభిషేకము" తిలకిస్తూన్న ప్రేక్షకులలో ఋష్యశృంగుడు, తన ధర్మ పత్ని శాంత ఇరువురూ భాగస్వాములౌతూ, తాదాత్మ్య చిత్తులై, తిలకిస్తూ ఉన్నారు. 
;

విధి విలాసము - శ్రీరాముడు, శ్రీరామ పాదుకా పట్టాభిషేకము  (patrika.haaram.com)



రచయిత : కాదంబరి (కోణమానిని)         ప్రచురణ తేది: 3/30/2012 12:00:00 AM

My story:  మూడు తరాలు  in - my Blog - కోణమానిని-  గురువారం 7 జూన్ 2012
(మూడు తరాలు ; బామ్మ సణుగుడు విరామమెరుగని ఆమె గొణుగుడు సాగుతూనే ఉన్నది.)



7, జులై 2012, శనివారం

కనకడి కిటికీ (Kanaka’s window)



"కనకడి కిటికీ"(Kannada - ಕನಕನ ಕಿಂಡಿ; 
English - Kanaka’s window) అంటే ఏమిటి? 
ఈ పేరు రావడానికి కారణమేమిటి? 
ఇందుకు ఒక ఆసక్తికరమైన సంఘటన మూలము.


కనకదాసు (1509–1609) కన్నడ కవికనకదాసు 
'కురుబ గౌడ' కులజాత మణిదీపము. 
నిమ్నజాతీయుడైన కనకదాసు- 
కన్నడ భక్తి సాహిత్యములో వెదజల్లిన శరచ్చ౦ద్రికా రాశి.


"ఉడుపి" కర్ణాటకరాష్ట్రములోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రము. 
బాలకృష్ణమూర్తి ఇక్కడ కొలువై ఉన్న దైవము. 
ఉడుపి అనగా "తారా దైవము యొక్క సీమ"- అంటే 
"చుక్కల రేడు ఐన చంద్రుని స్థలము" అని అర్ధము. 
కనకదాసు ఉడిపి కోవెలలోనికి అడుగిడటానికి సమ్మతించలేదు, 
ఆ గుడి పూజారులు.ఆ మహా భక్తుడు వేదనతో కుమిలిపోసాగాడు.
మహాభక్త కనకదాసు ఆక్రందన అంతా ఆలాపనగా మారినది. 
ఆ ఆలాపనే 
"బాగిలను తెరెదు సేవెయను కొడో హరియే" అన్న కీర్తన.


ఆ కీర్తన పూర్తికాగానే అచ్చటి గోడ కూలిపోయింది. 
కీర్తనకారుడు కనకదాసు కు "శ్రీ బాలగోపాలుడు" 
తానే దర్శనమొసగిన ఆ వైనముతో, 
మూఢ విశ్వాసాలతో కొట్టుమిట్టాడుతూన్న అగ్ర జాతుల వారు లజ్జ పడ్డారు. 
అందరూ గేయకర్త కనకదాసును ప్రశంసించారు. 


ఈ పవిత్ర అద్భుత సంఘటనను 
కనుల పంటగా పొందిన వారిలో ఉన్న వ్యక్తి "శ్రీ వాదిరాజ స్వామి". 
పడిపోయిన గోడ స్థానే మళ్ళీ గోడను నిర్మించజేసారు శ్రీ వాదిరాజ స్వామి. 
కొత్తగా గోడలో "కిటికీ" ని జాగ్రత్తగా అమర్చారు. 
కనకదాసు బాలకృష్ణుడి దర్శనమును పొందిన 
ఆ శిధిల కుడ్యపు స్థానములో కట్టిన ఒక చిన్న కిటికీకి చారిత్రక ప్రాధాన్యం ఏర్పడినది. 
ఈ చిన్న కిటికీ నామమే "కనకదాసు కిటికీ". 
నేటికి కూడా ఆ గవాక్షము ద్వారా క్రిష్ణ ప్రతిమకు అర్చనలు చేస్తూండటమే 
ఒక సంప్రదాయమై స్థిరపడినది.


అంతకు పూర్వము తూర్పు దిక్కు వైపుకు ఉన్న చిన్ని క్రిష్ణమ్మ బొమ్మ 
కన్నడ సంకీర్తనకారుడైన కనకదాసు కూర్చున్న వేపుకు అంటే 'పశ్చిమ ముఖంగా' తిరిగింది. 
ఈ అద్భుత సంఘటన జరిగిన చోటు
"ఉడుపి దేవళము".
* * * * *
కర్ణాటక సంగీతములోని ఉగాభోగ సంప్రదాయములో 
తాదాత్మ్య స్వర మాధురి నెలకొల్పినది కనకదాస. 
సాహిత్యము మాత్రమే ఆధారము కాకుండా శ్రావ్య ఆలాపనము 
శ్రవణములకు భోగమును చేకూర్చే సరి కొత్త రాగ ప్రస్తావనలుగా 
నాద సరస్వతీ కిరీటములో మణిభాసురములగుట వింతగా 
15 వ శతాబ్దమునుండీ- 19 వ శతాబ్ది నాటికి సుస్థిరమైనవి.


ఈ పధ్ధతికి పురందర దాసు, కనకదాసులు శ్రీకారము చుట్టి, నాంది పలికారు. 
19వ శతాబ్ది నాటికి తమిళ సంగీత కళాబిమానులు  సైతము 
ఈ ఉగాభోగాలాపనా సంస్కృతిని తమ లోగిలిలోనికి ఆహ్వానము పలికారు.
సంగీత నందనవనములో మేల్బంతి ఐన 
భక్త కనకదాసు కర్ణాటక రాష్ట్రానికి గర్వకారణమైన సంగీత, సాహిత్య తేజో ప్రభాకరుడు.

కనకడి కిటికీ ; Web magazine (New AvKy)
User Rating: / 2
Member Categories - తెలుసా!
Written by kadambari piduri   
Sunday, 03 June 2012 12:44
;

5, జులై 2012, గురువారం

ఆరుద్ర - అశ్వశాల/ హస్త బల్


giri durgamu











;
;
;                                                                            భాగవతుల శివ శంకర శాస్త్రి 
(Bhagavatula Siva Sankara Sastri) 
"ఆరుద్ర" (Arudra) కలం పేరుతో 
ప్రఖ్యాతి గాంచారు. "సమగ్రాంధ్ర సాహిత్యము" 
తెలుగు సాహిత్యానికి 
ఆయన అందించిన 
విశిష్ట ఉద్గ్రంధరత్నము.
విజయనగరంలో మహారాజా వారి 
“హస్త బల్” అనే నాటకశాల (hasti= elephant) ఉన్నది. 
ఆ స్టేజీ మీద ఆరుద్రకు సన్మానం వైభవంగా జరిగింది. ఆ సన్మాన సభలో దిగ్గజాల్లాంటి పండితులు మాట్లాడారు. "మహారాజా వారు ఏనుగులు కోసమని కట్టిన 
ఈ ‘హస్తబల్ ‘ స్థలంలో సాహిత్యంలో గజరాజు వంటి ఆరుద్ర గారికి 
సత్కారం జరగడం గొప్ప ఔచిత్యం.” 
అంటూ వక్తలు తమ ప్రసంగాలలో ఉటంకించారు.


అపరిమిత శ్రమతో అద్భుత పరిశోధనలను, అందించిన ఆరుద్ర మాట్లాడుతూ 
మహారాజా వారికి ఏనుగులు లేవు. 
ఇక్కడ ఆయన ఏనాడూ ఏనుగుల్ని కట్ట లేదు. 
ఇది అశ్వశాల మాత్రమే! 
'stable’ అంటే గుర్రాల శాల. తెలుగులో “ఇ” అని - 
ఇంగ్లీష్ లో S అనే letter ఆదిని ఉన్న పదాలకు 'ఇ'ని చేర్చే పదాల పరిణామం ఉన్నది. 
ఉదాహరణకు ‘ఇస్కూలు ’ అని పలుకుతారు. 
అలాగే stable పరిణతి జరిగింది. 
స్టేబుల్, ఇస్టేబుల్, అస్తేబుల్, అస్తబల్ అయి, హస్త బల్ ఐనది” అన్నారు.


చరిత్రను అంత నిశిత పరిశోధన చేసిన ఆరుద్ర మీద ప్రశంసల జల్లులు కురిశాయి.


* * * * *


కొన్ని సినిమాలకి తాపీ ధర్మా రావు, ఆరుద్ర సంయుక్తంగా రచనల పని చేసారు. 
వెండి తెర పైన “ తాపీ, ఆరుద్ర” అని వేసే వారు. 
అందుకు, ఆరుద్ర అందుకున్న చమత్కారం ఇది.
“ఒకరు తాపీ, మరొకరు ఆదుర్దా”


ఒకరు తాపీ, మరొకరు ఆదుర్దా.”ఆరుద్ర-అశ్వశాల (NEW AvakAya)
User Rating: / 2 
Member Categories - ప్రముఖుల హాస్యం
Written by kusuma   
Friday, 28 October 2011 13:57

1, జులై 2012, ఆదివారం

"అజిబీధ- పపా - విశ్వేసకి", పింగళి


శ్రీ కృష్ణార్జున యుద్ధము ; అజిబీధ-పపా విశ్వేసకి(1963)















;                                         "అజిబీధ- పపా - విశ్వేసకి" - 
     ఈ పేరు ఎవరిదో గుర్తు పట్టగలరా?
అలనాటి సినిమా శ్రీ కృష్ణార్జున యుద్ధం లోనిది. 
శ్రీ కృష్ణార్జున యుద్ధం - లో గీతరచన కూడా వారిదే! 
(కె.వి.రెడ్డి సుందరమైన పనితనంతో- పింగళి పద వైచిత్రీ నైపుణ్యాలు తోడైనది. 
1963 లో విడుదలైన ఈ తెలుగు మూవీ అద్భుత విజయాలతో నిర్మాతలకు 
కాసులపంటలను పండించింది). 
ఇలాటి చమత్కార పదాల సృష్టి కర్త వేరెవరో కాదు, పింగళి నాగేంద్ర రావు
పింగళి పద చిత్ర కవితా విన్యాసాలకు నోచుకున్నట్టి-  
మాయాబజార్, పాతాళభైరవి, మిస్సమ్మ- 
అలాగ ప్రతి చలనచిత్రమూ ఆణిముత్యము అని 
                            సకలాంధ్ర జనులకూ విదితమే!


"వచ్చిన వాడు అర్జునుడు, ఫల్గుణుడు, 
        సుభద్రా పరిణయమే ముఖ్య గమ్యము" 
          బావ శ్రీకృష్ణపరమాత్మ అందదండలు ఉండనే ఉన్నాయి. 
ఇక యతి వేషంలో కోటలో పాగా వేయడమెంతసేపు?! 
ఔరా! ఆహాహా! ఇంతటి చమత్కార కథ లభిస్తే 
గమ్మున ఊరుకుంటాడా మన పింగళి నాగేంద్ర రావు వారు!? 
సంభాషణలలో ఆయన హస్తవాసి అమోఘమైనదని నిరూపించేసారు.


* * * * * *
ఇంతకీ పాఠక మహాశయులారా! 
"అజిబీధ- పపా - విశ్వేసకి" 
ఈ పద నామధేయానికి మూలము ఏమిటో మీరు కనిపెట్టారా?


ఉరుము ఉరిమితే, మెరుపు మెరిస్తే ఫస్టు ఫస్టుగా 
ఒక వ్యక్తి పేరును తలుస్తారు. ఏకైక మనిషి నామమది, 
"జయమ్" - అనే పేరుతో వేదవ్యాస మహర్షి రచించిన 
                                మహేతిహాసమే మహాభారతము. 
మహాభారతములోని పాండవ మధ్యముడు అర్జునుడు. 
మేఘాడంబర వేళలలో, సౌదామినీ ఝలక్ ల తరుణాలలో భయం వేస్తే 
(పాత రోజులలో లెండి!)  గబగబా గభాలున ఉచ్ఛరిస్తారు ఆతని పది పేర్లనీ!
నిజానికి అన్ని పేర్లూ నుడవాలి గానీ, 
అత్యధిక ప్రజలకు మొదటి రెండు మూడు పేరులు మాత్రమే నెమరుకు వస్తాయి. 
(అర్జున, ఫల్గుణ - పార్ధ, కిరీటి......అంటూంటారు) 
తర్వాతి పేర్లన్నీ గాలిదేవుడికన్న మాట! 
సరే! మరి ఇప్పుడు అర్జునుని ఎన్ని పేర్లతో పిలిచారు? 
                                             కొంచెం పరికించుదము!


1) పార్ధ= పృధా తనయుడు- పార్ధుడు. అలాగే కుంతీ పుత్రుడు "కౌంతేయుడు"(కుంతీ దేవి మొదటి పేరు పృధ- ఆమె దత్తత తీసుకోబడిన పిమ్మట "కుంతీ దేవి" ఐనది)
2) జిష్ణు= ఎవరూ అర్జునిని జయించ లేరు,
3) కిరీటి = ఇంద్రుడు -కిరీటము-ను సుతుని శీర్షమున ఉంచి, అలంకరించాడు. 
           దగ ద్ధగాజమాన కిరీటము కలిగినందున- "కిరీటి".
4) శ్వేతవాహన= తన రథమునకు తెల్లని రంగు కల గుఱ్ఱములను పూన్చిన వాడు
5) బీభత్స= రణరంగములో శత్రువులను వణుకు పుట్టించే వాడు  ;
6) విజయ - విజయము సాధించే వాడు;
7) ఫల్గుణ= ఉత్తర ఫల్గుణ- అనే నక్షత్రమున జన్మించిన వాడు;
8) సవ్యసాచి = కుడి, ఎడమ,-రెండు చేతులతోనూ 
బాణములను సంధించే ప్రావీణ్యత అర్జునుని సొమ్ము
9) ధనంజయ= (धनन्‍जय) = గొప్ప సంపదలను గడించిన విజేత
10) గాండీవి=  గాండీవము- అనే నామము కల ధనుస్సు కలిగిన వ్యక్తి అర్జునుడు;


అర్జునుని ఇతర పేర్లని కూడా చూద్దాము.
అర్జున= తెల్లని వాడు
కృష్ణ= నల్లని మేని వన్నె కలవాడు 
               (కుంతీదేవి, కృష్ణుని పై భక్తితో తన  తనయుని "కృష్ణ" అని పిలిచినది)
గుడాకేశ= దట్టమైన కేశములు కలవాడు
కపిధ్వజుడు= రధముపై ధ్వజ చిహ్నము 'హనుమంతుడు'
భారత= కురు వంశ మూలపురుషుడు (scion) 
శకుంతలా  దుష్యంతుల కొడుకు "భరతుడు"- పేరును అర్జునుడు పొందాడు.
పరంతప= తన ఏకాగ్రతతో రిపులను గెలిచే వాడు
కృష్ణ= నల్లని మేని వన్నె కల వాడు


సన్యాసి గారికి బారసాల చేసారు మన పింగళి వారు.
ఇంకా "పాండవ మధ్యమ, మహా బంధు, పరంగం, కౌంతేయ" ఇత్యాది 
సమాస విశేషణ నామధేయాలు అర్జునినికి అనేకము ఉన్నవి. 
ఇన్ని పేర్లలో- పది పేర్లను సెలెక్ట్ చేసి 
"అజభీదపపావిశ్వేసకీ స్వామి"ని సృష్టించారు 
పింగళి నాగేంద్రరావు గారు. 
అదీ సంగతి. 
అది సరే గానీ, ఆ పేర్ల మొదటి అక్షరాలతో అల్లిన దండ కదా 
ఈ మాయా ఋషి 'వరుని' పేరు! పింగళి నాగేంద్ర రావూజీ 
అందులో ఇమిడ్చి, ఇరికించిన దశ నామావళి స్ఫురణకు వస్తున్నవా? 
ఇప్పుడు చిటికెలో ఆ దశ నామావళినీ పట్టేసారు కదూ! 
అవి ఇవిగో, కనండి!
"అజిబీ- ధపపా - విశ్వేసకి" - 
10 పేర్లలోని మొదటి అక్షరాల సొగసరి, గడసరి కూర్పు ఇది.


అర్జునుడు, జిష్ణు, బీభత్స, ధనుంజయ (ధనము+ జయము), 
ఫల్గుణ, పార్ధ, విజయ, శ్వేతవాహన, సవ్యసాచి, కిరీటి


ఇవీ పింగళి శంఖములో చేరిన తీర్ధ జలములు. 
అంతేనా? అంతే కాదు, అర్జున, శ్రీకృష్ణులు- 
"నర నారాయణులు" అవతారసంభూతులు. 
ఈ ద్వయ నామాలలో "నర/నరుని" అంశయే 
 సాంప్రదాయం ప్రకారం ఆశ్రమములలో 
సన్యాసాశ్రమమును స్వీకరించే  అర్హతను పొందిన వారికి 
ఋషి/ మఠాధిపతులు నూతన నామమును అనుగ్రహిస్తారు. 
 పింగళి నాగేశ్వరరావు 
;


కానీ పింగళి నాగేశ్వరరావు                          బలరాముని దుర్గమును చేరి, 
గడ్డాలు, మీసాలతో                                    దొంగసన్యాసిగా మారిన అర్జునునికి 
సరి కొత్త పేరును పెట్టారు!


చప్పట్లోయ్! చప్పట్లు!!!!!!!!


"అజిబీ- ధ పపా - విశ్వేసకి" - గారికీ జై జై జోహార్లు.

అజిబీధ- పపా - విశ్వేసకి (newAvakAya- web mag)
User Rating: / 1 
Member Categories - మాయాబజార్
Written by kadambari piduri   
Saturday, 23 June 2012 13:33
;

ఉభయకుశలోపరి - ఉగాది శుభఘడియలు

"అది ఒక చల్లని రాత్రి....." పాటను హమ్ చేస్తూ, సినిమాలోని హీరోయిన్ మాధవి అందచందాల నగుమోమును తలుచుకుంటూ ఆ ఊహలతో మైమరచిపోతూ ఇల్లు ...